ప్రచార పటాటోపం తెలీని కవయిత్రి.. మొల్ల
కవి సార్వభౌముడు శ్రీనాధుని తదనంతర కాల రచయిత్రి రామాయణ వచనకావ్య కవయిత్రి అయిన మొల్ల కే ఆనాడు తగిన ప్రచారం లభించలేదు.అనుచరగణం, పటాటోపం లేకపోవడం, పామర జాతికి చెందినది కావడం, మహిళ కావడం తోడు తనను తాను మార్కెట్ చెసుకుని గుర్తింపు పొందే తెలివితేటలు లేకపోవడ, అన్నింటికీ మించి లౌక్యం లేకపోవడమే ఆమె చేసుకున్న పాపమై ఉంటుంది.అసలు ఆమె ఏకాలానికి చెందినదో కూడా స్పష్తమైన ఆధారాలు లేకపోవడం, మాటలతో ప్రపంచాన్ని బురిడీ కొట్టించడమనే కళలో ఆమె ఆరి తేరినది కాక పోవడం కారణం.
తిక్కన సోమయాజి వరప్రసాదంతో `రామాయణ వచన కావ్యం రచించి ప్రతాపరుద్రునకు అంకితమిచ్చే చివరి క్షణంలో, ఆయన ఆస్థానంలో ప్రీతివచనాలతో రాజును సమ్మోహనపరచే అద్భుత వాక్చాతుర్యమున్న విద్వాంసులకు ఆమె రచనా పాటవం చూసి కన్నుకుట్టి, ఆమె కావ్యం ప్రాచుర్యం పొందితే తమవి చీకటి బతుకులవుతాయని భయపడి, "అది శూద్ర కవిత్వమని, నిషిద్ధకవిత్వమని" తూలనాడడంతో రాజు ప్రతాపరుద్రుడు బ్రాహ్మణ విరచిత భాస్కర రామాయణాన్ని గౌరవించాడు. అదే మొల్ల కుసుమ సుకుమార హృదయ దుర్భరతాపానికి కారణమై ఉండవచ్చునని పెద్దలే చెబుతున్నారు. తండ్రినో, పూర్వీకులనో ఆసరాగా చేసుకుని మొల్ల కవయిత్రిగా నిలబడాలనుకోలేదు ఇప్పటివారి మాదిరి. ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే ..."గురులింగ జంగమార్చన పరుడును, శివభక్తిరతుడు, బాంధవ హితుడున్,గురుడాతుకూరి కేసయ వరపుత్రి..." అనిపరిచయం చేసుకున్నది. తను ఎవరి మెప్పుకోసమో, గుర్తింపు కోసమో రామాయణం
"చెప్పుమని రామచంద్రుడు
చెప్పించిన పల్కుమీద చెప్పెద నేనె
ల్లప్పుడు నిహపరసాధన
మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్"
..... అని కోరింది.అంతటితో ఆగకుండా
"నేరిచి పొగడిన వారిని
నేరక కొనియాడువారి నిజకృపమనుపం
గారణమగుటకు భక్తియె
కారణమగు కాని చదువు కారణమగునే"... అన్నది. .
ఆమె ఒకచోట వెన్నెలను ఎంత అందంగా వర్ణించిందో ఆస్వాదించండి..
నారదులైరి సన్మునులు,నాక మహీజములయ్యె భూజముల్
శారదలైరి భామినులు శంకర శైలములయ్యె గోత్రముల్
పారదమయ్యె నీరధులు పన్నగ నాయకులయ్యె నాగముల్
వారిద వర్గమెల్ల సిత వర్ణములయ్య్ను పండువెన్నెలన్
అర్హులు విస్తృత ప్రచారం పొందలేక పోవడానికి కారణాలనేకం.
No comments:
Post a Comment