Sunday 10 March 2013


                                1967 నుంచీ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు... 







ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్వాతంత్ర్యానాతరం వ్యక్తులచుట్టూ పరిభ్రమించి విలువలు, నైతికత కోల్పోయి కీలుబొమ్మ రాజకీయాలు మొదలయ్యాయి. డబ్బు, మతం, కులం, ప్రాంతీయత, అవినీతి వేళ్ళూనుకుని పతనావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో కూర్చున్న వారి పేర్లు వింటే.. వారు ఆశీనులైన స్థానాలు ఎలాంటివారికి ఆశ్రయమిచ్చాయో అని బాధ మిగులుతుంది.. 

మన రాష్ట్ర రాజకీయ(ఎన్నికల) చరిత్రను పునరావలోకనం చేసుకుంటే ఒకప్పటి దీతైన, ఘాతైన ప్రతిప్క్షం ఉందే పార్టీలు ఎలా జావకారి చివరకు"తోక" పార్టీలుగా మారాయో అర్ధమవుతుంది. హైదరాబాద్(1952), అంధ్ర(153) రెండవ ఆంధ్రా అసెంబ్లీలో (1955)విపక్షాల అసంఖ్య అధికార కాంగ్రెస్ పార్టీకి చెరువలోనే ఉందేది. హైదరాబాద్ అసెంబ్లీలో మొత్తం 176 స్థానాలకు గాను కాంగ్రెస్ కు93దక్కాయి.పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్; రైతులు,కార్మికుల పార్టీలకు 52 మంది సభ్యులు ఎన్నికయ్యారు. సోషలిస్ట్లు 11 మంది,ఎస్ సి ఫెడరేషన్ పార్టీలకు 16 మంది సభ్యులున్నారు.ఇండిపెండెంట్ల హవా ఈ రాష్త్రంలో 1984 వరకు నడిచింది. ఉమ్మడిమద్రాసు రాష్ట్రంలోభ్హగమైన ఆంధ్ర అసెంబ్లీలొ 140 స్థానాలుండగా కాంగ్రెస్ కు కేవలం 40 మాత్రమేదక్కాయి. కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలకు కలిపి 35 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 40, కమ్యూనిస్తు పార్తీఇ 41 మంది సభ్యులుండేవారు, కమ్యూనిస్టు పార్టీకి 41. ఇండిపెండెంట్లకు 17 బలం ఉండేది. 

1955 ఎన్నికలనాటికి కాంగ్రెస్ సంఖ్య 119 కి పెరగగా, కృషికార్ లోక్ పార్టీ(22), ప్రజా సోషలిస్ట్ పార్టీ(13)కమ్యూనిస్టు పార్టీ(15) విపరీతంగా బలహీన పడ్డాయి. కాంగ్రెస్ బలం 119 కి పెరగడం ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో(1957) తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 68 స్థానాలుండగా పి డి ఏఫ్ కు 22 దక్కాయి. ఇండిపెండెంట్లు 12 మంది గెలిచారు. 1962 నుంచి రాష్ట్ర చిత్తరువు మారిపోయింది. పార్టీల సిద్ధాంత ప్రాతిపదికపై గౌరవం ఉందేది, కులాలు ఇంకా ప్రాబల్యంలోకి రాలేదు. 62 ఎన్నికల్లో కమ్యూనిస్టులు 50, స్వతంత్ర పార్టీ 19, ఇండిపెండెంట్లు 46 మంది గెలుచుకోగా దిగ్దంతలైన వ్యక్తులు, సచ్ఛీలురు, విద్యావంతులు, నైతిక విలువలున్నా వారు ఈ జాబితాలొ నిలిచారు. 

1967 ఎన్నికల నాతికి అవినీతి, కుల ప్రాబల్యం, బంధుప్రీతి, ఆశ్రితజనపక్షపాతం వేళ్ళూనుకుని 1967 ఎన్నికల్లో విపక్షాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కమ్యూనిస్టుల చీలికతో సి.పి.ఐ 11, సి.పి.ఎం 9 స్థానాలకు దిగజారాయి. ఆంధ్ర ప్రాంతంలో స్వతంత్ర పార్టీ మాత్రం 29 స్థానాలు నిలబెట్టుకుంది. ఇండిపెండెంట్లు అత్యధికంగా 68 మంది ఎన్నికై చరిత్ర సృష్టించారు. భారతీయ జనసంఘ్ రాజకీయాలలో కాలు పెట్టి 3 అసెంబ్లీ సీట్లలో ఖాతా తెరచింది. రిపబ్లికన్, ఎస్.ఎస్.పి నామాత్రంగా 2,1 బలంతో ఉనికి నిలుపుకున్నాయి. 1972 ఎన్నికలలో లో రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ లేకుండా తుడిచిపెట్టుకుపొయింది. ఇండిపెండెంట్లు 56 మంది గెలుపొంది ప్రధాన ప్రతిపక్షమయ్యారు. సి.పి.ఐ, సి.పి.ఎం; స్వంత్ర కలిపి 10 మించి గెలవలేకపోయాయి.

1976 ఎమర్జన్సీ ప్రభావం 1978 ఎన్నికలపై ధారాళంగా పడింది. దేశంలో ప్రచండ జనతా గాల్పులు వీచగా, మన రాష్ట్రంలో మాత్రం 1978 ఎన్నికల్లో ఇందిరా గాంధికి ప్రజలు మద్దతుగానిలిచారు. జనతానుంచి 60 మంది గెలవగా, జాతీయ కాంగ్రెస్(ఆర్) కేవలం 30 మంది బతికి బట్టకట్టారు. వై.ఎస్. ఆర్ అప్పుడు ఇందిరకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆర్ కాంగ్రెస్ ఇందిరలో విలీనమైంది. ఇందిర ప్రభంజనంలో పెత్తనం అంతా అధిష్ఠానం చేతుల్లోకి వెళ్ళి రాష్ట్రాలు ఉనికి కోల్పోయాయి.1983 ఎన్నికలు జాతీయ, రాష్ట్ర రాజకేఎయాలను గొప్ప మలుపు తిప్పి, పెనుమార్పులు తెచ్చాయి. 
(మిగతా వివరాలు మరో పర్యాయం)

No comments:

Post a Comment