Sunday 12 April 2015

తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి: ఏబికె..
-----------------------------------------------
ఆ మార్గదర్శకత్వం లోనే కొత్తగా... వన్ న్యూస్ (తెలుగు)చానల్..
---------------------------------------------------------------------
ఏబికె ప్రసాద్.., అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్‌ జన్మదినం ఆగస్టు 1 . 1935.  అంటే తెలుగునేలపై దాదాపు అయిదు  దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని భ్రమపడ్డాడు పాపం. ఆయన "జర్నలిస్టులను - ఎడిటర్లను" తయారు చేద్దామనే తపనలో తహతహలో ఎన్నో అపాత్రదానాలు చేశారు. ఆ ఫలితంగా ఎర్నలిస్టులు-సంపాదకులు ఎదిగారు. కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయనకూడా.... ఎందుకంటే ఆయన రాజీపడడు. పడి ఉంటే ఒకే పత్రికలో దర్జాగా వెలుగుతూ ఉండేవాడు. కోటిరూపాయల నజరానాకు అమ్ముడు పోయి ఉండేవాడు. కొందరిలా...
కృష్ణా  జిల్లా పునాదిపాడులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై కొద్దికాలానికే బయటికొచ్చేశారు. నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవారు. అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి తనకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరారు. తొలి ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌. ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారు. ‘జనశక్తి’ సంపాదకుడిగా అనేక కేసులు నమోదయ్యాయి.  జైలుకెళ్లారు.
ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ఆయన ప్రారంభ సంపాదకుడు కూడా.  కొత్తగా పత్రిక పెట్టే వారికి ఆయన సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత  ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీ పడి ఉద్యోగం చేయడం ఆయనకిష్టం లేదు. రాజీ పడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవారు కాదేమో.
తెలుగునేలపై ఒక కొత్త పత్రిక రావాలంటే ఏబికే మనసులో ఆలోచన పురుడు పోసుకోవాలి.  ఆస్పత్రులు, డాక్టర్లు, కాంపౌండర్లు, మంత్రసానులు, మందులు, శస్త్రచికిస్త్స సామగ్రి.. ఇలా అన్నీ ఆయన ఎంపికే.. మంచి పనిమంతుదని తలచి బృందంలో కలుపుకుని.. నిఖార్సయిన జర్నలిస్టని నమ్మకం పెంచుకుని బాధ్యత అప్పగిస్తాడు. తాను పుస్తకాల్లో.. చదువులో... రాతల్లో.. అధ్యయనాల్లో మునిగిపోతాడు. అందరినీ నమ్మేస్తాడు (నమ్మదగని వాళ్ళని ముఖ్యంగా..). ఇక తన ప్రపంచంలో  మునిగిపోతాడు. యాజమాన్యంతో రాజీ పడడు, రాజకీయంతో రాజీ పడడు. తనతో తనే రాజీపడడు.. రోజులు, నెలలు.. మహ అయితే మూడు, నాలుగేళ్ళు సాఫీగా సాగిపోతాయి..   ఆయన పేరే ఏ పత్రికకైనా వజ్రకవచం. ఆ కవచ కుండలాలనుకూడా ఇచ్చేసి బయటకి పోతాడావ్యక్తి.  
ఆయన అందలం ఎక్కించినవాళ్లందరూ ఆయన్ను నెట్టేసారు. ఆయనే లేకుంటే ఇందరు జర్నలిస్టులుగా బోర విడిచి ఈ నేలపై తిరిగేవాళ్ళుకాదు. ఆయన సమైక్య వాది. ప్రజల మనిషి. కులాలకు, పార్టీలకు అతీతుడు. ఏకొత్త మాధ్యమం మొదలవ్వాలన్నా ఏబికె చేయి పడాల్సిందే.. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు ..అన్నీ మూసలోనుంచి బయటపడి కొత్త దారిపట్టాయి. జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన ఒక మార్గదర్శి. అభిమాని. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రభలో, ఉదయంలో, వార్తలో, ఆంధ్రభూమిలో... ఎందరో ఆయన్ను ఆశ్రయించి చేరారు. ఆయన్ను పక్కకు నెట్టేసి పత్రికాస్థానాల్లో పైస్థానాలు  అలంకరించారు.
తెలుగు భాష కు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు.
చిన్నపత్రికైనా.. పెద్ద పత్రికైనా.. ఆయనకు ఒకటే. దేనికైనా రాస్తారు ఆయన... కాలాన్ని, కలాన్ని నమ్ముకున్న ఒక కాలమిస్టు. ఆపర్చునిస్టు మాత్రం కాదు.  ఇప్పుడు 80వ దశకంలో "వన్ న్యూస్"-తెలుగు కొత్త వార్తా చానల్‌కు ఎడిటోరియల్ నాయకుడు. ఆయన పేరే ఏ పత్రికకైనా వజ్రకవచం. ఆ కవచ కుండలాలనుకూడా ఇచ్చేసి బయటకి పోతాడావ్యక్తి.
 నాకలాన్ని సానపట్టింది, ధైర్యం నూరిపోసింది ఆయనే..నేను ఇప్పటికీ ఆయన అభిమానినే.. ఉదయంలో రెండేళ్ళు.. నేరుగా ఆయన సారథ్యంలో, తరువాత ఓ రెండేళ్ళు మాత్రమే ఆంధ్రజ్యోతిలో ఆయనతో కలసి పనిచేశాను.  ఆయనపై నా ఫిర్యాదు ఒక్కటే. ఆయన మోసగాళ్ళను తేలికగా నమ్ముటాడు. వలలో చిక్కుకుపోతాడు. దాంతో ఆయనను నమ్ముకున్నోళ్ళు మునిగిపోతారు. ఆ తరువాత ఆయన జరిగిన పొరపాటు తెలుసుకుంటారు.. ఇంతలో పుణ్యకాలం అయిపోతుంది.. మళ్ళీ కథ మొదలు.. ఇది వృత్తం..   ఇతి వృత్తం....

Thursday 4 September 2014

                               గురుభ్యోన్నమః 


                                     
                                       నేడు ఉపాధ్యాయ దినం. స్మరించుకుందాం. 

                 ఒక తత్వవేత్తను-మేధావిని- బహుముఖ   ప్రజ్ఞాశాలిని. 
---------------------------------------------------------------------------------------------
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బతుకుతెరువు చూసుకుంటూ సమాజం బతుకు బాటను సన్మార్గంలో పేట్టే ప్రతివ్యక్రీ ఉపాధ్యాయుడే!  పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

భారత దేశం గర్వించదగిన ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు, గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 ,సెప్టంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తణి లో సామాన్య కుటుంబంలో జన్మించాడు. తండ్రి వీరాస్వామయ్య తహశీల్దార్. తల్లి సీతమ్మ. ఆయన పాఠశాల విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరులో సాగింది. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీనుండి ఏం.ఏ పట్టా పొందారు. బాల్యం నుండే అసాధారణ మైన తెలివితేటలు కల్గివుండేవారు. 16 సం. వయస్సులో 10 సం.ల బాలిక శివకామమ్మతో వివాహం జరిగింది. ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో సీటు వచ్చినా,ఇంగ్లండ్ వెళ్ళి చదివేందుకు డబ్బులేక మానుకొన్నారు. 1909 లో 21 సం. వయస్సులో కుటుంబాన్ని పోషించేందుకు మద్రాస్  ప్రెసిడెన్సీ కళాశాలలో ఆసిస్టంట్ లెక్చరర్  గా ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అదే ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కాలంలో ఉపనిషత్తులు, భగవద్గీత , బ్రహ్మ సూత్రాలు, బౌద్ధ,జైన మత గ్రంథాలు బాగా అధ్యయనం చేశారు. వీటితోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాలను , ఆంగ్లసాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి ఆంగ్లభాషపైన, తత్వశాస్త్రము పైన మంచి పట్టు సాధించారు.

ఈయన ప్రతిభను గుర్తించి మైసూరు విశ్వవిద్యాలయం 1918లో ప్రొఫెసర్ గా నియమించింది. రాధాకృష్ణన్ ప్రసంగాలు విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకొనేవి . విద్యార్ధుల పట్ల ప్రేమ,వాత్సల్యం కల్గి వుండేవారు. 1921 లో అశుతోష్ ముఖర్జీ , రవీంద్రనాథ్ ఠాగోర్ ఆహ్వానంపై కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరారు.  మైసూర్ యూనివర్సిటీ లో ఘనంగా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పడానికి విద్యార్ధులు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన ఇంటిముందు గుర్రపు బండి సిద్ధంగావుంది. బండికి కట్టిన గుర్రాలను తొలగించి, రైల్వేస్టేషన్ దాకా బండిని విద్యార్ధులే లాక్కొని వెళ్లారు. అది విద్యార్ధులలో ఆయన పట్ల ఉన్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల అభిమానానికి రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనాడు గురుశిష్యుల హృదయాను బంధమం ఆవిధంగా ఉండేది.

కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉన్న రోజుల్లో ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం వ్రాసి పాశ్చాత్య పండితుల ప్రశంసలు పొందారు. దీనితో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిప్లేక్సన్, రికవరీ ఆఫ్ ఫేత్, కాన్సెప్ట్  ఆఫ్ లైఫ్,దిహిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈ స్టెర్న్  రెలిజిన్స్ అండ్ వెస్టర్న్ థాట్  ఆయన రచనలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పై వెళ్ళి ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలలో ప్రాచ్యతత్వ శాస్త్రం పై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయనకు అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ఇచ్చి సత్కరించాయి.

1931 లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలరర్‌గా  నియమితులయ్యారు. అదే సంవత్సరంలో లో నానాజాతి సమితి ఇంటలెక్చువల్ కొ ఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1946 లో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు.1949 లో ఉన్నతవిద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి రాధాకృష్ణన్ నాయకత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.  1952 నుండి 1962 వరకు భారత తొలి ఉపరాష్ట్రపతి గా పదవినలంకరించారు. బాబు రాజేంద్రప్రసాదు తర్వాత 1962 నుండి 1967 వరకు రెండవ భారత రాష్ట్రపతి గా పదవిని చేపట్టారు. 1954 లో  భారతరత్న పురస్కారం లభించింది. 1956 లో భార్య మరణించింది. వీరికి సంతానం 5 గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.శేష జీవితం మద్రాస్ లోని స్వంత ఇంట్లో గడుపుతూ 1975 ఏప్రిల్ 17 న పరమపదించారు.

చక్రవర్తి థార్మిక తత్త్వవేత్త అయి వుండాలన్నది గ్రీకు తత్త్వవేత్త ప్లాటో ఆశయం. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య భారతదేశానికి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్టప్రతి కావడంతో ప్లాటో ఆశయం కొంతవరకు నెరవేరినట్లే. ఆచార్యుడుగా విద్యావేత్తగా రాయబారిగా రాజనీతిజ్ఞుడుగా రచయితగా అసమాన తత్త్వవేత్తగా ప్రపంచ ఖ్యాతినందిన మహాపురుషుడు రాధాకృష్ణన్. సర్వమానవ సౌభ్రాతృత్వంకోసం, స్వేచ్ఛా సమానత్వాలకోసం నిబద్ధతతో అంకితభావంతో ఆయన చేసిన విశిష్ఠ సేవలు సమున్నత వ్యక్తిత్వానికి దర్పణాలు. రాధాకృష్ణన్ ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేదు. సంభాషణల్లో ఎవరినీ నొప్పించిన ఘటనలు లేవు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. ఆయన గాంభీర్యం, హుందాతనం చూసి అపరిచితులు తొలుత ఆయనను పలకరించడానికి జంకేవారు. తదుపరి పసిబిడ్డవంటి మృదుమధుర స్వభావాన్ని చూసి విస్తుపోయేవారు.

ప్రపంచ దేశాల మత, సామాజిక సాంస్కృతిక రాజనీతి శాస్త్ర సాహిత్యాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న మహామేధావి రాధాకృష్ణన్. నేటి వైజ్ఞానిక యుగంలో, భౌతిక విజ్ఞానాన్నీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ సమన్వయపరుస్తూ దేశ విదేశాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ మేధావుల ప్రశంసలను చూరగొన్నాయి. ప్రత్యేకించి వేద వాఙ్మయాన్ని మధించి శోధించి సాధించిన జ్ఞానామృతాన్ని తనదైన వ్యాఖ్యానాలతో పామరులకు సైతం అర్ధమయ్యేట్లు అందించారు. ఉపనిషత్తులపై, భగవద్గీతపై భారతీయ పురాణేతిహాసాలను తత్త్వశాస్త్ర సంపుటాలుగా ప్రచురించి ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు వివిధ భాషల్లోకి.

[2014 సెప్టెంబర్ నెల "క్షత్రియప్రభ" లో ప్రచురితమైన నా వ్యాసం. ]

Sunday 23 March 2014

వేడెక్కుతున్న వాతావరణం..ఎన్నికల "రణం"..  

23-3-14

*పన్నెండు రోజులకే కిరణాలు అస్తమిస్తున్నాయ్. మఖలో పుట్టి పుబ్బ వరకు కూడా నిలవని ఏకైక పార్టీగా తెలుగునాట చరిత్రకెక్కనున్న "జై సమైక్యాంధ్ర". మిగిలిన "ఆ నలుగురూ".. జై వైకాపా అనాల్సిందే! లీనం.. విలీనం..అంతా వాయులీనం. అందరూ "ఆత్మ ప్రదక్షిణలో" ఉన్నరటగా?
*అంతా పెయిడ్ న్యూస్.. పెయిడ్ వ్యూస్.. అంతా పెయిడ్ పాలిటిక్సే. అదే రుచికరమైన ఒక జ్యూస్!
*అంధ్రా కొలనులో కమలకులం విచ్చుకుంటున్నది..కొస్తా కమనీయమని చెప్పానుగా.. టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సి.పి.ఐ, సి.పి.ఎం. ఎల్.ఎస్ అన్నీ ఒకటే కులం..నీతి ఏ రాజకీయ జాతికున్నది? కావూరి, లగడపాటి, రాయపాటి... ఎవరైతేనేం? అధికారానికి అంటకాగడం నేటి నీతి. సి పి ఐ అంటే ఏమిటో తెలుసా? ఇందిరా గాంధి ఎమర్జెన్సీ రోజుల్లోనే ఆ పేరు సార్ధకత చేకూరింది. సి పి ఐ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా!!
*అసలు ఎన్టీ రామారావుకు రాజకీయాలకొత్తలో సుందరయ్య గారు కూడా ఎవరో తెలీదు. ఇక కమ్యూనిస్టులేంటి. 1982లో మొదటి సారి విజయవాడలో కొందరు ఆయనకు "వీరు పుచ్చలపల్లి సుందరయ్య గారు" అని పరిచయం చేశారు. హీరో స్టైల్లో ఒక సారి పైకి కిందికి తేరిపార చూసి " .. వీరేం చేస్తుంటారు?" అని ప్రశ్నించారు. అంతే అక్కడ ఉన్నవాళ్ళంతా... ఢాం! తరువాత కాలంలో "కమ్యూనిస్టులు మా బా వమరుదులు" అని అన్నారు. నక్సలైట్లకు ఏకంగా లాల్ సలాం చేశారు..

22-3-14
*ఇవన్నీ సరే నండీ.. ఎం జె అక్బర్ కూడా బిజెపిలో చేరారు. ఏం? ఆయన్ను కూడా తిడతారా? భాషరాని వాళ్ళు, భావాలు లేని వాళ్ళు ఇక ? ఏదీ మన ఇష్టం వచ్చినట్లు జరగదు..
*మరో సారి చెబుతున్నా. నా అభిప్రాయాలు నచ్చని వాళ్ళు వైదొలగి పోవచ్చు. అనుభవ రాహిత్యం, అభిప్రాయం పంచుకోవడం తెలియని వాళ్ళతో మిత్రత్వం వేస్ట్. నేనెవ్వరిని ఇలా ఎందుకు కాదూ?? అని నిలదీయను. ఎవరి ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకు లేదు.. ఫ్రెండ్ షిప్ అభ్యర్ధనలు పంపింది వాళ్ళే కాని నేను కాదు.. అభిప్రాయాన్ని సున్నితంగా స్వీకరించడం చేతకాని వాళ్ళు నా వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదు. నేను చిన్న, పెద్దా...స్త్రీ. పురుషులు.. అందరినీ గౌరవిస్తా. నన్ను గౌరవించలేక పోయినా, అర్ధం చేసుకోలేని వాళ్లతో పనిలేదు..
*పాస్ పోర్ట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆధార్ కార్డ్ ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ నెంబరుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఐ అండ్ పి ఆర్ అక్రెడిటేషనుంది.. అసెంబ్లీ పాసుంది..డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది., మరొ అరడజను పైగా పనికొచ్చేవీ, పనికిరానివీ ఐ డి కార్డులున్నాయి... ఇన్ని ఉన్నైకదా ఆ ఒక్కటి ఎందుకులే అని ఓటర్ కార్డు ఇవ్వలేదేమో!! రెండు సార్లు నమోదు చేయించుకున్నా..మొన్న 9న పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్ళి ఓటర్ లిస్ట్ చూస్తే నా పేరు మాత్రం లేదు
*రాజకీయనాయకుడు రంగు మార్చుకుంటే, కొత్త జెండాలు ఎత్తుకుంటే, కొత్త కండువాలు కప్పుకుంటే, అభిమానులు భుజాన వేసుకోవచ్చునేమో! కాని, ఓటర్లు ఎప్పటికప్పుడు రంగు మార్చుకోరు. ఓటరు వేరు, జనం వేరు, అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు.. మా ఇష్టం వచ్చినట్లు పొత్తులు పెట్టుకుంటాం మీరు ఓట్లు వెయ్యండంటే తలలూపడానికి మంది మంద గొర్రెలు కారు. ఈ పాట్లన్నీ పదవులకోసమే. అనుమానం లేదు. అందరివీ శ్రీరంగనీతులే... అన్నీ కుటుంబ పార్టీలే.. అన్నీ సొంత కుంపట్లే..
*నాకు తెలిసిందే కాని. ఒక పెద్దాయన ప్రత్యక్ష అనుభవం..
-----------------------------------------------------------------
నిన్న మా సోదరుని(ఆ మాట కంటే అప్త స్నేహితుడంటాను) కుమార్తె వివాహానికి వెళ్ళాను. అవె బంధు మిత్రులు.. కాలక్షేపం కబుర్లు.. తప్పలేదు రాజకీయాలూ ప్రవేశించాయి. ఒక 65 సంవత్సరాల సాంప్రదాయ పౌరోహిత బంధువొకాయాన మాట్లాడుతూ తన అనుభవం చెప్పాడు అందరూ షాక్. నేను సాదా సీదాగా ఉన్నాను. అందరూ అదేమిటి మీకేమి అనిపించడం లేదా అని అడిగారు. ఇది సింపుల్. అందరికీ తెలుసు. కాకుంటే నాకు కొంత ముందు తెలుసు..
ఆ పురోహితుని మాటల్లో..
"ఈ మధ్య ఒక రాజకీయ నాయకుడు సుడిగాలి పర్యటనలు చేస్తూ పశ్చిమకు ఊరూరు వెళ్ళాడు. అందరినీ ఆత్మీయంగా పలకరించాడు. బంధుత్వాలు కలిపాడు (పిలవడం వరకే..) కష్టాలు విని కరిగి పోయాడు. నేనొస్తున్నా మీ బతుకులిక 100 వాట్ బల్బులే! అడిగినా, అడగకున్నా వరాలు.. మీ భవిష్యంతా నాకొదిలేయండి. నాకు చాలా భవిష్యత్తుంది. అప్యాయంగా భుజాలు నిమిరాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. నాకనిపించింది ఎంత మహాను భావుడు.. జనాల్ ఎందుకింత ద్వేషిస్తారు ఈయన్ను, అని. అందరితో షేక్ హాండ్... వరుసలో ఉన్నారు. నా వంతు వచ్చింది. ఏం ఎలా ఉన్నారు. మీకు మంచి జరుగుతుంది.. మృదువుగా చెయ్యి కలిపాడు. ఆయన జరిగి వెళ్ళి పోయాడు. అంతలో నా అరచేతిలో ఏదో గరుకుగా తగిలింది. జనం ఒత్తిడిలోనే గుప్పిట విప్పి చూశాను. ఆశ్చర్యం వెయ్యి రూపాయలనోటు. నోరు పెగల్లే.. కొద్దిగా జనం బయటకు వచ్చాను. నా లాంటి వాళ్ళు మరో పదిమంది.. ముసిముసిగా నవ్వుకుంటూ..
ఆ షేక్ హాండ్ విలువ వెయ్యి. నాయకులు కొందరు తమతో కలసి భొజనం చేస్తే, టిఫిన్ చేస్తే..డబ్బు వసూలు చేస్తున్నారు. కాని ఆ మహాను భావుడు మనకు షేక్ హాండ్ ఇచ్చి ఎదురు వెయ్యి.. అహా మా అదృష్టం..
రోజూ షేక్ హాండ్లు..రాజకీయమా వర్ధిల్లు..
*ఎవరి డబ్బా వారిది. డబ్బుండాలికాని డబ్బాలదేముంది. దబ్బిస్తే వాయించడానికి ఎక్కడైనా డప్పుగాళ్ళు సిద్ధమేగా! రోజూ స్మశానాలవద్ద వింటునే ఉంటాం.. ఒక జగన్, ఒక బాబు, ఒక కెసీఅర్, ఒక కిరణ్, ఇప్పుడొక ఒక పవన్.. అయితే ఏకకాలంలో రెండు డప్పులూ వాయించే మొనగాళ్ళూ ఉన్నారు. ఎవరి డప్పు వారికి ఇంపు..
*జెండాలు మోయడమేమిటి పాపం..ఆత్మాహుతులూ చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఇప్పుడు అదే ప్రశ్న వెయ్యాలేమో! ఆత్మహత్యలతో ఉద్యమాలు నడవవు. అయినా ఎవడు చేసుకోమన్నాడు? నన్నడిగి చేసుకున్నారా?

21-3-14
*ఇవాళ మరోసారి తెలిసింది. నిరుపేదలు, మధ్య తరగతి సామాన్యులంటే వీళ్ళందరికీ ఎందుకు అమితమైన ప్రేమో..దయో..పాపం వాళ్ళ కడు బీదవారు.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దేశంలో కెల్లా అత్యంత(కటిక దరిద్రులు..) భాగ్యవంతులైన ఎంపీలు 11 మంది అని తేల్చారు. వారిలో ఆరుగురు మనవాళ్లే.. మన అవిభక్త ఆంధ్రప్రదేశీయులే.. మనకెంత గర్వం!!
1)జయ బచన్....494 కోట్లు
2)వై జగన్మోహన్ రెడ్డి ....446 కోట్లు
3)టి సుబ్బరామిరెడ్డి...239.6 కోట్లు
4)అని ఎ హద్...175 కోట్లు
5)నామా నాగేశ్వరరావు...174 కోట్లు
6)నవీన్ జిందాల్...132 కోట్లు
7)లగడపాటి రాజగోపల్...123 కోట్లు
8)కపిల్ సిబాల్....114 కోట్లు
9)కొణిదెల చిరంజీవి...89 కోట్లు
10)ప్రఫుల్ మనోహర్‌భాయ్ పటెల్...84 కోట్లు
11)గడ్డం వివెకానంద్....73 కోట్లు..
ఈ పేదలకు నిరుపేదలంటే అమిత ప్రేమ మరి.. మనం ఎంత అదృష్టవంతులమో కదా!!

*మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధి. చక్రవర్తుల రాజగోపాలాచారి మనుమడు. దేవదాస్ గాంధి కుమారుడు ఈ రాజ్‌మోహన్ గాంధి అకస్మాత్తుగా ఆకాశం నుండి రాజకీయాల్లోకి ఊడిపడుతుంటారు. మేధావుల వర్గీయుడేకాని ప్రజల మనిషి కాదు తాత గారి మాదిరి. జీవితం అంతా అత్యున్నత స్థాయిలో అనుభవించి, ఎనిమిది పదుల వయసులో ఆప్ కార్యకర్తగా మారి అవినీతిపై యుద్ధానికి సిద్ధుడవుతున్నారు. 1989లో రాజీవ గాంధిపై అమేధి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి దిగ్విజయంగా పరాజయం పాలయ్యరు. డిల్లి సైంట్ స్టెఫెన్సన్ కాలేజి విద్యార్ధి. ఇందిరా గాంధి ఎమర్జన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల క్రియాశీలక కార్యకర్త. ఉద్గ్రంధాల రచయిత, చేయి తిరిగిన పాత్రికేయుడు. 1990-92 పెద్దల సభ సభ్యుడు.. దేశం అనేక సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకుల్లో పడి అస్తవ్యస్తంగా తయారైనప్పుడు మౌనం వహించారు. అవినీతిపై ఎప్పుడూ ఉద్యమించిన దాఖలాలు లేవు. రాజకీయాంగా క్రియాశీలకం కాదు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ చేరువలో లేరు. అప్పుడప్పుడూ వార్తలకెక్కుతుంటారు.
వీరిప్పుడు కేజ్రివాల్ వెంట నడుస్తున్నారు. ఇన్నేళ్ళు (కనీసం పదేళ్ళుగా నైనా) దేశం సంగతి ఎందుకు పట్టించుకోలేదో..సామాన్యనుని వాసనలెక్కడైనా కనిపిస్తున్నాయా ఈయనలో? ఇదీ వారసత్వపు వాసనలేగా! వీరి గురించి మరి కొంత సమాచారం:
His book, A Tale of Two Revolts: India 1857 & the American Civil War (New Delhi: Penguin India, December 2009), studies two 19th-century wars occurring in opposite parts of the world at almost the same time. His previous book, a biography of his grandfather Mahatma Gandhi, Mohandas: A True Story of a Man, His People and an Empire, received the prestigious Biennial Award from the Indian History Congress in 2007. It has since been published in several countries. In 2002 he received the Sahitya Akademi Award for his Rajaji: A Life, a biography of Chakravarti Rajagopalachari (1878-1972), his maternal grandfather and a leading figure in India’s freedom movement, who became the first Indian Governor General, 1948-50.
His Other works include Ghaffar Khan: Nonviolent Badshah of the Pakhtuns (Penguin 2004); Revenge & Reconciliation: Understanding South Asian History (Penguin, 1999); Patel: A Life, a biography of Vallabhbhai Patel (1875-1950), Deputy Prime Minister of India, 1947-50 (Navajivan, Ahmedabad, 1990); and Eight Lives: A Study of the Hindu-Muslim Encounter (SUNY, 1987). One of his earlier books, The Good Boatman: A Portrait of Gandhi, was published in 2009 in a Chinese translation in Beijing. Most recently, Rajmohan Gandhi has also penned a book titled, Punjab (Aleph Book Company 2013), which is an unprecedented historical account of undivided Punjab, from the death of Aurangzeb to the Partition.[2]
Before teaching at the University of Illinois, he served as a Research Professor with the New Delhi think-tank, Centre for Policy Research. From 1985 to 1987 he edited the daily Indian Express in Madras (now Chennai), India. In 2004 he received the International Humanitarian Award (Human Rights) from the City of Champaign, and in 1997 he was awarded an honorary doctorate of law from the University of Calgary (Canada) and an honorary doctorate of philosophy from Obirin University, Tokyo. He currently also serves as a Jury Member, Nuremberg International Human Rights Award, and Co-chair, Centre for Dialogue & Reconciliation, Gurgaon, India.

20-3-14
*ముఖ్యమంత్రి పదవి విషయం వచ్చేసరికి పాత్రికేయ మిత్రులందరూ ఒకటే ప్రశ్నల పరంపర.. ఓకే....మరి మన పత్రికల్లో, చానళ్ళలో ఎడిటర్ పోస్టుల విషయం మాత్రం నోరు పెగలదు.. మనది కాక పోతే కాశీ దాకా దేకమన్నారు...
*ఓటరు ఎప్పటినుంచో తెలివైనవాడు.. మనకు నచ్చక పోతే మూఢుడు.. నచ్చితే జ్ఞాని. ఒక సామెత ఉంది. "వెయ్యి గొడ్లు తిన్న రాబందు.. ఒక్క గాలివానకు కొట్టుకు పోతుంది." అని. తెలివి తక్కువ వాళ్ళు ఇద్దరు. వినే వాళ్ళు, తినే వాళ్ళు..
*మోదీ స్థాయి తగ్గుతున్నదా? పవన్ దూకుడు పెరుగుతున్నదా?
సుత్తి కొడవలి, ఈల కూడా కమలం చేరనున్న సైకిల్ తో సుఖ ప్రయాణం కోరుకుంటున్నాయి. ఆ నలుగురికీ పవనం కూడా అనుకూలిస్తే....
*నేనెప్పుడో చెప్పా!! ఏడుకొండలవాడితో గేమ్స్ ఆడద్దురా అని.. ఎవ్వరూ వినలా..
పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు!
వెయ్యికాళ్ళ మంటపం కూల్చివేతతో అంకురార్పణ..  అవి ఏడుకొండలు కాదు. రెండే అన్నప్పటినుంచి అసలు కథంతా మొదలైంది. జనాల బాటలో చిరుతలు, పులులు నడవడం మొదలెట్టాయి. ఏనుగులూ ఘీంకరించాయి. ఊళ్ళలో గుళ్ళు కూలాయి, గోపురాలు గాలికే కొట్టుకుపోయాయి. ఆయన దేవుడు.. మనిషిలా మూలగడు. మాడు పగలగొడతాడు. మనిషిని మోసం చేసేవారెవరైనా మాడి మసైపోతారు, ఎందుకంటే దేవుళ్ళు మనుషుల్లో ఉంటారు. రాక్షస సంహారం జరుగుతుంది.. అటూ ఇటూ కొద్దిరోజుల తేడా.. అంతే!! అకౌంట్ తేలాలంటే చిత్రగుప్తుడు చిట్టా పూర్తి కావాలికదా..!!
**ఏకు మేకవ్వడం అంతే ఇదే!! ఓడ మల్లన్న బోడిమల్లన్న అవుతాడన్నది నిజం. తెలంగాణాకు శుభం కార్డు డిల్లీ జనపథ్ లో గ్రూప్ ఫొటో తో పడ్డది. అయితే భాగ్యనగరంలో మళ్ళీ కథ అశుభంతో మొదలయింది.
*పధ్నాలుగు సంవత్సరాల వనవాసానంతరం తెలంగాణకు పట్టాభిషేకం.. కానీ కాంగ్రెస్ కు మరో పధ్నాలుగేళ్ళ అజ్ఞాత వాసం తప్పేట్లు లేదు..
*తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ చచ్చింది..ఇక్కడ, అక్కడ
*చివరకు జె సీ కూడా పచ్చ చొక్కా. గుడ్డలిప్పి తిరిగే సిగ్గులేని వాళ్ళను భరిస్తున్న జనాలకు ఉండాలి ఎగ్గు..
*సమైక్యవాద నాయకులందరూ సాయుజ్యం పొందారు.. టిజి, ఏరాసు పసుపునీళ్ళతో శుద్ధి. మా "శైలజునాథుడు" కూడా "చెప్పులు" విడిచాడు, అనాథుడు కాకుండా ఫాన్ గాలి కావాలట. ఎలాగైనా ఆయన గడప కడపకు దగ్గర కదా!
*మూడురంగుల్లో ఏరంగైనా మార్చుకోవచ్చు. ముందు రంగు పడడం ముఖ్యం..

19-3-2014
*ఈ రాజకీయాల్లో ఎక్కడా ఏ ఇల్లూ చల్లగా లేదు. కానీ ఎదుటిల్లు తగలబడాలని ప్రతివాడి ఆశ!! అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాళ్ళు చాలా సంఖ్యలో...

*Regarding fire accident on Tirumala hills Governor, HE ESL Narasimhan informed 2 air crafts which have an expertise in chemical spraying to put off flames would arrive tonight. He had also alerted Chief of Air Force and Chief of Naval authorities and other heads of armed forces. He directed the EO TTD to coordinate. He informed that he was personally monitoring the situation and added that the fire will soon come under control. He asked the pilgrims not to get panicked.

Chief secretary Mr Mohanti Spoke to Cabinet Secretary, Secretary Defence, Secretary Forest and environment . He informed that Air Force authorities are arranging 4 helicopters and 100 Army personnel are reaching Tirumala DG Forests, DG Fire Services are reaching Tirumala tomorrow from Delhi.CS nominated EO TTD, M G Gopal as Nodal Officer. He directed Collector Chittoor to coordinate the operations.

*నిజమే, నాకూ అనిపిస్తున్నది. ఒక గెలుపు చారిత్రిక అవసరమని!!
*రచయితల్లో భావ దారిద్ర్యం..రాజకీయాల్లో సైద్ధాంతిక దారిద్ర్యం...పేదలకు నిత్య దరిద్రం..
*ఇవన్నీ పక్కన పెట్టండి నాకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయండి.
అప్పుడేమో ఉత్తరాదిన కేదారా్‌నాథ్‌లో జలప్రళయం. అభం శుభం ఎరుగని యాత్రికులెందరో జలసమాధి అయ్యారు, గల్లంతయిన కొందరు నేటికీ ఆచూకి లేదు..
ఇవ్వాళ దక్షిణాదిన పవిత్ర యాత్రాస్థలం కలియుగవైకుంఠంలో అగ్నికీలలు. అన్నెపున్నెం ఎరుగని మూగ జీవాలు ఎన్ని బూడిదవుతున్నాయో... జలప్రలయం దైవ ఘటన అని.. అగ్నికీలలు దుశ్చర్య అని అంటున్నారు...అయితే అవినీతి, ఆశ్రితపక్షపాతం, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కొట్లాది ప్రజలను అనునిత్యం మోసగిస్తూ దేశాన్నే కబళిస్తున్న నాయకులు క్షేమంగా ఉన్నారు. రోజుకో రంగుమారుస్తూ సిగ్గెరగని నేతలు బోరవిడుచుకు తిరుగుతున్నారు. దేవుడుకూడా ఇలా తయారయితే ఇక దిక్కెవ్వరు..
మంచోన్నేమో మంటబెడ్తవు
చెడ్డొంకి చెయ్యందిస్తవూ!
పిర్రలు జూస్తవు-పీటలేస్తవూ
శబ్బాష్‌రా-శంకరా!!!!
నువు తోల్‌బొమ్మల నాడిస్తవు
నడిమిట్లాపి ఏడ్పిస్తవూ!
ఏ దినమెవ్వరి ఖేల్ ఖతమైతదో..
శబ్బాష్‌రా-శంకరా!!!!
*ఏమిటో..మా కోయిలకు తొందరెక్కువ. ముందే కూసేసింది.. ఇప్పుడు గొంతు పెగలడంలా!!
"రాములమ్మ" ముందుగానే కాంగ్రెస్ కండువా కప్పేసుకుంది. కాంగ్రెస్ "కొండ"లన్నీ గులాబి జల్లుకుంటుంటే. రోజురోజుకూ పళ్ళెంలో సీ(స్వీ)ట్లన్నీ అయిపోతున్నాయి...
*ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంటుందో తెలుసా.. ఏ అర్హతా లేనివాళ్ళు. జవాబు తెలియని వాళ్ళకు. మన సమాజాన్ని రేయింబవళ్ళు ప్రశ్నించేది ఇద్దరే; ఒకటి రాజకీయ నాయకులు. రెండు ప్రసార మాధ్యమాల వాళ్ళు. కాని వీళ్ళు ఒకరినొకరు ప్రశ్నించుకోరు. ఎందుకంటే ఇద్దరూ మహాతెలివైన వాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు తెలిసి మసులుకుంటారు..
*రాజకీయాల్లో పత్తిత్తెవరు? జీవితంలో క్రమశిక్షణ లేనివానికి మరొకరికి నీతులు చెప్పే అధికారం లేదు. ప్రతిపార్టీ అవకాశవాదమే..కులానుకూలమే. కుటుంబాధిపత్యమే.. అధికారదాహమే..
18-3-14
*మెరిసేదంతా బంగారం కాదు..
కురిసేదంతా వర్షం కాదు..
తెల్లనివన్నీ పాలు కాదు..
పొత్తులన్నీ నిజంకాదు..
సమూహాలన్నీ ఓట్లూ కాదు..కావు కూడా!!!
*పుట్టి బుద్ధెరిగిన తరువాత ఇప్పటి దౌర్భాగ్య రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు. ఇందరు నాయకులు ఇన్నిసార్లు పట్టపగలు బట్టలు విప్పి సిగ్గు విడిచి పార్టీల వేదికలపై నర్తించడం..చూడాడానికి, వినడానికే కాదు ఊహించడానికి కూడా మనస్కరించడం లేదు. ఎమర్జన్సీ దినాలైన తరువాత కూడా ఈ పరిస్థితులు దాపురించలేదు. మరీ ఇంత నిస్సిగ్గా?
*కాంగ్రెస్ ఖర్మ చివరకి ఇలా కాలింది. కొండా దంపతులను పొన్నాల బుజ్జగించినా.. కాదు పొమ్మని టిఆర్ఎస్ గూటికి చేరారు.. మరీ ఘోరమేమిటంటే పాపం కేంద్రమంత్రి కావూరిని కూడ స్వయాన రాహుల్, దిగ్గి లాంటి దిగ్గజాలు "పార్టీ వదిలిపోవద్దు బాబూ..." అని ప్రాధేయ పడటం.. ఆయన కాదని ఛీత్కరించుకోవడం....
*బిజెపి పొత్తు బాబుకు లాభం..
పవన్‌తో సహజీవనం టిడిపికి చేటు.
పవన్-బాబుతో నడక బిజెపి నడిసముద్రంలో మునక..
*మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిధులుదాటి, అవధులు అధిగమంచి పోయింది. విశ్వమంతటినీ గుప్పిటలోకి తీసుకుంది. ఎన్నెని గ్రహాలున్నాయో.. ఏ గ్రహం ఎక్కడుందో! ఆ గ్రహంలో ఏమున్నాయో..అనీ తెలుసుకుంటున్నాం. గూగుల్ ప్రపంచాన్ని వడపోసి స్కాన్ చేసి గుండు సూది కూడా వదలడం లేదు.
కానీ.. పది రొజులైంది.. 239 మంది ప్రయాణిస్తున్న విమానం జాడ కోల్పోయి. ప్రపంచ దేశాలన్నీ అంజనం వేసి చూస్తున్నాయి లిప్తపాటు కాలాన్ని కూడా వృధాచేయకుండా.. నేటికీ ఆ రహస్యం ఛేదించలేక పోతున్నారు. ఇన్నిరోజులుగా ఎలా దాచిపెట్టారు, ఎవరు దాచిపెట్టారు. వారికి ఇన్నిరోజులుగా తిండీతిప్పలు ఎలా? పిల్లా, జెల్లా. వృద్ధుల ఆరోగ్యం ఏమిటి? ఒక్కళ్ళు ఎందుకు చెప్పలేక పోతున్నారు.
*ఒకటి మాత్రం ఖాయం. మన రెండు రాష్ట్రాల్లో కల్తీలేని నిఖార్సయిన రాజకీయ పార్టీ ఒక్కటీ లేదు. అన్నీ ఊసరవెల్లులే!
17-3-14
*2000 నుంచి 2012 వరకు నిర్విరామంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, గాంధిభవన్ బీట్లు చేసా.. రోజూ వాగుడుకాయి నాయకులు గత రెండు నెలలుగా హుష్ కాకి. తుపాకి గుండుకు దొరకడం లేదు.అడ్రస్ గల్లంతు. కారణం ఏమిటా అని విచారిస్తే.. ఆపరేషన్ కాంగ్రెస్ "దిగ్విజ"యంగా పూర్తయిందట! పార్టీ మళ్ళీ కోలుకున్నప్పుడు తిరిగి చూద్దాంలే.. ఆ బ్యాచ్ మరో పదేళ్ళు కలికం వేసి చూసినా కనపడరు. వినబడరు..
*మాజీ ముఖ్యమంత్రి అటువైపే ఉన్నారట.. కాంగ్రెస్ బస్సు అసలే జనం లేక ఖాళీగా ఉందట ఆయన్ను, ఆవెంటున్న ఆంధ్రా అక్టోపస్ ను.. కూడా ఎక్కించుకోండి. అరసవెల్లిలో తూర్పు తిరిగి నమస్కారం చేయ్యండి. పాపం ఒక పని పూర్తవుతుంది.
*ఎన్నికల్లో.. అక్కడైనా, ఇక్కడైనా....ఐతే స్వీప్.. లేకుంటే వీప్! *శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కాంగ్రెస్ బస్ యాత్ర! ఓ కార్యకర్తా.. నీ బస్సు జీవితకాలం మిస్సు..
చక్రాలూడిన బస్సుకు ఇద్దరు డ్రైవర్లు.. కలెక్షన్ కండక్టర్లెందరో!!
*బోడి గుండుకు..మోకాలికి ముడిపెట్టడడమే నేటి జర్నలిజం. అదే పవన్ - రాహుల్ పెళ్ళి ప్రస్తావనలు. కోతికి కొబ్బరి కాయ దొరికింది. అంతే వెంటనే ఒక ప్రబుద్ధుడు రెచ్చిపోయాడు.
"ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటానని చెప్పారు.నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాహుల్ గాంధీ గురించి వ్యాఖ్యానం చేశారు. ఈ నేపధ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు ఆసక్తి ఏర్పడుతుంది. పెళ్లి గురించి మాట్లాడారు కాని బ్రహ్మచర్యం గురించి ఎలా మాట్లాడుతారులే!"
అదేం ముక్తాయింపు?
*ప్రేమ అదొక అవ్యక్తానుభూతి..ప్రేమించడమంటే బానిసలుగా తలవంచడం కాదు. అభిప్రాయాలను అస్వాదించడం..హృదయాలను అంగీకరించడం..వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే ప్రేమించగలరు. వారే ప్రేమకు అర్హులు.. అందుకే కొందరు మాత్రమే శత్రువులను కూడా ప్రేమించే శక్తిమంతులు. ..
16-3-14
*రాజకీయాలగురించి, రాజశేఖర రెడ్డి గురించి..ఆయన ప్రభుత్వ కార్యక్రమాల గురించి చాలామంది కొత్తవాళ్ళు ఇవ్వాళ మాట్లాడుతున్నారు. అప్పటికి పాత్రికేయ వృత్తిలో పుట్టని వాళ్ళు ఇవ్వాళ ఏవేవో రాజకీయాలు మట్లాడేస్తున్నారు. భండారు శ్రీనివాసరావుగారి వంటి సీనియర్ల ముందు కూడా చాలామంది ఎన్నెని కుప్పిగంతులు వేస్తున్నారో. ఇవాళ్టి వాళ్ళు చాలామంది అప్పుటికి ఇంకా పుట్టనేలేదు... ఇప్పటిమాదిరి ఆ రోజుల్లో రాజకీయ నాయకులెవ్వరికీ వీరవిధేయ కలం సైన్యం, ఆత్మాహుతి దళం లేవు.
వై ఎస్ ఆర్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు అసెంబ్లీ ప్రవేశంతోనే మా అసెంబ్లీ ప్రవేశమూ జరిగింది.(వారు సభలో.. మేము గ్యాలరీలో. అంతే తేడా...) అప్పటి చెన్నారెడ్డి నుంచి నిన్నటి కిరణ్‌కుమార్ రెడ్ది వరకూ ఎందరో..తెల్సిన సీనియర్లు మౌనంగానే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి ముందే అనేక ఇంటర్వ్యూలు చేశాము. అనేక రాజకీయ సంక్షోభాలకు ప్రత్యక్ష సాక్షులం. అది గొప్ప కాదుకాని.. ఇవ్వాళ కలాలు పుచ్చుకుని, గళాలు విప్పుతున్నవాళ్ళు కూడా ఏవేవో మాట్లాడుతుంటే చెప్పాల్సి వస్తున్నది. 1978 నుంచి నేటివరకు దేశ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో మారిన రంగులు అనేకం చూశాం. అందుకే ఎవరు పడితే వాళ్ళు చేసే వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం లేదు..
*ప్రతివాడు రాజకీయాలలో విలువలు కాపాడేందుకు సంసిద్ధుడే..పాపం రాజకీయం..అడుగుజాడలు..
అలాగే ప్రతివారూ తెలుగును ఉద్ధరించేందుకు కంకణబద్ధులే..పాపం తెలుగు కూడా...కాపీమార్గం..
ఒకదానికి ఆదాయం.. మరోదానికి ప్రచారం..
15-3-14
*పవన్ ప్రసంగం పై వ్యక్తిగత అభిప్రాయాలు చాలా చదివా. తప్పులేదు కొందరికి నచ్చొచ్చు. కొందరికి అసలు విసుగేసి ఉండొచ్చు. పవన్ ప్రసంగంలో సారం కనిపించక పోవచ్చు. కొందరు మెచ్చక పోవచ్చు.
ఇవ్వాళ ఒక్కొక్క పత్రిక "పవన్" వార్తకిచ్చిన ప్రాధాన్యతా క్రమం గమనిస్తే.. పవన్ పట్ల వారి పోకడ అర్ధమవుతున్నది. అన్ని పత్రికలూ అందరూ మెచ్చుతున్నారా? అవి చెప్పినవే వేదాలా? అన్ని టీవీలను అందరూ పొగుడుతున్నారా..
అందరు నాయకులనూ అందరూ యుగపురుషుల మాదిరి ఆరాధిస్తున్నారా? ఎవరి ధోరణి వారిది..ఒకాయనకు రైతు లోకం, మరొకాయనకు విద్యార్థి ప్రపంచం, మరొకనికి బడుగు జీవి ప్రామాణికం. ఇంకొకరికి కార్పొరేట్ కలలు, మరి కొందరికైతే మహిళా సమస్యలు.. కొందరేమో ప్రాంతీయ అభిమానం, పలువురిది వ్యక్తి పూజ.. లోకో భిన్న రుచి. ఎవరి అజెండా వారిది. వారి వారి అలోచనలు వారికి ఉంటాయి. అయితే విచక్షణ విడిచి మనం ఏగాలికో కొట్టుకు పోకూడదని నా అభిప్రాయం. ఇదీ చాలామందికి ఇష్టం ఉండక పోవచ్చు...
8-3-14
*Mother is first.. God is next.. Love mother and pray God..
*మాతృ దేవోభవ! అమ్మకు నమస్కారం.. అవనిలో, ఆకాశంలో, అవకాశంలో, అధికారంలో.. సగం. ప్రసంగాలకే పరిమితం, అనుచరణలో మాత్రం శూన్యం. సాధికారత కాదు ఇప్పటికీ పరాధీన యే!! అన్ని దినాల మాదిరే మహిళకూ ఈ సుదినం "అంకితం".

పాలిట్రిక్స్ లో హాటెస్ట్/లేటెస్ట్ కామెంట్స్..  



12-3-14
*రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్త్రమం మొదలైంది.. పాతుకు పోయిన కాంగ్రెస్ వృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించి పారేసి కొత్త మొక్క నాటే బృహత్తర బాధ్యతను సోనియా జైరాం రమేష్ కు అప్పగించినట్లనిపించింది. సీమలో పార్టీని గడ్దపలుగుతో తవ్వి పారెయ్యడానికి వీలుగా కొణిదెల వారబ్బాయికి, నీలకంఠాపురం రఘువీరారెడ్డికి పగ్గాలు ఇచ్చారట. అందుకే ప్రత్యక్ష పర్యవేక్షణకు జైరాం తో పాటు దిగ్విజయ్‌సింగ్ కూడా సాయం పడతారట్లుంది... ఇదంతా చూస్తుంటే నాకనిపిస్తున్నది ఈనికలలోపే..అందరూ తలొక దుకాణంలో సర్దుకుంటారని..
*గొట్టాల రణగొణ ధ్వనులు. వేటికవే.. బాబుకు ఈటీవి, ఏబిఎన్,ఎన్ స్టూడియో, సివీఅర్.. అప్పుడప్పుడూ మరో రెండూ.. లైవ్ టెలికాస్ట్, జగన్‌కు సరే సాక్షి, అప్పుడప్పుడూ ఎన్టీవీ, టీవీ5. కిరణ్ కు సొంత ఐ న్యూస్. టెవీ9, టీవీ5 అప్పుడప్పుడూ.. సిపిఎం చానల్ వేరే.. చూస్తుండండి.. రెండ్రోజుల పాటు చిన్నా చితకా.. అన్ని చానళ్ళూ "జనసేనలో" పవన భజనలో కొట్టుకుపోవడమే!!

*ఎప్పటికైనా సముద్రం సముద్రమే.. నది నదే! విశాఖ సముద్ర తీరాన ప్రజాగర్జనకు అనుమతి లభించకపోవడం తో 24 గంటల్లో టిడిపీ తన సభావేదికను ఇందిరాప్రియదర్శిని స్టేడియంకు మార్చుకుని వాయ వేగంతో ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఒడ్డున రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లొ జై సమైక్యాంధ్ర ఆవిర్భోత్సవసభకు అధికారులు నో.. అందంతో రోడ్డెక్కింది పాపం. ఆర్టీసి బస్టాండ్ వద్ద ఒక అచిన్న స్థలంలో మమ అనిపిస్తున్నారట! ఎలాగైనా బాబు బాబే! కిరన్ రన్..
*విలేకరి ముదిరితే ఎమ్మెల్యే అవుతాడని మా కన్నబాబు నిరూపించాడు. ఇప్పుడు మరో దశ దాటి ఊసరవెల్లి అవుతున్నాడు. ఈనాడు..మాజీప్రతినిధి కె కన్నబాబు కులసమీకరణల నేపథ్యంలో పీఆర్‌పి ఎమ్మెల్యే అవతారమెత్తి. విలీనానంతరం కాంగ్రెస్ రంగేసుకున్నాడు. కొస్తా పసుపుధాటికి ఉక్కిరిబిక్కిరవుతూ. రెండుమూడు రోజుల్లో తెలుగు తమ్ముడై ఒంటికి, ఇంటికి పసుపేసుకుంటాడట!! వినేందుకే సిగ్గవుతున్నది,. రోజూ వీళ్లను చూస్తూ కలిసి మాట్లాడడంతో మాలో సిగ్గే చచ్చిపోయింది.
*యుద్ధసేనలు సాధారణంగా...భూమార్గం, జలమార్గం, ఆకాశమార్గం..అయితే 14న వచ్చే ఎన్నిఉకల 'జనసేన పవన మార్గమట. అదీ. స్టార్ నాయకుడు కదా.. అంచేత పార్టీ పురుడు నొవో టెల్ స్టార్ హోటల్లో..నామకరణంకూడా వెనువెంటనే.. మరి పీటలమీద కూర్చుండే ఆ ధర్మపత్ని ఎవరో!! ఆయనకు అత్యాస లేదు, పోటీ కేవలం 10 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లకే పరిమితం. మరి అటువంతప్పుడు ఇంత ఆయసమెందుకట??
*అన్ని వ్యవస్థలకూ మాదిరి రాజకీయ పార్టీలకు కూడా వ్యవస్థాపకులుంటారు. అదేమాదిరి కొన్నింటికి భూస్థాపితులు కూడా ఉంటారు. కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుదండీ!
-------------------------------------------------------------------------------------------------------
12-3-14
ప్రభుత్వ ఉత్తర్వు అమలుకు దిక్కులేదు
**నార్ల వెంకటేశ్వరరావు జీవిత సాఫల్య అవార్డు సహా, రాష్ట్రంలో 31 మంది పాత్రికేయులకు 2008, 2009, 2010  సంవత్సరాలకు ఉత్తమ పాత్రికేయ అవార్డులు ప్రకటిస్తూ 20 నెలల కిందట, 2012 ఆగస్టు 1వ తేదీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు(ఘ్.ఓ ఋత్ ణొ.3541)ను అమలు చేయలేని ఈ ప్రబుద్ధుడు విడిపోయిన రాష్ట్రాన్ని కలుపుతాడట. ప్రజలను మభ్యపెడుతూ చివరినిమిషం వరకూ పదవినిపట్టుకుని వేలాడిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువను గురించి ఉపన్యాసాలివ్వడం తెలుగు ప్రజల దురదృష్టం.  కేవలం 31 మందికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాట నిలుపుకోలేని ఘనుడు మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాడట. పత్రికలన్నా, పాత్రికేయులన్నా గౌరవం లేని వ్యక్తి బినామీగా ఒక పత్రికను, చానల్‌ను నిర్వహించడం సిగ్గుచేటు. ప్రకటించిన అవార్డులు నాలుగు నెలలోగా అందజేయాలని హై కోర్టు ఉత్తర్వులను జారీ చేసినా కూడా లెక్కజేయని ఈ వ్యక్తి కొత్త రాష్ట్రం ఏర్త్పాటు పై రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును  ఆశ్రయించడం ఆయన విజ్ఞతను ప్రదర్శిస్తున్నది. దివంగత  కాంగ్రెస్ నేతలు, దివంగత  ముఖ్యమంత్రులకు నివాళులర్పించని ఈయన తెలుగుల ఆత్మగౌరవం నిలబెడతాట. రాజకీయ జన్మనిచ్చి ముఖ్యమంత్రిని చేసిన తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి, అన్నం పెట్టిన చేతిని కాటువేసిన ఈ వ్యక్తి విలువలు, నీతులు చెబుతున్నాడు. మూడున్నర సంవత్సరాల పాలన రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసింది. ఈయన పార్టీ ఎవరికి లబ్ది చేకూర్చబోతున్నది?   నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్.
--------------------------------------------------------------------------------------------------------

11-3-14
*ఈ కొత్త పార్టీల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? వీరి వెనుక అదృశ్య శక్తులు ఎవరు? ఎవరి అభిప్రాయం వారికి ఉండడంలో తప్పులేదు. తెలుగు చానళ్ళలా పార్టీలు పెరిగితే సర్వం కాలుష్యమే! భయంకర (మానసిక)వ్యాధులు వస్తాయి.
*ఈ మధ్య మా ఆపాత ఆంధ్రజ్యోతి పత్రికా మిత్రుడు 'సింగం' కూడా జూలు విదిలించి, కోటేసుకుని, మైకు పుచ్చుకుని.. తెలుగు చానల్లో దూరిపోయి సమైక్యాంధ్ర గర్జనలు వినిపిస్తున్నాడు. ఔరా! ఎటువంటి పరిణామాలు?
*అభిమానం ఉండొచ్చు కాని, రాజకీయాలలో ఎవరూ వీరాభిమానం తో అంతగా మమేకం కాకూడదు. విశ్వాసం అవసరం, అతి విశ్వాసమే మనకు నష్టం చేకూరుతుంది. నాయకులతో వ్యక్తిగత, ప్రత్యేక అనుబంధం ఉంటే అభ్యంతరం లేదు కానీ లేకుంటే ఎవరితోనైనా సరే కొంచెం దూరంగా ఉంటే మేలు. తరువాత పరిణామాలకు మనం నీరసించిపోతాం, వారు బాగనే ఉంటారు. ఇది 35 సంవత్సరాల వృత్తిపర అనుభవంలో గ్రహించిన సత్యం.
*పార్టీ పదవులే కాదు..పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులూ కూడా కుటుంబీకులే.. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు..
*ఆలూ లేదు-చూలూ లేదు వాడెవరి పేరో జంబులింగమట! కాపురం కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందట!
చుండ్రు శ్రీహరి- వ్యవస్థాపక అధ్యక్షుడు; కిరణ్‌కుమార్ రెడ్డి-అధ్యక్షుడు; ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బం, హర్ష- ఉపాధ్యక్షులు; శైలజానాథ్, పితాని- కార్యదర్శులు; తులసిరెడ్డి, గంగాధర్, శ్రీనివాస్, దొరస్వామి, రత్నబిందు -కార్యదర్శులట.. మరో ఇంపార్టెంట్ పోస్ట్... కోశాధికారి-రామ్మూర్తి:
సమైక్యాంధ్ర ప్రియ ప్రజలకు మరో పెద్ద షాకింగ్ న్యూస్! గుండెలు అరచేతబట్టుకుని.. ఊపిరి బిగబట్టండి:: సలహాదారు - పార్లమెంటులో పెప్పర్ స్ప్రే!!
*శిశు జననం తరువాత మూడురోజుల బాలారిష్ట దశ దాటి 11 రోజులకు లేదా 21 రోజుకు కాని నామకరణం చెయ్యరు సామాన్యంగా. తరువాత అన్నప్రాశన.. ఆపై అక్షరాభ్యాసం వగైరా తంతులన్నీ .. కాని తెలుగునేలపై పుట్టని పార్టీకి ఈ రోజే పెరెట్టేశారు. రేపు గోదావరి ఒడ్డున పురుడుపోసుకుంటుంది-ట.
1983 తరువాత నాదెండ్ల్ భాస్కర రావు, లక్ష్మిపార్వతి, ఎమ్‌వి భాస్కరరావు, హరికృష్ణ, విజయశాంతి, దేవెందర్‌గౌడ్, చిరంజీవి, పాల్... పార్టీలు పెట్టి పల్టీలు కొట్టారు. దుకాణాలు బంద్. అదృశ్యాలు, విలీనాలు, గల్లంతులు, నిమజ్జనాలు పూర్తయ్యయి. ఇవిగాక అనేకానేక పార్టీలు ఆవిర్భవించాయి. మఖలో పుట్టి పుబ్బలో మబ్బుల్లో కలిసిపోయాయి. ఈ కొత్త సంబరమూ చూద్దాం!!
మాజీలందరూ తాజాగా తెరమీదకు వచ్చారు. పార్టీ రంగేమిటో తెలీదు. హంగుమాత్రం ముందే ఉంది. సభ్యులతో పని లేకుండా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి తెరమీదకు వచ్చేశారు. అదేంటో! రాజమండ్రి సెంటిమెంటు??
*మార్కెట్ లో వో(నో)టు విలువ అందరికీ తెలుస్తున్నది సార్. బేర(బీర్) సారాలకు ఇది మంచి సీజన్..పంచాయతి నుంచి లోక్ సభ వరకు ఓటును గుత్తకు కోనేయచ్చు..భలే మంచి చౌక బేరమూ.

Like ·  · Share

10-3-14
*కేజ్రీవాల్ మరో చిరంజీవి అయ్యాడు, సొమ్ము వసూళ్లకు దేశం మీద పడ్డాడు. ఆయనతో డిన్నర్ చేస్తే 20 వేల రూపాయలట. ఆయన "ఆమ్ ఆద్మీ" నా సిగ్గు చేటు. భోజనం చేసినందుకే 20 వేల రూపాయలైతే ఇక పార్టీ టిక్కెట్టు కు ఎంత వసూలు చేస్తాడో? అందరూ వసూల్ రాజాలే! వాళ్ళు జనాలను, దేశాన్ని ఉద్ధరిస్తారట..
*మార్కెట్ లో వో(నో)టు విలువ అందరికీ తెలుస్తున్నది సార్. బేర(బీర్) సారాలకు ఇది మంచి సీజన్..పంచాయతి నుంచి లోక్ సభ వరకు ఓటును గుత్తకు కోనేయచ్చు..భలే మంచి చౌక బేరమూ..

9-3-14
*దీన్నిబట్టి నాకు అర్ధమవుతున్న విషయమేమిటంటే..  తెలుగు ప్రసార మాధ్యమాలు అంటున్నట్ల్లు, అనుకుంటున్నట్లు.. టిడిపి కంపనీ మూసివేత జరగదు. కొత్త వాటాదార్లు అమితోత్సాహం ప్రదర్శిస్తున్నారు. వ్యాపారం మళ్ళీ పుంజుకుని మార్కెట్ వాల్యూ పెంచుకుంటుందని "స్టాక్ ఎక్స్చేంజ్" నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగా ఎవరైన వ్యతిరేకించవచ్చు.. సమర్ధించవచ్చు.. ఎవరిష్టం వాళ్ళది. అందరి ఊహలకు భిన్నంగా ఫలితాలు ఉండొచ్చని అభిప్రాయం.

*వీటన్నిటికీ మించిన మహాపరాధం, చారిత్రాత్మక తప్పిదం, మీడియాను దేవుడనుకుని నమ్మడం. ప్రజలను నమ్మితే ఎప్పుడన్నా అధికారం అందుతుంది. పత్రికలపై ఆధారపడితే అదేదో... పట్టుకుని గోదావరి ఈదడమే!!
*ఎప్పుడూ పెదవులకు పదవుల రుచి ఇష్టం.. కాకుంటే ఇన్ని ఊసరవెల్లులు వచ్చిఉండేవా?
పిల్లి తెల్లదా.. నల్లదా అనికాదు. ఎలకను పడుతుందా ఏదా? అన్నదీ ముఖ్యం( బాబు గారి మాటల్లోనే..)నాయకులు పార్టీలు మారినప్పుదల్లా ఓటర్లు కూడా మరుతున్నారు. ఇది దేశవ్యాప్తం.  అందుకే గో.పి.లు కూడా గెలుస్తున్నాయ్!!

8-3-14

*జన్ పథ్ మార్గం.. భజనే లక్ష్యం.. జనం చెవిలో వాయులీనం!! థెరెసా, ఫూలే, మహాత్మ, అంబేడ్కర్.. మూకుమ్మడిగా సోనియాలో నిమజ్జనం....
*ఈ రాజకీయాలన్నీ కుతంత్రాలు, కుమ్ములాటలు.. మనకంటే మన శత్రువు బలవంతుడైతే, మనం బలపడబోమని నిర్ణయించుకుని, ప్రత్యర్ధిని బలహీనుడు చెయ్యడానికి పలు మార్గాలు. వోట్లుచీల్చి లాభపడడానికి దబ్బిచ్చి పార్టీలు పెట్టించడం, పోతీకి నిలబెట్టడం మామూలే.. చరిత్ర చెప్పిన సత్యమిది. పవన్ వెనుక, కిరణ్ వెనుక కూడా బలమైన వ్యక్తులున్నారు, వర్గాలు ఉన్నాయి.
*Woman in man stands first and leads
*Mother is first.. God is next.. Love mother and pray God..
*నూరుపాళ్ళు నిజం. ఇంట్లో అమ్మకు దణ్ణం పెట్టు, నాన్నకు అన్నం పెట్టు,  చెల్లి తోడబుట్టినది, కూతురు నీకు పుట్టినది. ఆ ప్రేమ ఎవరో చెబితే రాదు. ఎవరో చేప్పేరోజు వస్తే మన దౌర్భాగ్యం
*మనకు జన్మనిచ్చినవారు, జన్మంతా తోడుండే వారు ఒక్కరే. ఆమే స్త్రీ. ఆమెను అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు, స్నేహితురాలు....ఎప్పుడైనా.. ఏ పేరుతోనైనా పిలు. పలుకుతుంది..
*మాతృ దేవోభవ! అమ్మకు నమస్కారం.. అవనిలో, ఆకాశంలో, అవకాశంలో, అధికారంలో.. సగం. ప్రసంగాలకే పరిమితం, అనుచరణలో మాత్రం శూన్యం. సాధికారత కాదు ఇప్పటికీ పరాధీన యే!! అన్ని దినాల మాదిరే మహిళకూ ఈ సుదినం "అంకితం".
హాటెస్ట్/లేటెస్ట్ కామెంట్స్..

7-3-14
*ఈ మధ్య పార్టీలు జనాలను మిస్సవుతున్నాయి. దీనికి విరుగుడు ఏమిటా అని అలోచించారు. ఒక్క మిస్ కాల్ ఇవ్వండి చాలు. ఇక మీ పని మేము చూసుకుంటాం అని తయారవుతున్నారు. పార్టీలు ఇళ్ళకు వస్తాయని భయపడి జనం తలుపులేసుకుంటుంతే ఇక మిస్ కాలిచ్చి తద్దినం కొని తెచ్చుకుంటారా!! టెవీ చానళ్ళ మాదిరి ఎస్సెమ్మెస్ రోగం ఎక్కువవుతున్నదీ పార్టీలకు.. పార్టీలు -పత్రికలు(చానళ్ళు) కలసి ఉమ్మడి వ్యాపారం!! మొదలవుతాయ్ పెయిడ్ న్యూస్ తతంగం....
*మా కిరణ్/పవన్ కు ప్రచారానికి ఒక కేతిగాడు దొరికాడు.. చూశారా!!
6-3-14
*కనీసం ఏడాది రాష్ట్రపతి పాలన, మనకా అదృష్టం గాట్టిగా రాసిపెట్టి ఉండేమో! భగవంతుడు మనలను ఆశీర్వదించు గాక! రాష్ట్ర విభజనపై రేపు సుప్రీం స్టే ఇస్తే.. తేలే వరకు..అంతా గందరగోళం.. ఈలోగా పార్లమెంటు మూత. ప్రభుత్వాలు పడిపోతయ్..అప్పుడు గ్యారంటీగా "నరసింహ రాజ్యం".
*ఒక్క సారి కిరణ్ డైలాగుల ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లండి....
"నాది కాంగ్రెస్ రక్తం నిండిన కుటుంబం. తండ్రి అమరనాథ్ రెడ్డి అడుగు జాడలు నావి. కాంగ్రెస్ వల్లనే ఇంత స్థితికి వచ్చాను. ఇప్పుడు కాదు ఎప్పుడో ఈ పదవికి రావలసిన వాడినని దివంగత మాజీ ప్రధాని పి వి నరసింహారావు గారు అశీర్వదించారు."  పాపం పివి గారు కిరణ్ ను దీవించడం (ఎప్పుడో ఎవరికీ తెలీదు) ఆయన చేసిన తప్పుల్లో మహాపరాధం. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతులేదు. రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఒక్క ఎంపీ ఈయన వెనకాల లేరు. ప్రధాని పదవి నుండి దిగిపోయిన తరువాత సోనియా పార్టీ టిక్కీట్టు ఇవ్వక పోయినా, ఆయన పన్నెత్తి మాట్లాడలేదు వ్యతిరేకంగా. వైఎస్సార్ అండ చూసుకుని పెట్రేగి పదవుల్లో ఉన్నప్పుడు సోనియాభజన తప్ప ఒక్క సారి పివిని స్మరించలేదు.. ఈనో మహానాయకుడు. ఈయనదో పార్టీ!!
*నిన్నటివరకు మన మిడిమేలపు మీడియా జెడి లక్ష్మ్నినారాయణ 'ఆప్' లో చేరుతున్నాడని సొల్లు కక్కింది.. తీరా జాయింట్ కమిషనరయ్యారు. ఎన్నికల టైములో ఎన్ని పార్టీలుంటే గొట్టాలకు అంత కరెన్సీ!! ఫుల్ డిమాండ్!!

Wednesday 5 March 2014

                 రాష్ట్రపతి పాలనకు "దాదా" ఆమోదం.. 

                                     

                           చురకలు, చమక్కులు మామూలే!!



28-2-2014
**రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో సమావేశమై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది సేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది. కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో 41 సంవత్సరాల తరువాత రెండోసారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. 1973‌లో తొలిసారి జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం దరిమిలా కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గవర్నర్‌‌ పాలనా పగ్గాలు చేపడతారు. క్యాబినెట్ నిర్ణయం దస్త్రం కొద్దిసేపట్లో రాష్ట్రపతి అమోదముద్ర కోసం రాష్ట్రపతి భవన్ కు చేరుతుంది.  

24-2-14
* నేనెప్పుడూ ఈ అవకాశవాద పొత్తులు సమర్ధించను. అధికారం పరమావధి అయితే ఇలాగే ఉంటాయి రాజకీయాలు. కమ్యూనిస్టులు కొంత కాలం కింద వరకు సొంతహ్మగా పోటీ చేసేవారు. గెలుపోతములు ప్రధానం కాదు. సిద్ధాంత నిబద్ధత విశ్వసనీయత పెంచుతుంది.అందుకే దఏసంలో కొంత కమ్య్యూనిస్టులకు గౌరవం ఉండేది. బిజెపి (భారతీయ జన సంఘ్)  కూడా అదే మార్గం. అయిత రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావం కమ్యూనిస్టులు, బిజెపిల ఉనికిని ఊడ్చిపెట్టింది. ఇప్పటికైనా ఏపార్టీ అయినా పొత్తులు లేకుండా పోటీ చేసి సత్త చాటుకున్నప్పుడే సుస్థిర, ప్రజా ప్రభుత్వాలకు ఆస్కారం లేకుంతే కప్పల తక్కెళ్ళే..  

23-2-14
*తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీలకు సంయుక్త అభినందనలు. కలసికట్టుగా తెలంగాణ ఆవిర్భావానికి పరస్పరం సహకరించుకున్న టీఆరెస్,బిజెపి, కాంగ్రెస్ నేతలారా. నాదొక సూచన.. లేదా మనవి.
తెలంగాణ సాధనలో ఒకరికొకరు పార్లమెంటులో అండగా నిల్చుని ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల స్వప్నాన్ని సాకారం చేసినట్లుగానే.. ఈ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పార్టీ పరిధులు, వ్యక్తిగత కాంక్షలు అధిగమించి రేపటి ఎన్నికల్లో స్నేహ బృందంగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా ఒక అవగాహనకు వచ్చి పోటీలు మానుకుని, పార్లమెంటు, శాసన సభ స్థానాల విషయంలో ఒప్పందం కుదుర్చుకోండి..
రాష్ట్రంలో ముగ్గురూ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి, విబేధాలు, విమర్శలు మానుకుని ప్రజా సంక్షేమం, ప్రగతి సాధించండి. ద్వేషాలు, కార్పణ్యాలకు స్వస్తి చెప్పండి. జాతీయ రాజకీయాలలో కూడా ఒక కొత్త వొరవొడి సృష్టించండి. కనీసం ఒక అయిదేళ్ళు ఈ విధానం అవలంబిస్తే ప్రజలు సంతోషిస్తారు. తెలంగాణను అన్ని రంగాలలో ముందుంచండి. ప్రజా హితవు కోసం రాజకీయాలలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఘన కీర్తి సాధించండి.. జాతికి మార్గదర్శకులు కండి.. కనీసం ఒక్క అయిదేళ్ళు. అలోచించండి.

*హైదరాబాద్ నగరాన్ని 60 ఏళ్ళుగా ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధిచేసి ఈ రోజు కోల్పోవడం వలన సీమాంధ్ర ఆర్ధికంగా ఎంతో నష్టపోయిందని విలవిల లాడుతున్న శోకపరితప్త హృదయాలకు నాది ఒకటి సూటి ప్రశ్న..
వందల సంవత్సరాలుగా రాష్ట్ర, దేశ, విదేశీ యాత్రికుల, భక్తులకు కొంగుబంగారమై కలియుగ వైకుంఠంగా అలరారుతూ, ఏడాదిలో కోట్ల రూపాయల హుండి ఆదాయం వస్తున్న పుణ్య జంట క్షేత్రాలు తిరుపతి-తిరుమల సహా కాణిపాకం వినాయకుడు, శ్రీకాళహస్తి - శ్రీశైలం, మల్లిఖార్జున స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ, మంగళగిరి పానకాల స్వామి, విశాఖ కనకమహాలక్ష్మి, అరసవెల్లి సూర్యనారాయణుడు, తూర్పు గోదావరి జిల్లాలోని శని దేవాలయం, అనేక ఇతర ప్రముఖ ఆలయాలు సీమలోనే ఉన్నాయి కదండీ..అవి రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త భక్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందినవే కదండీ..అందునా భగవంతుడు అందరి వాడూ కదండీ!! మరి ఇతర పర్యాటక కేన్రాల మాట ఏమిటి? వాటి గురించి ఎటువంటి ప్రస్తావన తెచ్చి ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు కదా?
ఈ ప్రశ్న ఎవరినీ బాధించడానికి, సూటిపోటి మాటకో కాదు.. కేవలం ఆలోచింప జేయడానికి మాత్రమే..
22-2-14
*నాకు తెలియక .. మిమ్ములను కొన్ని ప్రశ్నలడుగుతా? మీకు తెలిస్తే జవాబు చెప్పండి:
-----------------------------------------------------------------------------------------------------
మన నియోజక వర్గ ఎమ్మెల్యేకు ఏడాదిలో అసెంబ్లీ జరిగే 60 రోజులు మినహా హైదరాబాద్ లో పనేమిటి? ఏడాదికి నెలరోజులు కూడా మన ఊళ్ళో ఉండడు.
అయిదేళ్ళు ఎమ్మెల్యే అయితే... కారు చౌకకు హైదరాబాద్ లో స్థలం, ఇల్లెందుకు? హైదరాబాద్ లో క్వార్టర్లు, కరెంటు, ఫోన్లు, ఆస్పత్రుల్లో పెద్ద రోగాలకు ఆపరేషన్లు, రైళ్ళు, బస్సులు, విమానాల్లో ఫ్రీ ఎందుకు? మనం గెలిపించిన ఊరొస్తే అలవెన్సులెందుకు? చికిత్స కోసం అమెరికాకెందుకు? కాంట్రాక్ట్ లెందుకు? ఇవి గాక ప్రజాసేవ చేసేవాడికి నెలకు లక్ష రూపాయల భత్యమెందుకు? ఏడాది ఎమ్మెల్యే(ఎమ్మెల్సీ) వెలగట్టినా జీవితాంతం నెలకు 10 వేల రూపాయలు పెన్షనెందుకు? మనం ఇల్లడిగితే సవాలక్ష నిబంధనలు.. మందులు, డాక్టర్లుండని పెద్దాస్పత్రి మినహా దిక్కుండదు.. 30 సంవత్సారాలు ప్రభుత్వ ఊడిగం చేస్తే 10 వేల పెన్షన్ దాటదు. వీళ్ళా మన ప్రజా సేవకులు, ప్రతినిధులు. దగ్గరకొస్తే కాలరు పుచ్చుకు నిలదీయండి.
21-2-14
*ఇదీ నేటి నీతి మాట!!~
--------------------------
*మనకు మాత్రం ఉట్రవొడియంగా అందరూ ఉచిత సేవలందించాలి..మనం మాత్రం ప్రతి దానికీ పైసా పైసా వసూలు చేస్తాం.. అదేమంటే నా కష్టం దోచుకుంటారా? అని ముక్కు చీదుతాం!!
*పెప్పర్ ఘాటు నసాళానికి అంటింది. మన ఎంపీలకు కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగి..ఇంకా తేరుకోలేదు పాపం..
*ఊసరవెల్లులు రాజకీయ నాయకుల్లోనే కాదు..వర్తమాన పాత్రికేయుల్లోనూ ఉన్నారు. అయితే మరింత వేగంగా రగులుమార్చుకునే అద్భుత నైపుణ్యం..
*రాజ్యసభలో సమైక్య ఘోష శోష వచ్చి పడిపోయిందట.. చివరకు అందరూ నిలబెట్టి నీళ్ళు తాగించారు
*రాజకీయము, రాజ్యాంగము, లోక్ సభ,రాజ్యసభ నియమావళి మనం ఫేస్ బుక్ లో రాసుకున్నట్లు కాదు. మనం ఒక విధంగా జరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కాని అందుకు వ్యతిరేకంగా జరిగితే వ్యవస్థ చిన్నాభిన్నమైనట్లు భావిస్తే ఎలా! మన చేతిలో వోటు ఆయుధం ఉంది. దాన్ని ప్రయోగించి విజయం సాధించాలి. అప్పుడూ మనం కోరుకున్నట్లే ఫలితాలుంటాయని ఆశించడమూ సరికాదు.రాకపోతే ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిందని శపించడమూ అవివేకమే!! ప్రజల్లో మనం ఒక భాగం. మనమే ప్రజలు కాదు .....
20-2-14
*భూమిని కాపాడడానికి అలనాడు విష్ణుమూర్తి వరహావతారమెత్తినట్లు, రాజకీయాలను క్షాళన చేయడానికి త్యాగ "ధనులు" అవతారాలెత్తుతున్నట్లు.. ఈ మధ్య అంతరిస్తున్న తెలుగును ఆకాశంలో నిలబెట్టి ప్రభలు వెలిగించేందుకు సరస్వతీ పుత్రులు, పుత్రికలూ నెట్ పెపర్ల లో..పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రతా జనులారా!
*కొత్త పదం- "తెలుగుజాతి" ట.. అర్ధం కాని విషయం.. అది భాష. జాతి కాదు. జాతీయత నేషనాలిటి.. తమిళ జాతి, ఒరియా జాతి, కన్నడ జాతి, మరాఠి జాతి, పంజాబి జాతి, బెంగాలి జాతి, గుజరాతి జాతి, కొంకణ జాతి.. ఉంటాయా.? భారత జాతి ఉంటుందా? తెలుగు ప్రజలు చీలిపోరు, భాష చీలిపోదు, ప్రాంతాల భౌగోళిక హద్దులు, ప్రభుత్వ పాలనా యంత్రాగం మాత్రమే చీలిపోతుంది.
*ఫారం హౌజ్ రాజకీయం జనాలకు అర్థమై ఉంటుంది. ఆ బక్కాయన చెప్పినట్లే జరిగింది. "ఏ పి నుంచి డిల్లీ వెళుతున్నా.. తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా"
*సోనియా, మన్మోహన్, విపక్షాలు, అధికార పక్ష సభ్యులు పెదవి కదపకుందానే తెలంగాణ బిల్లు పూర్తయింది. "సోనియా ప్రసంగిస్తారు "అని బాకా ఊదిన చానల్ వార్తలు ..అంతా ట్రాష్.. మొదటినుంచీ అన్నీ ఇంతే!
18-2-14
*ఇన్నాళ్ళూ ఒకటే ఊదరగొట్టిన తెలుగు చానళ్ళు, పత్రికలు భవిష్యత్తులో ఏమి చెయ్యాలి చెప్మా??
*సందట్లో సడేమియా.. ముఖ్యమంత్రి రాజీనామా చేయకముందే అ.సత్యారావు ఆంధ్రప్రదేశ్‌ప్రెస్ అకాడెమీ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
*పొద్దుణ్ణుంచి తెలుగు చానళ్ళు కాకిలెక్కలేసి. వోటింగు తీరు. గెలుపు-ఓటముల గణాంకాలు.. పార్టీలు విధానం మార్చుకుంటే అనే ఒక చచ్చు ప్రశ్న.. బిల్లు పాసవుతునదా? లేదా.. నరాలు తెగే ఉత్కంఠ.. అంటూ కాకమ్మ కబుర్లు..
*మూజువాణి వోటుతో టి బిల్లుకు లోక్ సభ అమోదం..అనుకున్నట్లే.. అంకం పూర్తయింది.
*
సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలట. ఇది మరో నాటకం. రాష్ట్రం విడిపోదని, పోనీయమని బీరాలు పలికి, అవసరమైతే ప్రాణాలు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి, ఆర్నెల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నేతలు అస్త్ర సన్యాసం. ఇక రాజకీయ సన్యాసమే మిగులు..ప్రజలూ వారికి దండ కమండలాలు, కాషాయ దుస్తులూ సిద్ధం చేయండి..

Tuesday 18 February 2014

         తెలంగాణ గుండెలు ఇక హాయిగా నిద్రిస్తాయి.

                 ప్రజ్వరిల్లిన తెలంగాణ తేజం.. తీపి తెలం"గానం.." 

                   అంతా సవ్యం.. సుఖం, శుభం..కల నిజమాయెగా.. కోరిక తీరెగా..  


18-2-14
*సోనియా, మన్మోహన్, విపక్షాలు, అధికార పక్ష సభ్యులు  పెదవి కదపకుందానే తెలంగాణ బిల్లు పూర్తయింది. "సోనియా ప్రసంగిస్తారు "అని బాకా ఊదిన చానల్ వార్తలు ..అంతా ట్రాష్.. మొదటినుంచీ అన్నీ ఇంతే!  
*మూజువాణి వోటుతో టి బిల్లుకు లోక్ సభ అమోదం..అనుకున్నట్లే.. అంకం పూర్తయింది. ఇన్నాళ్ళూ ఒకటే  ఊదరగొట్టిన తెలుగు చానళ్ళు, పత్రికలు భవిష్యత్తులో ఏమి చెయ్యాలి చెప్మా??
*ఆయనెవరో మంత్రట..ఏరాసుట.. అందునా న్యాయ మంత్రట.. ఎప్పుడో రాజీనామాచేసాడట. ఇప్పుడు ఆమోదించాలట. గతంలో రాజీనామా చేసి పదవుల్లో సాగుతున్న వాళ్ళనుంచి జీఎతభత్యాలు, అలవెన్సులు, అమ్య్యామ్యాలు, డిల్లీకి విమానాల్లో కాలికి బలపం కట్టుకు తిరిగిన ఖర్చులు, ఏపి భవన్ ఖర్చులు, సెక్యూరిటీ .. మొత్తం చెవులు మెలేసి వసూలు చేయ్యాలి.. ప్రజారాజ్యంపార్టీతరఫున ఎన్నికై, జెండామర్చి కాంగ్రెస్ లో చేరి, హైదరాబాద్లో కాలేజీలు పెట్టి కోత్లు సంపాదిచిన అవంతి శ్రీనివాస్ కూద అరాజీనామనట. మంత్రి డొక్కా కూడా రాజీనామానట.. ఈ తెగిన గాలిపటాలు ఏకొమ్మలకు చిక్కుకుంటాయో! వేచి చూద్దాం..
*సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలట. ఇది మరో నాటకం. రాష్ట్రం విడిపోదని, పోనీయమని బీరాలు పలికి, అవసరమైతే ప్రాణాలు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి, ఆర్నెల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నేతలు అస్త్ర సన్యాసం. ఇక రాజకీయ సన్యాసమే మిగులు..ప్రజలూ వారికి దండ కమండలాలు, కాషాయ దుస్తులూ సిద్ధం చేయండి..
*ఇవ్వాళ్టితో ఈ రాష్ట్రానికి నాలుగేళ్ళ శని విరగడైందనుకుందాం. మనం ఆశాజీవులం. అందరం కలకాలం బాగుందాం. సంఖ్యా శాస్త్రమే (మిడతంభొట్లు జోస్యం) నిజమవుతున్నదన్న మాట-- తీన్ తేరా :: ఆఠ్ అఠారా::

17-2-148
*ఆ వార్తే నిజమైతే రాష్ట్రంలో జర్నలిస్టులందరూ సామూహిక ఆత్మ హత్య చేసుకోవచ్చు. కొన్నేళ్ళపాటు అతి సాధారణ రోజువారీ విలేఖరత్వం (అర్ధం ఏమిటని గింజుకోవద్దు) వెలగబెట్టి రాజకీయం పుణ్యమా అని ప్రభుత్వ ఉద్యోగిగా అవతారమెత్తి, ఆ తరువాత దాదాపు పాతికేళ్ళకు పైగా ప్రభుత్వ ఊడిగం చేసిన ఒక మహా విశ్వాసపాత్రునికి ముఖ్యమంత్రి పోతూ పోతూ "ప్రెస్ అకాడెమీ" కి పట్టాభిషిక్తుని చేశారట! ఔనా, కలయా వైష్ణవ మాయా? అది నిజమేనా? ఇప్పటికే "ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి హిమాద్రి, శుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి... వివేక భ్రష్ట సంపాతకుల్" అయింది ఆ అకాడెమీ....
*Never,never in the history of Indian democracy this uncertain political atmosphere prevailed. MPs, ministers, chief whip, whips, mla s from one region opposed the CM tooth and nail. PCC President and ministers of his region turned against him. Virtually there is no govt in the state. Cabinet itself is against CM. Wonderful state, AP.
*What would happen if T bill is defeated/ passed in Lok Sabha?


15-2-14
డిల్లీ రామ్ లీలా మైదాన్ లో సమైక్య ఆందోళన ధర్నాకు రాష్ట్రంలో అయిదు నగరాల నుంచి ప్రత్యేక రైళ్ళలో మహిళలు సహా ఎన్జీఓలు, ఉద్యమకారులు బయలు దేరారు. ఒక్కొక్కరైలుకూ వెయ్యి మంది చొప్పున కనీసం అయిదువేల మంది వెళ్ళి ఉండాలి. ఈ రైళ్ళకు అయ్యే ఖర్చు ఎవరు భరించారు? తలకు కనీసం నాలుగు రోజులకు వసతి, భోజన, ఉపాహార, ఇతరాలకు కనీస ఖర్చు 2000 రూపాయలకు తక్కువ ఉండదు. అందరూ మధ్యతరగతి వర్గ ప్రజలే. సాధారణ ఉద్యోగులే. స్పాన్సర్లు ఎవరు? అంతమందికి వసతి ఎవరు కల్పించారు? కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోలనకు సమాయత్తమైతే ప్రభుత్వం రైళ్ళు ఎలా అనుమతించారు? ఉద్యోగులు విధులకౌ గైర్హాజరవుతుంటే ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలోకి తొక్కినట్లేనా? వారి పై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరు? అంతే ఈ నాటకం మొత్తం కేంద్ర దర్శకత్వంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్నట్లే కదా..
రాజకీయమా వర్థిల్లు.. !!
*సభకు తాళం వేసి పోతూ పోతూ.. మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ల్యాప్ టాప్‌లూ, ప్రింటర్ల పేరిట ముచ్చటగా సుమారు మరో మూడుకోట్లు మింగేస్తున్నారు. పేపర్‌లెస్  అసెంబ్లీ పేరిట స్పీకర్ సభ్యుల ఇప్పటికే రెండు సార్లు కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్ పిసీలు, ఐ-ఫోన్లు..బహుమతులిచ్చేశారు. సభ జరగడమే గగనమయిన తరువాత వాటితో పని ఏమిటి. మన అసెంబ్లీ పేపర్‌లెస్ కాదు.. మెంబెర్‌లెస్ గా.. మానర్స్ లెస్ గా తయారయింది.. ఇప్పటికి రెండు సార్లు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇచ్చినా అవి ఎప్పుడో నజరానాలుగా చేతులు మారాయి. పాతవి ఏమయ్యాయి, ఇవి ఎందుకిచ్చారు?  మీడియా కూడా నోరు మెదపలేదు. సెల్ ఫోనే ఆపరేట్ చెయ్యడం రాని సభ్యులున్న మన అసెంబ్లీకి ఇవి అవసరమా? ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడవు? ప్రజాధనం ఇలా డ్రైనేజీ పాలవుతున్నా అడిగే నాధుడే కరవయ్యాడు. ఒక్కొక్కరికీ దాదాపు 85 వేల రూపాయలు.. కృష్ణార్పణం..  వాళ్ళు జీత భత్యాల బిల్లులు ఎటువంటి చర్చ లేకుండ గుంభనంగా ఏకగ్రీవ అమోదం పొందుతాయి, ప్రజల విషయమైతే....ఏళ్ళతరబడి పెండింగు..

 
14-2-14
*దశాబ్దపు కాలంగా వేచిచూస్తున్న అంతటి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెడుతుంటే యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్ సింగ్ సభకు హాజరు కాకుండా గృహాలకే పరిమితం కావడ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ప్రతిష్ఠకే తలవంపులు. ఇది స్క్రిప్ట్ లో భాగం కాదా? 24 గంటలు దాటినా ప్రధాని, సోనియా, రాహుల్ .. ఎవరూ ఎందుకు స్పందించలేదు?
*ఈ దేశంలో ప్రభుత్వం పట్టపగలు బహిరంగ వేలం వేసి మనుషులను(స్పోర్ట్స్‌మెన్) అమ్ముతుంది. ఇదే దేశంలో ఆ ప్రభుత్వాలను నడిపే మనుషులు(పొలిటిషియన్స్) ఏకంగా దేశాన్నే అమ్మేస్తారు.
*కొత్త తిట్టు...పెప్పెర్ స్ప్రే ముఖమూ.. నువ్వూనూ..  
13-2-14
"ఆత్మరక్షణ కోసం నేనెప్పుడూ పెప్పర్ స్ప్రే దగ్గరుంచుకుంటాను"- లగడపాటి.
పదేళ్ళుగా ఒక ప్రజాప్రతినిధి, అందునా రాజకీయరాజధాని విజయవాడ వంటి కేంద్రం నుంచి రెండు పర్యాయాలు లొక్ సభకు ఎన్నికైన అధికార పార్టీ సభ్యుడు ఆ మాటలు అనడం ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు అనిపిస్తున్నది. 1952 నుంచి విజయవాడ ప్రజల ప్రతినిధులుగా హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, కొమర్రాజు అచ్చెమాంబ, డాక్టర్ కె ఎల్ రావు(3), గోడె మురహరి, చెన్నుపాటి విద్య(2),వడ్డె శోభనాద్రీశ్వర రావు(2), పర్వతనేని ఉపేంద్ర(2) గద్దె రామ్మోహన్ లోక్ సభకు ఎన్నికయారు. వారిలో ఏ ఒక్కరూ ఏనాడూ తమకు ప్రాణహాని ఉన్నదని ఏనాడూ అన్న పాపాన పోలేదు.
రెండుపర్యాయాలుగా ఎంపీగా ఉన్న వ్యక్తి లగడపాటికి భద్రతా సిబ్బంది ఎప్పుడూ వెంట ఉంతారు. అందునా వివాదాల్లో ఎక్కువ చిక్కుకుని పీకలమీదకు తెచ్చుకోవడం ఈయనకు అలవాటే. అందు చేత భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగాఉంటారు. ఒక వ్యక్తి తనకు ప్రాణ భయమున్నదని పేర్కోనడం ఆయనపట్ల ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నదో అర్ధమవుతుంది. గన్ మెన్ వెంట ఉన్నా ఆయన ఆత్మరక్షణకు అప్రమత్తంగా ఉంటానని చెప్పుకోవడం పోలీసు శాఖకు అవమానం.
ప్రధాని, స్పీకర్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు కొలువుతీరిన లోక్ సభలో ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే తెచ్చుకున్నానని లగడపాటి చెప్పడం పార్లమెంటు వ్యవస్థను, భద్రతా వ్యవహారాన్ని కించపరచడమే. ప్రధానిని అవమానించినట్లే! ఈ లెక్కన ఆత్మరక్షన కోసమిక అసెంబ్లీలో, పార్లమెంటులో సభ్యులు నేరుగా పిస్టళ్ళను, జాగిలాలలను తీసుకెళ్ళే రోజులు వచ్చాయన్నమాట. సామాజిక వర్గ ప్రసారమాధ్యమాల మద్దతు వారికెటూ ఉంటుంది అది వేరే విషయం. ఇదీ మన పరిస్థితి. నవ్వు కుందామా? రోదిద్దామా? నేటి దుస్సంఘటనకు..  

*నిన్న లోక్ సభలో స్వయానా మంత్రులే వెల్ లోకి దూసుకు పోయి నినాదాలు చేస్తూ.. రైల్వే బడ్జెట్ ను అడ్దుకుని అర్ధంతరంగా మంత్రి చేత నోరు మూయిస్తే, రాజ్య సభలో చైర్మన్ మైకులు విరగ గొడితే కాంగ్రెస్ అధినాయకత్వం కళ్ళు మూసుకుందా? ఎందుకు చర్య తీసుకోలేదు.. ఆల్ డ్రామా!

*ఎంపీలు, మంత్రులు కూడా వెల్ లోకి వెళ్ళడం పార్లమెంటు చరిత్రకు మచ్చ.ఈ రాష్ట్రం ఎటుపోతోంది? నాయకుల ఆవేదన.. తేరిపార చూడండి..కడప గడప మార్గం పడుతున్నట్లుంది. (అనుకున్నట్లుగానే)!  

*పార్లమెంటు చరిత్రలో నేడు దుర్దినం- -- దిగ్విజయ్: ఆ తద్దినం  పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ పెద్దలదే!!దహన సంస్కారాలు మొదలయ్యాయి.

* Heads rolling down. So far 18 LS members were suspended .
*"ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీల చేత   సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయించారు "- ఉండవల్లి. ఎవరు చేయించారు? మీ సోనియా గాంధీ చేయించారా? అంటే సమైక్య రాష్ట్రానికి సోనియా సహా ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా వ్యతిరేకమన్న మాట. ఒహో కాంగ్రెస్ మిమ్ములను వెలివేసిందన్నమాట!   -- మిరియప్పొడిని లోనికి అనుమతించిన స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అడగలేదేమిటి? ఈ ఆలోచన ఎందుకు రాలేదబ్బా!  ప్రాంప్టింగ్ వినబడలేదేమో.. పాపం.  

*పార్లమెంటు బయట ఇప్పుడే ఉండవల్లి పాఠం వల్లె వేశాడు. పక్కనే...శాలువ కప్పుకుని హిస్ మాస్టర్స్ వాయిస్..

*"కాంగ్రెస్ వల్లనే మేమీ స్థితికి ఎదిగాం. కాంగ్రెస్ లోనే మరణిస్తా" మని నిన్నటివరకూ బీరాలు పలికిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ను పట్టపగలు నట్టనడి చట్టసభల్లో అధినేత్రి కళ్ళెదుటే నిలువునా ఖూని చేశారు. ఒక్కొక్కళ్ళదీ ఒక్కో ఆయుధం..అంతే తేడా!!    

*తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంటుందా? బిజెపిని హత్య చేస్తుందా?

*మిరియప్పోడిని ఇతరులపై జల్లి  దిమ్మ తిరిగి బైర్లు కమ్మి చివరకు ఆస్పత్రిపాలైంది లగడపాటి..  దీన్నే మొగుడినికొట్టి మొగసాలె కెక్కినట్లు.. అనడం..

*545 మంది సభ్యులున్న లోక్ సభను,250 మంది సభ్యులున్న రాజ్య సభను కేవల వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలో ఉన్న వ్యక్తులు అడ్డుకుని సభాగౌరవాన్ని, పరువుప్రతిష్ఠలను మంటగలిపితే అందరూ మునుల్లా కూర్చున్నారు లేదా, ఘాటు వాసనకు వెరచి పారిపోయారు. ఇదీ మన ప్రజాస్వామ్యం. సభ్యులు ప్లకార్డులవంటి భారీ వస్తువులను లోనికి తెస్తుంతే భద్రాతా సిబ్బంది నిస్సహాయులుగా మిగిలిపోయారు. మిరియప్పోడే కాడు మారణాయుధాలు బాహాటంగాతెచ్చినా కిమ్మన లేని దిస్థితి. పాలనా సామర్థ్యం నవ్వులపాలైంది. మైకులు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, పదునైన పరికరాలతో ఆత్మహత్యలకు పాల్పడడం.. అవమానకరం.  గతంలో బిజెపి వాళ్ళు నోట్ల సంచీ  తెలేదా!!నిఘా విభాగం నిద్దరోయింది. 125 కోట్లమంది భారత ప్రజలకు దిశా దశా నిర్దేశించే నాయకులు వీళ్ళా!!  

*2003 లో సోనియాగాంధి మొత్తం 35 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు, 2004, 2009 ఎన్నికల ప్రణలికల్లో ప్రత్యేక తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు, రాష్ట్రపతి ప్రసంగంలో, యుపీఎ ఉమ్మడి కార్యక్రమంలో పేర్కొన్నప్పుడు, కేంద్రం ప్రణబ్ కమిటీ నియమించినప్పుడు, అసెంబ్లీలో స్వయంగా రాజశేఖర రెడ్డి రోశయ్య కమిటీని ప్రకటించినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ ఏడాదిపటు విచారణలు నిర్వహించినప్పుడు..2004లో తెరాసతో పొత్తును ఈ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు.. ఈ నాయకులు తీవ్రంగా ఎందుకు ఖండించలేదు? ఆర్నెల్లకిందట కోర్ కమిటీ, సి డబ్ల్యుసి, మంత్రివర్గ ఉపసంఘం కరాఖండిగా తెలంగానను ప్రకటించినప్పుడే ఈ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు. మొన్నటికి మొన్న సిఎం ఎ.ఐ.సి.సి సమావేశాలకు వెళ్ళి తాడోపేడో ఎందుకు తేల్చుకోలేదు.. తెలంగాణ అయినా, సమైక్యమైనా... ఏదైనా స్వార్థ రాజకీయమే.. పరువుప్రతిష్ఠలు మాత్రం మంటగలిశాయి.. ప్రజలు విరోధులయ్యారు. నాయకులు కుమ్మక్కయ్యారు..

*అద్భుతం.. మహాద్భుతం.. అనుకున్నట్లే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ వ్యూహాన్ని తూచ తప్పక అమలుపరిచారు. భళా. వ్యూహకర్తా! బహుముఖ ప్రజ్ఞాశాలీ....

*పార్లమెంటులోకి ఇవ్వాళ మిరియప్పొడి తెచ్చిన వాడు రేపు మిషన్ గన్ తేడని నమ్మకమేమిటి? ఎన్డీఎ హయాంలో పార్లమెంట్ పై ఉగ్ర దాడి సంగతి తెలీదు కాని ఎంపీలే ఉగ్రవాదులను మించి పార్లమెంటులోనే దాడి చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం గా పేరొందిన భారత్ ను ఆమె వారసులే దారుణ "మానభంగం" చేసారు. ప్రజలు సిగ్గుచచ్చి పోయారు.. వీళ్ళా మన ఎంపీలు.. థూ!


12-2-14
*Hope, never in the history of post independent indian parliament, ruling party members including cabinet ministers stalled the House entering into well, raising slogans and throwing torn budget copies. most dishraceful and helpless cong party.

*OUR PARLIAMENT MEMBERS BETRAYED PEOPLE, PARTY AND DEMOCRACY BY ENACTING A HIGH DRAMA IN BOTH THE HOUSES OF PARLIAMENT

*విపి సింగ్ వినడు.. మన్మోహన్ మాట్లాడడు.
పార్లమెంటు స్థాయిలోనే ఇన్ని నాటకాలాడిన సీమాంధ్ర నాయకుల అసలు రూపం బయటపడిందిగా. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం నుంచి అన్నీ అక్రమాలే, వక్రీకరణలే! శాసనసభలో సంఖ్యా బలం పెట్టుకుని ఆధిపత్యం చెలాయించడమే 1990 వరకు వాళ్ళు చేసిన అన్యాయం. 2000 లో సోనియాకు తెలంగాన తీర్మానం పంపడమే వైఎస్సార్ 'రాజకీయం'. ఇప్పుడూ ప్రత్యేక ఆంధ్రలో ఒక వర్గం రాజకీయంగా, మరొవర్గం ఆర్ధికంగా బాగుపడుతాయి. సంపద కేంద్రీకృత అభివృద్ధి అరిష్ఠానికి మూల హేతువు. భౌగోళికంగా విడిపోయినా నష్టం లేదు. ఇప్పటికైనా విద్యావంతులు విజ్ఞత ప్రదర్శించాలి.

11-2-14
*ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి పుణ్యమా అని వార్డు సభ్యులు, కార్పోరేటర్ కు ఠికానా లేనివాళ్ళు తెలుగుదేశంలో, కాంగ్రెస్ లో ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులయ్యారు. పదేళ్ళు తల్లి పాలు తాగి ఒళ్ళు చేసి ఇవ్వాళ రొమ్ము గుద్దుతున్నారు. దేశ ద్రోహులకంటే మాతృద్రోహులు యమ డేంజర్.. పదవులు అనుభవించి భవిష్యత్ అగమ్యగోచరమై పార్టీలు ఫిరాయించే వాళ్ళేపార్టీ అయినా సరే, అమ్మ రొమ్ము గుద్దినట్లే! నీతి విలువలు ఒదిలేసి అలా ...

*డిల్లీలో గెంటించుకొచ్చిన ఈ ఊసరవెల్లి ఎంపీలను జనాలు ఇక "జంబలకరి పంబ" ఆడించాలి. (సెకండ్ సీన్‌లో మంత్రులొస్తారు) ఇన్నెల్లు మాయమాటలతో గడిపి ఇవ్వాళ గడప దగ్గరకొచ్చారు. నీళ్ళు సిద్ధంచేసి, నులక మంచం అడ్డుపెట్టి, పసుపు కుంకుమ ముద్దలెట్టి, గాజులివ్వండి ప్రజలారా నియోజకవర్గాల్లో!

*ఆరుగురు ఏంపీలపై కాంగ్రెస్ వేటు.. నూరు తప్పులకు కదా శిశుపాలునికి శిరచ్ఛేదం .. ఇదీ అంతే.. లెక్క మొదలైంది.. ఇక డొక్కలు చిరుగుతాయి.. తిరగబడుతున్న తలలు తెగిపడుతున్నాయ్.. ఇవ్వాళ్టికి ఆరు.


10-2-14
*What I have said yesterday.. has come in print today. Karan interviews Kiran. Answer varies from question..( repeating posting for reference)

*ఒక కరణ్(కరణ్ థాపర్) మరొక కిరణ్(కిరణ్ రెడ్డి) తో అరగంట భేటీ.. లాల్చి వేసుకున్నాయన ఇంగ్లీషు వినే సరికి కోటేసుకున్నాయనకు ముచ్చెమటలు పోశాయ్. సిఎన్ఎన్-ఐబిఎన్ లో.. చంద్రబాబును మించిన వొకాబులరీ..మా కిరణ్ ది. ఆయన పార్లమెంటు అధికారం అడిగితే .. ఈయన అసెంబ్లీ తీర్మానం గురించి చెబుతాడు.

"The Hans India" carried a detailed item on Karan & Kiran.. (news item for ready reference)
*నేను జోతిష్యుడను కాను. రాజకీయ రాగ ద్వేషాలకు అతీతంగా కేవలం అంచనా మాత్రమే. [అంచనాలు ఎప్పుడూ నిజరూపం దాలుస్తాయనుకోవడం అవివేకం..] అయితే అనుభవం, హేతుబద్ధంగా ఉంతే అలోచనలు కార్యరూపంలోకి వస్తాయి అని చెప్పడమే. అంతే కాని, "నేను మొన్ననే చెప్పాను - అది నేడు జరిగింది" అని ఒళ్ళంతా నెత్తురొచ్చేలా బరుక్కోవడం కాదు టివి విశ్లేషకుల్లా...
అందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే! ఈ నెల 7వ తేదీ కిరన్ రాజీనామ పై నా అంచనా:

*తీన్ తేరా ఆఠ్ అఠారా అంటున్నారు సంఖ్యా శాస్త్రవేత్తలు. ఇవ్వాళ్టితో అస్మదీయుల ఎన్నిక పూర్తయింది. ఇక (వోట్ ఆన్ అకౌంట్) జమా-ఖర్చుల లెక్క చూస్కోవాలిగా.. 13/18 ఖాయం చేస్తారేమో రాజీనామా ముహుర్తం!(7-2-14)!! అదే ఇవ్వాళ ఈనాడు పత్రికలో మొదటి పేజీ వార్త. (రెండూ నిజమవుతాయని కాదు. హేతుబద్ధత మాత్రమే)(10-2-14)

*Where is the sanctity for the budget when T ministers abstained from Cabinet meeting? Technically the Budget proposals might have been approved as the quorum was there, but morally unwise when representatives from one region abstained. T ministers should have attended cabinet meet and noted their descent.

*ఫ్లాష్:ఫ్లాష్:--- తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర:
ఫాలో అప్:ఫాలో అప్---- రాజీనామాలు..
రాజీనామాలకేమోకాని సీమాంధ్ర రాజకీయ ఆత్మహత్యలకు ముహుర్తం ఖరారైంది.
స్వయంగా టిజి అనే ఒక మాటలమాంత్రికుడు ఇనదాకే ప్రకటించేసాడు. తాను రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాడట. తోడు లేనిది రాచ పీనుగ పోదు కదా. కిరణ్ కూడా కాంగ్రెస్ కు టాటా బై బై ట. అది సరే మరి మంత్రి పదవికి రాజీనామా చేయడా? మరో మూడ్నెల్ల ముచ్చట తీర్చుకోవచ్చు ఇలాగే.. సరే.. ఇంకా ఎందుకాలస్యం.. ఆ మంచిపనేదే ఇప్పుదే చేస్తే సరిపోలా? షావుకారు గారిది మంచి బోణీ ... .

*ఇక మా ఎర్నలిస్టులు, జర్నలిస్టులందరూ (గొట్టమ్స్ సహా) రేపటినుంచి జై కెసీఅర్! రోజులు మారాయి..

*మా అంధ్రా అక్టోపస్ ఎక్కడ ఏమిచేస్తున్నది? బాలెక్కడ, బ్యాటెక్కడ? స్టంపులేవీ? ఫోరా, సిక్సరా, క్యాచా, క్లీన్ బౌల్డా, రన్ ఔటా, హిట్‌వికెట్టా,.. అసలు బ్యాట్స్ మాన్ ఏడీ.. అది సరే ఇంతకూ రాజకీయ సన్యాసం ముహుర్తం ఎప్పుడు? ఇక జోతిషం దుకాణం డిల్లీలోనా, బెజవాడలోనా? ఇద్దరూ రానీయకపోతే 'లరాగో' గతి ఏమిటి....? ఇంతకూ లెటర్ హెడ్..... మహాసభ ఏమైందీ?

*ఇక జెండా మార్పిళ్ళు, కండువా మార్పిళ్ళు వేగం.. నాలుగు స్తంభాలాట: కాంగ్రెస్-వైకాపా-టిడిపి-బిజెపి..నేతానుగ్రహం కోసం ప్రతి పీతా ప్రదక్షిణం.. గెలుపు సంగతి దేవుడెరుగు..ఇక టిక్కెట్ల ఇక్కట్లు మొదలు. ఎంత పంపుకొట్టినా ఆక్కడ కూడా సమన్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం జరుగుతాయనే నమ్మకం కలగడం లేదు..భవిష్యత్తయినా ఆశాజనకమా కాదా? అనుమానమే..! నేనెప్పుడో చెప్పాను "ఆత్మలు" ఎప్పుడూ సేఫ్ అని. అవునా?

*ఆర్నెల్లుగా ఆంధ్రా ప్రజలను సమైక్యమంటూ అబద్ధాలతో మభ్యపెట్టి రాజీడ్రామాలాడిన అన్నిపార్టీల నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో? రాష్ట్రం విడిపోకుండా ప్రాణాలు అర్పిస్తామన్న నేతలు ఇప్పుడేమి చేస్తారు? కొందరేమో ఊళ్ళు పట్టుకుని.. మరికొందరేమో రాష్ట్రాలు పట్టుకుని తిరిగారు.


9-2-14
*కులాసానా? ఆ. అంతా లాసే!!
----------------------------------
* లోక్ సభలో టి బిల్లును సమర్ధంగా ఎదుర్కొంటాం- సబ్బం; మరి రాజ్య సభలో అంత అసమర్ధులున్నారా.. మీలో
* మూడునెలల కిందట వరకు జగన్ ను తూర్పారపట్టిన తూర్పు నాయకుడు ధర్మాన మూడ్ మార్చుకుని బిచాణా మొత్తం వైకాపాలోకి.. అన్యధా శరణం నాస్తి..
జగన్ కోసం ఏమైనా చేస్తా అని ఒకప్పుడన్న సబ్బం ఇప్పుడు చెడుగుడు.. కాలమహిమ!
* రాజధానిలో బోన్సాయ్ చెట్ల ప్రదర్శన- ఒక వార్త.; ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నదంతా బోన్సాయ్ నాయకులే కదా!!
* అనేకచోట్ల కాంగ్రెస్ సమైక్య రన్ లు.. అవును వారి నాయకుడే కి"రన్" కదా! ఇక అందరిదీ మారథాన్ రన్.. పరుగో పరుగు..
* ద్రౌపదికి నిండు సభలో పరాభవం- కౌరవ ప్రభువులు కూలి పోయారు.; హస్తినలో మహిళామంత్రులకు ఘోర అవమానం- రాష్ట్ర ప్రభుత్వ పతనం?
* కిరణ్ తరఫున చుండ్రు శ్రీహరి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్-ఒక వార్త.; కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ ..
* చిరుకు సమైక్య సెగ..విభజన పొగ నుంచి విముక్తి అనుకుంటే ఇదొక కొత్త కష్టం పాపం..[ప్రజలకు ద్దొరమయితే ఇక చుట్టూ పోలీసులే!]
* టిడిపి హయాంలో పగోలో బియ్యాం బస్తాలను ధాన్యం బస్తాలుగా మర్చిన మంత్రి(మాంత్రికుడు) ఘనుడు ఇప్పుడెక్కడ అడ్రసు కనబడడం లేదే! మళ్ళీ జంప్ జిలానీ-ట!!
* కేంద్ర నిధులను రాష్ట్రాలు దుర్వినియొగం చేస్తున్నాయట.; రాహుల్ గాంధికి ఇవ్వాళ కటక్ లో తెలిసింది.. కట కటా..ఎన్ని కష్టాలొచ్చాయి?
* ఈసారి దక్షిణాదిన కూడా ఘనంగా జనం, మోడీ ప్రభంజనం..

*రాజ్యసభ సభ్యత్వం కోసం 1996 నుంచి 2008 వరకు ప్రయత్నించా, ఫలించకపోయినా నిరాశ నిస్పృహలకు లోనవలేదు-- కెవిపి అన్నారు(సాక్షి). రాజ్య సభ టికెట్ కోసం 1990 నుంచి గజని మహ్మద్ మాదిరి ప్రయత్నిస్తూ వచ్చా. 2008 వరకు ఆ ప్రయత్నం ఫలించకపోయినా ఏనాడూ పార్టీని ఏమీ అనలేదు. ఈ సారి టిక్కెట్ ఇప్పించడంలో సిఎం, పిసిసి అధ్యక్షుడు మనస్ఫూర్తిగా పని చేశారు-- కెవిపి అన్నారు(ఈనాడు).
*ఒకే వార్త రెండు పేపర్లలో రెండు తేదీలు .. జనాలు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? (నా వార్త-నా ఇష్టం)

*పార్టీ మార్పిడులు ప్రోత్సహించి ప్రజల చేత ఛీ కొట్టించుకోకుండా.. ఈ పర్యాయం పరువు, ప్రతిష్ట, మానాభిమానాలు..ఉనికిని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత..భారతీయ జనతా పార్టీది.

*ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టిందంటే, ఇందరు నాయకులను ప్రసాదించిందంటే, కాసు, పివి, అంజయ్య ఆ స్థాయికి ఎదగ గలిగారంటే, తన చేతులమీదగా 'బి ' ఫారాలు ఇవ్వడం వల్లనే-ట. 1983 నుంచి గాంధిభవన్ కళకళ కు తానే అభివృద్ధి చేశార-ట. బొత్స, ఆనం(రాం), కన్నా, రఘువీర, వట్టి.. వంటి వారి ఎదుగుదలలో ఆయన పాత్ర చాలా ఉంద-ట. శ్రీధర్ బాబు, విహెచ్, చిన్నారెడ్డి, పొన్నాల, దానం, పొన్నం వారిని మంత్రులుగా మంత్రులుగా, ఎంపీలుగా చేయడంలో తన కృషి చాలా ఉంద-ట... ఇంత కష్ట పడ్డా తనకు రెండొ సారి రాజ్య సభ టిక్కెట్టు రాకుండా కొన్ని సక్తులు అడ్డు పడ్డాయన్నారు. కిరణ్ కుమార్ గురించి ఏదో చెప్పబోతూ ఆగిపోయి.." ఈ సమయంలో వ్యతిరేకత భావాలెందుకు? అన్నీ మంచే మాట్లాడతాను..అని కూడా అన్నారు. "వైఎస్ చివరి కోరిక ప్రకారం రాహుల్ గాంధి ప్రధాని అయ్యేలా సహకరిస్తానని అన్నారు.
"నాకు గాంధి భవనే దేవాలయం. కాంగ్రెస్ లోనే చివరవరకు ఉండి మరణిస్తా" కెవిపి భావోద్వేగంతో మాట్లాడారు.(చూడుడు సాక్షి- పేజీ 5). ఇప్పటికైనా అర్ధమైందా రాష్ట్ర కాంగ్రెస్‌ను వెనుకనుంచి నడిపిస్తున్న దెవరో? అందుకేనేమో పలువురు నేతలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆయనను "అదృశ్య శక్తి" అని అభివర్ణిస్తారు.. ఆరాధిస్తారు. కెవిపి గారంటే మీడియా సహా అందరికీ(పార్టీ, ప్రాంతం తేడాలు లేకుండా..) ఇష్టమే.. మరిప్పుడు నాయకులేమంటారో?

*రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గజనీ.. ఘోరీల మయం..అది నేననలేదు. స్వయంగా కె వి పి అన్నారు. తాను 1990 నుంచి 2008 వరకు రాజ్యసభ టిక్కెట్టుకోసం గజనీ లా పోరాడారట..విజయం సాధించారట.(చూడుడు-ఈనాడు: పేజీ 5) ఏ శివాజి తోనో, రాణా ప్రతాప్‌తోనో ఎందుకు పోల్చుకోరు.. 1857 నుంచి స్వాతంత్ర్యంకోసం ఎందరు ఎన్ని పోరాటాలు చేశారు? ఈ దేశంకోసం ప్రాణాలర్పించిన భారతీయ త్యాగధనుల పేర్లు గుర్తుకు రావా మనకు? అవును విదేశీ నాయకత్వంలో స్వదేశీ అలోచనలు మనకు పుట్టవు..

-----------------------------------------------
7-2-14
*సరే. కాంగ్రెస్ కున్న రెండు రాజ్య సభ సీట్లు ఒకే ఆయనకు ఇచ్చారుగా!!! నీవే నా "తోడు" -నిను వీడని "నీడ" నేను(కెవిపి ఎక్కడుంటే - ఖాన్ అక్కడ..)

*తీన్ తేరా ఆఠ్ అఠారా అంటున్నారు సంఖ్యా శాస్త్రవేత్తలు. ఇవ్వాళ్టితో అస్మదీయుల ఎన్నిక పూర్తయింది. ఇక (వోట్ ఆన్ అకౌంట్) జమా-ఖర్చుల లెక్క చూస్కోవాలిగా.. 13/18 ఖాయం చేస్తారేమో రాజీdramaనామా ముహుర్తం!
*అయిపోయింది. ఆ ముచ్చటా తీరింది. సుప్రీం కోర్టు విభజన పిటిషన్ కు చేట కొట్టింది. కాదు పొమ్మంది. ఇక అంతర్జాతీయ కోర్టు ఒకటే దిక్కు. ఇదంతా మీడియా హైప్.. కందకు లేని దురద - కత్తిపీటకు అని వినే ఉంటారు..
*కాపీ చేసే వాళ్ళని కాపీఇష్టులు అంటారు. పేస్ట్ చేసే వాళ్ళను పేస్టర్లంటారు. గూగుల్ కాపీ-పేస్ట్ గాళ్ళు ఈ మధ్య అవేవో పేపర్లంటూ పెట్టి ఎడిటర్లవుతున్నారు. అదీ పాఠకుల బాధ
6-2-14

*It is the prime responsibility of people of Andhra Pradesh to see that all sitting MLAs are defeated in next elections irrespective of parties and places.

*Veteran Journalist Maddali Satyanarayana Sarma (96), popularly known as M.S.Sarma passed away at his residence in Jubilee Hills Journalists Colony at 8:15 p.m.last night. He was suffering from cancer of intestine for some time. He started his journalistic career in 1936 and served Prajamitra, Prajabandhu, Telugu Meezan daily. He later joined Andhra Patrika and worked there for about three decades. He was also Patrika's editor when retired. Sarma played key role in the journalists unions both at Madras and Andhra. He was bestowed with many awards including the Pratibha Puraskarm for Journalism by the P.S.Telugu University. He was active even at the ripe age and made it a habit to write a post card to any paper or channel if he noticed a factual mistake in its news or comment. (Dr GS Varadachary)

5-2-14
* మార్గదర్శిపై మాటల పోరాట యోధుడు ఉండవల్లి ఆరాటం ఏమైందిటపాపం.. ప్రాంప్టర్ అదృశ్యమయ్యేసరికి మాట పడిపోయినట్లయింది..

*లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!
అని నేరుగా ప్రధాని కాళ్ళమీదపడి ప్రార్ధిస్తే పుణ్యం పురుషార్ధమైనా దక్కేది. పరువైనా మిగిలేది.. జైరాం రమేష్ కాళ్ళమీద కాకుండా. ఛీ..  వీరా ప్రజాప్రతినిధులు..ఆత్మగౌరవం గురించి మాట్లాడేది?  

4-2-14
*అక్షరాల నిజం..ఫేస్ బుక్ మరో ప్రపంచానికి రహదారులు చూపింది..ఊహలకు నిచ్చెనలు వేసింది..

*తెలంగాణ బిల్లు విషయంలో ప్రత్యామ్నాయాలు రెండే రెండు.: తప్పు బిల్లు పంపినందుకు మన్మోహన్ రాజీనామా...లేదా బిల్లును తప్పన్నందుకు కిరణ్ రాజీనామా??
అక్కడేమో బిల్లు మేజా(టేబిల్) ఐటెమ్..ఇక్కడేమో బిల్లు మూ(గ)జువాణి!!  

*రాజకీయ నాయకులను తలదన్నే మాదిరి జర్నలిస్టుల్లో ఎన్ని గ్రూపులో.. మేథావులం (అనుకునే) మనం కూడా "కలసి ఉంటే కలదు సుఖం" అనే నానుడి మర్చిపోతున్నాం..ఎన్ని యూనియన్లు, ఎన్ని ఫెడరేషన్లు, ఎన్ని అసోసియేషన్లు, ఎన్ని ఫోరమ్‌లూ.. పుట్టగొడుగులనకూడదా!!

*మాతృ గర్భం-- భూగర్భం: రెండూ సుసంపన్న నిక్షిప్త సంక్షిప్త స్థానమే.

Sunday 2 February 2014

రుచులు మారుతున్న రాజకీయం..

పులిహోర నాకిష్టం.. నా గోల నాదే (వ్యాఖ్యలు)


 




1-2-14
*ఎన్నికలప్పుడు గోడలు దూకడం, కొత్త రంగులు పూసుకోవడం, పాత రంకులు బయటపెట్టడం.. మన దేశంలో కొత్త కాదుగా! పేదరికం, అవినీతి నిర్మూలన, ప్రజాసేవతో పాపం (అరాచక)రాజకీయ హృదయాలు పరితపిస్తుంటాయి.  ప్రజలు మినహా ఆకలి, అలసట, నిద్రా ఏవీ ఉండవు..

*కారత్ గారు చెప్పిన తరువాత నాకివ్వాళే తెలిసింది సెక్యులరిస్టులంటే ఎవరో!!. —

*మోడీని మెచ్చుకుంటే- మతతత్వ వాది, మన్మోహన్‌ను పొగిడితే-అసమర్థుడు, రాహుల్‌ను నచ్చితే-మొద్దబ్బాయ్, కేజ్రీను సెభాష్ అంటే-శుంఠ, బాబును భేష్ అంటే-కులగజ్జి, జగన్ జై అంటే-అవినీతిపరుడు, బాబాలకు నమస్కరిస్తే-శృంగారపురుషులు, ...పోనీ దేవుడికి దణ్ణం పెట్టినా- అదీ సహించలేరు..
లోకో భిన్నరుచి.. తా మునిగిందే గంగ... ఇదీ వ్యక్తుల వరుస!!

31-`1-14
**డిల్లీ లో కేజ్రీ 'వాల్' పోస్టర్ అతికించాడు. అత్యంత అవినీతిపరుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క పేరు .. వై ఎస్ జగన్...

*What had happened to Tarun Tejpal of Tehelka? Digging facts or his own grave..

30-1-2014
*తలపై అయిదు లక్షల రూపాయల రివార్డు ఉన్న 15 సంవత్సరాల అజ్ఞాత వాస మావోయిస్టు కిసా నర్సింహులు ఎలియాస్ జాని నేటి సాయంత్రం డిజిపి కార్యాలయంలో నేరుగా లొంగి పోయాడ ట!!!!
పోలీసు స్టేషనులోనికి వెళ్ళాలన్నా, కమిషనరు కార్యాలయంలోకి వెళ్ళాలన్నా..సామాన్య పౌరులకు అనుమతి ఉండదు. తిరస్కారాలు. లక్ష యక్ష ప్రశ్నలు.. దోపిడిదారులు, హంతకులు, తీవ్రవాదులకు నేరుగా డిజిపి కార్యాలయంలోకి ప్రవేశం లభిస్తుంది.. వెంటనే చట్టం కట్టుదిట్టమైన "భద్రత" కూడా కల్పిస్తుంది.

*పాపం మహాత్ముడు.. ఆయనను ఇవ్వాళ తలుచుకున్న పాపాన పొలేదు అసెంబ్లీ పుణ్యమా అని!!

*The voice vote, or acclamation, is considered the simplest and quickest of voting methods used by deliberative assemblies. The presiding officer or chair of the assembly will put the question to the assembly, asking first for all those in favor of the motion to indicate so verbally ("aye" or "yes"), and then ask second all those opposed to the motion to indicate so verbally ("no"). The chair will then make an estimate of the count on each side and state what he or she believes the result to be. Voice votes are usually not recorded.

*అసెంబ్లీలో జరిగింది ఓటింగ్ కాదు. టింగు..టింగు. అది మూజువాణి కాదు.. మూగవాణి.. గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత? కె సి ఆర్ గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఆప్షన్ కిరణ్ దే- చాట్‌భాండారా? టిఫిన్ సెంటరా?
*ఇన్నాళ్ళు బట్టలు లేని ద్రౌపదితో సరసాలాడి, నగ్న సౌందర్యాన్ని కన్నులారా తిలకించి.. తలలు ఒంచుకుని చేతకాక సిగ్గేసి చివరకు బట్టలు లేవని తెలుసుకున్న గాంధారులు. ఇప్పటికీ కేంద్రానిదే అధికారం. అది తెలుసుకోలేని అంధత్వం వీళ్ళను ఆవరించింది.  రాజ్యాంగం పేర్కొన్న ధర్మంలో అసెంబ్లీకి ఎటువంటి హక్కు లేదు. పార్లమెంటే సర్వసత్తాధికారి.. అది అందరికీ తెలుసు. ప్రజలను మభ్యపెట్తేందుకే ఇంత వ్యవహారం. ముఖ్యమంత్రి నాటకమాడకుండా నిజంగా వ్యతిరేకించి ఉన్నట్లయితే ముసాయిదా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయం కోసం పమిపిన రోజునే తమ వ్యతిరేకతను ప్రకటించి రాజీనామా చేసి ఉండవలసింది.

*Yes. Democracy was once again ridiculed.. నిండుసభలో మరోసారి రాష్ట్రపతి పంపిన బిల్లుకు దుశ్శాసనపర్వం..(వస్త్రాపహరణం..)
*I did not see whether Mahatma was assassinated by Nathooram Godse. But AP Assembly members are trying to do the same on his 66th death anniversary ..

*రాజ్యాంగం పేర్కొన్న ధర్మంలో అసెంబ్లీకి ఎటువంటి హక్కు లేదు. పార్లమెంటే సర్వసత్తాధికారి.. అది అందరికీ తెలుసు. ప్రజలను మభ్యపెట్తేందుకే ఇంత వ్యవహారం. ముఖ్యమంత్రి నాటకమాడకుండా నిజంగా వ్యతిరేకించి ఉన్నట్లయితే ముసాయిదా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయం కోసం పమిపిన రోజునే తమ వ్యతిరేకతను ప్రకటించి రాజీనామా చేసి ఉండవలసింది.
*AP Legislative Assembly Speaker should have done this (restricting media -particularly electronic) three years back..

*For the first time( to the best of my knowledge) today media was not allowed into Assembly gallery..

28-1-14
*రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్ధిత్వాలపై ఊహాగానాలకు ఈ సారి ఎందుకో ఏ పత్రికా ఉత్సాహం చూపలేదు. విశ్లేషకులు పెదవి విప్పలేదంటే సర్దుకున్నట్లు "అర్థం" అయింది. అన్ని కథలూ టీడీపి పైనే కేంద్రీకృతం.. తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు నోట మాట కరవైంది. అందరూ రాజీ పడ్డారా??

*రాజ్య సభ టిక్కెట్లు కెవిపి, ఖాన్, సుబ్బిరామిరెడ్డి కి.. సమైక్య రాష్ట్రంకోసం రాజ్య సభ సభ్యత్వానికి రాజీ నా(డ్రా)మా చేసిన కెవిపి కి మళ్ళీ ఆరేళ్ళు పదవి. ఇది కాంగ్రెస్..  ఏపార్టీకేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి "ఇటలి మాతను".....మనం అన్నీ వదిలేస్తే.. అప్పుడు అన్నీ మనలను పట్టుకుంటాయి. ఇదీ రాజకీయ సూత్రం.
"ఆత్మ" లక్షణం అర్ధమయిందా ఇప్పటికైనా... దానికి ఏపాపాలూ సోకవు. ఇప్పుడర్ధమైందా ఆత్మ ఎందుకు శాశ్వతమో.. అందుకే అందరూ "ఆత్మ ప్రదక్షిణాలు"

*స్వార్థం కోరనిది స్నేహం. బంధాలు పటిష్టం చేసేది అనుబంధం. రాగాలను అతిశయింపజేసేది అనురాగం. జీవితము, ఈ "ముఖపుస్తకం" నాకు అటువంటి గొప్ప వరాలను ప్రసాదించిచాయి. ఎందరో ప్రేమమూర్తులు మిత్రులు, సోదరీ సోదరులయ్యారు. సహృదయులు, పెద్దలు, జ్ఞానుల సాంగత్యం లభించింది. చదువు, సంపద, అందం, కులం కొందరిని గర్వాంధులను చేస్తాయి. అటువంటి వారు తారస పడినా.. మేక వన్నె పులుల నిజ నైజాలు బహిర్గతమై దూరంగా జరిగి పోతారు. అదే వడపోత. వాళ్ళ ముఖాలు చూపలేక ఇతరుల ముఖాలకు ముసుగేస్తారు. అందులో ఆడ, మగ తేడాలేదు. ఈ సమాజంలో అటువంటి వాళ్ళు పిపీలకాలు. దేనికీ పనికిరారు. ఆ అనుభవమూ ఆర్జించాను. అది నాకు 'గుణపాఠం' కాదు. వాళ్ళ గణ, గుణాలు బయటపడ్డాయి.

25-1-14
*ఓటు మన చేతిలో పాశుపతాస్త్రం..ఎప్పుడు, ఎలా, ఎవరిమీద ప్రయోగించాలన్నది వారి వారి విచక్షణ జ్ఞానంపై ఆధారపడిఉంటుంది..తెలుసుకోవడం ధర్మం.. కాదంటే ఖర్మం!!

24-1-14
*ఫేస్ బుక్ పాతాళానికని పేపర్లలో కొత్త కథనం..రోజులు గడుపుకోవాలి, ప్రచారం సంపాదించుకోవాలి. ఆ పరిశోధనలు,, సమీక్షలూ అన్నీ పొట్టకూటికి, పేరు ప్రతిష్ఠలకు, ఫక్తు వ్యాపార లక్షణం. అదైనా కొత్త మోజు కొన్నాళ్లే.. గ్రామఫోన్లు పోయాయ్, రేడియోలు పోయాయ్, ట్రాన్సిస్టర్లు పోయాయ్, టీవీలు పోయాయ్, ఎల్సీడీలు పోతున్నాయ్, ల్యాండ్ లైన్లు పోయాయ్, పేజెర్లు పోయాయి, సెల్ ఫోన్లలో రోజుకోటి మాయం..కార్డులు, ఇన్లాండ్ పోస్టు, టెలిగ్రాం, ఈమెయిల్స్, ట్విట్టర్లు, ఓర్కాట్,.... పరిణామ సిద్ధాంతం.. తప్పదు..నాటకాలు లేవు, సినిమాలు మూత, ఇదీ మీడియా పిచ్చితనం. పుస్తకాలు పోయి, న్యూస్ పేపర్లు నెట్ చదువులోచ్చాయ్.  టైప్ రైటర్లు హుష్.. కంప్యూటర్లు వచ్చాయ్. అవీ రూపాంతరం.. ఏది శాశ్వతం. బతుకులే మర్నాటికి.....ఒక్క ఫేస్ బుక్ పై అంత సీరియస్సా!!

*అదేమిటి? చోద్యం. మొన్ననే కదా మీడియా మొత్తం డాన్స్ చేసింది.. దక్షిణ- ఉత్తర గ్రిడ్ అనుసంధానమయింది, ఇక దేశం మొత్తం వెలుగే వెలుగు రాష్ట్రంలో కరెంటే కరెంటు..... కోతలుండవ్, ఒద్దన్నా, స్విచ్ఆఫ్ చేసినా వైర్ల నుంచి ఓవర్‌ఫ్లో..అంటూ ఒకటే మోతపెట్టాయ్. --------------- మరోవైపేమో ఇవ్వాళే కోతల వాతలు మొదయ్యాయని ప్రభుత్వ ప్రకటన.. ఇకపై..
గ్రామాల్లో ఉదయం 6 ఆం నుండి సాయంత్రం 6 ఫం వరకు (12 గం); *మండల కేంద్రాల్లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు (6 గం);
మునిసిపాలిటీల పరిధిలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 వరకు (4 గం); కార్పొరేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు (1:30 గం)!!

22-1-14
*మూడేళ్ళతరువాత కూడా కిరణ్ అర్ధం కాలేదంటే అది మన (మీడియా) లోపం.. ఆయన ప్రతిభకు తార్కాణం..  నా అనుభవం బట్టి కేశవరావు, జానారెడ్డి, కిరణ్.. ముగ్గురూ మూడు విధాలు.
కేశవరావు మాట్లాడేది మనకే కాదు, ఆయనకూ అర్ధం కాదు. అందుకే మర్నాటి పత్రికల్లో ఎవరేవిధంగా రాసినా ప్రశ్నించడు. జానారెడ్డి ఏది తనకు ఎంత అవసరమో అంతవరకే అర్ధమయ్యేట్లు మాట్లాడతాడు. వొద్దనుకున్నప్పుడు అర్ధం కానట్లు మాట్లాడతాడు. కిరణ్ తనకు అర్ధమయింది మాట్లాడతాడు. ఎదుటివాడికి అర్ధమయిందా లేదా అయనకు అనవసరం..అవసరమనుకున్నవాడు అర్ధం చేసుకోవాలి.

*ఆశల ఊయలలో చివరి ఊపు.. బిల్లు గడువు పొడిగింపుపై ఊహాగాన వార్తలు..జాతీయ మీడియా పేరిట మన గొట్టాల్లో.. అయితే.. అదుగో మేము నిన్ననే చెప్పాం!! కాకుంటే.. ఇది కాంగ్రెస్ నీలి ప్రచారం.. ఒక రాయెయ్యడమేగా..----అదే జరిగింది చూశారా? అప్పుడే ఒక గొట్టంలో మరో కథ..పాతవార్తకు ఖండన. గడువు పొడిగింపు వార్త నిజం కాదని హోం వర్గాలు పేర్కొన్నట్లు.. ముం(మం)దు జాగ్రత్త..

*ఆత్మకథలు అందరికీ సాధ్యం కాదు. ఆత్మలు లేకుండా కథలు ఎలా నడుస్తాయి. అలా అని కథలున్న వాళ్ళకు ఆత్మలున్నట్లూ కాదు.. ఆత్మలు 'పవర్‌' ఫుల్..

21-1-14
*"మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే సునంద మరణం-----".. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్ మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిద్రకు, ఆలోచనల నివారణకు ఉపకరించే  'ఆల్ప్రజోలం'  మందు అధిక మోతాదులో సునంద తీసుకున్నట్లు, అదే సమయంలో ఆమె రక్తంలో ఆల్కహాల్ తీసుకున్న ఆనవాళ్లేమీ కనిపించలేదనిల సమాచారం. --
మరి నిన్నటి దాకా అవేవో చించుకున్న ప్రసార మాధ్యమాలు నోరిప్పలేదే!! తమ కథలు, కాకరకాయలు, వాదననిలవలేదని అక్కసా? వాదననిలవలేదని అక్కసా? శీల విచ్ఛిత్తి ప్రక్రియ.. ఎవరికి వారే న్యాయమూర్తులై పోయారు.. వైఎస్సార్ ఎప్పుడూ అసెంబ్లీలో చెబుతుండేవారు: "రాజకీయం ఎలా తయారైందంటే...గుడ్డకాల్చి ఎదుటివాని ముఖాన వేసి మసి నువ్వే తుడుచుకో, నలుపు కాదని నిరూపించుకో.. అన్నట్లు. " అని .

*ఈ నెల 16వతేదీ డిల్లీలో ఏ.ఐ.సి.సి.సమావేశాల మొదటి రోజున "టి-బిల్లు చర్చకు రాష్ట్రపతి మరో పది రోజుల సమయం పోడిగించనున్నట్లు" పి.టి.ఐ. వార్తాకథనం పేరిట మీడియాలో బహుళ ప్రచారం జరిగింది. 17వ తేదీ అన్ని పత్రికలదీ అదే పతాకశీర్షిక.. ఆరు రోజులయిందికదా! మరెందుకు ఆ వార్తను పత్రికలు, చానళ్ళు ఇప్పటివరకు నిర్ధారించులేక పోయాయి? రెండ్రోజులుగా ఆ కథనానికి ఊపిరిపోసేలా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు శాసనసభ సమావేశాలను పొడిగించాలని స్పీకర్‌కు లేఖలు ఇవ్వడం, వివరణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖలు రాస్తే వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం, ఈలోగా మరో నాలుగు వారాలు సమయం పొడిగించాలని ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతికి నివేదనలు పంపడం చూస్తుంటే ఏమి అర్ధమవుతున్నది? అందరూ కలసి నాటకంలో తమ పాత్రలు ఎంత రసకందాయంగా పోషిస్తున్నారో తెలుస్తుంది కదూ!! ఇదే మీడియా మేనేజ్‌మెంట్!! సభ్యులందరూ తమ వాదనలు వినిపించాలట. ఒక్క ముఖ్య మంత్రే 10 గంటల చర్చకు సిద్ధమవుతున్నాయంటూ ఎన్నెన్ని కాకరకాయ వంటకాలో.. ఉత్కంఠలకు, ఉద్రిక్తతలకు దారితీసేలా ఎన్నెన్ని ప్రయత్నాలో!!

20-1-14
*ఉసెండీ అయినా. కొండపల్లి అయినా, కెజి సత్యమూర్తి అయినా... రేపు గణపతి అయినా?? ఇవాళ మన రాజకీయ నాయకులైనా..తాము మునిగింది గంగ..కాకుంటే మురికి మూసీ. ఫిరాయింపుదారులది.. ఫర్మానాలిచ్చే అధినేతలదీ ఇదేదారి. తమకు నచ్చినన్నాళ్ళూ మెచ్చుకుంటారు. కానప్పుడు సచ్చినోడా అంటారు. లోపలున్నన్నాళ్ళు దేవాలయం.. బయటికొస్తే స్మశానం. నాయకులకు అడుగులకు మడుగులొత్తీతే భక్త శిఖామణి. ముల్లులా గుచ్చితే శిఖండి...కాంగ్రెస్, టీడీపి, వైకాపా, టి్ఆర్ఎస్, భిజెపి... ఏదైనా అంతే! ఆ గోడల మధ్య యజమాని నిలువెత్తు దేవుడులా కనిపిస్తాడు. గోడదూకిరాగానే నియంతగా అనిపిస్తాడు...        
ఈ సిద్ధాంతం జర్నలిస్టులకూ బాగా వర్తిస్తుంది. తాము రాసిందే భగవద్గీత, వేదం. ప్రత్యర్ధిది బూతు పురాణం. తమది సంసారం-ఎదుటి వారిది వ్యభిచారం..  (నేను చెప్పింది ఇంగ్లీషు జర్నలిస్టుల గురించి కాదు.. తెలుగు ఎర్నలిస్టుల గురించి మాత్రమే!! ఇంగ్లీషు ఇంకా అంత ఎంగిలికాలేదు. ఇది నా భావన.--ఇక్కడ కూడా ఇంగ్లీషుందండి..)

*ఈ మధ్య, పద్య గద్యాల సేద్యంలో ఆముదపు వృక్షాలు ఆకసంలో తారలై విహరిస్తున్నాయి.. పాఠకులూ! శ్రోతలూ!! ఇంచుక తమాయించుకోండి!!!

*సబ్బం స్వరం మారింది.. పబ్బం గడిచింది. గర్వము సర్వము ఖర్వమయ్యింది. తోమిన కొద్దీ సబ్బు అరుగుతుంది. కంట్లో నురగపోతే మంటెక్కుతుంది అప్పుడు బయట పారేస్తాం..

19-1-14
*అందరు జర్నలిస్టుల జీవితాలు వడ్డించిన విస్తరి కావు. ముఖ్యమంత్రులు ఎదురొచ్చి కారు డోరు తెరచి సాదరంగా ఆహ్వానించిన పాతతరం జర్నలిస్టులు వృత్తిమీద అంకితభావంతో లక్షలకు విలువచేసే ఆస్తులమ్ముకుని,సంతానం చేతికందిరాక రెండు పూతల మెతుకులు దొరకక బిచ్చమెత్తుకోలేక కుళ్ళిపోతున్న జీవితాలు ఇంకా సాక్షీ భూతాలుగా నిలిచి ఉన్నాయి. పెదవులపై నవ్వు పులుముకుని ఎదలో అగ్నిపర్వతాలు దాచుకున్న వారెందరో!!  అందుకనే నేనంటా జర్నలిస్టులందరూ ఎర్నలిస్టులు కాదని. కొందరు కార్లలో విహరిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు."ముందు" చూపున్నవాళ్ళు.   జర్నలిస్టు  జీవిత పుస్తకంలో సువర్ణాక్షరాలున్న కాగితాలు కొన్ని మాత్రమే!!