Monday 30 December 2013


పాత్రికేయునిగా తిరుమల రామచంద్ర.. 
------------------------------------

(శత జయంతి పురస్కరించుకుని "ఆంధ్రజ్యోతి" దినపత్రిక 21-12-2013(శనివారం సంచిక)న ప్రచురితమైన సాహితీ వ్యాసం )


తెలుగు సాహిత్యం, పత్రికా రంగాలలో ప్రాతఃస్మరణీయులు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సారస్వతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు.  తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న తిరుమల రామచంద్ర విధ్వాన్, విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. అనంతరంజ్ ఢిల్లీ వచ్చి "డెయిలీ టెలిగ్రాఫ్" ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశారు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేశారు. తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు.  ఆరోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి , బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యారు. ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక లలో వివిధ హోదాలలో పనిచేశారు. "భారతి" మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురింఛిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశారు. నార్ల తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నారు.  డైలీ టెలిగ్రాఫ్‌లో చేరిన వెంటనే దాని సంపాదకులు వెంకట్రామన్‌ రామచంద్రగారికి ఇచ్చిన మొట్టమొదటి అవకాశం ప్రఖ్యాత పరిశోధకుడు, బహుభాషా వేత్త అయిన రాహుల్‌ సాంకృత్యాయన్‌గారి ఉపన్యాసాన్ని కవర్‌ చేయడం. తర్వాత హైదరాబాద్‌లో సంగెం లక్ష్మీబాయిగారిని కలిసి తెలుగు పత్రికా జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి పత్రికా రంగంలోనే స్థిరంగా ఉన్నారు.  రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్ధించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

ప్రొఫెసర్‌అప్పాజోస్యుల సత్యనారాయణగారన్నట్లు ఆయన పనిచేసిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, భారతి మొదలైన పత్రికల్లో ఏ ఒక్క పత్రికల్లో స్ధిరంగా ఉండినా దానికి సంపాదకుడు అయి ఉండేవారే. అందరు పత్రికా సంపాదకులను తనకన్న చిన్నవారుగాకాక మిన్నవారుగా అంగీకరించి, వారి కింద పనిచేసిన వినయశీలి తిరుమల.  డా. అక్కిరాజు రమాపతి రావు   'తిరుమల రామచంద్ర మనసుతోనే, మనస్విగానే బతి కారు. ఆయన నిరాడంబర వచస్వి, 60 ఏళ్లకు షష్టిపూర్తి చేయించుకోలేదు. 70 ఏళ్లకు సప్తతి జరగలేదు. 80 ఏళ్లకు అశీతి అసలేలేదు. 84 ఏళ్ల సహస్రచంద్ర దర్శనం సమ కూరలేదు. ఆయనది ఏమీ పట్టించుకోని మనస్తత్వమన్నారు. ఆయన గురించి ఆయన  'హంపి నుంచి హరప్పాదాకా'  రాసుకున్న ఆత్మకథలో 'ఇవి నా జీవితంలో మూడోవంతు సంఘటనలు, నేను సామాన్యమానవుడ్ని, కానీ నాలో వైచిత్య్రం, వైవిధ్యం ఉన్న మాట నిజం. ఎవరి జీవితంలో లేవు గనుక. ప్రతి మనిషి ఒకే మూసలో పోసినట్టుంటాడా? అయినప్పుడు వైవిధ్యం తప్పదు.  పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. "హైదరాబాద్ నోట్ బుక్" వంటి 15 శీర్షికలు నిర్వహించారు."సత్యాగ్రహ విజయం" నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు.  'మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు'అన్న రామచంద్ర రచన భాషాచరిత్రకే తలమానికమంటూ ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదన్న విశ్వాసాన్ని 'ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు'గారు ప్రకటించటం రామచంద్ర అలుపెరుగని పరిశోధకుడు అనడానికి నిదర్శనం. ప్రచారానికి ఆయన ఏనాడు అంగలార్చిన వాడుకాడు. నిరాడంబరత, నిండు మనసు, ఓరిమి వారి వ్యక్తిత్వంలో ఇమిడిపోయాయి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు.  లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు. దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

ఏడు దశాబ్దాల కిందటే  తెలంగాణ  అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు. ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రస్తావనకు రాలేదు. ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీకరించారు. . ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో,  తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు  కమలాపురం నుంచి క్వెట్టాదాకా  లేదా  హంపీ నుంచి హరప్పా దాకా  అని ఉంటే బాగుంటుందని ఆయన ముందుగానే అభిప్రాయపడ్డారు. జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు,  ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని ఆరాతీస్తే,  మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి  అని తేలింది.  అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు. తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇది ఆయన శతజయంతి వత్సరం కావడం విశేషం. .

ఆయన గ్రంథాలు  మన లిపి, పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండేదని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ, ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని రెండు ఇంటర్య్వూల్లో  రామచంద్ర  చెప్పారు.  తిరుమల రామచంద్ర జీవితంలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు.

బ్రిటీష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాలలో పనిచేసినప్పుడు, అచ్ఛర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సర్సవతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిలీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన వీరే మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామావిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమాస్తాగా, కాన్పూర్‌లో మరి కొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచంద్ర జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచుకున్న రచనలు మొదలైన వివరాలు మిత్రులకు లభ్యమయ్యాయి.  ఆయన  మూడు వాఞ్మయ శిఖరాలు  అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.  అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రాఘవపల్లె లో జన్మించిన రామచంద్ర తెలుగు, సంస్కృతాలలో విధ్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు. ఆయన నిత్య పాత్రికేయుడు, రచయిత, అధ్యయన శీలి, విద్యార్థి కూడా.. ఆయనకు శతకోటి  వందనాలు..

---నందిరాజు రాధాకృష్ణ,

రోతను పాతరేద్దాం...
పాతకు పట్టం కడదాం...
కొత్తను నెత్తికెత్తుదాం...
మంచిని ఎంచుకుందాం...
మనసును పంచుకుందాం... 

31-12-13
ఇది పాత సీసాలో పాత సారానే.. అర్ధరాత్రినుంచి కొత్త సరుకు..ఫుల్ జోష్!!
-------------------------------------------------------------------------------------

*తొందరపడి ఒక కోయిలా, ముందే కూసింది, నేలకు ఒరిగింది..--అమేథీలో రాహుల్ పై పోటీ చేస్తా! ధైర్యం ఉంటే మోడీ కూడా బరిలోకి దిగాలి--ఆప్(అతి) విశ్వాస్
*ఎన్నికల వేళ ఎన్నెన్ని కళలో!-- రాష్ట్రంలో 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్-కొలువుల మేలా!
*ఎక్కడబట్టినా అవినీతి కక్కులే--- రాజకీయనాయకులకు తిన్నదరగని అజీర్తి రోగం
*యథా రాజా తథా ప్రజా
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అసంబద్ధం -- విభజనపై ముఖ్యమంత్రి.
ప్రభుత్వాస్పత్రులలో మాకు వైద్యమా.. మేమొప్పుకోం ఉద్యోగులు!!
*మన ఘన నగరపాలక సంస్థ మొద్దు నిద్రకు తార్కాణం. -- అనుమతులు లేకుండా పదేళ్ళుగా నగరంలో వేల సెల్ టవర్లు
*ఏపి చాయ్ వాలాలతో మోడీ ముఖాముఖి -- కొంచెం అలోచించండి సార్, ..బార్ వాలాలతో మరీ బాగుంటుందేమో!!!
*మళ్ళీ డిల్లీ విమానాలకు రద్దీ - రాష్ట్రపతి నేడు డిల్లీ తిరుగు ప్రయానం.
*రాష్ట్ర ప్రజాలారా రెండ్రోజుల్లో ప్రాణాలు ఇన్సూర్ చేయించుకోండి-- బొత్స సత్తెయ్య నిజంగా 3న ఆస్తులు ప్రకటిస్తారట!!
*మందు ఉప్పెనలో మునిగిన భాగ్యనగరం - డిల్లీలో కుళాయిల్లో కట్టలు తెంచుకున్న "ఆప్" నీటి పరవళ్ళు..

29-12-13

*వాటికన్ సిటి మాదిరి తిరుపతికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి: .!! ఆ విషయంలో మాత్రం, బాబే కరెక్ట్. అదే వై ఎస్ ఉండి ఉన్నట్లయితే ఏడుకొండలు రెండుకొండలై మిగిలినదంతా నిజంగా వాటికన్ సిటి అయ్యుండేది.. అందుకే బాబు బతికి బట్టకట్టాడు.  
*బలాఢ్యులు, ధనాఢ్యులు, గుణాఢ్యులు... అదొక పాత కేటగిరి!! కులాఢ్యులు, మదాఢ్యులు .. ఇది కొత్త కిరికిరి.
*ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. రాజకీయ నాయకులకు వెల్త్ కార్డులు.. ఈ స్కీమేదో బాగుంది కదా!!
*తడిగుడ్డతో గొంతు కొయ్యడం కాంగ్రెస్ కు అలవాటట....ఉండవల్లి గారికి 10 ఏళ్ళ ఎంపి అనుభవంతో జ్ఞానోదయమైంది ఈ రోజు:
మరి పదేళ్ళుగా మనమెన్ని గొంతులు కోసామో అక్కడ ఉండి? ఇప్పుడు అనుభవం తలపండి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన రొమ్మును సమైక్య కత్తితో కోస్తున్నారు..
*మీరు మరొక విషయం గమనించారా!! ఆంధ్రా ఆక్టోపస్ (లగడపాటి) మరొక జోస్యం చెప్పింది - జగన్ కాంగ్రెస్ లో చేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య సత్తిబాబు చెప్పినట్లు 30 మంది కాదట. 70 మందట..కేంద్ర మంత్రు కూడా ఇద్దరున్నారట ఆ జాబితాలో: కొంపదీసి బొత్స ఝాన్సీ కూడా ఉందో ఏమిటో??  
*వివేక్, మందా గులాబి దండులో జేరి కెసీఅర్ పక్కనే కూర్చుని సిఎమ్‌ను తూర్పారబట్టారు. అయినా వారు కాంగ్రెస్ ఎంపీలే! కాంగ్రెస్ కు అంటూ.. ముట్టూ ఉండదు..
*గౌడ్ గారు ప్రాయశ్చిత్త పరిహారార్ధం అందుకే మళ్ళీ కంచిగరుడ సేవ మొదలెట్టారు..
*ఒకే వొరలో ఎన్ని కత్తులో! ఒకే వేదికపై ఎన్ని కుత్తుకలో!! ఉండవల్లి, లగడపాటి, సబ్బం---హర్షకుమార్, కావూరి, రాయపాటి..ఇదెలా సాధ్యం?
వీరి సమన్వయ కర్త ఎపి జ(ఎ)ర్నలిస్టుల ఫోరం..
*ధనముంటే ఏ సభకైనా జనమొస్తారు.... కావాలంటే చూడండి చిత్తూరు జిల్లాలోనే ఒక వైపు జగన్, మరొక వైపు బాబు..... అబ్బబ్బ ఇసకేస్తే రాలడం లేదు..విసుగేసినా ఆగడం లేదు..
*నిజమే! అమ్మ పెట్టదు..అడుక్కు తినమంటుంది... అది అమ్మ ఆద్మీ పార్టీ..  
*టీడీపీ ప్రజాగర్జనకు నన్ను ఆహ్వానించలేదు: హరికృష్ణ----గర్జనలకు జవసత్వాలుడిగిన వృద్ధ (వృధా) సింహాలను పిలవరు..
26-12-13

*మాతృభావం, పితృభావం, గురుభావం, సోదరభావం, స్నేహభావం, గౌరవభావం... ఇవన్నీ వాంఛనీయమే కాని అహంభావం మాత్రం అవాంఛనీయం....
*శ్రీకారం, స్వీకారం, మమకారం, ఉపకారం,అపకారం, తిరస్కారం, నమస్కారం, పురస్కారం, ఓంకారం, ... ఏవైనా భరిచవచ్చు. కానీ అహంకారులను అర క్షణం కూడా సహించకూడదు..
*We can bear cheating.. we can spare deceiving.. but we should not tolerate betraying.
*short cuts in life cut short life.. be careful !
*Influence may workout some times..be careful, it is highly inflammable all times.
20-12-13

*ప్రధాని పదవికి పోటీలో జయలలిత!! --- దక్షిణంలో మగాళ్ళకు చేతకాని పని. ఒక మహిళ అలా ధైర్యం చేస్తున్నందుకు. చాలా గర్వించదగిన విషయం. దక్షిణ సామ్రాజ్ఞి.

19-12-13

*ఇవ్వాళ రాష్ట్రం విడిపోవడానికి అందరూ ఎలా అంగీకరించడంలేదో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు, కలవడానికి కూడా అందరూ అంగీకరించలేదు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1955 నవంబరు 29వ తేదీ హైదరాబాద్ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ.. ఇలా చెప్పారు:  
"విభజనానంతరం హైదరాబాద్ భవిష్యత్తు నిర్ణయాధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసులపై ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్మానం రూపొందించారు. దానిలో లోపాలోపాలు నాకు తెలుసు. సభలోని అన్ని వర్గాలను తీర్మానం సంతృప్తి కలిగించలేదనీ నాకు తెలుసు. నోటీసుపై వచ్చిన రెండు డజన్ల సవరణలు  ఈవిషయం తెలియజేస్తున్నాయి.
కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా అభిప్రాయ బేధాలున్నాయి. తెలంగాణలో మూడురకాల అభిప్రాయాలున్నాయి. ఆ మూడూ:
తక్షణ విశాలాంధ్ర నిర్మాణానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యవర్గం సలహా పాటించాలి.
శాశ్వతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి.
ఎస్సార్సీ సిఫారసులను ఆమోదించడమే మంచిది.
సభ్యుల అభిప్రాయం భారత ప్రభుత్వానికి తెలియజేస్తాం. వ్యవధి లేనందువల్ల చర్చలో పాల్గొనే అవకాశం లభించని సభ్యుల లిఖిత పూర్వక అభిప్రాయాలను అంగీకరించడమా? లేకపోవడమా? అనేది సభాపతి నిర్ణయం. ఏది ఏమైనా ఈ విషయమై తుది నిర్ణయం చేసే అధికారం పార్లమెంటుదే!!" 

Wednesday 18 December 2013

పెళ్ళి కుదరదు-పిచ్చి తగ్గదు.. 
రాజకీయం రంగుల మయం.. 
వారంలో  వ్యాఖ్యల వాతలు..

17-12-13

*నాకు తొలగని ఆశ్చర్యం ఒకటే.. హైదరాబాద్ నగరంలో ఏ టూ వీలర్, ఫోర్ వీలర్ మీద చూసినా స్టిక్కర్లే స్టిక్కర్లు.. "ప్రెస్, డిఫెన్స్, డాక్టర్, కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్, మిలిటరి, ఆర్మి, జిహెచ్ఎమ్‌సి, ట్రాన్‌స్కో.." ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్ల సంగతి చెప్పక్కరలేదు..అని. హైదరాబద్ నగరంలో మాంసం తీసుకెళ్ళే స్కూటర్లమీద, ఆటో ట్రాలీల మీదా కూడా పెద్దక్షరాల్లో కనిపిస్తాయి "ప్రెస్" అని. మన రాష్ట్రంలో, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎన్నోచోట్ల తిరిగా. ఈ వింత ఎక్కడా కనబడలేదు.!!

*నాలుగు దశాబ్దాల నిఖార్సయిన కలంతో నిజాల నిప్పులు వర్షం కురిపిస్తూ, సహచర పాత్రికేయులను ఆత్మీయాతా "పాశం" తో బంధించి, వారి "యాద్"లో "గిరి" శిఖరమై నిలిచిన "పాశం యాదగిరి" మిత్రుని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసిన శుభతరుణంలో ఆప్తునికి అభినందన మందార మాల. ఆంధ్రపత్రిక, ఈనాడు, ఉదయం దినపత్రికల్లో కలాన్ని ఝళిపించి, "వర్తమానం" పత్రికకు స్వయానా సారధ్యం వహించిన అక్షర యోధునికి మరోసారి హృదయపూర్వక శుభాభినందనలు.

*సోదరి మాధవి ఈ నెల 15వ తేదీ వ్యక్తపరచిన భావానికి ఈ కిందివిధంగా నా అభిప్రాయం చెప్పాను---
"ఫేసు బుక్కులో ఫేకు లుక్కుల ముఖాలు.. మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పాడమ్మా!! కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని..అయితే కొందరు వృద్ధులకు పిదపకాలం బుద్ధులుంటాయి. వాళ్ళయినా వీళ్ళయినా, భాష, సంస్కృతి వంటబట్టని విశృంఖలతత్వం ఎక్కువవుతున్నది. అతి చనువు తీసుకుంటున్నారు కొందరు.." -----
నేటి సాక్షి దినపత్రికలో చూడండి.. వారూ అదే అన్నారు.."ఫేసు బుక్కులో ఫేకు లుక్కులెక్కువ"య్యాయని.
ఇందులో ఆడా మగా తేడా లేదు. తమ గురించి ఇతరులేమనుకుంటున్నారో తెలుసుకునే నెపంతో కొందరు, ఇతరులపై పరోక్షంగా అక్కసు వెళ్ళగక్కేందుకూ ఈ ఫేకు లుక్కుల, లైకు సామ్రాజ్య అకౌంట్లు సాగిస్తున్నారు. పాపులారిటీ పెంచుకునే ఈ ప్రక్రియలో ఆడా మగా తేడా లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి.

16-12-13

*జనాలకు మాదిరే, జ్వాలలు పలు రకాలు.. విరహజ్వాలలు, ఆగ్రహజ్వాలలు, అసూయజ్వాలలు, చలిమంటలు, చితిమంటలు, అక్కసుమంటలు, కడుపుమంటలు....ఆకలిమంటలు మినహా అన్నీ మనుషులను, మనసులను నిలువునా కాల్చేస్తాయ్! జాబితాలో కొత్తగా చేరింది "బిల్లు మంటలు"

*పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి రోజు విభజన బిల్ అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన స్పీకర్ : (Madhavi Vemulapati)
అంత జ్ఞాన సంపద ఉందా ఆ బుర్రల్లో! ఎవరి దినాలు వాళ్ళు లెక్కెట్టుకుంటున్నారు..చాచి చెంపకాయ కొట్టమన్నాడు మొన్నాయనెవరో. ఇప్పుడది మన (అ)గౌరవ సభ్యులందరికీ వర్తిస్తుంది. (my comment)

*మీడియాకు కళ్ళెం వేసే శక్తి ఒక్క కోర్టుకే ఉంది ప్రస్తుతానికి..బెదిరింపుల్లో, మామూళ్ళలో వాళ్ళని మించిపోయారని పోలీసులూ భయపడుతున్నారు మీడియా అంటే..

*350 మంది సభ్యుల ఉభయ సభలకు.. 3500 మంది పోలీసులతో బందో బస్తు.. జరగని సభకు అధిక బందోబస్తు అని చెప్పిందందుకే!    

*నేనెప్పుడో చెప్పాను. రాష్ట్రంలో రాజకీయం, పాత్రికేయం అంటకగుతున్నాయని. చూసారా ఇవ్వాల అసెంబ్లీ, కౌన్సిల్లో సభ్యుల తోపులటలు, దుర్భాషలు. సిగ్గు పడవలసింది వాళ్ళు కాదు, మనం. వీళ్ళా మన ప్రతినిధులు అని. మీడీయా అగ్నికి ఆజ్యం పోస్తున్నదని అర్ధమయింది కదా!! మీడీయా వాళ్ళు కూడా రెండు వర్గాలై వాగ్వివాదాలు. సభ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ కలసి. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన బిల్లు ప్రతులకు భంగపాటు. పట్టపగలు చట్ట సభాప్రాగణాల్లో ప్రతినిధులు ప్రతులను చించడం ప్రాజాస్వామ్యానికి వస్త్రాపహరణమే! అసెంబ్లీ పరిధిలో కట్టడి చేయాల్సింది, ప్రాంగనం నుంచి బహిష్కరించాల్సింది ఎమ్మీల్యేలు, ఎమ్మెల్సీలను కాదు, మొదట మీడియాను. సభలోకంటే బయటే రభస ఎక్కువ..

*సమస్య పరిష్కారం కంటే ప్రజా ప్రతినిధులకు ప్రచార యావే ఎక్కువ. చానళ్ళుంటే రెచ్చిపోతారు, లేకుంటే చప్పబడతారు. ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం మనదగ్గరే! ప్రతినిధుల స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం విశృంఖల విహారం చేస్తున్నాయి.

15-12-13
*ఉక్కుమనుషులున్న దేశం మొక్కవోలేదు..  పిల్లా - జెల్లా, పల్లె - పట్టణం.... ఆడ మగా..ఒకరు కాదు అందరూ... ఇవ్వాళ దేశం మొత్తం ఐక్యతా పరుగు పెట్టింది..

*మాజీ ముఖ్యమంత్రి, తాజా ముఖ్యమంత్రి సొంతజిల్లాలో వీరప్పన్‌ల(నేరస్థుల) స్వైరవిహారం. ప్రభుత్వ సిబ్బందిపై హత్యాకాండ.. ఇదీ శాంతిభద్రతల తీరు.
*రాష్ట్రాన్ని కలసి ఉంచితే, తనతో కలిసొస్తే.. బిజెపికి జగన్ 23 లోక్ సభసీట్లు ఇస్తానన్నాడట!(ఇదొక పైత్యకారి రాత-కూత)! తెలుగు విశ్లేషకుల మాదిరి బిజెపి అంత దిగజారి పోయిందన్నమాట. ఆ చేత్తోనే కాంగ్రెస్ కూ 18 ఇస్తేసరి. తనసీటు మాత్రం ఉంచుకుని.

*బాబుకు, జగన్‌కు, కెసీఅర్‌కు ఏకైక ఆపద్బంధు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే! ఖర్మకాలితే కాంగ్రెస్ జగన్‌కు, బిజెపికి కూడా మద్దతు ఇస్తుంది.. డిల్లీలో "పొరక" పార్టీకి ఇచ్చినట్లు.
జనసంఘ్ వ్యవస్థాపక ఆత్మలు శాంతించుగాక!!

*వాపు - బలుపు కాదు. అధికార, ధన మదాహంకారం తలకెక్కితే ఇక అధఃపాతాళానికే!! ముఖ్యంగా రాజకీయాల్లో ఇది నిత్య సత్యం..

*మార్కెట్ లో ప్రతి విక్రయానికి "బిల్లు" ఉంటుంది. కౌంట్లు.. డిస్కౌంట్లు, పర్సెంటేజీలలోనే తేడా!!

* బాపు - "గుండె" అంతర్ధానమయినా వడి వడిగా నడుస్తున్న కొండ. తెలుగులో రెండక్షరాల రేఖా బ్రహ్మ. దృశ్యకావ్యం, ప్రబంధకం, పురాణం, ఇతిహాసం, చరిత్ర...కలగలిపిన హంగుల రంగుల కాన్వాస్!
పిడుగు లాంటి బుడుగు నుంచి కల్పవృక్ష కవిసమ్రాట్ విశ్వనాథ వరకు చిరపరిచితమై, హాస్యానికి పుట్టినిల్లయిన తెలుగునాట ఆయనను గురించి మాట్లాడి పరిచయం చేయడం ఎంత దుస్సాహసమంటే.. అర్జా జనర్ధనరావుకు ఆంజనేయుని గురించి చెప్పడమే.  అసేతు హిమాచలం ఆ "రేఖా బ్రహ్మ" అశీతి ఉత్సవం జరుపుకుంటూ, పొట్ట చెక్కలయ్యేలా తెలుగులో పగలబడి నవ్వుతున్నదీనాడు.

14-12-13

*రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులుండరు. ఇది అక్షరాల నిజం. జనమే వెర్రిబాగులోళ్ళు.  బిజెపిని అటు జగన్, ఇటు బాబు తూర్పారబట్టారు. జగన్ ను కాంగ్రెస్, కాంగ్రెస్ ను జగన్ ఒకరి నొకరు రెండున్నరేళ్ళుగా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టుకున్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని బాబు విమర్శించారు, పొత్తు ప్రశ్నే లేదన్నారు.  ఇప్పుడు అవసరాలు మనుషులను మార్చాయి. బాబేమో బిజెపి వెంట సుళ్ళు తిరగడం.                
రాజశేఖరరెడ్డి  ఏదైనా స్వయంగా చూసుకున్నారు. ఏ సహాయానికి ఎవరి  వెంటపడలేదు.  కాంగ్రెస్ కు బద్ధశత్రువులైన విపక్షనేతలందరిని దూరంగా పెట్టారు. ఆయన కొడుకు జగనేమో అదే విపక్షనేతల దగ్గరకు కాలికి బలపం కట్టుకుని రోజూ దేశమంతా ఎక్కే గడప, దిగే గడప..యుపీఎకు మద్దతిస్తానన్న జగన్ ఎన్‌డీఎ కూటమి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇద్దరు బద్ధశత్రువులకు (జగన్-బాబు) కామన్ ఫ్రెండ్ బిజెపి. అదెలా సాధ్యం. రేపు బాబు-జగన్ కలవరని గ్యారంటీ ఏమీ లేదు..

*కాంగ్రెస్ చరిత్రలో నేను చూసినంతవరకు..మనరాష్ట్రంలో నిన్న, మొన్న దిగ్గీ పర్యటన అంత పేలవంగా ఏ కేంద్రనాయకుని పర్యటన జరగలేదు. డిల్లీనుంచి విమానం వచ్చి మళ్ళీ ఎగిరేవరకు సిఎం, సిఎల్పీ నేత, పిసిసి అధ్యక్షుడు, వందిమాగధ బృందం అనుక్షణం వెంట ఉండేది. వైఎస్సార్ హయాం 10 సంవత్సరాలలో అంతటా ఆయనదీ, ఆయన సైన్యానిదే హవా. ఈసారి పార్టీ నేతలది తలోదారి..పిసిసి అధ్యక్షుడు లేకుండా దిగ్గి గాంధిభవన్ సందర్శన, ముఖ్యమంత్రి అసలు లేక్కే చేయలేదు. సీమాంద్ర మంత్రులు తొంగిచూడలేదు.. ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కలికం వేసిచూసినా కనబడలేదు. అనతా చానళ్ళ గందరగోళం మినహా శూన్యం. అంతా డ్రాఫ్ట్ బిల్లు మీదే జరిగిపోయింది..

**అంటే గతంలో బాబుగారు చేసినట్లా!! ఒకటిమాత్రం ఖాయం. మిగిలినోళ్ళ సంగతి తెలీదుకాని "గళంలో గరళం నిపుకోనిదే కలం కదలని మా పాత్రికేయులం" మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తామని జోస్యం చెప్పగలను.  
13-12-13
*నేనొక ఆఫరిస్తా!! ఆలోచించుకో!!~
ఉద్యోగం మానేసి రాజకీయాల్లో చేరి కనీసం ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ అయితే అయిదేళ్ళపాటు పనిలేకుండా ఏకబిగిన సెలవులు..జీతాలు, భత్యాలు, వసతి సౌకర్యం, పర్సెంటేజీలు, కాంట్రాక్టులు, అమ్యామ్యాలు, ఫ్రీ కరెంటు, నీళ్ళు, ఫోన్, ప్రయాణాలు, ఇళ్ళ స్థలాలు, బంగళాలు, కారు లోన్లు... ఇలా ఎన్నెన్నో ఉంటాయి. బాగా ఆలోచించుకో..  బలే మంచి చౌక బేరము.. ఇంకా ఉంది లిస్టు: విదేశీయానాలు, కమిటీల పర్యటనలు, ఖరీదైన స్టార్ హాస్పిటళ్ళలో  పెద్దాపరేషన్లు, జీవిత కాల పెన్షన్లు, పట్టుపరిశ్రమ ఉంటే వారసులకు సీటు,... చివరాఖరిగా పోతే(?) అధికార లాంచనాలతో అంత్యక్రియలు. నియోజకవర్గంలో శిలావిగ్రహం.. కనీసం ఒక చెత్తరోడ్డుకైనా పేరు..

*ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా !! యథా లోక్‌సభా.. తథా అసెంబ్లీ!!  రెండూ సోమవారమే కలుస్తాయి మళ్ళీ వాయిదా పడేందుకు..

*ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు.. శాసన సభాప్రాంగణ రణగొణ విశేషాలు. క్లుప్తంగా:
----------------------------------------------------------------------------------------------------
*గాంధిభవన్లో కండువాలతొ దిగ్గిరాజాకి కార్యకర్తలు, నాయకుల ఊపిరాడని ఆహ్వానం -- జాగ్రత్త అవి మెడకు బిగుసుకునే ప్రమాదముంది.

*మూడేళ్ళపాటు తెలంగాణాపై తీర్మానానికి శాసన సభ స్తభన. ఇప్పుడా సీను మారింది. సమైక్యాంధ్ర తీర్మానానికి సభ స్తంభన. ఫలితం శూన్యమే!

*ప్రొఫెసర్ కోదండరామ్‌ను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాచేసి ఉద్యమంలోకి రావాలని మూడేళ్ళు ఆక్షేపించారు. వారే స్వయాన ఇప్పుడు ఒక ఎంజీవో ను (అశోక్ బాబు) గుమాస్తాను ప్రోత్సహిస్తూ అతని వెనుక నక్కి నాటకాలాడుతున్నారు.

*శాసనసభ, మండలి ప్రాంగణాలు నాతకీయ ఫక్కీ ఏడుపులు, పెడబొబ్బలతో స్మశానాన్ని మరపిస్తున్నాయి. - నిజం, ప్రజాస్వామ్యం పట్టపగలే హతమయింది..

*కేంద్రం అపంపిన ముసాయిదా ఎంత చులకనైంది. ముఖ్యమంత్రే స్వయంగా అవహేళన చేశారు: బిల్లు విమానంలో ఎంత స్పీడుగా వచ్చిందో అంత స్పీడుగా వెనక్కి పంపుదాం. మంగళయాన్‌లా! అది చేరడానికి ఆరునెలలు పడుతుంది.  
శాసన సభ, మండలి వదలి మీడియా పాయింట్లవద్ద గొంతులు  చించుకోవడానికి మంత్రులకు ఏమీ అనిపించడంలేదేమో కాని చూసేందుకే సిగ్గనిపిస్తోంది.

*విభజన బిల్లులో చాలా తప్పులున్నాయట- ముఖ్యమంత్రిగారు చెప్పారు.

*ముసాయీదా బిల్లు నకళ్ళు 390 ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ప్రతులు సిఎస్‌కు చేరాయని నిన్నంతా చానళ్ళు ఒకటే రొద.. ఇవ్వాళేమో భాషాపరమైన సంస్య వచ్చిందని, తెలుగు-ఉర్దూ కాపీలు రాలేదని రచ్చ, రచ్చ. ముందేమో అయిదు బండిళ్ళని హంగామా.. అర్ధరాత్రేమో 8 బండిళ్ళని సవరణలు.. అఘోరించినట్లుంది..
*సభ్యులందరూ మాట్లాడడానికి సభ ఏర్పాటవుతుంది. అంతా గోలగోల తో వాయిదాపై వాయిదా పడుతుంది. అప్పుడు సభ్యులందరూ విడివిడిగా, కలసికట్టుగా చేంబౌకెళ్ళి స్పీకర్‌ను కలుస్తారు. ఇదేమి చోద్యమో!!
*అసెంబ్లీకి వెళ్ళండర్రా అని చెప్పాల్సిన దిగ్గీ రాజా..పనికట్టుఇకుని మరీ వచ్చి సభ్యులను గుంపులుగా విడగొట్టి సమావేశాలనే నీరుగార్చారు.

*మంత్రులు, ఎమ్మెలయేలు ప్రాంతీయమ గావిడిపోయి సమాలోచనలు, వ్యూహ ప్రతివ్యూహాలు. మంత్రివర్గ సహచరులు  ముఖ్యమంత్రిని హెచ్చరించడం విడ్డూరం కదూ. అసలు సభ నడవడం సంగతి అలా ఉంచితే.. అసలు ప్రభుత్వం ఎక్కడున్నది?

*సౌండ్ పొల్యుషన్.. ఇక నుంచి ప్రతీ పార్టీ కి ఒకరే స్పోక్స్ పెర్సన్ ఉంటే బావుంటుంది..వీళ్ళ వాగుడికి చెవుల్లోంచి రక్తం వస్తుంది.
(రాచమళ్ళ పద్మజ వ్యాఖ్యకు నా స్పందన:)
**గంటల తరబడి స్పోకులు పెట్టి పొడుస్తుంటే మరి చెవులనుంచి రక్తపాతమేగా.. స్విచ్ ఆఫ్ చేసుకునే వీలున్న మీరే అలా అనుకుంటే బతుకు మెతుకు కోసం పారిపోయే దారికూడా లేని మాగతి ఏమిటి.. రోజూ..

*బాబు గారు చెప్పింది నాకూ నిజమేననిపిస్తున్నది. తెలంగాణ ముస్సాయిదా బిల్లు పోస్టులో లేటవుతుందనుకుంతే.. ఆ కట్టలన్నింటినీ డిటిడిసి కాని, ఏ ఎన్ ఎల్ కొరియర్ సర్వీసులో పంపితే పోయేది కదా! తొందరేముంది, సి ఎం ఇప్పుడే ఏమీ తేల్చరు కదా! "టి" తయారీకి ఇదొక అదనపు ఖర్చు..  రాష్ట్రం అసలే ఆర్థికంగా  క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.

*గంట మోగించాడు. పార్టీ ఫిరాయింపుకోసం. నేచెప్పానా.. మంత్రులు, మాజీలు, తాజాలు, ఎంపీలు జగన్ శిబిరంలోకి క్యూ కడతారని.
మొదట్లోనే వై ఎస్ వివేకానంద, ఆ తరువాత వరుస..ఒక మోపిదేవి, అ-ధర్మాన, ఒక ఘంటా, (ఆయన వెంట మరో అరడజనంట..)చీమ మంత్రులు ఎలాగూ చక్కెరదగ్గరకేగా.. అతీత శక్తి రంగప్రవేశం. ఇక చూడండి..
జండా మార్చిన మెగా నాయకుడు కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి.. భృత్యుగణమేమో వైఎస్సార్సిపి.. ఒటేసిన జనమేమో గంగలోకి.. ఇది మన రాష్ట్ర రాజకీయ విలువ..
ఖైదీకన్నయ్య సినిమాలో ఒక పాటుంది: కొట్టిన చెయ్యే కోరు..
దాన్ని మనం ఇలా పాడదాం: తిట్టిన నోరే పొగుడు..

*Be good at heart. It purifies blood. Faith flows in it. It gives good health.. Health is WEALTH.

*ఎక్కువ మంది వద్దనుకున్నా (నోటా)తక్కువ ఓట్లు వచ్చినోడే  మనకు నచ్చినోడు అవుతాడు.. వాడు ఎంత సచ్చినోడైనా సరే!! .

*ఇది ఇంటింటి భాగోతం:
---------------------------
మనం ఆరోగ్యంగా ఉన్నా మన వాళ్ళ తృప్తికోసం కొంత పెనాలిటీ చెల్లించుకోక తప్పదు. ఇంట్లో వాళ్ళ భయం నివృత్తిచేయడానికి డాక్టరు దగ్గరకు వెళతాం. వాళ్ళ సమక్షంలో మరింత భయం పెంచుతూ (తన ఫీజు మాడరేట్ గా..250రూపాయలు పిండి) కనీసం ఓ అరడజను పరీక్షలు రాస్తాడా పెద్ద మనిషి.
ఇక తప్పదు డయాగ్నోసిస్ లేబోరేటరీకి. అక్కడ అధమం 2 వేల రూపాయలు "హుండి"లో సమర్పించు కోవాలి. పరీక్షలన్నీ అయిపోతయ్. "అంతా నార్మల్" అని తేలుస్తారు. మళ్ళీ ఆ కాగితాలు పుచ్చుకుని డాక్టరు దగ్గరికెళితే.. అన్నీ అటూ ఇటూ చూసి, "యు ఆర్ ఆల్ రైట్. నథింగ్ సీరియస్. వయసు పైబడింది కదా.. సీజనూ మారింది, దాని ఎఫెక్ట్. కాని ముందు జాగ్రత్తగా ఈ మందులు కనీసం మూడు నెలలు వాడండి. ఆశ్రద్ధ చేయద్దు" అని సూక్తిముక్తావళి వినిపించి ఒక జాబితా చేతిలో పెడతాడు.. మళ్ళీ ఫీసు వసూలు షరా మామూలే.
ఆ మందులకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు."నే చెబితే విన్నారా? నాకు ఏమీలేదంటే, మూడువేల రూపాయలు ఆముదం" అని మనం అంటాం. "పోతే పొయింది వెధవ డబ్బు, మీ కంటే ఎక్కువా? ఏమీ లేదని తేలింది, అది చాలు", అని వాళ్ళు సంతోషిస్తారు.. ఇది ప్రతి ఇంటా భాగోతమే.. నాకు నిన్న, మొన్నట్లో ఇలా 3 వేల రూపాయలు చిలుమొదిలింది. నా భార్య, కూతురు మాత్రం హ్యాపీగా ఉన్నారు.

12-12-13
*దిగ్గి సూట్ కేస్ తెచ్చాడా? తీసుకెళతాడా? డిల్లీలో వాళ్ళకి, ఇక్కడివాళ్ళకు మంచిగా నిద్రవస్తుంది. ఎటూ నిద్ర రానిది, పోనీయంది తెలుగు చానళ్ళే.. ఈ మధ్య రాష్ట్రంలో కనబడకుండా పోయిన ఒక గొప్ప సోల్ సాక్షాత్కారమైంది ఇవ్వాళ దిగ్గీ తో!!

*విలేఖరులకు ఏదైనా గ్లోబల్ ప్రైజు పెడితే అది తప్పకుండా హైదరాబాద్ టిడిపి బీట్ విలేఖరులకే ఇవ్వాలి.  నాకు తెలిసి, నేను చూసినంతవరకు.. టీవీ చానళ్ళలో రోజూ లైవ్ లో కనబడడం, గంతలతరబడి విలేఖరులను వాయించడం - మహా శక్తిమంతుడైన చంద్రబాబు గారికే సాధ్యమైంది. టిడిపి బీట్ విలేఖరుల  బ్రెయిన్  తాటలు ఎప్పుడో ఊడిపోయాయి. జర్నలిస్టులకు అందుకేనేమో ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టారు..

*తెలంగాణా డ్రాఫ్ట్ బిల్లు పై ఉదయం నుంచి తెలుగు చానళ్ళు ఇష్టా రాజ్యంగా చెప్పుకుంటూ వచ్చాయి. నిజానికి బిల్లు ప్రతి సచివాలయానికి చెరింది(6.30 నిమిషాలు-సాయంత్రం) అరగంట కాలెదు. అయిదు బండిళ్ళలో బిల్లు అన్నారు. బండిళ్ళు లెక్కబెడితే ఎనిమిది ఉన్నాయి.. ఎవరి వార్తలు వారి ఇష్టారాజ్యం..వాస్తవాలకు రంగు పులుముతున్నాయి..

*ఆర్నెల్లలో ఎన్నికలొస్తున్నాయ్.. నాయకులు గోడలు దూకడం, రంగులు మార్చడం, కులాల మీటింగులు, రిజర్వేషన్లు, ఉద్యోగ సంఘాల బెదరింపులు, భజన మండళ్ళు అన్నీ షరా మామూలే. విశ్లేష"కుల" సమావేశాలు, కొత్త పత్రికలు పెట్టడం, చిన్న చానళ్ళు పుట్టడం, సీట్లకోసం ఎన్ని పాట్లో!!  వినోద భరితమే కాదు ఆదాయ మార్గం కూడా..  

* మండేలా మరణం ఏ పి అసెంబ్లీకి ఒక పూట ప్రాణం పోసింది..సభ గంభీరంగా సాగింది. పాపం ఆయనెవరో అసలు తెలీని వారుకూడా కక్షలు లేకుండా కలసికట్టుగా అంతా (రాసుకొచ్చిన)(రాసిపెట్టిన) నివాళులర్పించారు...

Tuesday 10 December 2013

          ఉత్తరాదిన ఊడ్చేసింది. కాంగ్రెస్ ఏడ్చేసింది. 

                            ఎన్నికల్లో తేలాయి వా(రా)తలు..  
_______________________________
9-12-13

*మంత్రిపదవి లేక నాలుగున్నరేళ్ళుగా Joker Carduku సంధి ప్రేలాపనలు తగ్గలేదు. సీక్వెన్స్ కాకపోయినా పరవాలేదనుకుని రోశయ్య, కిరణ్ కూడా రాజశేఖరరెడ్డి డిస్కార్డ్ చేసిన జోకరు ముక్కను ఎత్తుకోలేదు. పారేసిన జోకరు చుట్టూ ప్రతిరోజూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలమ వద్ద భుజకీర్తుల్లాంటి లంబు-జంబు వీర విలేఖరులు.. పాతికమందికి పైగా రెండుగంటల అకాలక్షేపం.. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఇంకొంచెం లెవెల్..

*Social media.. Facebook, twitter.. etc are much ahead of print and electronic media in many aspects. Opinions, comments, analysis, observations, jokes and many incidents first appear on social media. After 8 hours or next day we come across the same in print/ electronic media with some modifications. Basing on FB/Twitter many stories have been taking new shape. Social media has become very powerful and fast nowadays.

*ఏంత మొగోడైనా అంతా మూటగట్టలేడు.. రేపు మన రాష్ట్రంలో నైనా 294/42 గంపగుత్తగ ఎత్తుకుంటాడా ఎవరైనా?  
 *ఎర్రకోట వద్ద "బంగారు చీపురు" చిహ్నం ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంటుందంటారు? ఊడవడం డిల్లీ నుంచే మొదలిడదాం..
*ఉత్తరాదిన జనం వార్-షిప్.. దక్షిణాదిన వర్‌షిప్.. అదీ తేడా!!
ఇక్కడ జీరో హీరో అవుతాడు. అక్కడ హీరో జీరో అవుతాడు..

*తాము మునిగితేకానీ లోతు తెలీదు. తాను చేస్తే సంసారం.. ఎదువాడిది వ్యభిచారం.. ఇదీ మన రాజకీయం.  

*ఈ రోజు యాంటీ కరప్షన్ డే!  ఈ శుభసందర్భాన మనం "అవినీతి శ్రీ", "అవినీతి భూషణ్", "అవినీతి విభూషణ్", "అవినీతిరత్న", "అవినీతి చక్ర", అవినీతి వీర చక్ర" అవార్డుల ప్రారంభానికి శ్రీకారం చుట్టవచ్చునేమో! కాంపిటిషన్ హెవీగా ఉంటుంది. జడ్జీలే కరప్టయ్యే ప్రమాదం మెండు.. అమ్మో వద్దు లేండి. ఈ దేశం, ప్రజలు మనలను క్షమించరు. ఊరుకోరు, ఉరేస్తారు..

*దేవుళ్ళకు గుడికడతారు.. ఉన్నోళ్ళకు సమాధి కడతారు.. అర్ధ శతాబ్దం కిండతే ఉంది పరిషత్ బహుమతి పొందిన ఒక నాటకం..
"సమాధి కడుతున్నాం చందాలివ్వండి".

*ఉత్తరాదిన అవినీతిని చీల్చి చెండాడారు. మనం అవినీతికి పట్టం కట్టడానికి అంగలార్చుకుంటాం. పైసా మే పరమాత్మా..ఏడాదిలో ఏరోజొచ్చినా, ప్రతిరోజొచ్చినా ఎగబడతాం. మనం విగ్రహారాధ-కులం.

*ప్రతి అడ్డమైన వాడూ పార్తీ పెడతాదు మన దగ్గర. అడ్డమైన సంపాదనతో ఆర్జించిన సొమ్మున్న ఘనులం కదా!!

*ఎన్టీఆర్ ను దేవుడన్నారు, బాబుకు భజన చేశారు, వైఎస్సార్ కు వీర విధేయత చూపారు, రోశయ్యను ఆకాశానికెత్తారు, కిరణ్ కు కీర్తించారు... పదవి పోగానే పేడనీళ్ళు జల్లుతారు.. మీడియా అయినా, మేలగాళ్ళయినా!!

*ఏం పాపం చేసుకున్నాడో మహాత్మా గాంధి. ఇంకా ఆ కుటుంబం వెనుక తోకలా మిగిలాడు..

*కేజ్రీవాలా ప్రభంజనం, చెరిగేసింది. పీఅర్పి చిరుగాలి, చెదిరిపోయింది  nu

8-12-13
*ఒక ఘటం పగిలింది. ఒక కాష్టం కాలింది. ఒక ఘట్టం ముగిసింది..సరే!! అర్నెల్లల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ ఓట్ల పం(మం)ట. రాబోయే కాలానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరో?

*మనది లోకుల సత్తా-లోకల్ సత్తా.. లోక్ సత్తా కాలేకపోయింది..అదీ తేడా!!
*మోడీ - ఆడు మగాడ్రా..బాబూ!!

*నే చెప్పానా! మన ఐరన్ లెగ్గులు డిల్లీలో కాలు పెట్టగానే కాంగ్రెస్ నుగ్గు నుగ్గు.. బొగ్గు బొగ్గు.. పాపం ముమ్మారు ముఖ్యమంత్రికి మనవాళ్ళు వెళ్ళి ముసుగేశారు... షీలా డీలా పడింది.

*"Mahatma Gandhi and Sardar Patel are said to have held the view that the INC was formed only for achieving independence and should have been disbanded in 1947."-- Their long cherished wish was fulfilled by none other than members of Nehru family after 67 years.. Hurrae...

*The Nava Telangana Party headed by former minister Devender Goud was merged with the Praja rajyam Party much earlier to 2009 general elections. Subsequent to the great defewat of PRP, Goud had become the second rated leader in TDP(joined his good ole partyTDP). PRP founded by actor turned politician Chiranjivi  merged with the Indian National Congress on 20 August 2011. All the 18 PRP MLAs joined Congress. Does any one need more description than this?

*Congress once for all wiped out.. The vote did not simply go against Congress, but against corruption. Where is YUVARAJA? the hope of the Congress? future PM of India?

*centenary party reached cemetery..pay tributes..

*Indian National Congress was founded on December 28, 1885 (127 years ago) not 1863. Founded in 1885 by members of the occultist movement Theosophical Society—Allan Octavian Hume, Dadabhai Naoroji, Dinshaw Wacha, Womesh Chandra Bonnerjee, Surendranath Banerjee, Monomohun Ghose, Mahadev Govind Ranade and William Wedderburn. Nehru family was no where...

7-12-13

* అభిమాన హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత.------నాలుగేళ్ళ కిందట వరకు ధర్మవరపు తరచూ కాంగ్రెస్ లెగిస్లేచర్ పార్టీ కార్యాలయం వస్తూ పాత్రికేయులందరితో ఎంతో ఉల్లాసంగా గడిపే వారు. వైఎస్సార్ ఉన్నంతవరకు పార్టీ ఎన్నికలప్పుడు ప్రచార (సాంస్కృతిక కార్యక్రమాలకు సారధ్యం వహించేవారు. సౌమ్యుడు. ఎప్పుడూ రాజకీయాలు ప్రస్తావించేవారు కారు. విలక్షణమైన సలక్షణ హాస్యనటుడు. చిన్నతనంలో పోయారు. ఈమధ్య నటులు కాలం చేస్తున్నారు..విచారకరం!! పన్నీరు కురిపించిన హాస్యం కన్నీరు పెడుతున్నది.

*మన్మోహన్ మౌనమోహనుడని అంటారు అందరూ పాపం. ఆయన పెదవి విప్పితే సత్యాలు ప్రవహిస్తాయి. చూడండి నిన్న ఎన్ని నిజాలు చెప్పారో! పి వి వలననే సంస్కరణలన్నారు. దేశ ఆర్ధిక ప్రగతికి, ప్రపంచంలో పోటీకి నిలబడడానికి ఆయనే మూల పురుషుడని ప్రస్తుతించారు. పివి నరసింహారావును పొగడడం సోనియాకు ఆగ్రహం కలిగిస్తుందని తెలిసీ వెనుకడుగు వేయలేదు.  మోడీని తక్కువ అంచనా వేయడం లేదన్నారు.. బిజెపి సామర్థ్యాన్ని చెప్పారు. మన్మోహన్ రాజకీయవేత్త కాదు. ఆర్థిక నిపుణుడు. ఆయన నీడన కాంగ్రెస్ పదేళ్ళు బతికి చివరకు ఆయనకు మసి, మరక అంటించింది..  

*భర్తలు పోతే అసెంబ్లీకి వచ్చే భార్యలు కొందరైతే.. తండ్రులు పోతే అసెంబ్లీకి, పార్లమెంటుకు, పదవులకు ఎగబాకే కొడుకులు కొందరు.. అదృష్ట రేఖ అలా రాసిఉంటుంది కొందరి ముఖాన..ఏం చేస్తాం!

*ఇంట తిని వాసాలు లెక్కించడమంటే అంతే మరి.. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి. సేల్డ్ కవరోళ్ళకు కూడాబోల్డు మాటలు..

*చానళ్ళు రాజీనామాలు చేయిస్తునే ఉంటాయి.. కానీ వాళ్ళు చెయ్యిస్తునే ఉంటారు ప్రతిసారి..

6-12-2013
*

*అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామ దగ్గరా? మీడియా రంగులు నేను ముందటనుంచి చెబుతున్నాను. ఆ తానులో ముక్కనే కనుక నాకు తెలుసు..కలాలకు, గళాలకు కులాల జాడ్యం. ఇది తెలుగు "సంపాదకుల" కాలం.

*రాజధాని వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ.. పత్రికల విస్తరణ. గతంలో పత్రిక ప్రధాన కార్యాలయాలు కేందీకృతమై ఉన్నప్పుడు ప్రచురణ, సిబ్బంది ఎంపిక ఎంత వ్యవ ప్రయాసలుండేవి. మారుమూల ప్రాంతాలనుంచి వార్త్లలే కార్యాలయాలకు రోజుల తరువాత చేరేవి. పత్రికలు సకాలంలో పాఠకుల చేతికి వేళ్ళేవికావు. ఇవ్వాల్టి పత్రిక మరుసటిరొజు కు చేరేవి. మరి శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో నేడు జిల్లాకొక పత్రికా కార్యాలయం. ప్రతి మండలంలో కంపొయూటర్కేంద్రాలు శాఖలు, ప్రధాన కార్యాలయలతో అనుసంధానం. గతంలో దూరదర్శన్ ఒక్కటె గతి. ఇప్పుడు ఓబి వ్యాన్లతో ప్రతి జిల్లాలో టీవీ చానళ్ళు. డిల్లీలో అర్ధరాత్రి సంఘటనలు మరుక్షణంలో వీక్షకులకు.. హైదరాబాద్లో ఉన్నా, డిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా పిఎం, సిఎంలు వీడియో, టెలి కాన్ఫరెన్సుల్లో అధికారులు, సచివులతో సంభాషించి పాలనా నిర్ణయాలు తీసుకోవడం లేదా? మరప్పుడు వేర్వేరు  రాజధానులకు సమస్యేముంటుంది.  విజ్ఞులు అలోచించాలి. సమస్య పరిష్కారం కావాలి. కొత్త సమస్య ఉత్పన్నం కాకూడదు. అది తెలంగాణ అయినా.. సీమాంధ్ర అయినా!!

*ఎక్కడైనా మొత్తం వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ఢి సమతుల్యంలో సాగుతుంది. సచివాలయం, శాసనసభ, పోలీసు ప్రధాన కార్యాలయం, ఉన్నత న్యాయస్థానం వేర్వేరు కేంద్రాలలో నెలకొల్పితే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. ఎక్కడికక్కడ విద్యా రాజధాని, వైద్య రాజధాని, పరిశోధనా రాజధాని, పారిశ్రామిక రాజధాని, రాజకీయ రాజధాని, ఆర్ధిక రాజధాని, న్యాయసేవా రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధానులు ఏర్పడితే అందరికీ అవకాశాలు అందివస్తాయి. జనాభా వికేంద్రీకృతమై వివిధ కాలుష్యాలు, కార్పణ్యాలు, వైషమ్యాలు పెరగకుండా నివారించ వచ్చు. పాలనా సౌలభ్యం కలుగుతుంది.. సమాచార, సాంకేతిక విస్తరణ విప్లంతో ప్రపంచమే ఒక గ్రామమైనప్పుడు నిర్వహణ ఏదీ అసాధ్యం కాదు..విభేదాలు, విమర్శలు విస్మరించాలి అందరూ!! ఈ సూత్రం దేశానికీ వర్తిస్తుంది..జాతీయతా భావం ఏర్పడుతుంది..

5-12-13

*మళ్ళీ శుక్రవారం సీమాంధ్ర బందట.. దేనికి? రెండున్నర నెలలు చేయించారు ఆందోళనలు. ఫలితమేమిటి? నష్టపోయిందెవరు? ఇంకా శని వదలలేదు పాపం వాళ్ళను..

*వరల్డ్ బ్యాంక్ కావూరి కన్‌స్ట్రక్షన్ కంపనీని 11 ఏళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టేసరికి.. మాటలు, అడుగులు తడబడుతున్నాయ్. విభజన అయింది. ఇక అమ్మ భజనే మిగిలింది..

*అభిమానం, ఆత్మగౌరవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి  పదవికి రాజీనామ చేసి పరువు నిలబెట్టుకోవాలి. ఆంధ్రుల గౌరవానికి భంగం కలిగినా ఇంకా ఇలాగే పదవిలో ఉంటారా. సి ఎం పదవి రాష్ట్ర శ్రేయస్సుకు మించినదికాదని, ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రయోజనంకోసం అవసరమైతే పదవిని వదులుకుంటానని చెప్పినమాటలు గుర్తుంచుకోవాలి. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల పరిరక్షణ పదేళ్ళపాటు గవర్నరుకు కేంద్రం ధారాదత్తం చేసింది. అంతే సి ఎం పదవిలో, అధికారంలో కోత పెట్టింది. శాంతి భద్రతల నిర్వహణ అధికారం సిఎం చెయ్యి జారిపోయింది.
కొత్త రాజధాని 45 రోజుల్లో నిపుణుల కమిటీ తేలుస్తుందట. అంతే కొత్త రాజధాని కొసం ఒకే సీమలోని ప్రజలమధ్య చిచ్చు లేస్తుందన్నమాట. రాజధాని మాకంటేమాకని రగడ మొదలవుతుంది. మళ్ళీ జగడపాటి, రాయపాటిలు, కావూరి   తలెత్తుతారు. రాయల తెలంగాన జెసి దివాకర్కు నష్టం ఏమీ ఉందదు. ఆయన బస్సులు 29వ రాష్ట్రానికి విస్తరించినట్లే.. ఆయనది రాజకీయ రవాణా వ్యవస్థ కదా!!

*నాయకులను కాదు.. వ్యర్ధ వ్యాఖ్యల తెలుగు టీవీ విశ్లేషకులను నిందించండి. మహా మేధావులులాగా నాటకాలాడి ప్రజలను తప్పుతోవ పట్టించి పబ్బం గడుపుకున్నారు.  మేతగాళ్ళైన రాతగాళ్ళని, కూతగాళ్ళను నిలదీయండి.  

*రాయల టి ఒక నాటకం మాత్రమే.. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల విశ్వామిత్ర సృష్టికి మీడియా రంగులు పూసింది.

*కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారా నిజంగా, ఇదికూడా ఆర్నెల్లుగా సాగుతున్న కథగా మిగులుతుందా? టిజి వెంకటేశ్ చెబుతున్నారు పాపం. కె సి ఆర్ ఉందగా తెలంగాణ రాదని. మీరు ఉండగా రాష్ట్రం విడిపోదని చెప్పలేకపోతున్నారే.  ఏరీకోతలుకోసిన కోస్తామంత్రులు. డిల్లీలోప్యాకేజీలకోసం మీటింగులు పెట్టుకున్న సీమాంధ్ర ఎంపీలు అడ్రసు గల్లంతయ్యారే! సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ తో పాటు ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేసి పర్యాట్కంలో మునిగితెలుతున్న కేంద్రమంత్రి "చిరు"నామా ఎక్కద. నిజంగా ప్రజలు, రాష్ట్రం మీద అభిమానమున్న నేతలు తక్షణం పదవులు వొదిలి ప్రజల్లోకి వెళ్ళండి. కాదంటే మళ్ళీ మూకుమ్మడిగా "గోడ" దూకి మరో జండాపట్టుకుని, అజెండా మార్చుకోండి.  పాపం తెలుగు చానళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక్కరూ పదవిని వదలదంలేదు.. 25 పేజీల జిఓఎం నోట్, 6 పేజీల క్యాబినెట్ నోట్, 70 పేజీల డ్రాఫ్ట్ బిల్ల్ క్యాబినెట్నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నాయి.

*రాష్ట్రం విడిపోకపోతే, హైదరాబాద్ యుటి అయితే, టి బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రాకపోతే, అసెంబ్లీలొ బిల్లు ఓదిపోతే.. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ళముందు అకస్మాత్తుగా పోలీసు భద్రత ఎందుకు పెంచినట్లు. జిల్లాల్లో కవాతులు ఎందుకు నిర్వహిస్తున్నట్లు. ప్రజాప్రతినిధులు ప్రజా ప్రతిఘటన అనుమానిస్తున్నారా? లగడపాటి ఎప్పుడు సన్యాసానికి ముహుర్తం ఎప్పుడు పెట్టుకున్నారో?

*సాయంత్రం నుంచి తెలుగు చానళ్ళు గొంతులు చించుకుంటున్నాయి. దింపుడుకళ్ళెం ఆశ లా 12 జిల్లాల తెలంగాణా, యుటి పై ఒకటే రొద. డిల్లీలో చలిలో, చీకట్లో చానల్ రిపోర్టర్ల బాధలు చూస్తుంటే జాలి వేస్తున్నది.. నంగినంగిగా, మాటలు మింగుతూ, లింకులు తెగి ఎన్ని వ్యాఖ్యలు.. ఎన్నెన్ని జ్యొతిషాలో! ఇంకా పైత్యపు మాటలు తగ్గలేదు. హైదరాబాద్ యుటికి అంగీకరించకపోతే సీమ కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి రాజీనామాలంటూ కొత్త మంట పెడుతున్నారు.

*విశ్వకవీంద్రుడు రవీంద్రుని గీతాంజలిలో విస్తృతంగా జనప్రియమైన రచన
-------------------------------------------------------------------------------------
ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-
ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు

Thursday 5 December 2013


                     కసరత్తులు - చురకత్తులు
                     ------------------------------                  

                          (పది రోజుల రాజకీయ కోలాహలం) 


5-11-13
*మనలో మార్పు రానంత వరకు ఈ అవినీతి, బంధుప్రీతి, కుళ్ళు రాజకీయాలు అంతే...పార్టీ భజనలు, వ్యక్తి ఆరాధనలు, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం, సబ్సిడీలకు, ఉచితాలకు తలవంచడం, కులాభిమానాలు మానేసి అభ్యర్ధి నిజాయితీ, అర్హతలు, నైతిక ఋజువర్తన ప్రాతిపదిక పై ఎన్నుకుంటే మనకు కావాలిస్న ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రచార సాధనాల మాయకు గురైతే ఇంతే సంగతులు.. మార్పు కోరాలి..ఉత్తరాది నాలుగు రాష్ట్రాల మాదిరి చరిత్ర తిరగరాయాలి..
*ప్రతిపాదనలు, ఉపసంహరణలు, రహస్య చర్చలు, సంప్రదింపుల గురించి మనం చదివేదీ, వినేదీ అన్నీ అర్ధ సత్యాలే! అని గమనించాలి. మీడియా పనికట్టుకుని ఒకటి రాస్తుంది. దానిపై టీవీలు చర్చలు నిర్వహిస్తాయి, టీవీ కొత్త కథనం వినిపిస్తుంది. వాటిపై పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాస్తాయి. అనీ వింటాం, చదువుతాం బుర్రలు బద్దలు కోట్టుకుంటాం. గందరగోలం.. ఇద్నతా రాజకీయంతో పాత్రికేయం చేతులు కలపడం. పెద్ద నాటకం. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడంలో ఇవన్నీ భాగాలు..

4-12-13
*ఏపి కాంగ్రెస్‌ది అయిరన్ లెగ్.. గతంలో గుజరాత్ ఎన్నికల పరిశీలకుడుగా మన పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్ళారు. అంతే కాంగ్రెస్ మటాష్.. ఇప్పుడూ అంతే.. మన మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు డిల్లీ పరిశీలకుడుగా కాలు పెట్టారు. షీలా దీక్షిత్.. ఫట్..
నీతి:: దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ ను ఓడించాలంటే మన నాయకులను అబ్జర్వర్లుగా పంపాలి- గుజ్జు గుజ్జవుతుంది. అది ప్రధాన సూత్రం..
*ఒక పత్రికాధిపై "నిర్భయ" చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆఘనత మన రాష్ట్రానికే దక్కింది. వార్త సిఎండి, కాంగ్రెస్ మాజీ ఎంపి, నెలలతరబడి జీతాలివ్వని యజమాని గిరిష్‌సంఘి సికిందరాబద్ కంటోన్మేంట్ సి ఇ ఓ సుజాత అనే మహిళాధికారిని అసభ్యంగా దూషించిన ఫిర్యాదుపై బేగంపేట పోలీసులు కేసు కట్తారు. పోలీసు అనుమతిలేకుండా ప్రదర్శననిర్వహించి చట్టాన్ని ఉల్లంఘించిన కేసు కూడా నమోదయింది. కొడుకు పెళ్ళి సాకుతో హైకోర్టులో ఆ మహానుభావుడు యాంటిసిపేటరీ బైల్ పొండాడు. ఈ మహానుభావుడిపై సొంత అన్నదమ్ములే క్రిమిన కేసులి పెట్తారు.ఇదీ మన తెలుగు పత్రికా ప్రపంచపు గొప్పతనం. బ్లాక్ మెయిలర్లు, ఫొర్జరీగాళ్ళు, కబ్జాగాళ్ళు..పత్రికాధిపతులు..
*ఉత్తరాదిన కాంగ్రెస్ చెయ్యి విరిగింది అయిదు వేళ్లలో చిటికెన వేలు మాత్రం మిగులుతున్నది.. చేతికి తరు"వాత" అక్షరక్రమలో అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్.. దాంతో దక్షిణాదిన హస్తం మాయం.. ఇక అంతా అస్తవ్యస్తమే!! మోడీతో ఢీనా? మాడు పగుల్తుంది..
*
3-12-13
*విడిపోతున్న తెలంగాణాను ఫెవికాల్ పెట్టి అతికించ ప్రయత్నించినట్లు..
*ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుండి 12 మంది సమైక్య సీమాంధ్ర నేతలు పరారీనా? అదెట్లు జరిగె?
*poli-trics degenerating..

2-12-13
*డిసెంబరు 9 మరొక భయంకర తుపాను.. దానికి "సోనియా" అని పేరెడతారు. పది జిల్లాలు ఒక వైపు- 13 జిల్లాలు మరో వైపు కొట్టుకుపోతాయ్!!

29-11-13
*సమైక్య రాష్ట్రం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం..అందరూ అలసి, సొలసి ఆయాస పడిపోయారు. సమైక్య రాష్ట్రం కోసం డిల్లీ ప్రయాణాలు, యాత్రలు, దీక్షలు, రచ్చబండ పగుళ్ళు, వస్తున్నా నడకలు, శంఖారావాలు, భీషన ప్రతిజ్ఞలు...లైలా, హెలెన్, లెహెర్.. అన్నీ తుపానులే. మొత్తం తుడిచేసింది.. రాష్ట్రాన్ని కడిగేసింది. తేదీలు కూడా ఫిక్స్ అయ్యాయి తెలంగాణపై. ఇప్పుడేమంటారు మన పీతల నేతలు? మన పనిలేని మంత్రులు ఏమిచేస్తున్నారు?  సోనియా, రాహుల్, మన్మోహన్, అహ్మద్‌పటేల్, గులాంనబీ, మొయిలీ, దిగ్గిభయ్యా, షిండే, జైరాం.... అందరూ దివంగత రాజశేఖరరెడ్డికి ప్రీతిపాత్రులు. ఆంతరంగికులు.. అందరూ అయిదేళ్ళు ఒకరి మనసొకరు ఎరిగి నడుచుకున్నారు. ఒకరినొకరు కీర్తించుకున్నారు. మరి వీరందరూ ప్రత్యేక తెలంగాణాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? దీని వెనుక మతలబేమిటి? వైఎస్సార్ గురించి ఆప్తులు, ఆత్మీయులు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడరేమిటి? అంతా సైలెన్స్. లైట్స్ ఆఫ్. ప్యాకేజీలతో ప్యాక్-అప్!!!

*తెహెల్కా సిబ్బంది కానీ, భారత్ యావత్తులో ఒక్క జర్నలిస్టు కానీ, ఒక్కరూ పాపం తేజ్ పాల్ కు మద్దతుగా నిలవలేదు ఎందుకో? పత్రిక నోరు నొక్కేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛని కాల రాస్తున్నారని ఎవ్వరూ ఉద్యమాలు లేవనెత్తలేదు. చివరకు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమాచౌదురి, తెహెల్కా ఫౌండేషన్ నుంచి అరుణా రాయ్ కూడా తప్పుకున్నారు..
ఇదంతా సరే, కొన్నాళ్ళయిన తరువాత కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.. తేజ్ పాల్ కు ఇతరత్రా భాగస్వాములెవరో??
(మరి మీడియాల్లో అలాంటి "తేజ్ పాల్స్" ఎందరు ఉన్నారో?)

*మొత్తం వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ఢి  సమతుల్యంలో సాగుతుంది. సచివాలయం, శాసనసభ, పోలీసు ప్రధాన కార్యాలయం, ఉన్నత న్యాయస్థానం, పరిశ్రమలు, విద్యా, వైద్యాలను వేర్వేరు కేంద్రాలలో నెలకొల్పితే  భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. రాజకీయ రాజధాని, ఆర్ధిక రాజధాని, న్యాయసేవా రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, పర్యాటక రాజధానులుగా ఏర్పడితే అందరికీ ఆని అవకాశాలు అందివస్తాయి. సమాచార, సాంకేతిక విస్తరణ విప్లంతో ప్రపంచమే ఒక గ్రామమైనప్పుడు నిర్వహణ ఏదీ అసాధ్యం కాదు..విభేదాలు, విమర్శలు మానుకోవాలి అందరూ!!
*నాకెన్ని గుర్తింపుకార్డులున్నాయో!!!. ప్రతి పనిలో ఒకటి. ప్రతి పనికి వేరొకటి.. ఈ దేశంలో ఇన్ని అవసరమా? మనిషి ఆజన్మాంతం అన్నింటికీ ఉపయోగపడే ఒకే కార్డును మనం రూపొందిచుకోలేమా!!! (మాధవి ఆధార్‌కార్డ్ కథనం స్ఫూర్తి తో..)
[ఐ డి కార్డ్స్ ను ఆన్ లైన్ నేరస్తులు హాక్‌చేసి దుర్వినియోగం చేస్తారన్న ప్రభాకర్‌రావు గారి హెచ్చరికపూరిత సలహాతో ఫొటో డిలీట్ చేశాను..] --అయితే ఆధార్, ఆరోగ్యశ్రీ,, రేషన్, ధన్వంతరి ఫౌండేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆర్గనైజషన్, అక్రెడిటేషన్, ఓటర్ ఐడెంటిటీ, ఇన్సూరెన్స్, అసెంబ్లీ మీడియా ఐడెంటిటీ, రైల్వే ఐడి, బ్యాంక్, హౌజింగ్ సొసైటీ, ప్రెస్‌క్లబ్, పాస్‌పోర్ట్...వగైరా కార్డులున్నయ్ ప్రస్తుతానికి..
28-11-13

*ఫ్రతిపక్షం: కాంగ్రెస్ కు చీము, నెత్తురు, సిగ్గు., లజ్జ, అభిమానం ఉంటే వరల్డ్ బ్యాంక్ నిషేధించిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ ఓనర్ కావూరిని వెంటనే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించాలి..
ఏఐసిసి అధికార ప్రతినిథి: చాల్, చాల్లే పోవోయ్! అలా అయితే మా కాంగ్రెస్‌లో ఒక్కరూ మిగలరు, దుకాణం మూసుకోవలసిందే తెలుసా??

27-11-13

*చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లు..
అని మనం చదువుకున్నాం...
మహానుభావులు నడయాడిన పవిత్ర ప్రజాస్వామ్య ఆలయంలో(శాసన సభ ప్రాంగణంలో) తాచులు,పింజరులు, కట్లపాములు తలదాచుకుంటున్నాయ్!!  

26-11-13

*ఎన్టీ రామారావు మినహా ఎవ్వరూ రెండు సార్లు మించి ముఖ్య మంత్రిపదవిలో కొనసాగలేదు. కేవలం బ్రహ్మానంద రెడ్డి, చంద్రబాబు మాత్రమే వరుసగా ముఖ్యమంతిగా ఏడు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్నారు..ఏకబిగిన పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగిన ఘనత "ఒకే ఒక్కడు" చంద్రబాబు కు దక్కింది.. 57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో నలుగురు తెలంగాణ నేతలు మొత్తం తొమ్మిదేళ్ళ అయిదు నెలల కాలం మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

25-11-13

*ఇవ్వాళ మన మూడేళ్ల ముఖ్యమంత్రి గారు తేల్చేశారు::
"సమైక్యమా- కాంగ్రెస్ పార్టీనా? అని తేల్చుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిద్దాం".
వెంటనే మరో మాట కూడా: "రాజకీయ లబ్దికోసం ఏ పార్టీ లోనైనా కలవొచ్చు. దాన్ని ఆమోదిస్తాం".
ఆ పార్టీ పేరుకూడా చేబితే ఆంధ్ర ప్రజలు ధన్యులయ్యే వారు కదండీ....
కాంగ్రెస్సాయన తిరిగి ఏ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటాడో!!!

Monday 25 November 2013

వారంలో గరం మసాలా!! వేడి, వేడి వ్యాఖ్యలు    

[weekly summary of political comments]
24-11-13
*Press Club, Hyderabad elections could have not been conducted in such a decent, dignified and disciplinary manner without the co-operation of each and every member. Mr Bhandaru Srinivas Rao, Returning Officer has set a record in the history of Press Club by utilizing all the available and advanced technology to inform each and every thing minute by minute. Another land mark in the history of Press club was announcing results of five office bearers and six EC members within two hours after completion of polling. Total transparency was maintained in such a manner without giving any scope to raise even a single objection by contestants/agents/members. Election staff from the Cooperative department had done excellent job in conducting the poll, making arrangements, counting votes and announcing results. I am happy for associating with Mr Bhandaru for all these seven days (from the date of commencement of filing nominations and to declaring results).

*So called wise, educated, intellectuals and watchdogs of the society (members of the Press Club, Hyderabad ), who opposed the EVMs are going to elect their office bearers and EC members today(Sunday). Polling - from 11.30 am to 6 pm.

23-11-13

*డంబు, చెంబు, అని తేలిగ్గా తీసెయ్యకండి.. ప్రతి ఇంటికి అది అవసరం.. చెబుకోసం చాలా ఏళ్ళు ఎగబడిన జనాలు కోకొల్లలు..
అసలు ఒక పద్యం ఉంది.. "చిన్న చెంబుతో నీళ్ళు శీకాయ ఉదకంబు..."
22-11-13

*స్టింగ్ ఆపరేషన్లతో జనాలను పరేషాన్ చేసిన తేజ్ పాల్ అసలు స్వరూపం బయటపడింది కదా!
రోజూ నాగోడు అదే.. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. ఎర్నలిస్టుల్లో జర్నలిస్టులు వేరు. జర్నలిస్టుల్లో నేరస్థులు వేరు.
గోతులు తీసేవాళ్ళే నీతులు చెబుతారు.. అవినీతిపరుడే నీతి గురించి ఎప్పుడూ మాట్లాడతాడు. ఇవ్వాళ పేపర్లు, చానళ్ళలో నీతులు మాట్లాడుకోవడం వేస్ట్..

21-11-13

*జెసి దివాకర్ రెడ్ది అనే కాంగ్రెస్ సీనియర్ నేత (అయిదేళ్ళుగా ఎమ్మెల్యే మినహా ఏ పదవీ లేదు..వోల్వో బస్సులు మాత్రం చాలా ఉన్నాయి) సిఎల్పీ కార్యాలయం వద్ద అక్షర సత్యాలు చెప్పారు:
ఏట్లో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ ఆపలేదని తెలిసినా దాన్ని పట్తుకునే ప్రయత్నం జరుగుతుంది.రాష్ట్ర విభజన అడ్డుకునే విషయంలోనూ మాది అదేప్రయత్నం..
నీజమే...కాంగ్రెస్ లో ఉన్నదంతా గడ్డిపోచలని తెలిసికూడా ప్రజలు ఇన్నేళ్ళుగా వాటినే పట్టుకుని కొట్టుకుపోతున్నారు..
సీమాంధ్ర సమైక్య ఉద్యమం గడ్డిపోచలదని తేల్చి చెప్పేసారు ఆ సారు వారు. మరో గాదె (వెంకట) రెడ్డి గారు దాన్ని బలపరచారు.. జై గడ్డిపోచలూ!!

*దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఇవిఎంలు ఉపయోగిస్తూ ముందుకు పోతుంటే విచిత్రంగా హైదరాబాద్ పాత్రికేయుల్లో కొందరికి ఎవిఎంల పనితీరుపై ఎన్నెన్నో అనుమానాలు తొలుస్తున్నాయి. 1300 మందికిపైగా వోటర్లున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు ఈ నెల 24న ఎన్నికలు జరుగుతున్నాయి. కొందరి అనుమానాల వలన ఎన్నికల్లో ఇవిఎంలను ఉపయోగించే ప్రయత్నాలకు గండిపడుతున్నది.
వోట్లువేయని బాగా చదువుకున్నోళ్ళకు, రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల్లో ఎవిఎంల పై అనుమానాలు. ప్రజలు వోట్లు వేసి తమ పని తాము చేసుకు పోతున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఎన్నికల్లో ఎవిఎంలే వాడుతునారు. మరి జర్నలిస్టులకే ఎందుకు అభ్యంతరమో!! ఎవిఎంల వలన పోలింగు వేగవంతమై, కౌంటింగు కేవలం ఒకటి రెండు గంటల్లో పూర్తవుతున్నది. అనేక దైనందిన కార్యకలాపాల్లో కాలహరణం, శారీరకశ్రమ నివారించుకునేందుకు , శాస్త్రీయత, సాంకేతిక మార్గాన్ని ఎంచుకున్నాం బ్యాంకుల్లో శారీరక శ్రమ తగ్గడం వలన పని వేగవంతమైంది. ప్రయోజనాలు విస్తృతమయ్యాయి. ప్రజలు అలవాటుపడి సుఖ పడుతున్నారు. అనేక ఆలోచనలు పుట్టుకొచ్చే పాత్రికేయులకు ఎవిఎంలపై అపనమ్మకమేమో!
(ప్రపంచంలో ఏకైక సంస్కరణకర్తగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు అనేక సార్లు యు టర్న్ తీసుకున్నారు. మద్యం విషయంలోనైనా, ఉచితాల విషయమైనా. ఐటి విషయమైనా, చివరకు ఎన్నికల్లో ఇవిఎం ల ప్రవేశమైనా తన ఘనతగా చెప్పుకున్నప్పుడు పత్రికలు ఓహో అన్నాయి. అదే బాబు ఎన్నికల్లో ఓడిపోగానే ఇవిఎంలు అశాస్త్రీయమని దేశవ్యాప్త వివాదం, చర్చ లేవనెత్తారు. అప్పుడు కొందరు పాత్రికేయులు కూడా అవునని వంత పాడారు.)

*ప్రపంచానికి మార్గదర్శకులు జర్నలిస్టులు అని చాలామందికి అపోహ. ఎందుకంటే వారు అన్నీ నిజాలు చెబుతారనో, సమాజంలో మార్పును ఆకళింపుజేసుకుని అందరికీ వివరిస్తారనో.. నేనంటాను తమకు నచ్చనిదాన్ని ఇతరులకు నచ్చకుండా, తాము మెచ్చినదాన్ని ఇతరులు మెచ్చేలా చేయడమే వారి ప్రయత్నం, కర్తవ్యం. వాదోపవాదాలకు ఆద్యులు పాత్రికేయులే కదా!! యాజమాన్య ప్రయోజనాలను, స్వార్ధ ప్రయోజనాలను.. రెండింటిని వారు భుజాలకెత్తుకుంతారు. విస్తృత, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు..ఇది ఇప్పటి పరిస్థితి. నన్ను ఎందరు కోపగించుకున్నా పరవాలేదు. పత్రికల పాఠకులకు,, చానళ్ళ వీక్షకులకు ఇది అనుభవమే.
20-11-13

*గొంగట్లో తింటున్నాం. ఇక్కడ మనం మెతుకులేరుకోవాలి.. వెంట్రుకలు కాదండి..
అందరూ "సంపాదకులే" తయారయ్యారు ఈ క(కా)లంలో, వారిలో పాత్రికేయులను తెలుసుకోవాలి. అది డబ్బులిచ్చి పేపరు కొనుక్కునే పాఠకునికి అగ్ని పరీక్ష. .
(ఎర్నలిస్టుల్లో జర్నలిస్టులెందరు? అని)

*తెలుగు పిచ్చి మరీ ముదిరిపోతున్నది..సామాన్యునికి అర్ధంకాని రీతిలో కొత్త తెలుగు పదాల ప్రయోగం.. ఈనాడు లో ఈ రోజు ఉపయోగించిన పదాలు ఇలా..
ఔటర్ రింగ్ రోడ్= బాహ్య వలయ రహదారి;
వర్క్‌షాప్= కార్యశాల..

మిత్రులందరికీ ధన్య వాదాలు. తమ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించినందుకు.. ఆ... ఆలు రానట్టి అన్నయ్య లందరూ రాజకీయ మద్దతుతో 'అకాడెమీ' అధ్యక్షులవుతున్నారు. ఇక పత్రికల విషయానికొస్తే "ఎడిటర్లు" ఎప్పుడో అంతర్ధానమై నిజమైన "సంపాదకులే " మిగిలారు.
సతీష్ బాబుకు కృతజ్ఞతలు.. నీ వంతు కృషిగా మన అజ్ఞానుల విజ్ఞాన సంపదను శ్రోతలు/వీక్షకులకు నీ "జర్నలిస్టు డెయిరీ" ద్వారా పంచిపెడుతున్నదుకు.
19-11-13

**మంత్రులు, మాజీలు అందరూ జగన్ శిబిరంలో చేరాతారని నెలకిందట రాసిన మాటలు నిజమవుతున్నాయి .. మోపిదేవి వెనుక ధర్మాన ప్రసాదరావు క్యూలో నిల్చున్నరు చూశారా!! నిన్నటి వరకు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండాతిట్టారు. ఇప్పుడు ఏముఖంతో...???
సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల దోబూచులాట కొద్దిరోజుల్లో బయటపడుతుంది..రంగు బయటకొస్తుంది.
**ఒక సమస్య(పరిష్కారం) మరో సమస్యకు దారితీయకూడదు: డిల్లీలో జిఓఎం ఎదుట సి.ఎం.
నిజమే, ఒక సమస్య పరిష్కరించుకునే ప్రయత్నంలో చేసినవన్నీ పెద్ద సమస్యలు సృష్టించుకోవడమే... జగన్ సమస్యకు పరిష్కారమనుకుని రోశయ్యను పెట్టారు. రోశయ్య సమస్యను సరిదిద్దుకునేందుకు కిరణ్ ను మార్చారు. ఇప్పుడు కిరణ్ సమస్య అయి కూర్చున్నాడు..
**నేను చెప్పిందే కరెక్టయింది.. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు జారి పోయారు, దిగజారిపోయారు. ముఖ్యమంత్రివాదాన్ని కూడ బలపరచలేదు. జావ కారిపోయారు. సొమ్ము మీదనే దృష్టి..
"విభజన అనివార్యమైతే హెచ్.ఎం.డి.ఎ. ప్రాంతాన్ని డిల్లీతరహా కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలి, సీమాంధ్రకోసం ఏటా 40 వేల కోట్ల వంతున 20 యేళ్ళు ఆర్ధికసాయమ చెయ్యాలి, భద్రాచలమ, అస్వారావుపెట.. తిరిగి సీమాంధ్రలో చేరచాలి, సీమాంధ్ర 13 జిల్లాల్లోనూ అభివృద్ధి విస్తరింపజెయ్యాలి,బిల్లు అసెంబ్లీకి పంపినప్పుడు తగిన సమయం ఇవ్వాలి...." డిల్లీలో నిన్న వారి మాటలు ఇవీ! మరి ఈ నాయకులు ఏపి ఏర్పడినప్పటినుంచి 13 జిల్లాలను ఎందుకు అనాధలుగా మిగిల్చారట?
కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీ విలీనం(నిమజ్జనం) చేసినప్పుడు మెగా అనుకున్న చిరు చెప్పింది గుర్తుందా?
"కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు నాపై నమ్మకముంది. నావల్ల పార్టీ ప్రయోజనం పొందుతుంది".. నిజమే కదా ప్రజలు ఏమైనా పార్టీకి లాభం చేస్తున్నారు.

18-11-2013

**ప్రపంచ తెలుగు ప్రజలారా ఏకమవుదాం, తెలుగు ప్రజలంతా ఒకటే, సమైక్యాంధ్రకోసం ప్రాణాలిస్తాం, విభజన ఆపే వరకు పోరాటం, పార్టీ కంటే ప్రజలే ముఖ్యం, విభజన అనివార్యమైతే సమన్యాయం సాధిస్తాం, విభజన తప్పేట్లు లేదు సీమాంధ్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాం, మరో పార్టీ పెడతాం, హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం, కనీసం పదేళ్ళూ ఉమ్మడి రాజాధానిగా ఉంచాలి, రెవెన్యూలో సింహ భాగం ఇవ్వాల్సిందే, యూనియన్ టెరిటరీ కోసం పోరాటం. కొత్త రాజధానికి, భారీగా నిధులివ్వండి, భద్రాచలం ఆంధ్రులది, కనీసం దాన్నయినా మాకు దక్కేట్లు చెయ్యాలి. మేము రాజీనామాలు చేస్తే విభజన ఆగుతుందా? మేము ఇంత ఎదగడానికి పార్టీ ఆశీస్సులే కారణం, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకే కట్టుబడి ఉంటాం.మరో ఆలోచన లేదు........
ఇదంతా వింటుంటే.. చదూతుంటే ఏమి అనిపిస్తుంది?
నాకైతే ఈ భర్తృహరి సుభాషితం గుర్తుకొస్తుంది....
@ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంబోధి బయోధినుండిపవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వెవేక భ్రష్ట సంపాతముల్.....

15-11-13

**ఒకవైపు తెలంగాణ, మరొకవైపు సమైక్యాంధ్ర.. ఈ గొడవ తప్ప.. ఇప్పుడు మరో విషయమే లేదు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు ఒక్క సాహితీ విశాఖే పట్టంకట్టినట్లుంది.. ఎఫ్‌బీ మొత్తంలో అక్షర రాగాలాపన అక్కడనుంచే వినిపిస్తున్నది..

**ఇప్పుడు దేశ జనభా 130 కోట్లుటండీ.. కాంగ్రెస్ పార్టీకి కూడా 130 సంవత్సరాలు సమీపిస్తున్నాయ్.. దరిద్రాలు శతకం ..  కరక్టే కదా!!

*ఇదేకదా(అ)రాచకీయం.. "టి" లో ఉండాలని 72 గంటలు బందట! "సీ" లో కలపాలకి వాళ్లేమిచేస్తారో? తెలుగు నేలపై కాలు పెట్టినందుకు పాపం దేవుడుగా కూడా రాముడికి కష్టాలే.. (భద్రాచలాన్ని తెలంగాణా నుంచి విడతీసి సీమాంధ్రలో విలీనం చేస్తారా లేక తెలంగాణాలోనే వుంచుతారా అనేదానికంటే ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే - కలసి వుందామని వాదించే సమైక్యవాదులు 'విడతీయాలని' అంటున్నారు. విడిపోవాలని వాదించే విభజనవాదులు, కలిపే వుంచాలని అంటున్నారు--.భండారు గారి పోస్టింగ్ )

14-11-13
**మొయిలీగారు డిల్లీలో ఆటో ఎక్కారట. నెహ్రూ దిగొచ్చినంత సంతోషంగా పత్రికలు ప్రముఖంగా ఫోటోలు వేశాయి.
మొయిలీకి నా చాలెంజ్: దమ్ముమంటే హైదరాబాద్ వచ్చి మీటరు రేటుకు ఆటో ఎక్కు... నీ చిన్నప్పటినుంచి ఇలాంటి జిమ్మిక్కులెన్నో చూసింది ఈ దేశం.
.. వాజ్‌పేయీ పార్లమెంటుకు ఎడ్ల బండిలో వచ్చారు. నీకు తెలీదేమో!
..ఎన్టీ రామారావనే ముఖ్యమంత్రి అబిడ్స్ లోని తన ఇంటినుంచి సెక్రెటరియట్ కు ఆటోలో వచ్చాడు ఒకసారి.

Tuesday 12 November 2013

                                  "క్షత్రియప్రభ" నవంబరు 2013, సంచికలో 

                       స్వామి వివేకానందపై రాసిన ప్రత్యేక వ్యాసం..

          "మనుషుల్లో మహా పురుషుడు" 


                                                 




"క్షత్రియప్రభ" నవంబరు 2013, సంచికలో
 భగవాన్ సత్యసాయి 88 వర్ధంతి పురస్కరించుకుని రాసిన వ్యాసం.. 
 *నడిచిన దేవుడు*  


Saturday 9 November 2013

నవరస భరితం..నవంబరు నవనవోన్మేషం.. 
బయటి గోడు పాటు జర్నలిస్టుల గూడు కూడా... 

9-11-13
**12 గంటల వ్యవధిలో జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (హైదరాబాద్) ఎన్నికలు
-------------------------------------------------------------------------------------------
కూడు కోసం రోజూ పాట్లు పడుతున్నాం.. ఇది జీవితకాలం జరిపే ఒంటరి పోరు... గూడుకోసం మన గోడును ఎవరూ పట్టించుకోరు. మనకోసం మనమే నడుము బిగించాలి. ఇది కలసికట్టుగా చేయవలసిన కార్యక్రమం.. ఏమి జరుగుతున్నదీ.. ఎలా జరుగుతున్నదీ స్ఫటికసదృశంగా చూపే ప్రాతినిధ్యం అవసరం. ప్రతి జర్నలిస్టు రక్తం ధారపోసి గడించి కూడబెట్టిన రెండులక్షల రూపాయల నగదుకు రక్షణ కావాలి. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (హైదరాబాద్)కి కేవలం 12 గంటల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు విలువను గురించి మనం నిత్యం ప్రజలకు బోధలు చేస్తాం. మరి మన ఓటు మనం వేస్తేనే కదా.. మనం ప్రశ్నించగలిగేది.
ఆరేళ్ళలో ఇది మొదటి సారి అందివస్తున్న అవకాసం. స్థలాలు నెరవేరని కలలుగా మిగలకూడదు.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎన్నుకోవాలి. ఎవరి ఆలోచన వారిది అది ముఖ్యం.. ఈ నిర్ణయంపై మన భవిష్యత్తు ఆధార పడిఉంటుంది..అయిదుగురు డైరెక్టర్ల ఎన్నిక కోసం 14 మంది బరిలో ఉన్నారు. అందరూ మన పాత్రికేయులే, మిత్రులే..
అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా!!!!

**Started with clouds, drizzling, rain, low pressure, depression, downpour, cyclone, thunders, hailstorm, floods, gales, 12th number signal..Spl Task Force on its toes...[starts crossing shore by 9 am tomorrow and over by 4 pm..] It is all the weather report of Jawaharilal Nehru Journalists Mac Housing Society (Hyd) Directors elections.

**నవ్వే వాళ్ళను నవ్వనీ.. ఏడ్చే వాళ్ళను ఏడవనీ.. నవ్వే వాళ్ళ అదృష్టమేమని ఏడ్చేవాళ్ళను ఏడవనీ!!  ఈ ఆ పాత మధురం ఎంత తియ్యన.. ఇది అన్నికాలాలకు వర్తిస్తుంది కదూ..

8-11-2013
**విలక్షణ హాస్య నటుడు 'అదో తుత్తి" ఎ వి సుబ్రహ్మణ్యం నాకు 1985 నుంచి పాత్రికయ మిత్రుదు..రచయిత. నేను గుంటూరు "ఉదయం" ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎవిఎస్ తెనాలి ఉదయం రిపోర్టర్ గా చేరాడు. సంవత్సరంలో బాగా దగ్గరయ్యాడు. ఆ తరువాత నేను ఆంధ్రజ్యోతి లొ చేరి హైదరబాద్ వచ్చినప్పుడు అతను కూడా అంధ్రజ్యోతి తెనాలి రిపోర్టర్ గా చేరాడు. కళాకారుడు.. హస్య ప్రియుడు.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆఫీసుకు వచ్చి గంటల తరబడి హాయిగా అందరినీ నవ్వించేవాడు. తరువాత సినిమాల్లో చేరి నిలదొక్కుకున్నాడు. రామినేని ఫౌండషన్ తరఫున వార్షిక అవార్డులను ఎవిఎస్ ప్రకటించేవాడు.. హైదరాబాద్ లో రెండు పర్యాయాలు ఇంటికి కూడా వచ్చాడు. ఒక మంచి హాస్యప్రియ మిత్రుణ్ణి కోల్పొవడం బాధాకరం.. RIP

**నమ్మరాదు నమ్మరాదు .. అమ్ముడుబోయే మిడిమేలపు మీడియాను నమ్మరాదు.. నేను ఈ సంగతి ఎప్పటినుంచి చెబుతున్నానో మిత్రులు ఒక్కసారి భూతకాలంలోకి వెళ్ళండి. చిరంజీవి కాలు ఐరన్ లెగ్ అని ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమప్పుడే వ్యాఖ్య పెట్టాను. కాంగ్రెస్ కు అంత్యకాలమని చెప్పినట్లే జరిగింది. ఈయనమీద నమ్మకం పెట్టుకుని సోనియా తనను కాంగ్రెస్ లోకి అహ్వానించారని చెప్పుకున్నాడు చిరు. ఇప్పుడేమో చిర్రు బుర్రు.. ఉన్నదీ పోయింది ఉంచుకున్నదీ పోయిందనే సామెత కరెక్ట్. సామాజిక న్యాయం.. సామాజిక తెలంగాణా.. అంటే అర్ధం అయిందా ఎవరికైనా..ఇప్పుడు సామాజిక కాంగ్రెస్..కాంగ్రెస్ ప్రయాణం జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ....

7-11-13
**"జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌజింగ్ సొసైటీ"(హైదరాబాద్) ఎన్నికలు..
--------------------------------------------------------------------------------------------------
చూశారా మిత్రులారా! ఎన్నికల ప్రభావం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 1105 మంది జర్నలిస్టులు ఆరేళ్ళకిందట ఏర్పరచుకున్న "జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌజింగ్ సొసైటీ" కి మొదటి సారి డైరెక్టరల ఎన్నికలు జరుగుతున్నాయి.
అంటే ఆరేళ్ళుగా ఎన్నికలు లేకుండా నడిచిందన్నమాట. పంచాయితీలకు గాని, మునిసిపలిటీలకు గాని, కార్పొరేషన్లకు గాని ఎన్నికలు నిర్వహించడంలో ఆర్నెల్లు ఆలస్యమైతే ప్రపంచం కూలిపోతున్నదన్నట్లు పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసేవాళ్ళు, గంతల తరబడి విశ్లేషణలు చేసేవారు ఆరేళ్ళుగా ఎందుకు ఎన్నికలు జరుపుకోలేదని, కోట్ల రూపాయల నిధులున్న సొసైటీ ఎవరు నిర్వహిస్తున్నారని ఎవరు ప్రశ్నిస్తారు. ఎవరు అడుగుతారు.? ప్రభుత్వంలో పారదర్శకత గురించి నిలదీసే జర్నలిస్టులు ఎంత పారదర్శకత ప్రదర్శించారు.
సొసైటీలో ఎవరు దేనికి బాధ్యులో తెలీకుండా ఆరేళ్ళు నడిచిందంటే ప్రజలకు ఉపదేశాలు చేసే పాత్రికేయ మేధావులు ఎందుకు మౌనం వహించారు. అనేక సొసైటీల్లో అవకతవకలు జరిగాయని కోడైకూసే రాతగాళ్ళూ మినహాయింపుకాదని ఎన్నో విమర్శలు వచ్చాయి. అంతే ఎవో కుంభకోణాలు జరిగాయని మాత్రం కాదు. పారదర్శకత లేకుంటే అనర్థాలు ఏర్పడతాయని మాత్రమే చెబుతున్నాను.
జర్నలిస్టుల్లోనూ గ్రూపులున్నాయన్నది బహిరంగమే. అనేక కమిటీల్లో అనేక సంవత్సరాలుగా గుత్తాధిపత్యం సాగుతున్నదంటూ రచ్చకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ప్రభావాలాకు, ప్రలోభాలకూ గురికాకుండా పాత్రికయ వర్గానికి న్యాయం జరిగేలా చూసుకోవలసిన కర్తవ్యం అందరిదీ.. కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించుకోవలసిన నైతికత మన జర్నలిస్టులది..ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక కోసం 14 మందికి పైగా బరిలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ అనుబంధాలకు దూరంగా ఉండాలి. విజ్ఞతతో ప్రతినిధులను ఎన్నుకోవాలి. 1105 మంది భవిష్యత్తు జీవనం ఆధారపడిఉంది. అందరూ రెండు లక్షల రూపాయలు చెల్లించిన వాళ్ళే!! కొందరు అకస్మాత్తుగా తెరమీదకు వస్తున్నారు. కొందరు ప్రచ్ఛన్నంగా ఉంటున్నారు. వివేకంతో ఆలోచించాలి.
ఈనెల 10 వతేదీన హైదరాబాద్ (సోమాజిగూడ) ప్రెస్ క్లబ్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్. అందరూ హక్కు వినియోగించుకోవాలి. ఈ అభ్యర్ధన ఎవ్వరికీ వ్యతిరేకమూ కాదు.. అనుకూలమూ కాదు..
**ప్రచార పటోటోపాలు ఎక్కువతే బొమ్మ ఎప్పుడూ బోర్లా పడుతుంది.. ఇది చరిత్ర చెబుతున్న పాఠం..కలం కత్తి అనుకుని నమ్ముకుంతే అది కుత్తుకలు కోస్తుంది..ఎందుకంతే బొద్దుబారిన కత్తికి ఎందరో "సాన" పెడతారు. ఎవేరి ఉపయోగం కోసమ వారి తంటా!!
**విభజన విషయమై చర్చకు అయిదు పార్టీలనే పిలిచిందట కేంద్రం..మీడియాలో కొందరు తెగ బాధపడిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 100 మీడియా సంస్థలనూ అహ్వానించకపోవడం..అప్రజాస్వామికం కదూ.. నాయకులకు పాకేజీ సలహాలు ఇచ్చేవరికి తృణమో పణమో దక్కకపోవడం విచారమే!!

6-11-13
****ఒక్క విషయం కాదు.. అన్నీ అంతే! జనాలను బలవంతంగా నమ్మించడానికే కదా పొద్దున్నే టీవీల్లో రాజకీయ రామంధాళి..చర్చల చిచ్చు.. ప్రాణాలు పణంగా పెట్టడానికి వీక్షకులు ఎవరూ ఇష్టపడడంలేదు. "పొద్దున్నే ఆ పాడు టీవీ పెట్టి ప్రాణాలు తోడకండి.. పగలూ రాత్రుళ్ళూ అదే గోల చస్తున్నాం", అని ఈ మధ్య ఇళ్ళలో తిట్లు శాపనార్ధాలు..
**సమైక్యంకోసం చచ్చిపోతామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు పాకేజీల జాబితాను సిద్ధం చేశారట.. పాపం ఎంపీలు కూడా క్యూల్లో నిల్చున్నారు..
** రాష్ట్ర దేశ రాజకీయాలను, ప్రభుత్వాలను(ప్రజలను) శాసించే స్థాయికి ఒక గుమస్తా ఎదగడం ఎంత గుణాత్మకమైన మార్పు!!
**నిన్నొక మాట, నేడొక మాట, రేపొకమాట చెప్పే పార్టీ కాదు మాది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.-విభజన ఆగిపోవాలని కోరుకుంటున్నా: బొత్స. అవును పూటకోచోట - మనిషికొక మాట చెప్పే పార్టీ మీది.  సిడబ్ల్యుసి శిరోధార్యమైతే విభజన ఎలా అగిపోతుందో?
**తాడూ, బొంగరం లేని లక్ష్మిపార్వతికి కూడా రాష్ట్రపతిని కలుసుకునే అవకాశం లభించడం ఎంత గర్వకారణం.
**విశాలాంధ్ర మహా సభ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, పేటకో జేఎసి.. ఎన్ని స్వయం ఉపాధి మార్గాలు?
**ప్రధానిని కలిశాం, రాష్ట్రపతిని కలిశాం, సోనియాను కలిశాం, రాహుల్ ను కలిశాం, చిదంబరం ను కలిశాం, షిండేని కలిశాం.. రాష్ట్రంలో తాజా రాజకీయ, శాంతిభద్రతల గురించి వివరించాం. వారు శ్రద్ధగా, ఆసక్తిగా విన్నారు. తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రయత్నాలు ఇలాగే సాగుతాయి..--
వీరికి పనిలేకపోతే డిల్లీలో వారికీ పనిలేదా..తలుపులు బార్లా తెరుచుకుని ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నట్లున్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉందా??

5-11-13
**"కేంద్రంలో ఎవరూ కెవిపి గారి సమైక్యాంధ్ర గోడు వినడం లేదని" పాపం ఒకానొక సమైక్య సీనియర్ పాత్రికేయుడు ఇవ్వాళ మధ్యహ్నం ఎంతగానో బాధపడిపోయారో. ఈ కింది మాటలు ఆయనవే.---
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్రరావు కోరారు. ఆయన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం పురోగతి సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దశలో కెవిపి విన్నపాన్ని వినేవారు ఎవరుంటారు.--- (చూడండి రాజకీయనేతలు, పాత్రికేయుల అవినాభావ సంబంధం అలాంటిది..)
**సమైక్యమైనా. ప్రత్యేకమైనా బాదుడు సామాన్యులకే అని అర్ధమైందా! సమ్మెలు చేసిన ఆర్టీసి కుటుంబాలకి ఎటూ ఫ్రీ పాసులే. వాళ్ళకేమీ నష్టం ఉండదు. చేయించిన ప్రజా ప్రతినిధులది ఎప్పుడూ బైరాగి టిక్కెట్టే, అశొక్ జ్ఞానిది ఆకాశపయనమే.. ఎటూ చిక్కులు సామాన్యులకే. మళ్ళీ రాజకీయ పార్టీలు చార్జీల పెంపుదలపై ఆందోళనలు.. నడ్డి విరిగేది ఎవరికి?

4-11-13
**సమైక్యంకోసం ప్రాణాలిస్తాం, తెలంగాణ అంగీకరించబోమని ప్రతిజ్ఞలు చేసిన కర్నూలు, అనంతపురం ఉత్తరకుమారులు ఇప్పుడు తెలంగాణాలొ తమను "నిమజ్జనం" చేయాలని కాళ్ళా వేళ్ళా పడుతున్నారు..చీ! సిగ్గులేని రాజకీయం.
**సంతోషం ఏమిటంటే నాకు ముఖతః, ముఖపుస్తకంలోనూ మిత్రులు పరిమితం. మిత్రులందరూ ఆప్తులు, సహృదయులే..ఏఫ్‌బి లో మిత్రుల సంఖ్య నేడు ముచ్చటగా మూడార్లకు చేరింది.(666)

2-11-13
**గాంధీ భవన్ లు ఎప్పుడో బ్రాందీ భవన్లయ్యాయ్..మహాత్ములకు మగానుబావులకు తేడా ఉందండి..లక్షాధికారుల కొడుకులే కోటీశ్వరులు అవుతారు..మంత్రుల సంతానం ముఖ్యమంత్రులవుతారు, నిరక్షర కుక్షులు నిచ్చెనలెక్కుతారు..
**వంట గ్యాస్ ధర తగ్గింది:- వార్త
అంతా గ్యాస్. అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆమాత్రమయినా తగ్గక పొతే "బండ" పడుతుందన్న భయం.. తరువాత ఎలాగూ మంటే:- ఇది వాత

1-11-13
** సినిమా హీరోయిన్లందరూ తెలుగొచ్చిన వాళ్ళేనా? తెలుగు చానళ్ళలో పని చేసేవారందరికీ తెలుగు వచ్చా? రాజకీయాలకు భాష అనవసరం..భరోసా ఉంటే అదేచాలు..
-----------------------------------------------------------------------------------------------

Friday 1 November 2013

వారం తీరంలో రాజకీయ అల(జడు)లు..


1-11-13.
**రాష్ట్రంలో మూడేళ్ళుగా కనుమరుగైన "ఆత్మ" త్వరలో సాక్షాత్కారం చూస్తూ ఉండండి. విజ్ఞులు నా మాట గుర్తుంచుకోండి..త్వరగా, త్వర త్వరగా తెరమీదకు పాత్ర!!

31-10-13
**ఉద్యోగుల సమ్మె వలననే సమయానికి తుపాను చర్యలు, సహాయ కార్యక్రమాలు అందించలేకపోయామని ముఖ్యమంత్రి గారు బాధ పడ్డారు. అందుకేనేమో రైతులను, బాధితులను ఆదుకోని సహ్హయం అందిచని సమ్మె ఉద్యోగులకు ఉదారంగా రెండు నెలల జీతం అడ్వాన్స్ మంజూరు చేశారు సి ఎం గారు!!

**ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలిగిస్తుంది. ఒక అలోచన మరొక అలోచనను రేకెత్తిస్తుంది. ఒక హృదయం మరొక హృదయాన్ని ప్రేమిస్తుంది..

**మీడియా హడావిడి కూడా అంతేగా!! చచ్చిన వాళ్ళను కూడా వదలకుండా చెత్త కథనాలు..

31-1-0-13
**ఈ రిస్ట్ వాచ్ కి నేడు 30వ జన్మదినం.. 
------------------------------------
ఈ రిస్ట్ వాచ్ వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ఇది నా జీవితంతో పెనవేసుకు పోయింది. నా కాళ్ళు, చేతులు, గుండె, మెదదు మాదిరి శరీరంలో విడదీయలేని ఒక భాగమైపోయింది. నేడు 30 సంవత్సరంలోకి కాలు పెట్టింది. అంటే ముప్పయ్యో జన్మదిన వార్షికోత్సవం జరుపుకుంటున్నది. నా కూతురి కంటే వయసులో ఇది పెద్దది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇది పని చేస్తున్నది. నాకు ప్రియాతి ప్రియమైన హెచ్ఎంటి తయారి.
1963 నుంచి ఇప్పటివరకు నేను రెండు వాచ్‌లు సొంత సంపాదనతో కొనుక్కున్నాను . 1963 ఎస్సెస్సెల్సీ మార్కుల ప్రాతిపదికపై 1964లో (పియుసి) 150 రూపాయల స్కాలర్‌షిప్ లభించింది. ఆ మొత్తం నుంచి 110 రూపాయలు పెట్టి అప్పుడే కొత్తగ మార్కెట్ లో ప్రవేశించిన ట్రెస్సా చతురస్ర వాచ్, మిగిలిన 40 రూపాయలతో ఫ్లెక్స్ షూ తీసుకున్నాను.. అలా ఆ వాచ్ 1984 రెండు దశాబ్దాలపాటు వరకు భద్రంగా వాడుకున్నాను. 


1984 అక్టొబరు నెలలో నిజామాబాద్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల "ఉదయం రోవింగ్ కరెస్పాండెంట్" గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఒకరోజు ఆవాచ్ కిందపడి పాడైపోయింది. అక్టొబర్ 31 వతేదీ మధ్యాహ్నం గంజ్ మార్కెట్లోని హెచ్ ఎం టి వాచ్ షాపుకెళ్ళి, ఈ వాచ్ 190 రూపాయలకు కొనుగోలు చేస్తుండా ఒక్క ఉదుటున సంచలనం... ఉద్రిక్తత, పెద్దగా కేకలు, అరుపులు, గంబ్దరగోళం. దుకాణం షట్టర్లు హడావిడిగా దించేశారు.. అప్పుడు తెలిసింది ప్రధాని ఇందిరాగాంధి దారుణ హత్యకు గురయ్యారని. వెంటనే బయటకు పరిగెత్తా!! భయానక వాతావరణం. దుకాణ దారు నన్ను లోపలికి లాగాడు. "బయటకు వద్దు. రాళ్ళు విసురుతున్నారు" అంటూ.. గంట సేపు లోపలే కూర్చున్నా. అప్పుడు ఆకాశవాణి డిల్లీ కేంద్ర ఆ వార్తను ధృవీకరించింది. ఈ రోజుకే మరో ప్రాధాన్యత. భారత ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని, ఆంతరంగిక భద్రతా వ్యవాహారాల మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇదే రోజు. 

సోదరాగ్రజులు, భగవదనుగ్రహ, గురుదేవ కటాక్ష పాత్రులు, శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు ఈ ఏడాది ఆగస్టు నెలలో వారి ఇంటికి ఆహ్వానించి అమెరికానుంచి తాను ప్రేమతో నాకోసం తెచ్చిన రిస్ట్ వాచ్ ను గురూజి చిత్రపటాలను, గ్రంధాలను బహూకరించారు.. రెంటిలో ఏదీ వదులుకోలేను. అందుకే ఇఫ్ఫుడు ఈ రెండు వాచీలు రోజు విడిచి రోజు పెట్టుకుంటున్నాను. 65 సంవత్సరాల జీవన ప్రయాణంలో రెండు చేతి గడియారాలతో 20 సంవత్సరాల ప్రేమానుబంధం, 35 సంవత్సరాల గాఢానుబంధం.. ..

**ఒక ప్రళయమో, విపత్తో, ప్రమాదమో, బాధో, హ(అ)త్యాచారమో జరిగినప్పుడు వెంటనే కవితలు, పరామర్శలు, సంతాపాలు గుట్టల గుట్టలు. కొవ్వొత్తి ప్రదర్సనలు, సామూహిక ప్రార్ధనలు, బ్యానర్ల ఊరేగింపుల వరద..మంత్రులు, అధికారగణ బాధ్యతారహిత ప్రకటనలు, ప్రభుత్వ వైఫల్యంపై పంచాంగం, రాజకీయనాయకుల పరామర్శ పర్యటనలు, విమర్శల తుపాను, ఉద్వేగ ప్రసంగాలు, పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై పత్రికలు, చానళ్ళ మూకుమ్మడి దాడులు, ప్రశ్నాస్త్రాల సంధన, పైత్యప్రకోపాలతో ఊహాతీత కథనాలు.. ఇవన్నీ అమానుషం..లోపాలు ఎత్తి చూపడంలో ఉత్సాహం సాయం చేయడంలో కనబడదు. అదీ విచారకరం..

29-10-13
**పదవులాట తెలీకపోతే పడవ బోల్తా.. అనుభవమే పాఠం చెబుతుంది..ట్యూషన్ ఉండదు..
**అంతా టేకులు.. రీ టేకుల జీవితం కదా.. రాజకీయలో రీళ్ళుండవని, అన్నీ కన్నీళ్ళేనని..తెలీదులేమ్మా!
**అయిదేళ్ళ కాపురం అనివార్యం. అయితే పీఠమెక్కిన వాడికే విడాకుల(రాజీనామా) అవకాశం. ఎక్కించిన మనకునచ్చకున్నా "అత్యధికులను" భరించాల్సిందే.. మన తిరస్కారం వాళ్ళకు పురస్కారం..

28-10-13
**ఆ ముక్కాయల చూర్ణాన్ని రంగరించి ఎప్పుడూ ముక్కులో వేళ్లెట్టుకునే ఆయన కర్ణాల్లో పోశారుట. అంతే..నసాళానికంటింది.. నాలుగేళ్ళబట్టీ ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, (వి)భజనొచ్చినా, నోరెళ్ళబెట్టి "వస్తున్నా మీ కోసం" అంటూ -ఆత్మగౌరవ- ఘోషలతో భూప్రదక్షిణలు మొదలయ్యాయి. ఇక భూకంపాలే...

**(పాత్రికేయ)మైకంలో ఉన్నాను మన్నించండి.. ఈ మాటలు, చేతలు నావే కావూ(అక్కినేని పాట). నాక్కాస్త తిక్కెక్కువ.. దానికి లెక్కలేదు..

**No beating round the bush..all direct answers No.1) JP will not change politics, but he will change, 2) how do you expect a vision-less person will do justice at all? 3) Congress sees no betterment 4) BJP is the only alternative for the present, first let it come to power then we can talk of miracles..,5) yes, people are looking for two states.. I am always impartial.. that is cent percent true to my conscious..

**గొట్టాలు గుట్టలుగా తయారయ్యాయి.. కలాలను కులాలు కమ్మేసాయి.. చెడు-వినకు, చెడు-కనకు, చెడిపోకు.

26-10-13
**ఇవ్వాళ అత్తల దినమట..
నేను గనక ఒక ఈల గనక వేశానంటే....
కొందరు కోడళ్ళు ముళ్ళ మీద కుళ్ళుకుంటూ, మరి కొందరు.. ఎంత సంతోషమో!!
అత్తయూ ఒక ఇంటి కోడలే కాని.. ప్రతి కోడలు అత్త కావాలన్న రూలు లేదు..అదీ అసలు కిరికిరి.
**

25-10-13
**ప్రపంచ మేధావిగా, రాజనీతిజ్ఞునిగా పేరొందిన పివి ప్రధాని పదవి నుంచి వైదొలగిన తరువాత గాంధీ భవన్ కు పలు మార్లు వస్తే. ఒక్క నాయకుడు తోంగిచూడలేదు.. వెనుక ఉన్న గ్రంధాలయంలో కొద్దిసేపు కూర్చునేవారు. పత్రికా ప్రతినిధులూ ముఖం చాటేశారు... అందుకే ఆయన కార్యక్రమాలు రామానందతీర్థ కార్యాలయానికి పరిమితి చేసుకునే వారు. మనం కాదంటే ఆయనను రాంటెక్ ప్రజలు ఆదరించారు.
**కొన్నిచోట్ల మానవ సంబంధాలు మాయమవుతున్నా.. మెషిన్ సంబంధాలు కొన్ని నాగార్జున సిమెంట్ లా పటిష్టమవుతున్నమాట వాస్తవం..

Friday 25 October 2013

          ఈ వారం [గరం మసాలా] మాటల ఈటెలు..
                                                 -----------------------------------------

25-10-13

**చిత్తం మెత్తనైతే చిత్తరువులన్నీ మొత్తం ఉత్తమమే.. కుంచె మంచిది కదా! ఎవరినీ ముంచదు. 'మధురా'నురాగాల మన(సు)ముఖ చిత్రాలు బహుసుందరం.. మీ మది బృందావనం .. నందనవనం. మీ శ్రమైక జీవన సౌందార్యారాధన (పరి)శ్రమకు మరో సారి వందనం.

**రాజకీయాలన్నా, అంతకు మించి సోషలిజమన్నా..రామ్ మనోహర్ లోహియా, మధులిమాయే, మధు దండావతే, జార్జ్ ఫెర్నాండెజ్, బద్రివిశాల్ పిత్తి, సంజీవదేవ్, స్నేహలతారెడ్డి వంటి ఉద్దండుల పట్ల ఆసక్తి కలగడానికి సోమయ్యగారే దిక్సూచి. కళాశాల విద్యార్ధిదశలోనే(1965-68) లిమాయే, జార్జ్, పిత్తి వంటి కొందరు సోషలిస్టు నాయకులతో ప్రత్యక్ష పరిచయం, లేఖాబాంధవ్య  భాగ్యం అరుణక్క, సోమయ్య (బావయ్య)గార్ల ఫలమే. సామాజిక అలోచనలు, రాజకీయాల పట్ల, రచనా వ్యాసంగం పట్ల ఉత్సుకత పెరగడానికి వారే మార్గదర్శకులు. 1967 ఎన్నికల్లో సోమయ్యగారు తాడికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎస్.ఎస్.పి.(సంయుక్త సోషలిస్ట్ పార్టీ) అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొనడమే కాక ఎన్నికల ఏజెంటుగా కూడా పనిచేసే అవకాశం నాకు లభించింది...అప్పుడెలాగో ఇప్పటికీ ఆ అనురాగ మూర్తులిరువురిదీ సైద్ధాంతిక నిబద్ధ నిరాడంబర జీవనమే. వారితో నాది ఐదు దశాబ్దాల ఆప్యాయతాబంధం.

**ప్రజలను పట్టించుకోనివాళ్ళు, వాళ్ళ ప్రాణాలను కాపాడలేని వాళ్ళు, ప్రాంతాల ప్రయోజనాలను ఎలా పరిరక్షిస్తారు? అందరిదీ పదవీకాంక్ష, స్వార్ధమే!! గల్లీలు మునిగిపోతుంటే నేతలు డిల్లీలో దాగుడుమూతలు.. నాయకులకు ప్రజలే కీలెరిగి వాత పెట్టాలి..

**మళ్ళీ తీన్ తేరా, ఆఠ్ అఠారా! ఈ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు పదమూడు కలసిరాదని తెలిసినా..అంతే..
13 మంది ఎంపీలు ఘనంగా రాజీనామాలు చేస్తే స్పీకర్ "కుదరదు ఫోండి" అని ముఖం మీద గిరాటేశారు.
ఈ సారి మరొక బృందం నేరుగా రాష్ట్రపతి వద్దకు (రాష్ట్ర భేరానికి) రాయబేరానికి వెళ్ళారు. లెక్క చూసుకోలేదో, ఇది ఎట్లాగూ తేలని యెవ్వారమనుకున్నారేమో! మళ్ళీ 13 మంది రాష్ట్రపతిభవన్ లో ఎడమకాళ్ళు పెట్టారు. ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు..వెరసి 13. ఈ 13 కి వెన్నుగా ఎమ్మెల్యేలు కూడ వెళ్ళారు ఈ సారి. (రాష్ట్రపతి భవన్ ను చూసినట్లుంటుంది కూడా..) అదేమి చిత్రమో వాళ్ళు కూడ పదముగ్గురే!
మంత్రులు:శైలజానాథ్, టిజి వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, తోట నరసింహం, అహ్మదుల్లా, పితాని.
ఎంపీలు: కెవిపి, లగడపాటి, రాయపాటి, మాగుంట, అనంత, కనుమూరి, సాయిప్రతాప్.
ఎమ్మెల్యేలు: కె కన్నబాబు, కె సుధాకర్,వంగా గీత, ఉగ్రనరసింహ, బిఎన్ విజయకుమార్, ఎన్ శేషారెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, సిహెచ్ వెంకట్రామయ్య, కెవి నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, ఈలి నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు..(వీళ్ళకుతోడుగా [ఆటలో అరటిపండ్లు] ఎక్‌స్ట్రాలు ఆ నలుగురు.. ఎమ్మెల్సీలు)
మరో ముఖ్య విషయం..భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన అభాగ్యులు కూడా 13 మంది. మృతుల కుటుంబాలకు మనమైనా సంతాపం తెలుపుదాం. (ప్రజాప్రతినిధులు పాపం బిజీ కదా!)

**ప్రతి దానికి ఒక లెక్కుంటుంది.. లేకుంటే తిక్కెక్కుతుంది..
మరో ఆచ్చెర్ర్యం ఏమిటో గమనించారా? సమైక్య్యాంధ్ర కోరుతున్న సీమాంధ్రలో మిగిలినవి 13 జిల్లాలు. మళ్ళీ మరోసారి తీన్ తేరా..అదే వాళ్ళ మల్ల గుల్లాలు. గ్రహ అనుగ్రహాలు తెలిసిన గోదారి ఘనాపాటి కదా ఉండవల్లి.. అందుకేనేమో ఖమ్మం జిల్లాను అటువైపు తరలించాలట..కొత్త మాట మొదలెట్టాడు. అప్పుడు కూడా పవర్‌ఫుల్ ఇక్కడ మిగిలే నవగ్రహాలని(తొమ్మిది జిల్లాలు) ఆయన లెక్కేసుకోలేదు.. పాపం పెద్దమ్మ ఆ(వ)(గ్ర)హిస్తే ఏ గ్రహం అనుగ్రహం చూపదు..ఇక గృహమే కదా స్వర్గ"సీమ"!!

24-10-13
**"సూర్య" అనే ఈ పత్రిక ఒక్కటి చాలు.. పత్రికా ప్రపంచాన్ని భ్రష్టు పట్టించేందుకు. సమాజాన్ని నాశనం చేసేందుకు..పత్రిక పుట్టుక నుంచి నేటి వరకు నడచిన అధ్యాయాలు గమనిస్తే ఎన్ని అపభ్రంశపు అడుగులో...

23-10-13
** రాజకీయ జోక్యాల వలన పోలీసింగ్ రాష్ట్రంలో నిర్వీర్యమై అయిదేళ్ళయింది. నగ్జలైటలతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు "అన్నలకు" మన పోలీసు ప్రబుద్ధులు వినతిపత్రాలిచ్చారు గుర్తుందా అందరికీ. ఇక మనం ఈ పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం గొంగట్లో తింటున్నామని గుర్తుంచుకోవాలి. అధికారానికి ఖాకీలు దాసోహమంటున్నంతకాలం ఇంతే! జంటనగరాల్లో నేరస్తులను ఎటూ అదుపుచేయలేరు.. కనీసం ఆటొడ్రైవర్లను కూడా నియంత్రించలేని పరిస్థితి. వసూళ్ళలో మునిగిపోతున్నారు మరి.

**కారాగారాల్లో ఉండవలసినవాళ్ళు సచివాలయాలకు ఎగబడుతున్నారు.. పాపులు పాలకులు కావాలని ఆత్రుత, కంత్రీలు మంత్రిపదవులకు గాలం వేస్తున్నారు.

21-10-13
**కాపీ(నం)హక్కు దారులు ఎక్కాల బుక్కులు అచ్చేయించుకుని అవార్డులకోసం వెంపర్లాడుతున్నారు తెలుసా మీకు. రాతగాళ్ళు, కూతగాళ్ళు (కలాలు, గొట్టాలు)భావచౌర్యం సొంతం చేసుకుని చిల్లి గవ్వకు చెల్లని సత్తు ముఖాలు సమాజంలో మేధావులుగా చెలామణి అవుతున్నారు....

**నా వార్తలు నా ఇష్టం - అంటే ఇదే!! (My news.. my views.. my will..)See a blatant distortion of news. All print media carried the news item stating that CM had stated that he would stop the "division cyclone" with the help of people. What he really said was different even according to "The Hans India" which carried a distorted version..Hans carries the rejoinder on its first page (22-10-13).

**కొత్త కులాలు అందలం ఎక్కుతాయో లేదో తెలీదుకాని మన పాత కలాలు, గొట్టాలు తమ ప్రవృత్తిని తాకట్టు పెట్టుకోవడమే కాకుండా బానిసలై వృత్తిని పణంగాపెట్టి గెలిపించడానికి నానా యాతన పడుతున్నారు. ప్రేమ ప్రాంతం మీద, కులం మీద కాకపోవచ్చు .. పైసా మే పరమాత్మా హైన్!

**
**పొరబాటున బాబు సి ఎం అయితే మొదత సాష్టాంగ పాద ప్రణామం చేసేది కలంకుల కార్లే..


20-10-13
**అశోకుడి ఉద్యమ ప్యాకేజ్ విలువ అక్షరాల "కోటి" రూపాయలట..తిలాపాపం తలా పిడికెడు..ప్రసార సాధనాలవెప్పుడూ స్తోత్రపాఠాలు లేదా తిట్ల పురాణం..కొత్తేముంది.. ప్యాకేజీ ప్రభావం..

**కమ్యూనిజమంటే కాదుకానీ కొందరు కమ్యూనిస్టులంటే నిజంగా నాకు గిట్టదు. కాని కేర్ ఆస్పత్రిలో నిన్న రాత్రి కన్ను మూసిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి(వైఆర్కే)కు నేను అభిమానిని. ఆయన ఒక ప్రజావైద్యుడు. ఒక శ్నేహ శీలి. కుండబద్దలుకొట్టినట్లు చెప్పే వాదాలను ఆయన మెచ్చకున్నా మనసారా అహ్వానిస్తారు. ఆయన ఒక సైధ్ధాంతిక ఉపన్యాసకుడే కాదు. ఒక ఉత్తమ శ్రోత. నిగర్వి. ఒక కమ్యూనిస్టునాయకుడిగ-ఒక పాత్రికేయుడిగా మా ఇరువురికి 15 సంవత్సరాలకు పైబడి మంచి స్నేహబంధం...రాజ్యసభకు అర్హుడైన నిజమైన మేధావి. రాష్ట్రానికి ఖమ్మం జిల్లా ప్రసాదించిన అరుదైన విశిష్ట వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన మరణం మిత్రకోటికి బాధాకరం. మా ఇరువురి పేర్లు ఒకటి కావడం కాకతాళీయమైన అనుబంధం.. ఒక మంచి వ్యక్తి శాశ్వతంగా అదృశ్యమైపోయారు. ఆయన మంచితనం అజరామరం..

**మనం పాదాక్రాంతమై, దెయ్యాలైన కఠిన శిలలకు మొక్కుతున్నంతకాలం తప్పకుండా మనది డెమొనాక్రసీనే.. ఏమాత్రం అనుమానంలేదు. శిరసు వంచడం మినహా బానిసబతుకులకు మరో మార్గం లేదు. కమండలం ఇప్పించనంతకాలకాలం దండాధారులదే కమాండ్..

18-10-13

**గళం మూగవోయింది, కలం ఇంకిపోయింది, రాత ఆగిపోయింది.. ఊపిరి నిలిచిపోయింది..రావూరి వెళ్ళిపోయారు....చలం దగ్గరకు పాకుడురాళ్ళ మీదుగా  నడుచుకుంటూ.... 'జ్ఞానపీఠ్' విజేతకు అక్షరాంజలి.. అశృతర్పణం..

**తీన్ తేరా ఆఠ్ అఠారా.. అంటారు.. అంటే ఇక అంతే సంగతి అని అనుకుంటా..
మన సీ(చీ)మ ఎంపీల పని అంతే. ఫట్..పదముగ్గురు ఎంపీల రాజీనామ స్పీకర్ తిరస్కరణ..ఇక మిగిలింది ప్రజా తిరస్కరణ.. డ్రాజీనామా బాగుంది..
తేరీ మన్‌కే తెలంగాణా.. మేరీ మన్‌కే సమైక్యాంధ్ర.. బోల్ సోనియా బోల్ సమైక్యం హొగాకే నహీ...
నహీ... కబీ నహి...
**రాజీనామాలు సాధించలేనివాళ్ళు ఇక సమైక్యాన్ని ఏం సాధిస్తారు..
**నవ సమా(జ)ధి నిర్మాతలు మన నేతలు.. రానున్న ఎన్నికల గుర్తు : సమాధి
**కొందరు కారణ జన్ములు..వారు సాకారులు. మరి కొందరు అకా"రణ" జన్ములు.. వారు నిరాకారులు.. మరింత వికారులు..
17-10-13
**ఆంధ్రా "అశోకుడు" చెట్లు పీకించెను, రోడ్లు తవ్వించెను, చెరువులు పూడ్పించెను, స్కూళ్ళు మూయించెను, బస్సులను ఆపెను, కార్యాలయములకు తాళము వేయించెను, ప్రజలను కష్టముల పాల్జేసెను, యుద్ధము మాన్పించెను(సమ్మె ఉపసంహరించుకొనెను..). ముఖ్యమంత్రి నుంచి హామీ కూడా పొందెను.. రాష్ట్రపతిపాలన హెచ్చరిక ప్రభావమా?

**మూడురాష్ట్రాల ఏర్పాటప్పుడు అక్కడ ఎన్జీవోలు సమ్మెలు చేయలేదే, మంత్రులు ముఖ్యమంత్రులను  తూర్పారబట్టలేదే.. ఎంపీలు రాజీనామా డ్రామాలాడలేదే, రాష్ట్ర మంత్రులు సచివాలయాలు వదలి డిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదే, చానళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదే.. 

Tuesday 15 October 2013

వారంలో గరం గరం రాజకీయ వడ(దెబ్బ)లు   

15-10-13
**ఈ రోజెంత ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉందో!!
అవును అచ్చోసే అక్షర కాలుష్యం నుండి ఒక్కరోజు విరామం..
(ఇవ్వాళ వార్తా పత్రికలు లేవు కదా... ఇలా వారంలో ఒక్క రోజైనా ఉంటే బాగు కదా!!)
మొన్న శనివారం భండారువారికి ఉత్తమ పాత్రికేయ పురస్కార సభలో జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. "ఇదివరలో దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఈ మోనోపలి ఏమిటి? ఇంకా చానళ్ళు రావలని అనుకునే వాణ్ణి. ఇప్పుడైతే  చానళ్ళన్నీ మూతపడాలని కోరుకుంటున్నాను(రు). వార్తా కాలుష్యం రాజకీయనాయకులు కూడా ఏవగించుకునే లా... ఎంతగా పెరిగిందో అర్ధమవుతున్నది..

14-10-13

**ప్రమాణాలు పరమాణువులై..ప్రణామాలు అందుకోలేక పోతున్నాయ్.. పరిణామలు ఎలా ఉంటాయో.. అంతా ప్రమాద భూయిష్టమైన వాతావ"రణం" లో ప్రపంచం......
12-10-13

**I AM HAPPY TO INFORM MY FRIENDS THAT DR B R AMBEDKAR OPEN UNIVERSITY(HYDERABAD) AUTHORITIES HAVE NOMINATED ME AS A TRANSLATOR FOR TRANSLATING THE MASS COMMUNICATION AND PUBLIC RELATIONS COURSE, AT UG LEVEL [B A, B COm, B Sc] (WRITING FOR MEDIA FROM ENGLISH TO TELUGU).
GURU KATAAKSHAM AND VIJAYA DASAMI GIFT TO ME.

HIGH REGARDS TO SRI DASU KESAVA RAO, WHO AT THE END OF HIS 28 YEARS IN THE COUNTRY'S LEADING ENGLISH DAILY, "THE HINDU" , REACHED THE PINNACLE OF HIS CAREER AS CHIEF OF BUREAU, AND DEPUTY EDITOR, FOR ENCOURAGING AND GUIDING ME IN RIGHT DIRECTION IN THE PROFESSION FROM THE BEGINNING. I AM BLESSED. (status)
-----
**PARAMA GURU KATAAKSHAM. TRIPLE PROSTRATIONS DEVA. I AM BLESSED.
DR B R AMBEDKAR OPEN UNIVERSITY(HYDERABAD) AUTHORITIES HAVE NOMINATED ME AS A TRANSLATOR FOR TRANSLATING THE MASS COMMUNICATION AND PUBLIC RELATIONS COURSE, AT UG LEVEL [B A, B COm, B Sc] (WRITING FOR MEDIA FROM ENGLISH TO TELUGU). ALL GURU GRACE. AT THY HOLIEST FEET. _/\_(sridharamritam)
----------------------------------------------------
**నదులన్నిటికీ కాలువలు ముందుగానే తవ్వి ఉంచారు.. సముద్రంలో కలవడానికి.. ఇంకిపోయే జలాలు, కలాలు మరో వనరు వెతుక్కోవాలి కదా.. ఇది కొత్తేముంది. బెల్లం ఉన్న చోటకు చీమలు సాధారణమే! సలహాదారులు సామాన్యులా!

**కతుకుడు రాజకీయాలు మనుషుల బతుకులనే కాదు పండగ బతుకమ్మలనూ మార్చే(డ్చే)సినాయ్.

**కిరణ్‌కుమార్ ప్రతిపక్షంలో విప్. అధికార పక్షంలో చీఫ్ విప్, తరువాత స్పీకర్, మూడేళ్ళు ముఖ్య మంత్రి.. ఆ మాత్రం తెలీదా. రాజ్యాంగం లోని 3 ఆర్టికిల్ అసలు చదవలేదా, చదివినా అర్ధం కాలేదా? తీర్మానాన్ని ఓటింగ్‌లో ఓడిస్తామనడం కేవలం ప్రజలను మభ్య పెట్టడమే. ఉద్యమం పేరిట అందరూ ఊళ్ళు పంచుకున్నారు.

**ఆశ్చర్యమేమిటంటే.. సిబ్బంది సంస్థ సమస్యల పరిష్కారకోసం సమ్మె జరిగితే 23 జిల్లాల్లో కాకుందా 13 జిల్లాలకే ఎందుకు పరిమితమైంది. సమ్మె రాజకీయ మని, రాష్ట్ర విభజన నేపథ్యమని తెలిసి 60 రోజులు యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుంది. ఒక కన్నైనా కనబడుతున్నదని ఉపేక్షించిందా? రవాణా మంత్రి నిన్నటివరకు ఎందుకు చర్చలు జరపలెదు? సమ్మె నష్టం 200 కోట్ల రూపాయలనష్టం ఎవరు భరిస్తారు? 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, 13 జిల్లాల ఆర్టీసి సిబ్బంది నుంచి వసూలు చెయ్యండి. నిజమైన న్యాయవాదులుంటే రాష్త్ర ఉన్నత న్యాయ స్థానం లో పిల్ వేయండి.  

**నిన్నటితో ఉద్యమ హోరు ఆగింది చానళ్ళలో . ఈ రోజూ ఉప్పెన హోరు మొదలైంది.. పాపం 24 గంటల బాధ..వర్షం ఎలా కురుస్తుంది? తుపానేమిటి? అల్ప పీడనమేమిటి.. ఇలాంటి కథలు పొద్దుణ్ణించి..టీవీ పెడితే రోజూ మనకు ఎన్ని పీడలో..మనం తాడిత పీడితులం.. సమ్మె రాజకీయం అయిపోయింది. ఇక నేటినుంచి సహాయ పునరావాస కార్యక్రమాలపై తిట్ల దండకాలు. బుల్లి తెరపై ఇక వైఫల్య కథనాలు కో కొల్లలు.

** నిజాల్ని ఇజాలు (జర్నల్-ఇజం)పాతరేస్తున్నాయి. అందుకు తార్కాణం తెలుగు చానళ్ళు, పత్రికలు. ఒక విషయానికి ఎంతగా మసిపూయవచ్చో (వక్రీకరించవచ్చో)రోజూ చేసి చూపుతున్నాయి.

**సమైక్య రాష్ట్రం గా ఉంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందా ఉద్యోగులు చల్లబడ్డారు. అసెంబ్లీకి తీర్మానం వోటింగుకు పెదతామని సోనియా వాగ్దానం చేసిందా? ప్రజాప్రతినిధులు తోక ముడిచారు. 73 రోజులు ప్రజలు పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు చదువులు అన్నీ వొదిలేశారు. రోడ్లెక్కారు. 60 రోజులు ఆర్టీసి బస్సులు బంద్ 200 కోట్లు నష్టం. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు, జీతాలు ఇవ్వాళకాకపోతే రేపు వస్తాయి. లంచాలు నిత్య కల్యాణం పచ్చతోరణం. అశొక్ బాబు అనే మరో తురుం ఖాన్ ను సీమాంధ్రకు ప్రసాదించింది "ఉద్యమం". తెలుగు చానళ్ళు బాగా సొమ్ము చేసుకున్నాయి. ఇప్పుడైనా అర్ధమైందా? ఎప్పుడైనా గెలిచేది క్షుద్ర రాజకీయం. ఒడేది ప్రజలు.

**క్షుద్ర రాజకీయ వ్యాధిగ్రస్థ నాయకులకు అవసాన దశప్రాప్తిరస్తు. ఇది ప్రజల శాపం.

**ప్రజల శాపం యమ పాశం. వీళ్ళు ఉత్తమ మార్కండేయులు కారు. ఉత్త మూర్ఖండేయులు.. అన్ని దారులూ మూసుకుపోయాయి నాసికా రంధ్రాలు సహా! ఊపిరాడక ఇక మరణమే..

10-10-13

**‘నందామయా గురుడ నందామయా’ఆనంద దేవికీ నందామయా..గొర్రెలు తినువాడు గోవింద కొడతాడు బర్రెలు తినువాడు వస్తాడయా...
‘శివశివమూర్తివి గణనాథా’ నీవు శివుని కుమారుడవు గణనాథ.. ఒక్క సారి మంత్రి చెయ్యి గణనాథ. నిన్ను ఒదిలిపెడితె ఒట్టు పెట్టు గణనాథ..‘బ్లాక్ మార్కెట్ చెయ్యి గణనాథా నిన్ను కొట్టమంటే ఒట్టుపెట్టు గణనాథా’...
ఈ పాటలు గుర్తుందాండీ..  "పెద్దమనుషులు.." కె వి రెడ్డి గారిది ఎంత ముందు చూపు..

** ఆర్టీసి కి మూతేసి.. ప్రై"వేటు"కు రంగం సిద్ధం..  ఇక దివాకర్ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్, మురళికృష్ణ టావెల్స్, సింధు ట్రావెల్స్...జిల్లాలు పంచుకుంటాయి. రెండు కొత్త రాష్ట్రాల్లో వారి ప్రగతి చక్రాలే పరుగులు తీస్తాయి.

**అసెంబ్లీలో కేవలం చర్చ మాత్రమే.. ఓటింగు ఉండదు.. ఇక టింగు టింగే..అందరూ చేతులు(కాళ్ళు కూడా)ఎత్తడమే!! హస్తవాసి బాగుండలేదు. 'అనంత' రాత్రి జగన్నాధ రథంలో, పొద్దున్నే రాయపాటి బాబు దగ్గరకు జంప్. సామాజిక సమీక'రణాలు' మొదలవుతున్నాయి.

**నిప్పు రాజేసి తప్పుకున్నారు. ఇప్పుడు చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కళ్ళని..

**వెదకి, వెంటాడి తంతారు.. ప్రజలు వెంగళప్పలు కారు..
అశోకుడు చెట్లు నాటించెను - అది చరిత్ర;
'అశోక్' సమ్మె చేయించెను - ఇది వాస్తవం..

**చాకో గారు డిల్లీలో అల్టిమేటం ఇచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, విధినిర్వహణలో ఆ ప్రభుత్వం విఫల మైనప్పుడు ప్రత్యామ్నాయం రాష్ట్రపతి  పాలనేనని. అంతే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత ముఖ్యమంత్రిదేనని కూడా కుండ బద్దలు కొట్టారు. మరేదారి లేకుంటే రాష్ట్రపతి పాలనే నని తేల్చేశారు. వెంటనే విద్యుత్ సమ్మె ఆగింది. బొత్స ఆర్టీసి ఉద్యోగులతో చర్చలు మొదలెట్టారట. తుపాను నెపం తో ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెకు విరామం ప్రకటించారట. కాకెక్కుతేగాని తెలీదు..

**వారం రోజులపాటు కన్నుపొడుచుకున్న చీకట్లు.. ఇక కళ్ళు బైర్లు కమ్మే మిరుమిట్లు.. విద్యుత్ సమ్మె ఆగిపోయింది. నాయకుని ఇష్టానుసారం ఉద్యోగులు నడుచుకున్నారు.
9-10-13

** జూనియర్ (నూతన) నేతలకు ఫ్యూచర్లో మంచి డిమాండ్. "పెర్ఫార్మెన్స్" బట్టి ప్రొమోషన్లు.. అవార్డులు, రివార్డులు..

**పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచెయ్యడంలేదు రెండు నెలలుగా..ఎక్కడా జీతాలు లేవు కూడా. అవునా? అయినా స్దరే.. తుపానుకు కోస్తాజిల్లాల్లో ప్రభుత్వ సిబ్బందితో సర్వం సిధ్ధంగా ఉందట. రఘువీరా గారు సెలవిచ్చారు. కంట్రోల్ రూములు తెరచారట.. ప్రజలను అప్రమత్తం చేశారట! తీరంలో ప్రమాద సూచికలు ఎగురవేశారట. కోస్తాలో కాంగ్రెస్ కోతకు గురవుతున్నది. వలస శిబిరాలు మొదలయ్యయి. అసలు మంత్రులే అదృశ్యం..(ఇవన్నీ కాంగ్రెస్ కు ముంచుకొస్తున్న తుపాను. డామేజీ పూర్తిగా అయింది. ఇక కంట్రోల్ ఏమిటో?) ఇక ఫైనల్‌గా చేతులెత్తేయడం - తెల్లజండా ఎగరేయడమే!!
[COMMENT BY Srinivasrao Bhandaru అల్లకల్లోలంగా వున్న సముద్రంలో నౌకలో ప్రయాణించేవారు అలలు యెంత తీవ్రంగా వున్నా నౌకనుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకోరు. కానీ నౌకకు చిల్లిపడిందని తెలిస్తే మాత్రం అందులో ఒక్కరూ వుండరు. సముద్రంలోకి దూకి వొడ్డుకు చేరాలని తాపత్రయ పడతారు. ఇదీ అంతే.}

**సమైక్యమంటూ రేయింబవళ్ళు డిల్లీలో మంతానాలు సాగించిన కాంగ్రెస్ ఎంపీలు అనుకున్నట్లే జగన్ బాట పట్టారు. తెర వెనుక నడిపిస్తున్నది వ్యూహరచనా ధురీణులు కదా? జగన్ కాంగ్రెస్ లో విలీనం కంటే కాంగ్రెస్ జగన్ తో మమేకమవుతున్నది. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తో క్యూ మొదలైంది.. రాష్ట్ర మంత్రులూ సంచీలు సర్దుకుంటున్నారు..

**కలి-విడిగా...విడిగా కలిసుందాం..కలిసి విడిపోదాం: మనసులు కలసి.. మనుషులే విడిగా: నేల ఒకటే - ప్రాంతాలు వేరు: అన్నదమ్ముల్లా పంచుకుందాం: బేటాలు, టాటాలు, మాటలు, పాటలు, కోటాలు, ఇవన్నీ బీటలకే చిహ్నం.. మొత్తానికి తేలవలసింది "పదవుల వాటాలు" మాత్రమే. పిల్లి పోరు-పిల్లిపోరు చివరకు పిట్ట తీర్చిందట..

8-10-13
**చంచల్‌గూడా జైలు గోడలు కూడా అన్యాయం చెయ్యద్దు.. సమన్యాయం చెయ్యమని ఘోషిస్తున్నాయట..చానల్ కెమేరాలు రోడ్లు ఖాళీ చేశాయి..బోసిపోయి ప్రజలంతా ఏదో వెలితిగా ఫీలవుతున్నారు.

**జ్ఞానముందనుకున్న ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దీకూడా జగన్నాటకంలో ముఖ్యపాత్రే కదా.. చీలిన కాంగ్రెస్ తో ఆయనకూడా సమైక్యమే..రాజకీయ గురువు అడుగుజాడల్లో ఆయన..ఆయన వెంట వందిమాగధ బృందం.. చూస్తుండండి..నిరంతరాయ నాటకం.
.
**పాపం విద్యుత్ సిబ్బంది నాయకుని మాట వినలేదుట..స్వర్ణాంధకారం మరికొన్నిరోజులు.. రాజుకంటే మొండివాడు బలవంతుడే ..

**రజనీకాంత్ .... నేను ఒక్క సారి చెబితే వందసార్లు చెప్పినట్టు-
చంద్రబాబు .. నేను వందసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అర్థం కాదు-
బాబుకు దీటుగా కెకె ను బరిలోకి దించితే సరి..గడ్డం జుట్టు రెండూ పీక్కుని పరార్!! (ఇద్దరికీ గెడ్డాలు, జుట్టు ఒకే రీతిలో ఉంటాయి)..

Wednesday 9 October 2013

                              
                               మంత్రపుష్పం
  

                       [ఈ రోజు నుంచి మంత్ర పుష్పం శ్లోకం తాత్పర్య సహితంగా అందిస్తున్నాను.]
 
1-9-13
మంత్ర పుష్పం..
------------------
ఓమ్ 

ధాతా పురస్తా ద్యముదాజహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్త్రః
త్వమేవం విద్వా నమృత ఇహ భవతి
నాన్యః పాంథా అయనాయ విద్యతే!

తా: పూర్వము పరమ పురుషుడు ఈ మంత్ర పుష్పమును నిర్మింపగా, సకల ప్రాణికోటిని రక్షించేందుకు  ఇంద్రుడు దీనిని నలు దిక్కులా వ్యాప్తి చేసెను. ఆ పరమాత్మను ధ్యానించడం వలన అమృతత్వం లభిస్తుంది. ఇది మినహా మోక్షప్రాప్తికి వేరు మార్గం లేదు.
  
శ్లో(1): సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్
      విశ్వం నారాయణం దేవం అక్షరం పరమ్ పదమ్!
తా: వేయి శిరస్సులు కలిగి అనేక నేత్రములతో ప్రపంచమునకు సుఖము చేకూర్చు వాడూ, సర్వ వ్యాపకుడు, సమస్త ప్రాణికోటికీ ఆధారమైనవాడు, శాశ్వతుడూ, శుభకరుడూ, మోక్షస్థానమైన వాడూ అయిన నారాయణునకు  నమస్కరించెదను.  
2-9-13
మంత్రపుష్పమ్

శ్లో(2):విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ హరిమ్,
     విశ్వ మే వేదం పురుషస్త ద్విశ్వ ముపజీవతి.
 (3):పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతం
    నారాయణం మహాయజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్.
తా: విశ్వానికి అతీతుడు, విశ్వమే తానైనవాడు, నిత్యుడూ, సర్వవ్యాపకుడూ, విశ్వానికి జీవనాధారమైనవాడూ, విశ్వపతి, విశ్వానికి ఈశ్వరుడూ, శాశ్వతుడూ, మంగళకరుడూ, నాశనము లేనివాడూ, తెలిసికొనదహిన పరమాత్ముడు, విశ్వాత్ముడూ, విశ్వపరాయణుడూ,అయిన నారాయణునికి నమస్కారము.    
3-9-13
మంత్రపుష్పమ్
శ్లో(4):నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః
     నారాయణపరం బ్రహ్మ తత్వం నారాయణః పరః
     నారాయణ  పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః!
తా: నారాయణుడే పరం జ్యోతి, పరమాత్మస్వరూపుడు,అతడే బ్రహ్మ, పరతత్వము, ధ్యానం చేసేవాడూ, ధ్యానమూ కూడ ఆ నారాయణుడే..  
4-9-13
మంత్రపుష్పమ్
శ్లో(5): యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శూయతేపి వా,
     అంత ర్బహి శ్చ త త్సర్వం వ్యాప్య నారాయన స్థితః
     అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంతంవిశ్వసంభువమ్! 
తా: బ్రహ్మాండంలో ఈ స్వలపమైన జగత్తు మహాకాసంలో వేరుగా తోచు ఘటాకాశం వలే కనిపిస్తుంది. ఉనికిని పొందుతుంది.దానికి బయటా, లోపలా, అంతా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. అనంతుడు, వినాశములేనివాడు అయిన ఈ దేవుడు సంసార సాగరం నుండి విముక్తిని ప్రసాదిస్తూ ప్రపంచమునకు సుఖం కలిగిస్తాడు. 
5-9-13
మంత్రపుష్పమ్
శ్లో(6): పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్!
తా: కంఠమునకు కిందిభాగంలో, నాభికి పై భాగంలో ద్వాదశాంగుళ ప్రమాణం గలిగి, అథోముఖంగా, ముకుళించి ఉన్న పద్మాన్ని పోలిన హృదయం నెలకొని ఉంది.
6-9-13
మంత్రపుష్పమ్
శ్లో(7,8,9): అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యా ముపరి తిష్ఠతి,
         జ్వాలామాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్,

         సంతతగ్ం శిలాభి స్తు లంబత్యాకోశసన్నిభమ్,
         తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్టితమ్,

         తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః,
         సోగ్రభుగ్విభజంతిష్ఠ న్నాహార మజరః కవిః,
         తిర్యగూర్ధ్వమధశ్శాయీ  రశ్మయ స్తస్య సంతతా.
తా: ఆ హృదయ కమలాన్ని ఆశ్రయించి, జ్వాలాసమూహంతో వెలుగుతూ, జీవులకు పొరధాన స్థానమై, అనేక నాడీ సమూహాలకు ఆలంబనయై, అరవిరిసిన పద్మాన్ని బోలిన హృదయాగ్రభాగంలో సూక్ష్మమైన కమలం ఒకటున్నది. దాన్లో సర్వం ప్రతిష్ఠితమై ఉన్నది.  దాని మధ్యలో అంతటా జ్వాలలు వ్యాపించు గొప్ప అగ్నిదేవుడున్నాడు. ఆ అగ్నియే జఠరాగ్ని. 

7-9-13
మంత్రపుష్పమ్

శ్లో(10):సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తకః,
      తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః.

తా: భుజించిన అన్నాన్ని ఆ అగ్ని సముచిత భాగాలుగా విభజించి పైకి, కిందికి, అడ్డముగాను ఉన్నది. ఆ అగ్నికిరణాలు ఆపాదమస్తకం వ్యాపించి ఉన్నవి. ఈ న్యాసముచే యోగధ్యానులు చేసేవారు మహా తేజోవంతులవుతారు.

8-9-13
మంత్రపుష్పమ్

శ్లో(11):నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
      నీవార శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా.

తా: ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన  అగ్నిశిఖ ఊర్ధ్వముగా పైకెగయుచున్నది. అది నీల మేఘం మధ్య మెరపువలె ప్రకాశించుచున్నది. నివ్వరి ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి అది అణువుతో సమానమై ఉన్నది. 
9-9-13
మంత్రపుష్పమ్

శ్లో(12): తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరి స్సేంద్రస్సో క్షరం పరమస్స్వరాట్! 

తా: ఆ అగ్నిశిఖ మధ్యలో పరమాత్మ ఉంటాడు. బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు ఆ పరమాత్మయే. నాశరహితుడు, మూలకారణము, స్వయంప్రకాశము గలవాడు ఆ పరమాత్మయే!

10-9-13

మంత్రపుష్పమ్

శ్లో(13): యోపాం పుష్పం వేద, పుష్పవాన్, ప్రజావాన్ పశుమాన్ భవతి,
       చన్ద్రమా వా ఆపాం పుష్పం, పుష్పవా ప్రజావాన్, పశుమాన్ భవతి, య ఏవం వేద. 

తా: ఉదకమున భగవంతుడు, ఆ భగవంతునిలో ఉదకమూ పరస్పరం ఆశ్రయాలై ఉన్నట్లు తెలుసుకున్నవారికి పుష్పాలు, సంతానం, పశువులు లబించుచున్నవి. ఆ ఉదక స్థాన వివరణమెరిగిన వారు ముక్తులవుదురు. 

11-9-13
మంత్రపుష్పమ్

శ్లో(14):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
      అగ్నిర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
      యోగ్నేరాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
      ఆపోవా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి,
      య ఏవం వేద.
తా: అగ్నిలో ఉదకం, ఉదకంలో అగ్ని పరస్పర ఆశ్రయాలు, ఈస్థితిని తెలిసిన వారు ముక్తులవుదురు. 

24-9-13

మంత్రపుష్పమ్

శ్లో(15):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
      వాయుర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
      యో వాయో రాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
      ఆపోవై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి,
      య ఏవం వేద.
తా: వాయువు ఉదకమునకు స్థానము. వాయువునకు జలాలు స్థానం. పరస్పర ఆశ్రయాలైన వీటిస్థానాలు గ్రహించిన వారు ముక్తి పొందుతారు.  
  
25-9-13
మంత్రపుష్పమ్

శ్లో(16):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
ఆసోవై తపన్న పామాయతనం, ఆయతనవాన్ భవతి,
యోముష్యతపత రాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
ఆపోవా అముష్యతపత ఆయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.
తా:తపింపజేస్తున్న ఈ సూర్యుడే జలస్థానమునకు అధినేత. జలస్థానమే ఆదిత్య స్థానం. వీటి పరస్పర అభేధ స్థితిని ఎరిగినవారు ముక్తులగుదురు.

26-9-13
మంత్రపుష్పమ్

శ్లో(17):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
     చన్ద్రమా వా ఆపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
     యశ్చ్ణన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి,
     ఆపోవై చన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి,
     య ఏవం వేద.
తా:జనులందరికీ సంతోషం కలిగించే చంద్రుడే జలస్థానపతి.జలాలే చంద్రునికి స్థానం. ఎ విషయం గ్రహించినవారు ముక్తి పొందుదురు.. 

27-9-13
మంత్రపుష్పమ్

శ్లో(18):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
     నక్షత్రాణివా  వా ఆపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
     యోనక్షత్రాణామాయతనం, ఆయతనవాన్ భవతి,
     ఆపోవైనక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి,
     య ఏవం వేద. 
తా:  జలాలకు నక్షత్రాలే స్థానం. ఆ నక్షత్రాల స్థితిని తెలుసుకుని జలమే స్థ్గానమని గ్రహించినవారు ముక్తులవుతారు..  

28-9-13
మంత్రపుష్పమ్

శ్లో(19):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
     పర్జన్యో వా ఆపామాయతనం, ఆయతనవాన్ భవతి,
     యః పర్జన్యస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి, 
     ఆపో వై పర్జన్యస్యాయతనం, ఆయతనవాన్ భవతి,
     య ఏవం వేద. 
తా:  ఉదకస్థానమునక్ మేఘుదే అధినేత. మేఘములకు జలమే స్థానం ఈ విషయం తెలుసుకున్నవారు ముక్తులవుతారు.  

03-10-13
మంత్రపుష్పమ్

శ్లో(20&21):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
సంవత్సరో వా ఆపామాయతనం, ఆయతనవాన్ భవతి,
యః సంవత్సరస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి, 
ఆపో వై సంవత్సరస్యాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద. 
యో ప్సు నావం ప్రతిష్ఠి తాం వేద, ప్రత్యేవ తిష్ఠతి. 
తా: సంవత్సరమే ఉదకమునకు స్థానం, ఉదకమే సంవత్సరమునకు స్థానం. నీటికున్న అభేదమును తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు. కాబట్టి ఇవి ఏవిధంగా అన్యోన్య ఆశ్రయంగా వున్నాయో తెలుసుకోవాలి. అల గ్రహించిన వారే ముక్తులు. పదవకు-నీటికి ఎలా అన్యోన్యాశ్రయం వుందో అలాగే ఇదికూడా తెలుసుకోవాలి.

04-10-2013
మంత్రపుష్పం 

శ్లో(22):కిం తద్విష్ణోర్బల మాహుః, కాదీప్తిః కింపరాయణం,
      ఏకో యాదారయ ద్దేవః, రేతసీ రోదసీ ఉభే.   
తా: ఐహికము, ఆముష్మికము అనే రెంటికి స్వయంప్రకాశమూర్తి ఐన భగవంతుడు ఒక్కడే లోకాన్ని ఎలా ధరించాడు? ఆ విష్ణువు బలమేమిటి? ఆయన ప్రకాసం ఎలాంటిది? అతని పరంధామం ఏది? 
శ్లో(23):వాతాద్విష్ణో ర్బల మాహుః, అక్ష్రాద్దీప్తిః రుచ్యతే,
      త్రిపదా ద్దారయ ద్దేవః, యద్విష్ణో రేక ముత్తమమ్.  
తా: ప్రాణాయామాదులచేత విష్ణువునకు బలం లభించింది. నాశనం లేనివాడవడం చేత ప్రకాశం కలిగింది. త్రిపదావిభూతి వలన లోక ధారణ చేయగలిగాడు. ఆయనకు విష్ణులోకం ఒక్కతే పరమపద స్థానం.

5-10-13
మంత్ర పుష్పం..

శ్లో(24):రాజాధిరాజాయ ప్రహస్య సాహినే, నమోవయం వై
శ్రవణాయకుర్మహే, సమే కామాన్, కామకామాయ
మహ్యం, కామేశ్వరో వై శ్రవణో దదాతు, కుబేర
య వై శ్రవణాయ, మహారాజాయ నమః.
తా: రాజులందరికీ రాజైన ఆ భగవంతునికి నమస్కారం. కామములకు ప్రభువైన ఆ దేవదేవుడు కోర్కెలన్నింటినీ సపహలెకృతం చేస్తున్నాడు. స్తోత్రాలు వినదంలో ఆసక్తి గలవాడు, బ్రహ్మాండానికి అధినేత ఐన శ్రీమన్నారాయణునకు వందనం.

6-10-13
మంత్రపుష్పం

శ్లో(25-26):ఓం తద్బ్రహ్మ,ఓం తద్వాయు, ఓం తదాత్మా,
           ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః

           అన్తశ్చరతి భూతేషు, గుహాయాం విశ్వమూర్తిషు, త్వం
           యజ్ఞ స్త్వం వషట్కార స్త్వ మిన్ద్రస్తగ్ం రుద్రస్త్వం 
           విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః.
తా: ఓం అనే ప్రణవమే బ్రహ్మ స్వరూపం. అదే వాయువు, అదే ఆత్మ, అదే సత్యం, సర్వకారణ స్వరూపం. ఇలా పలికి దానికి నమస్కరిస్తున్నారు. ఆ ప్రణవస్వరూపుడు సకల భూతముల హృదయాల్లోనూ నెలకొని ఉంటాడు. పర్వత గుహలో సంచరిస్తున్నాడు. విస్వమంతా వ్యాపించి ఉంటాడు.  ఓ దేవా! నువ్వు యజ్ఞానివి, నువ్వే వషట్కారమవు, ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ స్వరూపుడూ నువ్వే. ప్రజలను పాలించేవాడవూ నువ్వే!
7-10-13
మంత్రపుష్పం

శ్లో(27):త్వం తదాప ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్!

(28):ఈశానస్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రహమాదిపతిర్
బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం!
తా: ఓ దేవా, స్వయంప్రకాశాత్మవైన నువ్వే అపోజ్యోతివి. అమృతస్వరూపుడవు. రస స్వరూపుడవు. బ్రహ్మ రూపుడవు. భూర్భువస్సువర్లోకాలలో ప్రణవస్వరూపుడవు నీవే! 

తా:నువ్వు సర్వ విద్యలకు అధిపతివి. సమస్తభూతాధిపతివి. బ్రహ్మలోకానికి, బ్రహ్మానికి అధినేతవు. బ్రహ్మస్వరూపుడవు. శివుడవు, ఓంకార స్వరూపుడవు, మాకు ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించవలెనని ప్రార్ధిస్తున్నాను.

8-10-13
మంత్రపుష్పం

శ్లో(29):తద్విష్ణో పరమం పదగ్‌ం సదా పశ్యన్తి సూరయః
    దివీవ చక్షు రాతతమ్!
తా: తతవ్వేత్తలు పరమపదమైన విష్ణులోకాన్ని అంతరిక్షంలోని నాటకదీపమువలె జ్ఞాన దృష్టిచేత ఎల్లప్పుడూ చూస్తూఉన్నారు.
శ్లో(30):తద్విప్రాసో విపన్వవో జాగృదాం సస్సమిన్దతే విష్ణోర్య
      త్పరమం పదమ్!
తా:పరమపదమైన భగవంతుని మోక్షస్థానాన్ని శ్రద్ధాళువులు పొందుతారు. 
9-10-13
మంత్రపుష్పం 
(తాత్పర్య సహిత మంత్రపుష్పం నేటితో సమాప్తం:)
-----------------------------------------------------------          
పక్షం దినాల్లో పూర్తికావలసిన ఈ ప్రక్రియ మధ్యలో అనివార్య కారణాల వలన ఆలశ్యమైందని విన్నపం  
                                                                  *** 
శ్లో(31): ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్,
       ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమోనమః.

తా:ఋతస్వరూపుడు, సత్యస్వరూపుడూ, పరముడూ, బ్రహ్మస్వరూపుడు, విశ్వాకారుడూ, విశ్వనేత్రుడు, జగత్తుకు సుఖం ప్రసాదించువాడూ, పింగళవర్ణుడూ, ఊర్ద్వరేతస్కుడూ, ఐన భగవంతునికి ప్రణామములు.
శ్లో(32):నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి,
      తన్నోవిష్ణుః ప్రచోదయాత్. 
తా: శ్రీమన్నారాయణుడు, సర్వవ్యాపి అయిన వాసుదేవుడు, మహా విష్ణువు మా బుద్ధిని అపరోక్షానుభవ లాభసిద్ధియందు ప్రేరేపించును గాక.(ఇది నారాయణ గాయత్రి మంత్రం. ఇక్కడ ఇతర దేవతా గాయత్రి మంత్రములను సందర్భానుసారంగా చెప్పుకొనవచ్చును.)  
శ్లో(33): ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి  సాగరం,
       సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి!
తా: ఆకాశం నుండి పడిన నీరు సముద్రాన్ని చేరుతున్నట్లు ఏ దేవునికి నమస్కరించినా ఆ నమస్కార కేశవునికే చెందుతోంది.

(తాత్పర్య సహిత మంత్రపుష్పం నేటితో సమాప్తం:)
-----------------------------------------------------------        
పక్షం దినాల్లో పూర్తికావలసిన ఈ ప్రక్రియ మధ్యలో అనివార్య కారణాల వలన ఆలశ్యమైందని విన్నపం
-----------------------------------------------------------------------------------------------