ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :
[This is the intellectual property of Sri Vinjamuri Venkata Apparao ]
ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...
1. తత్ - గణేశ్వరుడు
2. స - నృసింహ భగవానుడు
3. వి - విష్ణుదేవుడు
4. తుః - శివదేవుడు
5. వ - కృష్ణ భగవానుడు
6. దే - రాథా దేవి
7. ణ్యం - లక్ష్మీదేవి
8. భ - అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రదేవుడు
10. దే - సరస్వతి
11. వ - దుర్గాదేవి
12. స్య - హనుమంతుడు
13. ధీ - పృధ్వీదేవి
14. మ - సూర్యదేవుడు
15. హి - శ్రీరాముడు
16. ధి - సీతామాత
17. యో - చంద్రదేవుడు
18. యో - యమదేవుడు
19. నః - బ్రహ్మదేవుడు
20. ప్ర - వరుణదేవుడు
21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీదేవి
మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.-- Vinjamuri Venkata Apparao
No comments:
Post a Comment