Monday 29 April 2013

ఖద్దరుధారి, నిబద్ద వ్యవహారి, ఆంధ్రగాంధి నిరాడంబర మహామనీషి వావిలాల 


కాశీనాధుని నాగేశ్వరరావు, ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణారావు, తెన్నేటి విశ్వనాథం, గౌతులచ్చన్న, కాళోజి నారాయణరావు వంటి ఉద్దంద నేతల వరుసలోని వారు శ్రీ వావిలాల. వావిలాల ప్రజల మనిషి, గొప్ప పార్లమెంటేరియన్. ఇరవయ్యో సంవత్సరంలోనే 1926 లొ సత్తెనపల్లి బాల కవితా కుటీరం వారి "విద్యార్ధి" త్రైమాసికపత్రికకు సంపాదకత్వం వహించారు. ఆ తరువాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చెంత మద్రాసులో "ఆంధ్రపత్రిక" దినపత్రికలో రెందేళ్లపాతు ఉపసంపాదకుడుగా పని చేసారు. మధ్యలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తొమ్మిది నెలలౌ జైలు జీవితం గడిపారు. 1928లోనే "జ్యోతి" పక్షపత్రికకు సంపాదకులుగా, "సహకారం" మాస పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.

1950 లో గుంటూరు జిల్లా పత్రికా రచయితల సంఘం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. జర్నలిజం పై కోర్సు రాసి రెండు స్కూళ్ళు నిర్వహించారు. జర్నలిజంపై వేసవి కళాశాలకు ప్రించిపాల్ గా వ్యవహరించారు. దిన, వార, పక్ష, మాస పత్రికలకు వివిధ అంశాలపై అసంఖ్యాకంగా విజ్ఞానాత్మక వ్యాసాలు రాశారు. శాసన సభ పని తెరు తెన్నెలు, పాలనాసంస్కరణలు, ప్రణాళికలు,ఇత్యాది వాటిపై 50 గ్రంథాలు, మరో 15 ఇంగ్లీషు పుస్తకాలు రచించారు.

1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నాయకుడు. ప్రజాప్రతినిధి. వక్త. బహుగ్రంథకర్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, ఆజన్మ బ్రహ్మచారి.స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, "పద్మభూషణ" పురస్కార గ్రహీత.

గోపాలకృష్ణయ్య జీవిత కాలంలో పలు రచనలు చేసారు. తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని1922లో తొలి రచన 'శివాజీ',1947లో మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?,1951లో విశాలాంధ్రం, 1976-77 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం మొదలైనవి ఆయన కలం నుంచి జాలువారాయి. "అంధ్రాగాంధీ" బిరుదాంకితుదు గా వెలుగొందిన ఆయన స్వతహాగా సోషలిస్టు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు. 1974-77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా వ్యవహరించారు. మద్యపాన వ్యతిరేకోద్యమ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరించి ప్రభుత్వ తీరుకు నిరసనాగా రాజీనామా చేశారు.2003 ఏప్రిల్ 29 న ఆయన మరణించారు.
కాశీనాధుని  నాగేశ్వరరావు, ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణారావు, తెన్నేటి విశ్వనాథం, గౌతులచ్చన్న, కాళోజి నారాయణరావు వంటి ఉద్దంద నేతల వరుసలోని వారు శ్రీ వావిలాల. వావిలాల ప్రజల మనిషి, గొప్ప పార్లమెంటేరియన్. ఇరవయ్యో సంవత్సరంలోనే 1926 లొ సత్తెనపల్లి బాల కవితా కుటీరం వారి "విద్యార్ధి" త్రైమాసికపత్రికకు సంపాదకత్వం వహించారు. ఆ తరువాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చెంత మద్రాసులో "ఆంధ్రపత్రిక" దినపత్రికలో రెందేళ్లపాతు ఉపసంపాదకుడుగా పని చేసారు. మధ్యలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తొమ్మిది నెలలౌ జైలు జీవితం గడిపారు. 1928లోనే "జ్యోతి" పక్షపత్రికకు సంపాదకులుగా, "సహకారం" మాస పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
 
1950 లో గుంటూరు జిల్లా పత్రికా రచయితల సంఘం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. జర్నలిజం పై కోర్సు రాసి రెండు స్కూళ్ళు నిర్వహించారు. జర్నలిజంపై వేసవి కళాశాలకు ప్రించిపాల్ గా వ్యవహరించారు. దిన, వార, పక్ష, మాస పత్రికలకు వివిధ అంశాలపై అసంఖ్యాకంగా విజ్ఞానాత్మక వ్యాసాలు రాశారు. శాసన సభ పని తెరు తెన్నెలు, పాలనాసంస్కరణలు, ప్రణాళికలు,ఇత్యాది వాటిపై 50 గ్రంథాలు, మరో 15 ఇంగ్లీషు పుస్తకాలు రచించారు.     

1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నాయకుడు. ప్రజాప్రతినిధి. వక్త. బహుగ్రంథకర్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, ఆజన్మ బ్రహ్మచారి.స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, "పద్మభూషణ" పురస్కార గ్రహీత.

గోపాలకృష్ణయ్య జీవిత కాలంలో పలు రచనలు చేసారు. తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని1922లో తొలి రచన 'శివాజీ',1947లో మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?,1951లో విశాలాంధ్రం, 1976-77 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం మొదలైనవి ఆయన కలం నుంచి జాలువారాయి. "అంధ్రాగాంధీ" బిరుదాంకితుదు గా వెలుగొందిన ఆయన స్వతహాగా సోషలిస్టు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు. 1974-77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా వ్యవహరించారు. మద్యపాన వ్యతిరేకోద్యమ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరించి ప్రభుత్వ తీరుకు నిరసనాగా  రాజీనామా చేశారు.2003 ఏప్రిల్ 29 న ఆయన మరణించారు.

No comments:

Post a Comment