మరో ఆధ్యాత్మిక మహోన్నతుడు జిడ్డు కృష్ణమూర్తి:
మనకు లభించిన అరుదైన ఆధ్యాత్మిక మహా పురుషులలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఆయన మనిషిగా మహోన్నతి చెందిన వారు. ఒక కుసుమంలా వికసించారు. దైవం పేరుతోనో,అతీత శక్తుల ముసుగులోనో పెరిగి పేరు సంపాదించ లేదు.ఆయనొక విజ్ఞాన ఖని.మానవ జీవితానికి సంబంధించిన విషయాలనే ప్రస్తావించారు.పరీక్షకు నిలిచిన అంశాన్నే స్వీకరించారు. జీవిత తత్వాన్ని లోతుగా పరిశీలించారు. తానూ చెప్పినది ఆలోచించి అవగాహన చేసుకోమన్నారు. జగత్తులో మానవ సంక్షేమకోసం తహ తహ లాడారు. బాల్యం నుంచే మహోన్నత భావ,గుణ, లక్షణ,లక్షితుడైన పరిపూర్ణ మానవతా మూర్తి జిడ్డు కృష్ణమూర్తి..నిశిత పరిశీలన,.సూక్ష్మ అవగాహనల సమ్మిళితమే ఆయన జీవితం. సంపూర్ణ స్వేచ్ఛ ఆయన వికాసానికి ఊపిరి.సమస్త మానసిక, భౌతిక నిబద్ధతకు లోను గాకున్దాఉన్దదమ్ ఆ స్వేచ్ఛకు జీవం.ఆయన మేధా సంపత్తి, విశాల హృదయం సమపాళ్ళలో వృద్ది చెందాయి.అందుకే సామాన్య వ్యక్తిగా జన్మించి అనన్య సామాన్య, విశ్వ మానవునిగా శిఖరాలను ఆరోహించారు.. ఆయన గురించి ఈ తరానికి తెలియాల్సింది ఎంతో ఉంది.
90 సంవత్సరాల 9 నెల లకు పైగా జీవించారు.1986 జనవరి 4 న మద్రాసులో "మరణము-ధ్యానము" అంశంపై ప్రసంగిస్తూ అది తన చివరి అభిభాషణమని చెప్పారు. అదే నెల 10 వ తేదీ కాలిఫోర్నియా వెళ్ళారు.లివర్ కాన్సర్ కు చికిత్సపొంది ఓహై పర్ణశాలలో విశ్రాంతి తీసుకున్నారు. ఫిబ్రవరి 16 వ తేదీ చైతన్య వృక్షమైన 'పెప్పర్ ట్రీ' కింద పద్మాశీనులై ధ్యానంలోకి జారుకున్నారు. అంతకు ముందు సన్న్హితుఅలను పిలచి "ఇది నా అంతిమ దర్శనం. నన్నొక దైవాంశ సంభూతినిగా చేయకండి.నాకెవరూ భక్తులు లేరు. నాకు స్మారక మందిరాలు, ఆలయాలు వద్దు. భౌతిక దేహాన్ని శుభ్ర పరచి అగ్నికి అర్పించండి. ప్రార్ధనలు, ఆరాధనలు, ప్రసంగాలు, ప్రజా దర్శనాలు వద్దు." అని స్పష్టం చేశారు.అర్ధ రాత్రి గడచిన పిమ్మట నిశ్చల,నిరీహ, నిర్మల,నిరంజన,తురీయ స్థితి పొందారు.ఆయన పాంచ బౌతిక పార్ధివ దేహం విద్యుద్దహన సాధనకు ఆహుతి అయిపోయింది. ఆమహనీయుడు కనుమరుగైనా ప్రవచనాల ద్వారా లోకావగాహణలో వెలుగై నేటికీ విలసిల్లుతున్నారు.
అయన 91 సంవత్సరాల నవయువకుదు, నవయుగ వైతాళికుడు. తాను బోధకుడనో, గురువునో కాదన్నారు. పదిమందితోబాటు విషయ చర్చచేస్తూ స్వస్వరూప జ్ఞానంద్వారా సత్యాన్ని తెలుసుకోవాలన్నరు. తాను చెప్పిన అంశాలను సాధికారికంగా తీసుకుని వల్లెవేయడం తగదని, జాగ్రత్తగా పరిశీలించి ఎవరికివారు నిగ్గుతేల్చుకోవాలని ఒకటికి పది సార్లు చెప్పే వారాయన.. అందుకే ఆయన గురించి ...
భారతీయులు కన్న బిడ్డ
అంగ్లేయుల ముద్దుబిడ్డ
అమెరికనుల గారాబుబిడ్డ
ప్రపంచపు దొడ్డ బిడ్డ!
జీవన దర్శన స్ఫూర్తి
వసుధైక కుటుంబ దీప్తి
తాత్విక యుగ చక్రవర్తి
అతడే జిడ్డు కృష్ణ మూర్తి!
అని ప్రస్తుతించారు..
No comments:
Post a Comment