Saturday 12 January 2013

మన వేమన పద్యం విశ్వజనీన వేదం 


1829 లో తొలిసారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించారు. తరువాత లభ్యమైన మరి కొన్ని పద్యాలను చేర్చి 1839లో ద్వితీయ ముద్రణ చేశారు. మనకు తెలిసిన శతక పద్యాలు చాలా తక్కువ. వేమన మొత్తం ఎన్ని పద్యాలు రాశాడన్నది ఇప్పటివరకు ఇతమిధ్థంగా లెక్కతేలలేదు. 1166 పద్యాలు మించి ఉన్నాయని ఒక వాదన. 1839 నాటి ప్రచురణ గ్రంధం దేశంలొ ఎక్కడా లభ్యంకాక పోవడంతొ, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతొ 1980లో పునర్ముద్రణకు పూనుకుని మూడు అశ్వాశాలుగా 417+467+279 మొత్తం 1163 పద్యాలతో ఒక సంకలనాన్ని తీసుకు వచ్చారు.
1980 జులై మాసంలొ ముద్రించిన పుస్తకం వెల కేవలం రెండున్నర రూపాయలు మాత్రమే. చెన్నారెడ్డి హయాం లోనే "యోగి వేమన తెలుగు విజ్ఞాన కేంద్రం" ఆధ్వర్యంలో ఆ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ఆ పుస్తకానికి చెన్నారెడ్డి పంపిన సందేశంలొ, " వేమన వంటి కవి మనకు మరొకరు లేరు. తెలుగు కవుల్లో ఇంత పుష్కలంగా ప్రజాభిమానాన్ని పొందిన వారుకూడాలేరు. నేటి విశాల ప్రపంచానికి ఎరుక పరచేందుకు అర్హత కలిగిన కవికూడా మరొకరు లేరేమో. ఆ అర్హత సత్తా ఉన్నందునే తమిళం, కన్నడం వంటి పొరుగు భాషల్లోనే కాకుండా, ఇంగ్లీషు, లాటిన్, ఫ్రెంచ్ వంటి పాశ్చ్యాత్త్య భాషల్లోకి కూడా వేమన పద్యాలు పరివర్తన పొందాయి. పర్యాప్తమయ్యాయి. ఆయన పద్యం విశ్వజనీనమైన వేదంలా, వాదంలా ధ్వనిస్తుంది, భాసిస్తుంది".. అని పేర్కొనారు. అంతే కాదు.. ".. వేమన కవిత్వం ఎన్నొ విధాలుగా విలక్షణమైనది.భ్హావంలో, భాషలో, శైలిలో, శిల్పంలో, చిత్తవృత్తిలో, అన్నింటా... ఆయన పద్యాలు నిత్యం ప్రజల నాలుకలపై నర్తించే సామెతలైపోయాయి. స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారన్నట్లు ..అజంతా గుహల్లోని ఆంధ్రుల శిల్ప సంపద, ఎట్లో వేమన ఆటవెలదుల్లోని హృదయాకర్షక శక్తి, చైతన్య స్ఫూర్తి అట్లా ఉంటాయి." అని చెన్నారెడ్డి అభిప్రాయ పడ్డారు. పుస్తక ప్రచురణ సమయంలో దేవాదాయ శాఖ కమిషనర్ గా యం చంద్రమౌళి రెడ్డి వ్యవహరించేవారు.  అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా   పి వి ఆర్ కె ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ ఈ పుస్తక ప్రచురణకు ఎంతో తోడ్పాటు నిచ్చింది. 

శివకవులకు, నవ కవులకు
శివభక్తికి తత్వమునకు, చింతామణికిన్
శివలోక ప్రమథులకును,
శివునకు గురువునకు శరణు సేయు వేమా..

అని పునర్ముద్రణ ప్రథమ భాగం మొదలవుతుంది.సాధారణ శతకాలలొ మనకు కంపించని పద్యాలెన్నొ దీనిలొ ఉండడం గమనార్హం..

17వ శతాబ్దానికి చెందిన యోగి వేమన కు గౌరవ పురస్కారంగా భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపు ముద్రించింది.

No comments:

Post a Comment