Thursday 6 June 2013

                     భక్తకోటికి నిత్యదేవుడు సత్యసాయి

               స్మారక తపాలా బిళ్ళ(పోస్టల్ స్టాంప్)   

 

 సత్యసాయి

భక్తులు ఆర్తిగా పిలుచుకునే మధుర నామం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ప్రేమ, శాంతి, దయ, ధర్మం,
అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గమని ఉద్బోదించి,తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేసిన సాక్షాత్ భగవానుడు. ఆయన భోధనలు మానవాళికి మార్గదర్శనాలు. ఆయన తత్వం ప్రేమ తత్వం. ఆయన మార్గం దైవ మార్గం. మన కోసం మన మధ్యే ఇప్పటికీ నడయాడుతున్న దైవ స్వరూపం. ప్రపంచమంతా ఒక్కటయ్యే మధుర క్షణం మనందరి కోసం వేచి ఉందని, మనుషులంతా దానికోసం కలిసి కట్టుగా పాటుపడాలనీ ఆయన ఉపదేశించారు.   సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి. తాను సకల దేవతా స్వరూపుడనైన అవతారమని బాబా చెప్పారు అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియడంలేదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పారు. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించారు.

తపాలా బిళ్ళ (పోస్టల్ స్టాంప్) 

ఇంతటి మహనీయునికి, భగవత్ స్వరూపునికి కేంద్ర ప్రభుత్వం  సముచిత గౌరవం  కల్పించి భక్తులకు పరమానందం కలిగించేందుకు శ్రీ సత్యసాయి తపాల బిళ్ళను ముద్రించాలని తాజాగా నిర్ణయించిది. ఇది ముదావహమే. నిత్యం కొలిచే  భక్తులకు సాయిని స్తాంపు రూపంలో తేవడం మరొక విధంగా బాధాకరంగా తయారయింది.  సాక్షాత్తు భగవత్ స్వరూపుని స్తాంప్ రూపంగ తెస్తే కవర్లపై అతికించే ఆ స్తంపులపి నిర్దాక్షిణ్యంగా తపాలా ముద్రలు వేసి ముఖ వచస్సును, గౌరవాన్ని కించపరచదం జరుగు తుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుచేత భక్తుల మనోభీష్టాన్ని గుర్తించి  కేవలం "సాయి" ప్రత్యేక బిళ్ళను, లేదా ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల చేయాలని పలువురు అభ్యర్ధిస్తున్నారు.  ప్రభుత్వం భక్తకోటి సెంటిమెంటును గౌరవించి  కేవల ప్రత్యేక స్టాంపును, ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల  చేయాలని పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ వి వి శ్రీధరన్, శ్రీ శ్రీ శ్రీ  విశ్వయోగి విశ్వంజీ మహరాజు, కుర్తాళం పీఠాధిపతి స్వామి సిద్ధేశ్వరానంద భారతి, స్వామి  పరిపూర్ణానంద తదితర పీఠాధిపతులు  సలహా ఇస్తున్నారు.

ప్రత్యక్ష దైవం 

సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను వెల్లడిస్తాయి. అవి అధికంగా హిందూ మతం సంప్రదాయాలను, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయని కొందరి అభిప్రాయం. తాను అందరిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, వేదాధ్యయనాన్ని సంరక్షించడానికీ అవతరించానని ప్రవచించారు. ఆయన తన బొధనలలో మరొక ముఖ్యాంశం - తల్లిదండ్రుల పట్ల భక్తి. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చి దిద్దుతారని, స్త్రీలను గౌరవించడం జాతీయ కర్తవ్యమని..
ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనలకు, ఆయన బోధనలకు, సమాజ సేవకు, వ్యక్తిత్వ వికాస ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. వాటిలో భక్తి ముఖ్యమైన అంశం. ఆయన ప్రచారాన్ని ప్రోత్సహించరు. సాయి సత్సంగాలలో అన్ని దేవతల, గురువుల భజనలు సాగుతుంటాయి.
సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి. తాను సకల దేవతా స్వరూప అవతారమని బాబా చెప్పారు. అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పారు.. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించారు. సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను తెలియజేస్తాయి.సాయిబాబా బోధనలు నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చు. ఒకటే కులం - మానవత; ఒకటే మతం - ప్రేమ; ఒకే భాష -హృదయం; ఒకే దేవుడు - అంతటా ఉన్నవాడు. సత్య సాయి బాబా అధ్వర్యంలో ప్రత్యక్షంగా, ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి. సాయిబాబా బోధనలు నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చు. ఒకటే కులం - మానవత; ఒకటే మతం - ప్రేమ; ఒకే భాష -హృదయం; ఒకే దేవుడు - అంతటా ఉన్నవాడు.
సత్య సాయి బాబా అధ్వర్యంలో ప్రత్యక్షంగా, ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి.
ఉన్నత విద్య : ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ (శ్రి శథ్య శై ఈన్స్తితుతె ఒఫ్ హిఘెర్ ళేర్నింగ్) ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం.)దేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా "ఆ++" రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి.
వైద్యం : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ (శ్రి శథ్య శై ఈన్స్తితుతె ఒఫ్ హిఘెర్ ంఎదిచల్ శ్చిఎంచెస్) 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 1991 నవంబరు 22న  అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రాంభించారు. ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. ఏప్రిల్ 2012 నాటికి  3,75,000 మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది.  అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది. ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి.
త్రాగు నీరు: అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి గోదావరి నదినుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. మరికొన్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయి, ఇంకొన్ని ప్రతిపాదన స్థాయి దాటాయి.
విద్య : ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య ((Educare, Education in Human Values) నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు.
సాయి సమితులు: దేశ దేశాలలో సాయి సమితులున్నాయి. సత్యసాయి సమితివారి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింసలకు చిహ్నాలు.
ప్రచురణలు : సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు 'సనాతన సారధి' అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి. 2001లో "సాయి గ్లోబల్ హార్మొనీ అనే రేడియో స్టేషన్ ప్రాంభమైంది.
సత్యసాయి సంస్థలకు పెద్దమొత్తాలలో విదేశాలనుండి విరాళాలు లభిస్తున్నాయి. మహిమలు:  బాబా మహిమల గురించి విస్తృతమైన నమ్మకాలుభక్తుల మనస్సులలో నాటుకుని ఉన్నాయి ఉన్నాయి. పుస్తకాలలోనూ, పత్రికా రచనలలోనూ, ఇంటర్వ్యూలలోనూ బాబా అనుచరులు బాబా మహిమల గురించీ, వ్యాధి నివారణ శక్తిని గురించీ తరచు ప్రస్తావించారు. భక్తుల అనారోగ్యాన్ని బాబా గ్రహించినట్లుగా పేర్కొన్నారు. అను నిత్యం బాబా విభూతిని, కొన్ని మార్లు ఉంగరాలు, హారాలు, వాచీల వంటి చిన్న వస్తువులనూ "సృష్టించి" భక్తులకు పంచిపెట్టడం భక్తకోతి ప్రత్యక్ష్మగా వీక్షించి తన్మయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఇళ్ళలో బాబా పటాలు, పూజా మందిరాలు, విగ్రహాలు, పీఠాలనుండి విభూతి, కుంకుమ, పసుపు, పవిత్ర తీర్ధజలం, శివలింగాలు, చిన్న సైజు (ఇత్తడి, బంగారం) దేవతా మూర్తులు, ప్రసాదాలు (తినుబండారాలు), విలువైన మణులు, దారాలు వంటివి లభించిన ఉదంతాలు ఉన్నయి. కిర్లియన్ ఫొటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి, విశ్లేషించడంలో నిపుణుడైనఫ్రాంక్ బారొవస్కీ బాబా కాంతిపుంజాన్ని పరిశీలించి; "అంతకుముందు తాను పరిశీలించిన ఎవరి కాంతిపుంజాలూ బాబా కాంతి పుంజాలలా లేవు. బాబా సామాన్యమైన వ్యక్తి కాదు. దివ్యపురుషుడై ఉండాలి. బాబా కాంతిపుంజం చాలా విశాలమై దిగంతాలకు వ్యాపిస్తున్నది. ఇంతకు ముందెన్నడూ చూడని బంగారు, వెండి (రంగు) ఛాయలు అందులో కనిపిస్తున్నాయి". అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

అవతార పరిసమాప్తి: 

ప్రపంచ వ్య్యప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ సత్యసాయిబాబా, 2004 ఏప్రిల్ 24 ఆదివారం ఉదయం (ఉత్తరాయణం వసంత రుతువు చైత్రబహుళ సప్తమి ఉత్తరాషాడ నక్షత్రంలో) 7.40 నిమిషాలకు  ఈ పాంచభౌతిక దేహాన్ని విడనాడారు. ఈ విషయాన్ని అధికారికంగా ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రకటించారు. మార్చ్ నెల 28న సిమ్స్ వైద్యసాలలో చేరిన బాబా 28 రోజుల అనంతరం 24వ తేది ఉదయాన అనంత విశ్వంలోకి ప్రయాణమయ్యారు బాబా . సత్య సాయి బాబా జన్మనామం  సత్యనారాయణరాజు . 1926 నవంబరు 23న పుట్టపర్తిలో జన్మించారు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. సత్యసాయి మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.  సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య  కోటికి మించి ఉన్నారని అంచనా.. కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 కోట్లుగా   చెబుతారు. సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.

తపాలా బిళ్ళ (పోస్టల్ స్టాంప్)

ఇంతటి మహనీయునికి, భగవత్ స్వరూపునికి కేంద్ర ప్రభుత్వం  సముచిత గౌరవం  కల్పించి భక్తులకు పరమానందం కలిగించేందుకు శ్రీ సత్యసాయి తపాల బిళ్ళను ముద్రించాలని తాజాగా నిర్ణయించిది. ఇది ముదావహమే. నిత్యం కొలిచే  భక్తులకు సాయిని స్తాంపు రూపంలో తేవడం మరొక విధంగా బాధాకరంగా తయారయింది.  సాక్షాత్తు భగవత్ స్వరూపుని స్తాంప్ రూపంగ తెస్తే కవర్లపై అతికించే ఆ స్తంపులపి నిర్దాక్షిణ్యంగా తపాలా ముద్రలు వేసి ముఖ వచస్సును, గౌరవాన్ని కించపరచదం జరుగు తుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుచేత భక్తుల మనోభీష్టాన్ని గుర్తించి  కేవలం "సాయి" ప్రత్యేక బిళ్ళను, లేదా ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల చేయాలని పలువురు అభ్యర్ధిస్తున్నారు.  ప్రభుత్వం భక్తకోటి సెంటిమెంటును గౌరవించి  కేవల ప్రత్యేక స్టాంపును, ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల  చేయాలని పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ వి వి శ్రీధరన్, శ్రీ శ్రీ శ్రీ  విశ్వయోగి విశ్వంజీ మహరాజు, కుర్తాళం పీఠాధిపతి స్వామి సిద్ధేశ్వరానంద భారతి, స్వామి  పరిపూర్ణానంద తదితర పీఠాధిపతులు  సలహా ఇస్తున్నారు. 

No comments:

Post a Comment