Monday 10 June 2013


                                అద్వాని అలిగారు- పార్టీ వీడారు.
                                   పదవి ఏమీనా చేయిస్తుంది..

భారతీయ జనతా పార్టీ కూడా పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా ఎదిగిందని లాల్ కృష్ణ అద్వాని రుజువు చేశారు. స్వాంత్ర్యం తొలిరోజులనుంచి దేశంలో దీటైన ప్రతిపక్షంగా వెలిగిన భారతీయ జనసంఘ్ ఎలియాస్ భారతీయ జనతాపార్టీ నేదు కాంగ్రెస్ వర్గ లక్షణాలు పుణికిపుచ్చుకుని రెండు వర్గాలుగా చీలిపోయింది. అధికారం రుచి మరిగిన వ్యక్తుల లక్షణాలు బహిర్గతమయ్యాయి. నేటి బిజెపి నాటి శ్యాంప్రసాద్ ముఖర్జీ పార్టీ విలువలు విసర్జించిందని అద్వాని వ్బాధపడ్డారు. దేశంలో బిజెపి లో తనకు దీతైన నాయకుడు లేదన్నా అద్వాని కలలు కల్లలై నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో బిజెపి ద్వారా దేశానికి గొప్ప నాయకుడు (ప్రధానిగా) ఎదుగుదలను సహించలేని శక్తులు నేడు పార్టీని బజారుకెక్కిస్తున్నాయి. పర్టెలో విలువలు మృగ్యమవుతున్నాయని అద్వాని వ్యథ చెందారు. వెంటనే పార్టీలో అన్ని పదవులకు రాజీనామాచేసి వైరాగ్యం ప్రదర్శించారు. దేశంలో మరుగున పడుతున్న ఒక రాజకీయ శక్తికి దీటైన నాయకత్వం లభించిందని సంతోషించవలసిన అద్వాని వంటి పెద్ద నాయకుడు అలగడం ఆయన స్వార్ధ చింతనను బహిర్గతం చేసింది. 

శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీందయాళ్ ఉపాధ్యాయ హిత వాదులు, అటల్ బిహారీ వాజ్‌పేయీ, మురళిమనోహర్ జోషి మితవాదులు, అద్వాని, ప్రమోద మహాజన్ తీవ్రవాదులు. ఇప్పుడు వారిని తలదన్నే ఉగ్రవాది మోడీ.




అవినీతి కాంగ్రెస్ పరువు గంగలోకలసి దేశంలోని ప్రస్తుత కలుషిత, అవినీతి, బంధుప్రీతి రాజకీయ వాతావరణంలో ఒక పెనుమార్పు మోడీ వల్లనే సాధ్యమవుతుందన్న విశ్వాసం సర్వత్రా యువత, విద్యాధిక, మధ్యతరగతి వర్గాల్లో, మోడీ నాయకత్వం కింద పార్టీకి మద్దతు పెరుగుతున్న తరుణంలో అద్వాని చర్య పర్టీనిఉ నవ్వులపాల్జేస్తున్నది. దేశం ముఖ్యమా.. వ్యక్తిస్వార్ధం ఎక్కువా తేల్చుకోవాలి. మోదీ పేరు తెరపైకి రాగానే కాంగ్రెస్, యు పి ఎ కూటమి వెన్నులో వణుకు మొదలైంది. ఇంతకంతే మంచి తరూనం బిజెపి కి రాదు. దేశం సుభిక్షంగా, అభివృధ్ధి దిశలో ఎదగాలంటే మోడీ నాయకత్వం అత్యవసరం. అద్వాని మనసు మార్చుకోవాలి. నాయకత్వం, ప్రధాని పదవికై పాకులాడకుండా మోడీ ని బలోపేతం చెయ్యాలి.

No comments:

Post a Comment