Sunday 14 July 2013

              ప్రతి వారికి ఒక ముఖ్య సమాచారం 

                 ప్రతివారికి సహాయ పడుతుంది 





ప్రతి వారికి ఒక ముఖ్య సమాచారం. ఇది ప్రతివారికి సహాయ పడుతుంది. దీనికి బహుళ ప్రచారం లభిస్తే ప్రాణాంతక వ్యాధుల నుంచి (శస్త్ర)చికిత్సలకు ఎవరి సిఫారసులు లేకుండా, ఏ ప్రజాప్రతినిధిని ప్రాధేయ పదకుండా ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక వంటి పథకం "ఆరోగ్యశ్రీ" కింద అమలవుతున్న "ఆరోగ్యమిత్ర" సేవలు ఇప్పటికీ రాష్త్ర వ్యాప్తంగా అమలవుతునే ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఇన్సూరెన్స్ కార్డులు లేని వారు, సి.ఎం.రిలీఫ్ ఫండ్ కాకుండా రోజుకు కనీసం రాష్ట్రంలోని ఏడు పట్టణాలలో కనీసం 500-600 మందికి తక్కువకాకుండా అన్ని వర్గాల ప్రజలు రెండు లక్షలనుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు విలువైన వైద్య చికిత్సలు ఉచితంగా పొందుతున్నారు. దీనికి ప్రభుత్వ పరంగా ప్రచారం లేకపోవడం వలన ఎక్కువ మందికి తెలియడం లేదు.

ప్రభుత్వ జాబితాలో ఉన్న అనేక కార్పోరేట్ ఆస్పత్రుల్లో దర్జాగా శస్త్రచికిత్సలు చేయించుకునే అవకాశం అలందరికీ లభిస్తుంది. ప్రభుత్వం పై విపక్షాలు(పత్రికలు) ఆరోగ్యశ్రీ పై దుమ్మెత్తిపోస్తున్నా పట్టించుకుంటున్న నాధుడు లేకపోవడం యంత్రాంగం నిరాసక్తత బహిర్గతమవుతున్నది. ప్రభుత్వం విమర్శల పాలవుతున్నది. తెల్ల కార్డు లేకున్నా ఈ ఉచిత వైద్యసేవలకు అందరూ అర్హులే.

వ్యాధిగ్రస్తులు, హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయం వద్ద ఆరోగ్య మిత్ర ట్రస్ట్ క్లినిక్ కార్యాలయానికి గాని, తిరుపతి స్విమ్‌స్, కర్నూల్ లో కొత్తగా నిర్మించిన జిజిహెచ్, కాకినాడ జిజిహెచ్, విజయవాడ జిజిహెచ్, విశాఖపట్నం కెజిహెచ్, వరంగల్ ఎంజిహెచ్ కేంద్రాలకు రోగులు ఆస్పత్రులు ధృవీకరించిన వ్యాధిపత్రాలతో, తగిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రతిరోజు ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు వెళితే, ఎవరి సిఫారసు లేకుండానే స్పెషాలిటీ నెట్‌వర్క్ ఆస్పత్రులలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్యాకేజిల కింద హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అనుమతి తీసుకుని ఎలాంటి చెల్లింపులు లేకుండా చికిత్స లభిస్తుది. ఇందుకు అయిన యావత్ ఖర్చులను ప్రభుత్వమ్నుంచి ఆయా ఆప్సత్రులకు నేరుగా చెల్లింపుంపులు జరుగుతాయి.

కాంప్ కార్యాలయాం వద్ద రోగనిర్ధారణ పత్రాలతో పాటు పక్క పోస్టరులొ చూపిన గుర్తింపుకార్డులలో ఏదో ఒకటి జత చేయవలసివుంటుంది. అక్కడి సిబ్బంది రోగి ఫొటో, వేలిముద్రలు (బయోమెట్రిక్)తీసుకుని సంబంధిత ఆస్పత్రికి రెఫెరల్ కార్డు జారీ చేస్తారు. ఆ కార్డు తీసుకుని నేరు ఆస్పత్రికి వెళితే 10 రోజులలోగా పైసా చెల్లించకుండా ఉచితంగా శస్త్ర చికిత్సలు జరుపుతారు. ముఖ్య మంత్రి నగరంలోఉన్నా, లేకున్నా, సెలవు దినాలతో ప్రమేయం లేకుండా 365 రోజులూ ఈ ప్రక్రియ సాగుతుంది. హైదరాబాద్ సిఎం కాంప్ ఆఫీసు వద్ద ప్రతిరోజు కనీసం 100 నుంచి 150 మందికి ఈ సేవలు లభిస్తున్నాయి. మొత్త ఏడు కేంద్రాలలో రోజుకు సగటున 600 మందికి ఈ సేవలు లభిస్తున్నాయి. గులాబి కార్డు దారులకు మాత్రమే కాకుండా ఏకార్డూ లేని వారికి కూడా కహరీదైన ఈ ఉచిత వైద్య సేవలు అందుతాయి. సి ఎం సహాయనిధి కొసం వెంపర్లాడి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెంట తిరగవలసిన అవసరం లేదు. ముఖ్య మంత్రి కార్యాలయమ వద్ద పడిగాపుల పని లేదు. రాష్ట్రంలోని మొత్తం ఏడు కేంద్రాలవద్ద సిబ్బంది అన్నీ నమోదు చేసుకుని కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి కేవల గంటన్నర వ్యవధిలో రోగికి రెఫెరల్ కార్డు జారీ చేస్తారు.

చేస్తున్న పనులను ప్రభుత్వం తగిన ప్రచారం చేసుకోలేక అభాసుపాలవుతున్నది. పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు సయితం ప్రజలకు సమాచారం ఇవ్వడంలో శ్రద్ధకనబరచక రాజకీయాలపై దృష్టి పెట్టదం వలన ప్రజలు ఇబ్బందు ఎదుర్కొంటున్నారు.

(మా బంధువు శస్త్ర చికిత్స విషయంలో పదిరోజులు అందరి చుట్టూ ప్రదక్షిణలు చేసి విఫలమైన నేపథ్యంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ముఖ్య సమాచారమిది. కేవలం గంటన్నర లో రెఫెరల్ కార్డు తీసుకుని సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్స సదుపాయాన్ని సీతారామ శాస్త్రి గారు ఉచితంగా పొందగలుగుతున్నారు)

No comments:

Post a Comment