Friday 22 February 2013




                                                ఇది రాజకీయ మాయాజాలం. రాజకీయ రచనల బృందం.


                                             
                                              

ఓం శ్రీ పద్మావతి సహిత వేంకటేశ్వరాయనమః. ఓం గురుభ్యోన్నమః, జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరిదేవికి ఫ్రణామములు. చెల్లెలు భావరాజు పద్మినికి కృతజ్ఞతలు. 

ఇది రాజకీయ మాయాజాలం. రాజకీయ రచనల బృందం. విలువలను గౌరవించే వ్యక్తులకు సాదర ఆహ్వానం..

ఈ రోజు పవిత్ర భీష్మ ఏకాదశి.ప్రపంచ మాతృభాషా దినోత్సవం కూడా కలిసొచ్చింది. గురువారం. జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ శుభదినాన నాకు, నా తోటి వారికి ఆసక్తిదాయక కార్యక్రమం చేపట్టాలన్న అలోచన తళుక్కున మస్తిష్కంలొ మెరిసింది. 

ఆందుకు స్ఫూర్తి నా చెల్లెలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావరాజు పద్మిని. నా ఆలొచనలు, వృత్తి, ప్రవృత్తిని గమనంలో ఉంచుకుని,"అన్నయ్యా నీకిష్టమైన రాజకీయ రంగం నుంచి ఈ మధ్య దూరమవుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. నీ ఆసక్తిని చంపుకోవద్దు. సృజనను వెలికితీసి తెలుగు భాష, ఆధ్యాత్మికం, రచనా వ్యాసంగంతో పాటు నీ మూడున్నర దశాబ్దాల పాత్రికేయ వృత్తికి మూలామైన రాజకీయంపై మళ్ళీ దృష్టి సారించి, రాజకీయ మాయాజలంపై నీ అస్త్రాలు సంధించడం ప్రారంభించు, నీ భావజాలం కలిగిన వారితో కలసి అడుగులు కదుపు" అని సలహా ఇచ్చింది.

నన్నేమి చేయామంటావమ్మా, అని అడగగా, రాజకీయ అంశాలపై ప్రత్యేక బృందం (గ్రూపు) ప్రారంభించవలసిందిగా సలహా ఇచ్చింది. చెల్లెలు ప్రోత్సాహం నాకు వెయ్యేనుగుల బలం ఇచ్చినట్లయింది. అందుకే శుభస్య శీఘ్రం అన్నట్లు, చెల్లెలు అమృత హస్తాలతొ రాజకీయ బృందానికి శ్రీకారం చుడుతున్నాను. రాజకీయ అంతా మాయాజాలం దానికి తోదు ఇది అంతర్జాల ప్రపంచం అందుకని ఈ గ్రూపునకు "రాజకీయ మాయాజాలం" గా నామకరణం చేయించాను. నందిరాజు ఇంటి ఆడపడుచు పద్మిని చేతుల మీదుగా కొద్ది నిముషాల కిందటే అధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలింపజేయించి ఆ బంగరు తల్లి చేత ప్రారంభింపజేశాను.

అచ్చంగా తెలుగు ఏర్పడి నేటితొ ఏడాది పూర్తైన శుభ ఘడియల్లో ఆ అమృత హస్తాలతో మరో నూతన బృందావిష్కరణ జరిగింది. నాతో మీరుకూడా అలోచనలను పంచుకుంటారని, నిష్పాక్షికంగా రాజకీయ విశ్లేషణలకు తోడ్పాటునిస్తారని ఆశిస్తున్నాను. విలువల ప్రాతిపదికపై ఈ బృందం నడుస్తుంది. రాజకీయ నాయకుల అభిప్రాయాలకు కూడా తావిస్తాము. వ్య్క్తిగత దూషణలు, విమర్శలకు చోటు లేదు. కేవలం ప్రజాల ఆకాంక్ష మేరకు రాజకీయ ప్రస్తావనలు జరుగుతాయి. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఇక్కడ మిత్రులు, స్నేహితులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయ వచ్చు.

ఒక్కొక్కరు రోజులో ఒక అంశంపై 10-12 పంక్తులకు మించకుండా పోస్టింగ్స్ ఇవ్వవచ్చు. వర్తమాన రచనలకే ప్రాధాన్యం. పాత రచనలు, ప్రచురణలకు ఏమాత్రం స్థానం లేదు.బ్లాగు రచనలకు తావు లేదు. ఇక్కడ రాసిన అనంతరం మాత్రమే వారి సొంత బ్లాగుల్లో పెట్టుకోవచ్చు. ఆధ్యాత్మిక,సంగీత, సాహిత్య, భాషాభి వృధ్ధి అంస్శలకు కూదా ప్రాముఖ్యత కల్పిస్తాము. కవితలు, గేయాలకు ఇక్కడ ఆస్కారం లేదు. ఇది జనవేదిక వంటిది. చెల్లెలు పద్మిని తనకు ఇష్తమైన అంశంతో ఒక వ్యాసంగాని అందివ్వాలని అభ్యర్ధిస్తున్నాను. ఇక మొదలిడదామా!!

No comments:

Post a Comment