ఒకానొకప్పుడు గురువు శిష్యులు ఒకరికోసం ఒకరు తపించేవారు. ఇది కలికాలం కదూ.... ఈ తరం గురువులు కూడ కలి బారిన పడ్డారు. కాసులు, కోరికలూ వదలటం లేదు. ఎంత దండుకుందామా అని మాత్రం చూస్తున్నారు. ఎంతిచ్చినా తీరటం లేదు. చేతి దురద.... ఎంతసేపూ తన స్వార్ధం చూడటమే కానీ ఇచ్చిన కాసుకి తగినంత విద్య చెప్పామా అన్న కనీస, ఆ చిన్న ఆలోచన, కూడా చేయటం లేదు. ఎంతసేపూ శిష్యులని హింసించడమే కాని మూడు వేళ్ళు తమను చూపుతున్నాయన్న కనీస యొచనకూదా లేకుండాపొయింది. గురువు తెలిసే చేస్తుంటే శిష్యులు నిస్సహాయంగా ఎవరిదారి వారు వెతుక్కుంటూ వెడుతున్నారు. తానుగా గురువు ఇది నువ్వు చెయ్యి, అని అంటారేమోనని నిజమైన శిష్యులు ఎదురుచూస్తున్నారు. కానీ ఎందుకు ఈ గురువులు అనటం లేదు? అనలేకపోతున్నారు?
గురువుని మించిన శిష్యులు అంటే పాత తరం గురువులు పొంగిపోయేవారు. ఈ తరంలో అటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు. ఎవరు ఎక్కువ సొమ్ము ముట్టజెబితే వారికే విద్యను విక్రయిస్తున్నారు. కాసు కున్న విలువ విద్యకి లేదు. సమాయానికంతకన్నా లేదు. పడిగాపులు గాచినా విద్య మాత్రం దక్కదు. చివరికి కాసులూ పోయి, సమయమూ వృధాఅయి, విద్యలేకుండా, సమాజంలో సంపాదించుకున్న ఆ కాస్త మర్యాదా పోయి, పరపతి పోయి, ఒట్టి చేతులతో, అవమాన భారం నెత్తినేసుకుని, చక్కాపోవటమే శిష్యులకు మిగులుతున్నది.
జ్ఞాన సంపద ఒకచోట, కాసుకోసం మరోచోట పనిచేసి అలిసి సొలసి పోవటం ఇప్పటి గురువు వ్యవహారం. రాజకీయ వాతావరణం మారక పోవటం నిప్పుకు గాలి తోడైనట్లయింది. అందుకే ఏ రంగంలోనూ విద్యార్హతలు, జ్ఞాన సంపద కలవాళ్ళూ కరువయ్యారు. అంతటా, కాసుల గలగలలు, రాజకీయత. లోపాయికారీ తనంతో విద్య సంపాదించిన శిష్యుల రెపరెపలు తప్ప, జ్ఞాన సముపార్జన కనుమరుగవుతున్నది.
No comments:
Post a Comment