Monday 30 December 2013


పాత్రికేయునిగా తిరుమల రామచంద్ర.. 
------------------------------------

(శత జయంతి పురస్కరించుకుని "ఆంధ్రజ్యోతి" దినపత్రిక 21-12-2013(శనివారం సంచిక)న ప్రచురితమైన సాహితీ వ్యాసం )


తెలుగు సాహిత్యం, పత్రికా రంగాలలో ప్రాతఃస్మరణీయులు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సారస్వతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు.  తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న తిరుమల రామచంద్ర విధ్వాన్, విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. అనంతరంజ్ ఢిల్లీ వచ్చి "డెయిలీ టెలిగ్రాఫ్" ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశారు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేశారు. తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు.  ఆరోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి , బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యారు. ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక లలో వివిధ హోదాలలో పనిచేశారు. "భారతి" మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురింఛిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశారు. నార్ల తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నారు.  డైలీ టెలిగ్రాఫ్‌లో చేరిన వెంటనే దాని సంపాదకులు వెంకట్రామన్‌ రామచంద్రగారికి ఇచ్చిన మొట్టమొదటి అవకాశం ప్రఖ్యాత పరిశోధకుడు, బహుభాషా వేత్త అయిన రాహుల్‌ సాంకృత్యాయన్‌గారి ఉపన్యాసాన్ని కవర్‌ చేయడం. తర్వాత హైదరాబాద్‌లో సంగెం లక్ష్మీబాయిగారిని కలిసి తెలుగు పత్రికా జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి పత్రికా రంగంలోనే స్థిరంగా ఉన్నారు.  రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్ధించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

ప్రొఫెసర్‌అప్పాజోస్యుల సత్యనారాయణగారన్నట్లు ఆయన పనిచేసిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, భారతి మొదలైన పత్రికల్లో ఏ ఒక్క పత్రికల్లో స్ధిరంగా ఉండినా దానికి సంపాదకుడు అయి ఉండేవారే. అందరు పత్రికా సంపాదకులను తనకన్న చిన్నవారుగాకాక మిన్నవారుగా అంగీకరించి, వారి కింద పనిచేసిన వినయశీలి తిరుమల.  డా. అక్కిరాజు రమాపతి రావు   'తిరుమల రామచంద్ర మనసుతోనే, మనస్విగానే బతి కారు. ఆయన నిరాడంబర వచస్వి, 60 ఏళ్లకు షష్టిపూర్తి చేయించుకోలేదు. 70 ఏళ్లకు సప్తతి జరగలేదు. 80 ఏళ్లకు అశీతి అసలేలేదు. 84 ఏళ్ల సహస్రచంద్ర దర్శనం సమ కూరలేదు. ఆయనది ఏమీ పట్టించుకోని మనస్తత్వమన్నారు. ఆయన గురించి ఆయన  'హంపి నుంచి హరప్పాదాకా'  రాసుకున్న ఆత్మకథలో 'ఇవి నా జీవితంలో మూడోవంతు సంఘటనలు, నేను సామాన్యమానవుడ్ని, కానీ నాలో వైచిత్య్రం, వైవిధ్యం ఉన్న మాట నిజం. ఎవరి జీవితంలో లేవు గనుక. ప్రతి మనిషి ఒకే మూసలో పోసినట్టుంటాడా? అయినప్పుడు వైవిధ్యం తప్పదు.  పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. "హైదరాబాద్ నోట్ బుక్" వంటి 15 శీర్షికలు నిర్వహించారు."సత్యాగ్రహ విజయం" నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు.  'మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు'అన్న రామచంద్ర రచన భాషాచరిత్రకే తలమానికమంటూ ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదన్న విశ్వాసాన్ని 'ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు'గారు ప్రకటించటం రామచంద్ర అలుపెరుగని పరిశోధకుడు అనడానికి నిదర్శనం. ప్రచారానికి ఆయన ఏనాడు అంగలార్చిన వాడుకాడు. నిరాడంబరత, నిండు మనసు, ఓరిమి వారి వ్యక్తిత్వంలో ఇమిడిపోయాయి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు.  లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు. దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

ఏడు దశాబ్దాల కిందటే  తెలంగాణ  అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు. ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రస్తావనకు రాలేదు. ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీకరించారు. . ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో,  తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు  కమలాపురం నుంచి క్వెట్టాదాకా  లేదా  హంపీ నుంచి హరప్పా దాకా  అని ఉంటే బాగుంటుందని ఆయన ముందుగానే అభిప్రాయపడ్డారు. జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు,  ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని ఆరాతీస్తే,  మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి  అని తేలింది.  అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు. తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇది ఆయన శతజయంతి వత్సరం కావడం విశేషం. .

ఆయన గ్రంథాలు  మన లిపి, పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండేదని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ, ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని రెండు ఇంటర్య్వూల్లో  రామచంద్ర  చెప్పారు.  తిరుమల రామచంద్ర జీవితంలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు.

బ్రిటీష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాలలో పనిచేసినప్పుడు, అచ్ఛర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సర్సవతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిలీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన వీరే మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామావిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమాస్తాగా, కాన్పూర్‌లో మరి కొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచంద్ర జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచుకున్న రచనలు మొదలైన వివరాలు మిత్రులకు లభ్యమయ్యాయి.  ఆయన  మూడు వాఞ్మయ శిఖరాలు  అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.  అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రాఘవపల్లె లో జన్మించిన రామచంద్ర తెలుగు, సంస్కృతాలలో విధ్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు. ఆయన నిత్య పాత్రికేయుడు, రచయిత, అధ్యయన శీలి, విద్యార్థి కూడా.. ఆయనకు శతకోటి  వందనాలు..

---నందిరాజు రాధాకృష్ణ,

రోతను పాతరేద్దాం...
పాతకు పట్టం కడదాం...
కొత్తను నెత్తికెత్తుదాం...
మంచిని ఎంచుకుందాం...
మనసును పంచుకుందాం... 

31-12-13
ఇది పాత సీసాలో పాత సారానే.. అర్ధరాత్రినుంచి కొత్త సరుకు..ఫుల్ జోష్!!
-------------------------------------------------------------------------------------

*తొందరపడి ఒక కోయిలా, ముందే కూసింది, నేలకు ఒరిగింది..--అమేథీలో రాహుల్ పై పోటీ చేస్తా! ధైర్యం ఉంటే మోడీ కూడా బరిలోకి దిగాలి--ఆప్(అతి) విశ్వాస్
*ఎన్నికల వేళ ఎన్నెన్ని కళలో!-- రాష్ట్రంలో 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్-కొలువుల మేలా!
*ఎక్కడబట్టినా అవినీతి కక్కులే--- రాజకీయనాయకులకు తిన్నదరగని అజీర్తి రోగం
*యథా రాజా తథా ప్రజా
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అసంబద్ధం -- విభజనపై ముఖ్యమంత్రి.
ప్రభుత్వాస్పత్రులలో మాకు వైద్యమా.. మేమొప్పుకోం ఉద్యోగులు!!
*మన ఘన నగరపాలక సంస్థ మొద్దు నిద్రకు తార్కాణం. -- అనుమతులు లేకుండా పదేళ్ళుగా నగరంలో వేల సెల్ టవర్లు
*ఏపి చాయ్ వాలాలతో మోడీ ముఖాముఖి -- కొంచెం అలోచించండి సార్, ..బార్ వాలాలతో మరీ బాగుంటుందేమో!!!
*మళ్ళీ డిల్లీ విమానాలకు రద్దీ - రాష్ట్రపతి నేడు డిల్లీ తిరుగు ప్రయానం.
*రాష్ట్ర ప్రజాలారా రెండ్రోజుల్లో ప్రాణాలు ఇన్సూర్ చేయించుకోండి-- బొత్స సత్తెయ్య నిజంగా 3న ఆస్తులు ప్రకటిస్తారట!!
*మందు ఉప్పెనలో మునిగిన భాగ్యనగరం - డిల్లీలో కుళాయిల్లో కట్టలు తెంచుకున్న "ఆప్" నీటి పరవళ్ళు..

29-12-13

*వాటికన్ సిటి మాదిరి తిరుపతికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి: .!! ఆ విషయంలో మాత్రం, బాబే కరెక్ట్. అదే వై ఎస్ ఉండి ఉన్నట్లయితే ఏడుకొండలు రెండుకొండలై మిగిలినదంతా నిజంగా వాటికన్ సిటి అయ్యుండేది.. అందుకే బాబు బతికి బట్టకట్టాడు.  
*బలాఢ్యులు, ధనాఢ్యులు, గుణాఢ్యులు... అదొక పాత కేటగిరి!! కులాఢ్యులు, మదాఢ్యులు .. ఇది కొత్త కిరికిరి.
*ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. రాజకీయ నాయకులకు వెల్త్ కార్డులు.. ఈ స్కీమేదో బాగుంది కదా!!
*తడిగుడ్డతో గొంతు కొయ్యడం కాంగ్రెస్ కు అలవాటట....ఉండవల్లి గారికి 10 ఏళ్ళ ఎంపి అనుభవంతో జ్ఞానోదయమైంది ఈ రోజు:
మరి పదేళ్ళుగా మనమెన్ని గొంతులు కోసామో అక్కడ ఉండి? ఇప్పుడు అనుభవం తలపండి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన రొమ్మును సమైక్య కత్తితో కోస్తున్నారు..
*మీరు మరొక విషయం గమనించారా!! ఆంధ్రా ఆక్టోపస్ (లగడపాటి) మరొక జోస్యం చెప్పింది - జగన్ కాంగ్రెస్ లో చేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య సత్తిబాబు చెప్పినట్లు 30 మంది కాదట. 70 మందట..కేంద్ర మంత్రు కూడా ఇద్దరున్నారట ఆ జాబితాలో: కొంపదీసి బొత్స ఝాన్సీ కూడా ఉందో ఏమిటో??  
*వివేక్, మందా గులాబి దండులో జేరి కెసీఅర్ పక్కనే కూర్చుని సిఎమ్‌ను తూర్పారబట్టారు. అయినా వారు కాంగ్రెస్ ఎంపీలే! కాంగ్రెస్ కు అంటూ.. ముట్టూ ఉండదు..
*గౌడ్ గారు ప్రాయశ్చిత్త పరిహారార్ధం అందుకే మళ్ళీ కంచిగరుడ సేవ మొదలెట్టారు..
*ఒకే వొరలో ఎన్ని కత్తులో! ఒకే వేదికపై ఎన్ని కుత్తుకలో!! ఉండవల్లి, లగడపాటి, సబ్బం---హర్షకుమార్, కావూరి, రాయపాటి..ఇదెలా సాధ్యం?
వీరి సమన్వయ కర్త ఎపి జ(ఎ)ర్నలిస్టుల ఫోరం..
*ధనముంటే ఏ సభకైనా జనమొస్తారు.... కావాలంటే చూడండి చిత్తూరు జిల్లాలోనే ఒక వైపు జగన్, మరొక వైపు బాబు..... అబ్బబ్బ ఇసకేస్తే రాలడం లేదు..విసుగేసినా ఆగడం లేదు..
*నిజమే! అమ్మ పెట్టదు..అడుక్కు తినమంటుంది... అది అమ్మ ఆద్మీ పార్టీ..  
*టీడీపీ ప్రజాగర్జనకు నన్ను ఆహ్వానించలేదు: హరికృష్ణ----గర్జనలకు జవసత్వాలుడిగిన వృద్ధ (వృధా) సింహాలను పిలవరు..
26-12-13

*మాతృభావం, పితృభావం, గురుభావం, సోదరభావం, స్నేహభావం, గౌరవభావం... ఇవన్నీ వాంఛనీయమే కాని అహంభావం మాత్రం అవాంఛనీయం....
*శ్రీకారం, స్వీకారం, మమకారం, ఉపకారం,అపకారం, తిరస్కారం, నమస్కారం, పురస్కారం, ఓంకారం, ... ఏవైనా భరిచవచ్చు. కానీ అహంకారులను అర క్షణం కూడా సహించకూడదు..
*We can bear cheating.. we can spare deceiving.. but we should not tolerate betraying.
*short cuts in life cut short life.. be careful !
*Influence may workout some times..be careful, it is highly inflammable all times.
20-12-13

*ప్రధాని పదవికి పోటీలో జయలలిత!! --- దక్షిణంలో మగాళ్ళకు చేతకాని పని. ఒక మహిళ అలా ధైర్యం చేస్తున్నందుకు. చాలా గర్వించదగిన విషయం. దక్షిణ సామ్రాజ్ఞి.

19-12-13

*ఇవ్వాళ రాష్ట్రం విడిపోవడానికి అందరూ ఎలా అంగీకరించడంలేదో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు, కలవడానికి కూడా అందరూ అంగీకరించలేదు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1955 నవంబరు 29వ తేదీ హైదరాబాద్ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ.. ఇలా చెప్పారు:  
"విభజనానంతరం హైదరాబాద్ భవిష్యత్తు నిర్ణయాధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసులపై ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్మానం రూపొందించారు. దానిలో లోపాలోపాలు నాకు తెలుసు. సభలోని అన్ని వర్గాలను తీర్మానం సంతృప్తి కలిగించలేదనీ నాకు తెలుసు. నోటీసుపై వచ్చిన రెండు డజన్ల సవరణలు  ఈవిషయం తెలియజేస్తున్నాయి.
కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా అభిప్రాయ బేధాలున్నాయి. తెలంగాణలో మూడురకాల అభిప్రాయాలున్నాయి. ఆ మూడూ:
తక్షణ విశాలాంధ్ర నిర్మాణానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యవర్గం సలహా పాటించాలి.
శాశ్వతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి.
ఎస్సార్సీ సిఫారసులను ఆమోదించడమే మంచిది.
సభ్యుల అభిప్రాయం భారత ప్రభుత్వానికి తెలియజేస్తాం. వ్యవధి లేనందువల్ల చర్చలో పాల్గొనే అవకాశం లభించని సభ్యుల లిఖిత పూర్వక అభిప్రాయాలను అంగీకరించడమా? లేకపోవడమా? అనేది సభాపతి నిర్ణయం. ఏది ఏమైనా ఈ విషయమై తుది నిర్ణయం చేసే అధికారం పార్లమెంటుదే!!" 

Wednesday 18 December 2013

పెళ్ళి కుదరదు-పిచ్చి తగ్గదు.. 
రాజకీయం రంగుల మయం.. 
వారంలో  వ్యాఖ్యల వాతలు..

17-12-13

*నాకు తొలగని ఆశ్చర్యం ఒకటే.. హైదరాబాద్ నగరంలో ఏ టూ వీలర్, ఫోర్ వీలర్ మీద చూసినా స్టిక్కర్లే స్టిక్కర్లు.. "ప్రెస్, డిఫెన్స్, డాక్టర్, కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్, మిలిటరి, ఆర్మి, జిహెచ్ఎమ్‌సి, ట్రాన్‌స్కో.." ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్ల సంగతి చెప్పక్కరలేదు..అని. హైదరాబద్ నగరంలో మాంసం తీసుకెళ్ళే స్కూటర్లమీద, ఆటో ట్రాలీల మీదా కూడా పెద్దక్షరాల్లో కనిపిస్తాయి "ప్రెస్" అని. మన రాష్ట్రంలో, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎన్నోచోట్ల తిరిగా. ఈ వింత ఎక్కడా కనబడలేదు.!!

*నాలుగు దశాబ్దాల నిఖార్సయిన కలంతో నిజాల నిప్పులు వర్షం కురిపిస్తూ, సహచర పాత్రికేయులను ఆత్మీయాతా "పాశం" తో బంధించి, వారి "యాద్"లో "గిరి" శిఖరమై నిలిచిన "పాశం యాదగిరి" మిత్రుని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసిన శుభతరుణంలో ఆప్తునికి అభినందన మందార మాల. ఆంధ్రపత్రిక, ఈనాడు, ఉదయం దినపత్రికల్లో కలాన్ని ఝళిపించి, "వర్తమానం" పత్రికకు స్వయానా సారధ్యం వహించిన అక్షర యోధునికి మరోసారి హృదయపూర్వక శుభాభినందనలు.

*సోదరి మాధవి ఈ నెల 15వ తేదీ వ్యక్తపరచిన భావానికి ఈ కిందివిధంగా నా అభిప్రాయం చెప్పాను---
"ఫేసు బుక్కులో ఫేకు లుక్కుల ముఖాలు.. మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పాడమ్మా!! కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని..అయితే కొందరు వృద్ధులకు పిదపకాలం బుద్ధులుంటాయి. వాళ్ళయినా వీళ్ళయినా, భాష, సంస్కృతి వంటబట్టని విశృంఖలతత్వం ఎక్కువవుతున్నది. అతి చనువు తీసుకుంటున్నారు కొందరు.." -----
నేటి సాక్షి దినపత్రికలో చూడండి.. వారూ అదే అన్నారు.."ఫేసు బుక్కులో ఫేకు లుక్కులెక్కువ"య్యాయని.
ఇందులో ఆడా మగా తేడా లేదు. తమ గురించి ఇతరులేమనుకుంటున్నారో తెలుసుకునే నెపంతో కొందరు, ఇతరులపై పరోక్షంగా అక్కసు వెళ్ళగక్కేందుకూ ఈ ఫేకు లుక్కుల, లైకు సామ్రాజ్య అకౌంట్లు సాగిస్తున్నారు. పాపులారిటీ పెంచుకునే ఈ ప్రక్రియలో ఆడా మగా తేడా లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి.

16-12-13

*జనాలకు మాదిరే, జ్వాలలు పలు రకాలు.. విరహజ్వాలలు, ఆగ్రహజ్వాలలు, అసూయజ్వాలలు, చలిమంటలు, చితిమంటలు, అక్కసుమంటలు, కడుపుమంటలు....ఆకలిమంటలు మినహా అన్నీ మనుషులను, మనసులను నిలువునా కాల్చేస్తాయ్! జాబితాలో కొత్తగా చేరింది "బిల్లు మంటలు"

*పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి రోజు విభజన బిల్ అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన స్పీకర్ : (Madhavi Vemulapati)
అంత జ్ఞాన సంపద ఉందా ఆ బుర్రల్లో! ఎవరి దినాలు వాళ్ళు లెక్కెట్టుకుంటున్నారు..చాచి చెంపకాయ కొట్టమన్నాడు మొన్నాయనెవరో. ఇప్పుడది మన (అ)గౌరవ సభ్యులందరికీ వర్తిస్తుంది. (my comment)

*మీడియాకు కళ్ళెం వేసే శక్తి ఒక్క కోర్టుకే ఉంది ప్రస్తుతానికి..బెదిరింపుల్లో, మామూళ్ళలో వాళ్ళని మించిపోయారని పోలీసులూ భయపడుతున్నారు మీడియా అంటే..

*350 మంది సభ్యుల ఉభయ సభలకు.. 3500 మంది పోలీసులతో బందో బస్తు.. జరగని సభకు అధిక బందోబస్తు అని చెప్పిందందుకే!    

*నేనెప్పుడో చెప్పాను. రాష్ట్రంలో రాజకీయం, పాత్రికేయం అంటకగుతున్నాయని. చూసారా ఇవ్వాల అసెంబ్లీ, కౌన్సిల్లో సభ్యుల తోపులటలు, దుర్భాషలు. సిగ్గు పడవలసింది వాళ్ళు కాదు, మనం. వీళ్ళా మన ప్రతినిధులు అని. మీడీయా అగ్నికి ఆజ్యం పోస్తున్నదని అర్ధమయింది కదా!! మీడీయా వాళ్ళు కూడా రెండు వర్గాలై వాగ్వివాదాలు. సభ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ కలసి. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన బిల్లు ప్రతులకు భంగపాటు. పట్టపగలు చట్ట సభాప్రాగణాల్లో ప్రతినిధులు ప్రతులను చించడం ప్రాజాస్వామ్యానికి వస్త్రాపహరణమే! అసెంబ్లీ పరిధిలో కట్టడి చేయాల్సింది, ప్రాంగనం నుంచి బహిష్కరించాల్సింది ఎమ్మీల్యేలు, ఎమ్మెల్సీలను కాదు, మొదట మీడియాను. సభలోకంటే బయటే రభస ఎక్కువ..

*సమస్య పరిష్కారం కంటే ప్రజా ప్రతినిధులకు ప్రచార యావే ఎక్కువ. చానళ్ళుంటే రెచ్చిపోతారు, లేకుంటే చప్పబడతారు. ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం మనదగ్గరే! ప్రతినిధుల స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం విశృంఖల విహారం చేస్తున్నాయి.

15-12-13
*ఉక్కుమనుషులున్న దేశం మొక్కవోలేదు..  పిల్లా - జెల్లా, పల్లె - పట్టణం.... ఆడ మగా..ఒకరు కాదు అందరూ... ఇవ్వాళ దేశం మొత్తం ఐక్యతా పరుగు పెట్టింది..

*మాజీ ముఖ్యమంత్రి, తాజా ముఖ్యమంత్రి సొంతజిల్లాలో వీరప్పన్‌ల(నేరస్థుల) స్వైరవిహారం. ప్రభుత్వ సిబ్బందిపై హత్యాకాండ.. ఇదీ శాంతిభద్రతల తీరు.
*రాష్ట్రాన్ని కలసి ఉంచితే, తనతో కలిసొస్తే.. బిజెపికి జగన్ 23 లోక్ సభసీట్లు ఇస్తానన్నాడట!(ఇదొక పైత్యకారి రాత-కూత)! తెలుగు విశ్లేషకుల మాదిరి బిజెపి అంత దిగజారి పోయిందన్నమాట. ఆ చేత్తోనే కాంగ్రెస్ కూ 18 ఇస్తేసరి. తనసీటు మాత్రం ఉంచుకుని.

*బాబుకు, జగన్‌కు, కెసీఅర్‌కు ఏకైక ఆపద్బంధు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే! ఖర్మకాలితే కాంగ్రెస్ జగన్‌కు, బిజెపికి కూడా మద్దతు ఇస్తుంది.. డిల్లీలో "పొరక" పార్టీకి ఇచ్చినట్లు.
జనసంఘ్ వ్యవస్థాపక ఆత్మలు శాంతించుగాక!!

*వాపు - బలుపు కాదు. అధికార, ధన మదాహంకారం తలకెక్కితే ఇక అధఃపాతాళానికే!! ముఖ్యంగా రాజకీయాల్లో ఇది నిత్య సత్యం..

*మార్కెట్ లో ప్రతి విక్రయానికి "బిల్లు" ఉంటుంది. కౌంట్లు.. డిస్కౌంట్లు, పర్సెంటేజీలలోనే తేడా!!

* బాపు - "గుండె" అంతర్ధానమయినా వడి వడిగా నడుస్తున్న కొండ. తెలుగులో రెండక్షరాల రేఖా బ్రహ్మ. దృశ్యకావ్యం, ప్రబంధకం, పురాణం, ఇతిహాసం, చరిత్ర...కలగలిపిన హంగుల రంగుల కాన్వాస్!
పిడుగు లాంటి బుడుగు నుంచి కల్పవృక్ష కవిసమ్రాట్ విశ్వనాథ వరకు చిరపరిచితమై, హాస్యానికి పుట్టినిల్లయిన తెలుగునాట ఆయనను గురించి మాట్లాడి పరిచయం చేయడం ఎంత దుస్సాహసమంటే.. అర్జా జనర్ధనరావుకు ఆంజనేయుని గురించి చెప్పడమే.  అసేతు హిమాచలం ఆ "రేఖా బ్రహ్మ" అశీతి ఉత్సవం జరుపుకుంటూ, పొట్ట చెక్కలయ్యేలా తెలుగులో పగలబడి నవ్వుతున్నదీనాడు.

14-12-13

*రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులుండరు. ఇది అక్షరాల నిజం. జనమే వెర్రిబాగులోళ్ళు.  బిజెపిని అటు జగన్, ఇటు బాబు తూర్పారబట్టారు. జగన్ ను కాంగ్రెస్, కాంగ్రెస్ ను జగన్ ఒకరి నొకరు రెండున్నరేళ్ళుగా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టుకున్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని బాబు విమర్శించారు, పొత్తు ప్రశ్నే లేదన్నారు.  ఇప్పుడు అవసరాలు మనుషులను మార్చాయి. బాబేమో బిజెపి వెంట సుళ్ళు తిరగడం.                
రాజశేఖరరెడ్డి  ఏదైనా స్వయంగా చూసుకున్నారు. ఏ సహాయానికి ఎవరి  వెంటపడలేదు.  కాంగ్రెస్ కు బద్ధశత్రువులైన విపక్షనేతలందరిని దూరంగా పెట్టారు. ఆయన కొడుకు జగనేమో అదే విపక్షనేతల దగ్గరకు కాలికి బలపం కట్టుకుని రోజూ దేశమంతా ఎక్కే గడప, దిగే గడప..యుపీఎకు మద్దతిస్తానన్న జగన్ ఎన్‌డీఎ కూటమి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇద్దరు బద్ధశత్రువులకు (జగన్-బాబు) కామన్ ఫ్రెండ్ బిజెపి. అదెలా సాధ్యం. రేపు బాబు-జగన్ కలవరని గ్యారంటీ ఏమీ లేదు..

*కాంగ్రెస్ చరిత్రలో నేను చూసినంతవరకు..మనరాష్ట్రంలో నిన్న, మొన్న దిగ్గీ పర్యటన అంత పేలవంగా ఏ కేంద్రనాయకుని పర్యటన జరగలేదు. డిల్లీనుంచి విమానం వచ్చి మళ్ళీ ఎగిరేవరకు సిఎం, సిఎల్పీ నేత, పిసిసి అధ్యక్షుడు, వందిమాగధ బృందం అనుక్షణం వెంట ఉండేది. వైఎస్సార్ హయాం 10 సంవత్సరాలలో అంతటా ఆయనదీ, ఆయన సైన్యానిదే హవా. ఈసారి పార్టీ నేతలది తలోదారి..పిసిసి అధ్యక్షుడు లేకుండా దిగ్గి గాంధిభవన్ సందర్శన, ముఖ్యమంత్రి అసలు లేక్కే చేయలేదు. సీమాంద్ర మంత్రులు తొంగిచూడలేదు.. ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కలికం వేసిచూసినా కనబడలేదు. అనతా చానళ్ళ గందరగోళం మినహా శూన్యం. అంతా డ్రాఫ్ట్ బిల్లు మీదే జరిగిపోయింది..

**అంటే గతంలో బాబుగారు చేసినట్లా!! ఒకటిమాత్రం ఖాయం. మిగిలినోళ్ళ సంగతి తెలీదుకాని "గళంలో గరళం నిపుకోనిదే కలం కదలని మా పాత్రికేయులం" మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తామని జోస్యం చెప్పగలను.  
13-12-13
*నేనొక ఆఫరిస్తా!! ఆలోచించుకో!!~
ఉద్యోగం మానేసి రాజకీయాల్లో చేరి కనీసం ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ అయితే అయిదేళ్ళపాటు పనిలేకుండా ఏకబిగిన సెలవులు..జీతాలు, భత్యాలు, వసతి సౌకర్యం, పర్సెంటేజీలు, కాంట్రాక్టులు, అమ్యామ్యాలు, ఫ్రీ కరెంటు, నీళ్ళు, ఫోన్, ప్రయాణాలు, ఇళ్ళ స్థలాలు, బంగళాలు, కారు లోన్లు... ఇలా ఎన్నెన్నో ఉంటాయి. బాగా ఆలోచించుకో..  బలే మంచి చౌక బేరము.. ఇంకా ఉంది లిస్టు: విదేశీయానాలు, కమిటీల పర్యటనలు, ఖరీదైన స్టార్ హాస్పిటళ్ళలో  పెద్దాపరేషన్లు, జీవిత కాల పెన్షన్లు, పట్టుపరిశ్రమ ఉంటే వారసులకు సీటు,... చివరాఖరిగా పోతే(?) అధికార లాంచనాలతో అంత్యక్రియలు. నియోజకవర్గంలో శిలావిగ్రహం.. కనీసం ఒక చెత్తరోడ్డుకైనా పేరు..

*ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా !! యథా లోక్‌సభా.. తథా అసెంబ్లీ!!  రెండూ సోమవారమే కలుస్తాయి మళ్ళీ వాయిదా పడేందుకు..

*ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు.. శాసన సభాప్రాంగణ రణగొణ విశేషాలు. క్లుప్తంగా:
----------------------------------------------------------------------------------------------------
*గాంధిభవన్లో కండువాలతొ దిగ్గిరాజాకి కార్యకర్తలు, నాయకుల ఊపిరాడని ఆహ్వానం -- జాగ్రత్త అవి మెడకు బిగుసుకునే ప్రమాదముంది.

*మూడేళ్ళపాటు తెలంగాణాపై తీర్మానానికి శాసన సభ స్తభన. ఇప్పుడా సీను మారింది. సమైక్యాంధ్ర తీర్మానానికి సభ స్తంభన. ఫలితం శూన్యమే!

*ప్రొఫెసర్ కోదండరామ్‌ను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాచేసి ఉద్యమంలోకి రావాలని మూడేళ్ళు ఆక్షేపించారు. వారే స్వయాన ఇప్పుడు ఒక ఎంజీవో ను (అశోక్ బాబు) గుమాస్తాను ప్రోత్సహిస్తూ అతని వెనుక నక్కి నాటకాలాడుతున్నారు.

*శాసనసభ, మండలి ప్రాంగణాలు నాతకీయ ఫక్కీ ఏడుపులు, పెడబొబ్బలతో స్మశానాన్ని మరపిస్తున్నాయి. - నిజం, ప్రజాస్వామ్యం పట్టపగలే హతమయింది..

*కేంద్రం అపంపిన ముసాయిదా ఎంత చులకనైంది. ముఖ్యమంత్రే స్వయంగా అవహేళన చేశారు: బిల్లు విమానంలో ఎంత స్పీడుగా వచ్చిందో అంత స్పీడుగా వెనక్కి పంపుదాం. మంగళయాన్‌లా! అది చేరడానికి ఆరునెలలు పడుతుంది.  
శాసన సభ, మండలి వదలి మీడియా పాయింట్లవద్ద గొంతులు  చించుకోవడానికి మంత్రులకు ఏమీ అనిపించడంలేదేమో కాని చూసేందుకే సిగ్గనిపిస్తోంది.

*విభజన బిల్లులో చాలా తప్పులున్నాయట- ముఖ్యమంత్రిగారు చెప్పారు.

*ముసాయీదా బిల్లు నకళ్ళు 390 ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ప్రతులు సిఎస్‌కు చేరాయని నిన్నంతా చానళ్ళు ఒకటే రొద.. ఇవ్వాళేమో భాషాపరమైన సంస్య వచ్చిందని, తెలుగు-ఉర్దూ కాపీలు రాలేదని రచ్చ, రచ్చ. ముందేమో అయిదు బండిళ్ళని హంగామా.. అర్ధరాత్రేమో 8 బండిళ్ళని సవరణలు.. అఘోరించినట్లుంది..
*సభ్యులందరూ మాట్లాడడానికి సభ ఏర్పాటవుతుంది. అంతా గోలగోల తో వాయిదాపై వాయిదా పడుతుంది. అప్పుడు సభ్యులందరూ విడివిడిగా, కలసికట్టుగా చేంబౌకెళ్ళి స్పీకర్‌ను కలుస్తారు. ఇదేమి చోద్యమో!!
*అసెంబ్లీకి వెళ్ళండర్రా అని చెప్పాల్సిన దిగ్గీ రాజా..పనికట్టుఇకుని మరీ వచ్చి సభ్యులను గుంపులుగా విడగొట్టి సమావేశాలనే నీరుగార్చారు.

*మంత్రులు, ఎమ్మెలయేలు ప్రాంతీయమ గావిడిపోయి సమాలోచనలు, వ్యూహ ప్రతివ్యూహాలు. మంత్రివర్గ సహచరులు  ముఖ్యమంత్రిని హెచ్చరించడం విడ్డూరం కదూ. అసలు సభ నడవడం సంగతి అలా ఉంచితే.. అసలు ప్రభుత్వం ఎక్కడున్నది?

*సౌండ్ పొల్యుషన్.. ఇక నుంచి ప్రతీ పార్టీ కి ఒకరే స్పోక్స్ పెర్సన్ ఉంటే బావుంటుంది..వీళ్ళ వాగుడికి చెవుల్లోంచి రక్తం వస్తుంది.
(రాచమళ్ళ పద్మజ వ్యాఖ్యకు నా స్పందన:)
**గంటల తరబడి స్పోకులు పెట్టి పొడుస్తుంటే మరి చెవులనుంచి రక్తపాతమేగా.. స్విచ్ ఆఫ్ చేసుకునే వీలున్న మీరే అలా అనుకుంటే బతుకు మెతుకు కోసం పారిపోయే దారికూడా లేని మాగతి ఏమిటి.. రోజూ..

*బాబు గారు చెప్పింది నాకూ నిజమేననిపిస్తున్నది. తెలంగాణ ముస్సాయిదా బిల్లు పోస్టులో లేటవుతుందనుకుంతే.. ఆ కట్టలన్నింటినీ డిటిడిసి కాని, ఏ ఎన్ ఎల్ కొరియర్ సర్వీసులో పంపితే పోయేది కదా! తొందరేముంది, సి ఎం ఇప్పుడే ఏమీ తేల్చరు కదా! "టి" తయారీకి ఇదొక అదనపు ఖర్చు..  రాష్ట్రం అసలే ఆర్థికంగా  క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.

*గంట మోగించాడు. పార్టీ ఫిరాయింపుకోసం. నేచెప్పానా.. మంత్రులు, మాజీలు, తాజాలు, ఎంపీలు జగన్ శిబిరంలోకి క్యూ కడతారని.
మొదట్లోనే వై ఎస్ వివేకానంద, ఆ తరువాత వరుస..ఒక మోపిదేవి, అ-ధర్మాన, ఒక ఘంటా, (ఆయన వెంట మరో అరడజనంట..)చీమ మంత్రులు ఎలాగూ చక్కెరదగ్గరకేగా.. అతీత శక్తి రంగప్రవేశం. ఇక చూడండి..
జండా మార్చిన మెగా నాయకుడు కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి.. భృత్యుగణమేమో వైఎస్సార్సిపి.. ఒటేసిన జనమేమో గంగలోకి.. ఇది మన రాష్ట్ర రాజకీయ విలువ..
ఖైదీకన్నయ్య సినిమాలో ఒక పాటుంది: కొట్టిన చెయ్యే కోరు..
దాన్ని మనం ఇలా పాడదాం: తిట్టిన నోరే పొగుడు..

*Be good at heart. It purifies blood. Faith flows in it. It gives good health.. Health is WEALTH.

*ఎక్కువ మంది వద్దనుకున్నా (నోటా)తక్కువ ఓట్లు వచ్చినోడే  మనకు నచ్చినోడు అవుతాడు.. వాడు ఎంత సచ్చినోడైనా సరే!! .

*ఇది ఇంటింటి భాగోతం:
---------------------------
మనం ఆరోగ్యంగా ఉన్నా మన వాళ్ళ తృప్తికోసం కొంత పెనాలిటీ చెల్లించుకోక తప్పదు. ఇంట్లో వాళ్ళ భయం నివృత్తిచేయడానికి డాక్టరు దగ్గరకు వెళతాం. వాళ్ళ సమక్షంలో మరింత భయం పెంచుతూ (తన ఫీజు మాడరేట్ గా..250రూపాయలు పిండి) కనీసం ఓ అరడజను పరీక్షలు రాస్తాడా పెద్ద మనిషి.
ఇక తప్పదు డయాగ్నోసిస్ లేబోరేటరీకి. అక్కడ అధమం 2 వేల రూపాయలు "హుండి"లో సమర్పించు కోవాలి. పరీక్షలన్నీ అయిపోతయ్. "అంతా నార్మల్" అని తేలుస్తారు. మళ్ళీ ఆ కాగితాలు పుచ్చుకుని డాక్టరు దగ్గరికెళితే.. అన్నీ అటూ ఇటూ చూసి, "యు ఆర్ ఆల్ రైట్. నథింగ్ సీరియస్. వయసు పైబడింది కదా.. సీజనూ మారింది, దాని ఎఫెక్ట్. కాని ముందు జాగ్రత్తగా ఈ మందులు కనీసం మూడు నెలలు వాడండి. ఆశ్రద్ధ చేయద్దు" అని సూక్తిముక్తావళి వినిపించి ఒక జాబితా చేతిలో పెడతాడు.. మళ్ళీ ఫీసు వసూలు షరా మామూలే.
ఆ మందులకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు."నే చెబితే విన్నారా? నాకు ఏమీలేదంటే, మూడువేల రూపాయలు ఆముదం" అని మనం అంటాం. "పోతే పొయింది వెధవ డబ్బు, మీ కంటే ఎక్కువా? ఏమీ లేదని తేలింది, అది చాలు", అని వాళ్ళు సంతోషిస్తారు.. ఇది ప్రతి ఇంటా భాగోతమే.. నాకు నిన్న, మొన్నట్లో ఇలా 3 వేల రూపాయలు చిలుమొదిలింది. నా భార్య, కూతురు మాత్రం హ్యాపీగా ఉన్నారు.

12-12-13
*దిగ్గి సూట్ కేస్ తెచ్చాడా? తీసుకెళతాడా? డిల్లీలో వాళ్ళకి, ఇక్కడివాళ్ళకు మంచిగా నిద్రవస్తుంది. ఎటూ నిద్ర రానిది, పోనీయంది తెలుగు చానళ్ళే.. ఈ మధ్య రాష్ట్రంలో కనబడకుండా పోయిన ఒక గొప్ప సోల్ సాక్షాత్కారమైంది ఇవ్వాళ దిగ్గీ తో!!

*విలేఖరులకు ఏదైనా గ్లోబల్ ప్రైజు పెడితే అది తప్పకుండా హైదరాబాద్ టిడిపి బీట్ విలేఖరులకే ఇవ్వాలి.  నాకు తెలిసి, నేను చూసినంతవరకు.. టీవీ చానళ్ళలో రోజూ లైవ్ లో కనబడడం, గంతలతరబడి విలేఖరులను వాయించడం - మహా శక్తిమంతుడైన చంద్రబాబు గారికే సాధ్యమైంది. టిడిపి బీట్ విలేఖరుల  బ్రెయిన్  తాటలు ఎప్పుడో ఊడిపోయాయి. జర్నలిస్టులకు అందుకేనేమో ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టారు..

*తెలంగాణా డ్రాఫ్ట్ బిల్లు పై ఉదయం నుంచి తెలుగు చానళ్ళు ఇష్టా రాజ్యంగా చెప్పుకుంటూ వచ్చాయి. నిజానికి బిల్లు ప్రతి సచివాలయానికి చెరింది(6.30 నిమిషాలు-సాయంత్రం) అరగంట కాలెదు. అయిదు బండిళ్ళలో బిల్లు అన్నారు. బండిళ్ళు లెక్కబెడితే ఎనిమిది ఉన్నాయి.. ఎవరి వార్తలు వారి ఇష్టారాజ్యం..వాస్తవాలకు రంగు పులుముతున్నాయి..

*ఆర్నెల్లలో ఎన్నికలొస్తున్నాయ్.. నాయకులు గోడలు దూకడం, రంగులు మార్చడం, కులాల మీటింగులు, రిజర్వేషన్లు, ఉద్యోగ సంఘాల బెదరింపులు, భజన మండళ్ళు అన్నీ షరా మామూలే. విశ్లేష"కుల" సమావేశాలు, కొత్త పత్రికలు పెట్టడం, చిన్న చానళ్ళు పుట్టడం, సీట్లకోసం ఎన్ని పాట్లో!!  వినోద భరితమే కాదు ఆదాయ మార్గం కూడా..  

* మండేలా మరణం ఏ పి అసెంబ్లీకి ఒక పూట ప్రాణం పోసింది..సభ గంభీరంగా సాగింది. పాపం ఆయనెవరో అసలు తెలీని వారుకూడా కక్షలు లేకుండా కలసికట్టుగా అంతా (రాసుకొచ్చిన)(రాసిపెట్టిన) నివాళులర్పించారు...

Tuesday 10 December 2013

          ఉత్తరాదిన ఊడ్చేసింది. కాంగ్రెస్ ఏడ్చేసింది. 

                            ఎన్నికల్లో తేలాయి వా(రా)తలు..  
_______________________________
9-12-13

*మంత్రిపదవి లేక నాలుగున్నరేళ్ళుగా Joker Carduku సంధి ప్రేలాపనలు తగ్గలేదు. సీక్వెన్స్ కాకపోయినా పరవాలేదనుకుని రోశయ్య, కిరణ్ కూడా రాజశేఖరరెడ్డి డిస్కార్డ్ చేసిన జోకరు ముక్కను ఎత్తుకోలేదు. పారేసిన జోకరు చుట్టూ ప్రతిరోజూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలమ వద్ద భుజకీర్తుల్లాంటి లంబు-జంబు వీర విలేఖరులు.. పాతికమందికి పైగా రెండుగంటల అకాలక్షేపం.. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఇంకొంచెం లెవెల్..

*Social media.. Facebook, twitter.. etc are much ahead of print and electronic media in many aspects. Opinions, comments, analysis, observations, jokes and many incidents first appear on social media. After 8 hours or next day we come across the same in print/ electronic media with some modifications. Basing on FB/Twitter many stories have been taking new shape. Social media has become very powerful and fast nowadays.

*ఏంత మొగోడైనా అంతా మూటగట్టలేడు.. రేపు మన రాష్ట్రంలో నైనా 294/42 గంపగుత్తగ ఎత్తుకుంటాడా ఎవరైనా?  
 *ఎర్రకోట వద్ద "బంగారు చీపురు" చిహ్నం ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంటుందంటారు? ఊడవడం డిల్లీ నుంచే మొదలిడదాం..
*ఉత్తరాదిన జనం వార్-షిప్.. దక్షిణాదిన వర్‌షిప్.. అదీ తేడా!!
ఇక్కడ జీరో హీరో అవుతాడు. అక్కడ హీరో జీరో అవుతాడు..

*తాము మునిగితేకానీ లోతు తెలీదు. తాను చేస్తే సంసారం.. ఎదువాడిది వ్యభిచారం.. ఇదీ మన రాజకీయం.  

*ఈ రోజు యాంటీ కరప్షన్ డే!  ఈ శుభసందర్భాన మనం "అవినీతి శ్రీ", "అవినీతి భూషణ్", "అవినీతి విభూషణ్", "అవినీతిరత్న", "అవినీతి చక్ర", అవినీతి వీర చక్ర" అవార్డుల ప్రారంభానికి శ్రీకారం చుట్టవచ్చునేమో! కాంపిటిషన్ హెవీగా ఉంటుంది. జడ్జీలే కరప్టయ్యే ప్రమాదం మెండు.. అమ్మో వద్దు లేండి. ఈ దేశం, ప్రజలు మనలను క్షమించరు. ఊరుకోరు, ఉరేస్తారు..

*దేవుళ్ళకు గుడికడతారు.. ఉన్నోళ్ళకు సమాధి కడతారు.. అర్ధ శతాబ్దం కిండతే ఉంది పరిషత్ బహుమతి పొందిన ఒక నాటకం..
"సమాధి కడుతున్నాం చందాలివ్వండి".

*ఉత్తరాదిన అవినీతిని చీల్చి చెండాడారు. మనం అవినీతికి పట్టం కట్టడానికి అంగలార్చుకుంటాం. పైసా మే పరమాత్మా..ఏడాదిలో ఏరోజొచ్చినా, ప్రతిరోజొచ్చినా ఎగబడతాం. మనం విగ్రహారాధ-కులం.

*ప్రతి అడ్డమైన వాడూ పార్తీ పెడతాదు మన దగ్గర. అడ్డమైన సంపాదనతో ఆర్జించిన సొమ్మున్న ఘనులం కదా!!

*ఎన్టీఆర్ ను దేవుడన్నారు, బాబుకు భజన చేశారు, వైఎస్సార్ కు వీర విధేయత చూపారు, రోశయ్యను ఆకాశానికెత్తారు, కిరణ్ కు కీర్తించారు... పదవి పోగానే పేడనీళ్ళు జల్లుతారు.. మీడియా అయినా, మేలగాళ్ళయినా!!

*ఏం పాపం చేసుకున్నాడో మహాత్మా గాంధి. ఇంకా ఆ కుటుంబం వెనుక తోకలా మిగిలాడు..

*కేజ్రీవాలా ప్రభంజనం, చెరిగేసింది. పీఅర్పి చిరుగాలి, చెదిరిపోయింది  nu

8-12-13
*ఒక ఘటం పగిలింది. ఒక కాష్టం కాలింది. ఒక ఘట్టం ముగిసింది..సరే!! అర్నెల్లల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ ఓట్ల పం(మం)ట. రాబోయే కాలానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరో?

*మనది లోకుల సత్తా-లోకల్ సత్తా.. లోక్ సత్తా కాలేకపోయింది..అదీ తేడా!!
*మోడీ - ఆడు మగాడ్రా..బాబూ!!

*నే చెప్పానా! మన ఐరన్ లెగ్గులు డిల్లీలో కాలు పెట్టగానే కాంగ్రెస్ నుగ్గు నుగ్గు.. బొగ్గు బొగ్గు.. పాపం ముమ్మారు ముఖ్యమంత్రికి మనవాళ్ళు వెళ్ళి ముసుగేశారు... షీలా డీలా పడింది.

*"Mahatma Gandhi and Sardar Patel are said to have held the view that the INC was formed only for achieving independence and should have been disbanded in 1947."-- Their long cherished wish was fulfilled by none other than members of Nehru family after 67 years.. Hurrae...

*The Nava Telangana Party headed by former minister Devender Goud was merged with the Praja rajyam Party much earlier to 2009 general elections. Subsequent to the great defewat of PRP, Goud had become the second rated leader in TDP(joined his good ole partyTDP). PRP founded by actor turned politician Chiranjivi  merged with the Indian National Congress on 20 August 2011. All the 18 PRP MLAs joined Congress. Does any one need more description than this?

*Congress once for all wiped out.. The vote did not simply go against Congress, but against corruption. Where is YUVARAJA? the hope of the Congress? future PM of India?

*centenary party reached cemetery..pay tributes..

*Indian National Congress was founded on December 28, 1885 (127 years ago) not 1863. Founded in 1885 by members of the occultist movement Theosophical Society—Allan Octavian Hume, Dadabhai Naoroji, Dinshaw Wacha, Womesh Chandra Bonnerjee, Surendranath Banerjee, Monomohun Ghose, Mahadev Govind Ranade and William Wedderburn. Nehru family was no where...

7-12-13

* అభిమాన హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత.------నాలుగేళ్ళ కిందట వరకు ధర్మవరపు తరచూ కాంగ్రెస్ లెగిస్లేచర్ పార్టీ కార్యాలయం వస్తూ పాత్రికేయులందరితో ఎంతో ఉల్లాసంగా గడిపే వారు. వైఎస్సార్ ఉన్నంతవరకు పార్టీ ఎన్నికలప్పుడు ప్రచార (సాంస్కృతిక కార్యక్రమాలకు సారధ్యం వహించేవారు. సౌమ్యుడు. ఎప్పుడూ రాజకీయాలు ప్రస్తావించేవారు కారు. విలక్షణమైన సలక్షణ హాస్యనటుడు. చిన్నతనంలో పోయారు. ఈమధ్య నటులు కాలం చేస్తున్నారు..విచారకరం!! పన్నీరు కురిపించిన హాస్యం కన్నీరు పెడుతున్నది.

*మన్మోహన్ మౌనమోహనుడని అంటారు అందరూ పాపం. ఆయన పెదవి విప్పితే సత్యాలు ప్రవహిస్తాయి. చూడండి నిన్న ఎన్ని నిజాలు చెప్పారో! పి వి వలననే సంస్కరణలన్నారు. దేశ ఆర్ధిక ప్రగతికి, ప్రపంచంలో పోటీకి నిలబడడానికి ఆయనే మూల పురుషుడని ప్రస్తుతించారు. పివి నరసింహారావును పొగడడం సోనియాకు ఆగ్రహం కలిగిస్తుందని తెలిసీ వెనుకడుగు వేయలేదు.  మోడీని తక్కువ అంచనా వేయడం లేదన్నారు.. బిజెపి సామర్థ్యాన్ని చెప్పారు. మన్మోహన్ రాజకీయవేత్త కాదు. ఆర్థిక నిపుణుడు. ఆయన నీడన కాంగ్రెస్ పదేళ్ళు బతికి చివరకు ఆయనకు మసి, మరక అంటించింది..  

*భర్తలు పోతే అసెంబ్లీకి వచ్చే భార్యలు కొందరైతే.. తండ్రులు పోతే అసెంబ్లీకి, పార్లమెంటుకు, పదవులకు ఎగబాకే కొడుకులు కొందరు.. అదృష్ట రేఖ అలా రాసిఉంటుంది కొందరి ముఖాన..ఏం చేస్తాం!

*ఇంట తిని వాసాలు లెక్కించడమంటే అంతే మరి.. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి. సేల్డ్ కవరోళ్ళకు కూడాబోల్డు మాటలు..

*చానళ్ళు రాజీనామాలు చేయిస్తునే ఉంటాయి.. కానీ వాళ్ళు చెయ్యిస్తునే ఉంటారు ప్రతిసారి..

6-12-2013
*

*అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామ దగ్గరా? మీడియా రంగులు నేను ముందటనుంచి చెబుతున్నాను. ఆ తానులో ముక్కనే కనుక నాకు తెలుసు..కలాలకు, గళాలకు కులాల జాడ్యం. ఇది తెలుగు "సంపాదకుల" కాలం.

*రాజధాని వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ.. పత్రికల విస్తరణ. గతంలో పత్రిక ప్రధాన కార్యాలయాలు కేందీకృతమై ఉన్నప్పుడు ప్రచురణ, సిబ్బంది ఎంపిక ఎంత వ్యవ ప్రయాసలుండేవి. మారుమూల ప్రాంతాలనుంచి వార్త్లలే కార్యాలయాలకు రోజుల తరువాత చేరేవి. పత్రికలు సకాలంలో పాఠకుల చేతికి వేళ్ళేవికావు. ఇవ్వాల్టి పత్రిక మరుసటిరొజు కు చేరేవి. మరి శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో నేడు జిల్లాకొక పత్రికా కార్యాలయం. ప్రతి మండలంలో కంపొయూటర్కేంద్రాలు శాఖలు, ప్రధాన కార్యాలయలతో అనుసంధానం. గతంలో దూరదర్శన్ ఒక్కటె గతి. ఇప్పుడు ఓబి వ్యాన్లతో ప్రతి జిల్లాలో టీవీ చానళ్ళు. డిల్లీలో అర్ధరాత్రి సంఘటనలు మరుక్షణంలో వీక్షకులకు.. హైదరాబాద్లో ఉన్నా, డిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా పిఎం, సిఎంలు వీడియో, టెలి కాన్ఫరెన్సుల్లో అధికారులు, సచివులతో సంభాషించి పాలనా నిర్ణయాలు తీసుకోవడం లేదా? మరప్పుడు వేర్వేరు  రాజధానులకు సమస్యేముంటుంది.  విజ్ఞులు అలోచించాలి. సమస్య పరిష్కారం కావాలి. కొత్త సమస్య ఉత్పన్నం కాకూడదు. అది తెలంగాణ అయినా.. సీమాంధ్ర అయినా!!

*ఎక్కడైనా మొత్తం వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ఢి సమతుల్యంలో సాగుతుంది. సచివాలయం, శాసనసభ, పోలీసు ప్రధాన కార్యాలయం, ఉన్నత న్యాయస్థానం వేర్వేరు కేంద్రాలలో నెలకొల్పితే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. ఎక్కడికక్కడ విద్యా రాజధాని, వైద్య రాజధాని, పరిశోధనా రాజధాని, పారిశ్రామిక రాజధాని, రాజకీయ రాజధాని, ఆర్ధిక రాజధాని, న్యాయసేవా రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధానులు ఏర్పడితే అందరికీ అవకాశాలు అందివస్తాయి. జనాభా వికేంద్రీకృతమై వివిధ కాలుష్యాలు, కార్పణ్యాలు, వైషమ్యాలు పెరగకుండా నివారించ వచ్చు. పాలనా సౌలభ్యం కలుగుతుంది.. సమాచార, సాంకేతిక విస్తరణ విప్లంతో ప్రపంచమే ఒక గ్రామమైనప్పుడు నిర్వహణ ఏదీ అసాధ్యం కాదు..విభేదాలు, విమర్శలు విస్మరించాలి అందరూ!! ఈ సూత్రం దేశానికీ వర్తిస్తుంది..జాతీయతా భావం ఏర్పడుతుంది..

5-12-13

*మళ్ళీ శుక్రవారం సీమాంధ్ర బందట.. దేనికి? రెండున్నర నెలలు చేయించారు ఆందోళనలు. ఫలితమేమిటి? నష్టపోయిందెవరు? ఇంకా శని వదలలేదు పాపం వాళ్ళను..

*వరల్డ్ బ్యాంక్ కావూరి కన్‌స్ట్రక్షన్ కంపనీని 11 ఏళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టేసరికి.. మాటలు, అడుగులు తడబడుతున్నాయ్. విభజన అయింది. ఇక అమ్మ భజనే మిగిలింది..

*అభిమానం, ఆత్మగౌరవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి  పదవికి రాజీనామ చేసి పరువు నిలబెట్టుకోవాలి. ఆంధ్రుల గౌరవానికి భంగం కలిగినా ఇంకా ఇలాగే పదవిలో ఉంటారా. సి ఎం పదవి రాష్ట్ర శ్రేయస్సుకు మించినదికాదని, ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రయోజనంకోసం అవసరమైతే పదవిని వదులుకుంటానని చెప్పినమాటలు గుర్తుంచుకోవాలి. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల పరిరక్షణ పదేళ్ళపాటు గవర్నరుకు కేంద్రం ధారాదత్తం చేసింది. అంతే సి ఎం పదవిలో, అధికారంలో కోత పెట్టింది. శాంతి భద్రతల నిర్వహణ అధికారం సిఎం చెయ్యి జారిపోయింది.
కొత్త రాజధాని 45 రోజుల్లో నిపుణుల కమిటీ తేలుస్తుందట. అంతే కొత్త రాజధాని కొసం ఒకే సీమలోని ప్రజలమధ్య చిచ్చు లేస్తుందన్నమాట. రాజధాని మాకంటేమాకని రగడ మొదలవుతుంది. మళ్ళీ జగడపాటి, రాయపాటిలు, కావూరి   తలెత్తుతారు. రాయల తెలంగాన జెసి దివాకర్కు నష్టం ఏమీ ఉందదు. ఆయన బస్సులు 29వ రాష్ట్రానికి విస్తరించినట్లే.. ఆయనది రాజకీయ రవాణా వ్యవస్థ కదా!!

*నాయకులను కాదు.. వ్యర్ధ వ్యాఖ్యల తెలుగు టీవీ విశ్లేషకులను నిందించండి. మహా మేధావులులాగా నాటకాలాడి ప్రజలను తప్పుతోవ పట్టించి పబ్బం గడుపుకున్నారు.  మేతగాళ్ళైన రాతగాళ్ళని, కూతగాళ్ళను నిలదీయండి.  

*రాయల టి ఒక నాటకం మాత్రమే.. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల విశ్వామిత్ర సృష్టికి మీడియా రంగులు పూసింది.

*కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారా నిజంగా, ఇదికూడా ఆర్నెల్లుగా సాగుతున్న కథగా మిగులుతుందా? టిజి వెంకటేశ్ చెబుతున్నారు పాపం. కె సి ఆర్ ఉందగా తెలంగాణ రాదని. మీరు ఉండగా రాష్ట్రం విడిపోదని చెప్పలేకపోతున్నారే.  ఏరీకోతలుకోసిన కోస్తామంత్రులు. డిల్లీలోప్యాకేజీలకోసం మీటింగులు పెట్టుకున్న సీమాంధ్ర ఎంపీలు అడ్రసు గల్లంతయ్యారే! సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ తో పాటు ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేసి పర్యాట్కంలో మునిగితెలుతున్న కేంద్రమంత్రి "చిరు"నామా ఎక్కద. నిజంగా ప్రజలు, రాష్ట్రం మీద అభిమానమున్న నేతలు తక్షణం పదవులు వొదిలి ప్రజల్లోకి వెళ్ళండి. కాదంటే మళ్ళీ మూకుమ్మడిగా "గోడ" దూకి మరో జండాపట్టుకుని, అజెండా మార్చుకోండి.  పాపం తెలుగు చానళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక్కరూ పదవిని వదలదంలేదు.. 25 పేజీల జిఓఎం నోట్, 6 పేజీల క్యాబినెట్ నోట్, 70 పేజీల డ్రాఫ్ట్ బిల్ల్ క్యాబినెట్నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నాయి.

*రాష్ట్రం విడిపోకపోతే, హైదరాబాద్ యుటి అయితే, టి బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రాకపోతే, అసెంబ్లీలొ బిల్లు ఓదిపోతే.. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ళముందు అకస్మాత్తుగా పోలీసు భద్రత ఎందుకు పెంచినట్లు. జిల్లాల్లో కవాతులు ఎందుకు నిర్వహిస్తున్నట్లు. ప్రజాప్రతినిధులు ప్రజా ప్రతిఘటన అనుమానిస్తున్నారా? లగడపాటి ఎప్పుడు సన్యాసానికి ముహుర్తం ఎప్పుడు పెట్టుకున్నారో?

*సాయంత్రం నుంచి తెలుగు చానళ్ళు గొంతులు చించుకుంటున్నాయి. దింపుడుకళ్ళెం ఆశ లా 12 జిల్లాల తెలంగాణా, యుటి పై ఒకటే రొద. డిల్లీలో చలిలో, చీకట్లో చానల్ రిపోర్టర్ల బాధలు చూస్తుంటే జాలి వేస్తున్నది.. నంగినంగిగా, మాటలు మింగుతూ, లింకులు తెగి ఎన్ని వ్యాఖ్యలు.. ఎన్నెన్ని జ్యొతిషాలో! ఇంకా పైత్యపు మాటలు తగ్గలేదు. హైదరాబాద్ యుటికి అంగీకరించకపోతే సీమ కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి రాజీనామాలంటూ కొత్త మంట పెడుతున్నారు.

*విశ్వకవీంద్రుడు రవీంద్రుని గీతాంజలిలో విస్తృతంగా జనప్రియమైన రచన
-------------------------------------------------------------------------------------
ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-
ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు

Thursday 5 December 2013


                     కసరత్తులు - చురకత్తులు
                     ------------------------------                  

                          (పది రోజుల రాజకీయ కోలాహలం) 


5-11-13
*మనలో మార్పు రానంత వరకు ఈ అవినీతి, బంధుప్రీతి, కుళ్ళు రాజకీయాలు అంతే...పార్టీ భజనలు, వ్యక్తి ఆరాధనలు, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం, సబ్సిడీలకు, ఉచితాలకు తలవంచడం, కులాభిమానాలు మానేసి అభ్యర్ధి నిజాయితీ, అర్హతలు, నైతిక ఋజువర్తన ప్రాతిపదిక పై ఎన్నుకుంటే మనకు కావాలిస్న ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రచార సాధనాల మాయకు గురైతే ఇంతే సంగతులు.. మార్పు కోరాలి..ఉత్తరాది నాలుగు రాష్ట్రాల మాదిరి చరిత్ర తిరగరాయాలి..
*ప్రతిపాదనలు, ఉపసంహరణలు, రహస్య చర్చలు, సంప్రదింపుల గురించి మనం చదివేదీ, వినేదీ అన్నీ అర్ధ సత్యాలే! అని గమనించాలి. మీడియా పనికట్టుకుని ఒకటి రాస్తుంది. దానిపై టీవీలు చర్చలు నిర్వహిస్తాయి, టీవీ కొత్త కథనం వినిపిస్తుంది. వాటిపై పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాస్తాయి. అనీ వింటాం, చదువుతాం బుర్రలు బద్దలు కోట్టుకుంటాం. గందరగోలం.. ఇద్నతా రాజకీయంతో పాత్రికేయం చేతులు కలపడం. పెద్ద నాటకం. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడంలో ఇవన్నీ భాగాలు..

4-12-13
*ఏపి కాంగ్రెస్‌ది అయిరన్ లెగ్.. గతంలో గుజరాత్ ఎన్నికల పరిశీలకుడుగా మన పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్ళారు. అంతే కాంగ్రెస్ మటాష్.. ఇప్పుడూ అంతే.. మన మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు డిల్లీ పరిశీలకుడుగా కాలు పెట్టారు. షీలా దీక్షిత్.. ఫట్..
నీతి:: దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ ను ఓడించాలంటే మన నాయకులను అబ్జర్వర్లుగా పంపాలి- గుజ్జు గుజ్జవుతుంది. అది ప్రధాన సూత్రం..
*ఒక పత్రికాధిపై "నిర్భయ" చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆఘనత మన రాష్ట్రానికే దక్కింది. వార్త సిఎండి, కాంగ్రెస్ మాజీ ఎంపి, నెలలతరబడి జీతాలివ్వని యజమాని గిరిష్‌సంఘి సికిందరాబద్ కంటోన్మేంట్ సి ఇ ఓ సుజాత అనే మహిళాధికారిని అసభ్యంగా దూషించిన ఫిర్యాదుపై బేగంపేట పోలీసులు కేసు కట్తారు. పోలీసు అనుమతిలేకుండా ప్రదర్శననిర్వహించి చట్టాన్ని ఉల్లంఘించిన కేసు కూడా నమోదయింది. కొడుకు పెళ్ళి సాకుతో హైకోర్టులో ఆ మహానుభావుడు యాంటిసిపేటరీ బైల్ పొండాడు. ఈ మహానుభావుడిపై సొంత అన్నదమ్ములే క్రిమిన కేసులి పెట్తారు.ఇదీ మన తెలుగు పత్రికా ప్రపంచపు గొప్పతనం. బ్లాక్ మెయిలర్లు, ఫొర్జరీగాళ్ళు, కబ్జాగాళ్ళు..పత్రికాధిపతులు..
*ఉత్తరాదిన కాంగ్రెస్ చెయ్యి విరిగింది అయిదు వేళ్లలో చిటికెన వేలు మాత్రం మిగులుతున్నది.. చేతికి తరు"వాత" అక్షరక్రమలో అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్.. దాంతో దక్షిణాదిన హస్తం మాయం.. ఇక అంతా అస్తవ్యస్తమే!! మోడీతో ఢీనా? మాడు పగుల్తుంది..
*
3-12-13
*విడిపోతున్న తెలంగాణాను ఫెవికాల్ పెట్టి అతికించ ప్రయత్నించినట్లు..
*ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుండి 12 మంది సమైక్య సీమాంధ్ర నేతలు పరారీనా? అదెట్లు జరిగె?
*poli-trics degenerating..

2-12-13
*డిసెంబరు 9 మరొక భయంకర తుపాను.. దానికి "సోనియా" అని పేరెడతారు. పది జిల్లాలు ఒక వైపు- 13 జిల్లాలు మరో వైపు కొట్టుకుపోతాయ్!!

29-11-13
*సమైక్య రాష్ట్రం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం..అందరూ అలసి, సొలసి ఆయాస పడిపోయారు. సమైక్య రాష్ట్రం కోసం డిల్లీ ప్రయాణాలు, యాత్రలు, దీక్షలు, రచ్చబండ పగుళ్ళు, వస్తున్నా నడకలు, శంఖారావాలు, భీషన ప్రతిజ్ఞలు...లైలా, హెలెన్, లెహెర్.. అన్నీ తుపానులే. మొత్తం తుడిచేసింది.. రాష్ట్రాన్ని కడిగేసింది. తేదీలు కూడా ఫిక్స్ అయ్యాయి తెలంగాణపై. ఇప్పుడేమంటారు మన పీతల నేతలు? మన పనిలేని మంత్రులు ఏమిచేస్తున్నారు?  సోనియా, రాహుల్, మన్మోహన్, అహ్మద్‌పటేల్, గులాంనబీ, మొయిలీ, దిగ్గిభయ్యా, షిండే, జైరాం.... అందరూ దివంగత రాజశేఖరరెడ్డికి ప్రీతిపాత్రులు. ఆంతరంగికులు.. అందరూ అయిదేళ్ళు ఒకరి మనసొకరు ఎరిగి నడుచుకున్నారు. ఒకరినొకరు కీర్తించుకున్నారు. మరి వీరందరూ ప్రత్యేక తెలంగాణాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? దీని వెనుక మతలబేమిటి? వైఎస్సార్ గురించి ఆప్తులు, ఆత్మీయులు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడరేమిటి? అంతా సైలెన్స్. లైట్స్ ఆఫ్. ప్యాకేజీలతో ప్యాక్-అప్!!!

*తెహెల్కా సిబ్బంది కానీ, భారత్ యావత్తులో ఒక్క జర్నలిస్టు కానీ, ఒక్కరూ పాపం తేజ్ పాల్ కు మద్దతుగా నిలవలేదు ఎందుకో? పత్రిక నోరు నొక్కేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛని కాల రాస్తున్నారని ఎవ్వరూ ఉద్యమాలు లేవనెత్తలేదు. చివరకు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమాచౌదురి, తెహెల్కా ఫౌండేషన్ నుంచి అరుణా రాయ్ కూడా తప్పుకున్నారు..
ఇదంతా సరే, కొన్నాళ్ళయిన తరువాత కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.. తేజ్ పాల్ కు ఇతరత్రా భాగస్వాములెవరో??
(మరి మీడియాల్లో అలాంటి "తేజ్ పాల్స్" ఎందరు ఉన్నారో?)

*మొత్తం వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ఢి  సమతుల్యంలో సాగుతుంది. సచివాలయం, శాసనసభ, పోలీసు ప్రధాన కార్యాలయం, ఉన్నత న్యాయస్థానం, పరిశ్రమలు, విద్యా, వైద్యాలను వేర్వేరు కేంద్రాలలో నెలకొల్పితే  భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. రాజకీయ రాజధాని, ఆర్ధిక రాజధాని, న్యాయసేవా రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, పర్యాటక రాజధానులుగా ఏర్పడితే అందరికీ ఆని అవకాశాలు అందివస్తాయి. సమాచార, సాంకేతిక విస్తరణ విప్లంతో ప్రపంచమే ఒక గ్రామమైనప్పుడు నిర్వహణ ఏదీ అసాధ్యం కాదు..విభేదాలు, విమర్శలు మానుకోవాలి అందరూ!!
*నాకెన్ని గుర్తింపుకార్డులున్నాయో!!!. ప్రతి పనిలో ఒకటి. ప్రతి పనికి వేరొకటి.. ఈ దేశంలో ఇన్ని అవసరమా? మనిషి ఆజన్మాంతం అన్నింటికీ ఉపయోగపడే ఒకే కార్డును మనం రూపొందిచుకోలేమా!!! (మాధవి ఆధార్‌కార్డ్ కథనం స్ఫూర్తి తో..)
[ఐ డి కార్డ్స్ ను ఆన్ లైన్ నేరస్తులు హాక్‌చేసి దుర్వినియోగం చేస్తారన్న ప్రభాకర్‌రావు గారి హెచ్చరికపూరిత సలహాతో ఫొటో డిలీట్ చేశాను..] --అయితే ఆధార్, ఆరోగ్యశ్రీ,, రేషన్, ధన్వంతరి ఫౌండేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆర్గనైజషన్, అక్రెడిటేషన్, ఓటర్ ఐడెంటిటీ, ఇన్సూరెన్స్, అసెంబ్లీ మీడియా ఐడెంటిటీ, రైల్వే ఐడి, బ్యాంక్, హౌజింగ్ సొసైటీ, ప్రెస్‌క్లబ్, పాస్‌పోర్ట్...వగైరా కార్డులున్నయ్ ప్రస్తుతానికి..
28-11-13

*ఫ్రతిపక్షం: కాంగ్రెస్ కు చీము, నెత్తురు, సిగ్గు., లజ్జ, అభిమానం ఉంటే వరల్డ్ బ్యాంక్ నిషేధించిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ ఓనర్ కావూరిని వెంటనే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించాలి..
ఏఐసిసి అధికార ప్రతినిథి: చాల్, చాల్లే పోవోయ్! అలా అయితే మా కాంగ్రెస్‌లో ఒక్కరూ మిగలరు, దుకాణం మూసుకోవలసిందే తెలుసా??

27-11-13

*చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లు..
అని మనం చదువుకున్నాం...
మహానుభావులు నడయాడిన పవిత్ర ప్రజాస్వామ్య ఆలయంలో(శాసన సభ ప్రాంగణంలో) తాచులు,పింజరులు, కట్లపాములు తలదాచుకుంటున్నాయ్!!  

26-11-13

*ఎన్టీ రామారావు మినహా ఎవ్వరూ రెండు సార్లు మించి ముఖ్య మంత్రిపదవిలో కొనసాగలేదు. కేవలం బ్రహ్మానంద రెడ్డి, చంద్రబాబు మాత్రమే వరుసగా ముఖ్యమంతిగా ఏడు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్నారు..ఏకబిగిన పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగిన ఘనత "ఒకే ఒక్కడు" చంద్రబాబు కు దక్కింది.. 57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో నలుగురు తెలంగాణ నేతలు మొత్తం తొమ్మిదేళ్ళ అయిదు నెలల కాలం మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

25-11-13

*ఇవ్వాళ మన మూడేళ్ల ముఖ్యమంత్రి గారు తేల్చేశారు::
"సమైక్యమా- కాంగ్రెస్ పార్టీనా? అని తేల్చుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిద్దాం".
వెంటనే మరో మాట కూడా: "రాజకీయ లబ్దికోసం ఏ పార్టీ లోనైనా కలవొచ్చు. దాన్ని ఆమోదిస్తాం".
ఆ పార్టీ పేరుకూడా చేబితే ఆంధ్ర ప్రజలు ధన్యులయ్యే వారు కదండీ....
కాంగ్రెస్సాయన తిరిగి ఏ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటాడో!!!