Monday 25 November 2013

వారంలో గరం మసాలా!! వేడి, వేడి వ్యాఖ్యలు    

[weekly summary of political comments]
24-11-13
*Press Club, Hyderabad elections could have not been conducted in such a decent, dignified and disciplinary manner without the co-operation of each and every member. Mr Bhandaru Srinivas Rao, Returning Officer has set a record in the history of Press Club by utilizing all the available and advanced technology to inform each and every thing minute by minute. Another land mark in the history of Press club was announcing results of five office bearers and six EC members within two hours after completion of polling. Total transparency was maintained in such a manner without giving any scope to raise even a single objection by contestants/agents/members. Election staff from the Cooperative department had done excellent job in conducting the poll, making arrangements, counting votes and announcing results. I am happy for associating with Mr Bhandaru for all these seven days (from the date of commencement of filing nominations and to declaring results).

*So called wise, educated, intellectuals and watchdogs of the society (members of the Press Club, Hyderabad ), who opposed the EVMs are going to elect their office bearers and EC members today(Sunday). Polling - from 11.30 am to 6 pm.

23-11-13

*డంబు, చెంబు, అని తేలిగ్గా తీసెయ్యకండి.. ప్రతి ఇంటికి అది అవసరం.. చెబుకోసం చాలా ఏళ్ళు ఎగబడిన జనాలు కోకొల్లలు..
అసలు ఒక పద్యం ఉంది.. "చిన్న చెంబుతో నీళ్ళు శీకాయ ఉదకంబు..."
22-11-13

*స్టింగ్ ఆపరేషన్లతో జనాలను పరేషాన్ చేసిన తేజ్ పాల్ అసలు స్వరూపం బయటపడింది కదా!
రోజూ నాగోడు అదే.. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. ఎర్నలిస్టుల్లో జర్నలిస్టులు వేరు. జర్నలిస్టుల్లో నేరస్థులు వేరు.
గోతులు తీసేవాళ్ళే నీతులు చెబుతారు.. అవినీతిపరుడే నీతి గురించి ఎప్పుడూ మాట్లాడతాడు. ఇవ్వాళ పేపర్లు, చానళ్ళలో నీతులు మాట్లాడుకోవడం వేస్ట్..

21-11-13

*జెసి దివాకర్ రెడ్ది అనే కాంగ్రెస్ సీనియర్ నేత (అయిదేళ్ళుగా ఎమ్మెల్యే మినహా ఏ పదవీ లేదు..వోల్వో బస్సులు మాత్రం చాలా ఉన్నాయి) సిఎల్పీ కార్యాలయం వద్ద అక్షర సత్యాలు చెప్పారు:
ఏట్లో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ ఆపలేదని తెలిసినా దాన్ని పట్తుకునే ప్రయత్నం జరుగుతుంది.రాష్ట్ర విభజన అడ్డుకునే విషయంలోనూ మాది అదేప్రయత్నం..
నీజమే...కాంగ్రెస్ లో ఉన్నదంతా గడ్డిపోచలని తెలిసికూడా ప్రజలు ఇన్నేళ్ళుగా వాటినే పట్టుకుని కొట్టుకుపోతున్నారు..
సీమాంధ్ర సమైక్య ఉద్యమం గడ్డిపోచలదని తేల్చి చెప్పేసారు ఆ సారు వారు. మరో గాదె (వెంకట) రెడ్డి గారు దాన్ని బలపరచారు.. జై గడ్డిపోచలూ!!

*దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఇవిఎంలు ఉపయోగిస్తూ ముందుకు పోతుంటే విచిత్రంగా హైదరాబాద్ పాత్రికేయుల్లో కొందరికి ఎవిఎంల పనితీరుపై ఎన్నెన్నో అనుమానాలు తొలుస్తున్నాయి. 1300 మందికిపైగా వోటర్లున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు ఈ నెల 24న ఎన్నికలు జరుగుతున్నాయి. కొందరి అనుమానాల వలన ఎన్నికల్లో ఇవిఎంలను ఉపయోగించే ప్రయత్నాలకు గండిపడుతున్నది.
వోట్లువేయని బాగా చదువుకున్నోళ్ళకు, రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల్లో ఎవిఎంల పై అనుమానాలు. ప్రజలు వోట్లు వేసి తమ పని తాము చేసుకు పోతున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఎన్నికల్లో ఎవిఎంలే వాడుతునారు. మరి జర్నలిస్టులకే ఎందుకు అభ్యంతరమో!! ఎవిఎంల వలన పోలింగు వేగవంతమై, కౌంటింగు కేవలం ఒకటి రెండు గంటల్లో పూర్తవుతున్నది. అనేక దైనందిన కార్యకలాపాల్లో కాలహరణం, శారీరకశ్రమ నివారించుకునేందుకు , శాస్త్రీయత, సాంకేతిక మార్గాన్ని ఎంచుకున్నాం బ్యాంకుల్లో శారీరక శ్రమ తగ్గడం వలన పని వేగవంతమైంది. ప్రయోజనాలు విస్తృతమయ్యాయి. ప్రజలు అలవాటుపడి సుఖ పడుతున్నారు. అనేక ఆలోచనలు పుట్టుకొచ్చే పాత్రికేయులకు ఎవిఎంలపై అపనమ్మకమేమో!
(ప్రపంచంలో ఏకైక సంస్కరణకర్తగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు అనేక సార్లు యు టర్న్ తీసుకున్నారు. మద్యం విషయంలోనైనా, ఉచితాల విషయమైనా. ఐటి విషయమైనా, చివరకు ఎన్నికల్లో ఇవిఎం ల ప్రవేశమైనా తన ఘనతగా చెప్పుకున్నప్పుడు పత్రికలు ఓహో అన్నాయి. అదే బాబు ఎన్నికల్లో ఓడిపోగానే ఇవిఎంలు అశాస్త్రీయమని దేశవ్యాప్త వివాదం, చర్చ లేవనెత్తారు. అప్పుడు కొందరు పాత్రికేయులు కూడా అవునని వంత పాడారు.)

*ప్రపంచానికి మార్గదర్శకులు జర్నలిస్టులు అని చాలామందికి అపోహ. ఎందుకంటే వారు అన్నీ నిజాలు చెబుతారనో, సమాజంలో మార్పును ఆకళింపుజేసుకుని అందరికీ వివరిస్తారనో.. నేనంటాను తమకు నచ్చనిదాన్ని ఇతరులకు నచ్చకుండా, తాము మెచ్చినదాన్ని ఇతరులు మెచ్చేలా చేయడమే వారి ప్రయత్నం, కర్తవ్యం. వాదోపవాదాలకు ఆద్యులు పాత్రికేయులే కదా!! యాజమాన్య ప్రయోజనాలను, స్వార్ధ ప్రయోజనాలను.. రెండింటిని వారు భుజాలకెత్తుకుంతారు. విస్తృత, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు..ఇది ఇప్పటి పరిస్థితి. నన్ను ఎందరు కోపగించుకున్నా పరవాలేదు. పత్రికల పాఠకులకు,, చానళ్ళ వీక్షకులకు ఇది అనుభవమే.
20-11-13

*గొంగట్లో తింటున్నాం. ఇక్కడ మనం మెతుకులేరుకోవాలి.. వెంట్రుకలు కాదండి..
అందరూ "సంపాదకులే" తయారయ్యారు ఈ క(కా)లంలో, వారిలో పాత్రికేయులను తెలుసుకోవాలి. అది డబ్బులిచ్చి పేపరు కొనుక్కునే పాఠకునికి అగ్ని పరీక్ష. .
(ఎర్నలిస్టుల్లో జర్నలిస్టులెందరు? అని)

*తెలుగు పిచ్చి మరీ ముదిరిపోతున్నది..సామాన్యునికి అర్ధంకాని రీతిలో కొత్త తెలుగు పదాల ప్రయోగం.. ఈనాడు లో ఈ రోజు ఉపయోగించిన పదాలు ఇలా..
ఔటర్ రింగ్ రోడ్= బాహ్య వలయ రహదారి;
వర్క్‌షాప్= కార్యశాల..

మిత్రులందరికీ ధన్య వాదాలు. తమ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించినందుకు.. ఆ... ఆలు రానట్టి అన్నయ్య లందరూ రాజకీయ మద్దతుతో 'అకాడెమీ' అధ్యక్షులవుతున్నారు. ఇక పత్రికల విషయానికొస్తే "ఎడిటర్లు" ఎప్పుడో అంతర్ధానమై నిజమైన "సంపాదకులే " మిగిలారు.
సతీష్ బాబుకు కృతజ్ఞతలు.. నీ వంతు కృషిగా మన అజ్ఞానుల విజ్ఞాన సంపదను శ్రోతలు/వీక్షకులకు నీ "జర్నలిస్టు డెయిరీ" ద్వారా పంచిపెడుతున్నదుకు.
19-11-13

**మంత్రులు, మాజీలు అందరూ జగన్ శిబిరంలో చేరాతారని నెలకిందట రాసిన మాటలు నిజమవుతున్నాయి .. మోపిదేవి వెనుక ధర్మాన ప్రసాదరావు క్యూలో నిల్చున్నరు చూశారా!! నిన్నటి వరకు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండాతిట్టారు. ఇప్పుడు ఏముఖంతో...???
సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల దోబూచులాట కొద్దిరోజుల్లో బయటపడుతుంది..రంగు బయటకొస్తుంది.
**ఒక సమస్య(పరిష్కారం) మరో సమస్యకు దారితీయకూడదు: డిల్లీలో జిఓఎం ఎదుట సి.ఎం.
నిజమే, ఒక సమస్య పరిష్కరించుకునే ప్రయత్నంలో చేసినవన్నీ పెద్ద సమస్యలు సృష్టించుకోవడమే... జగన్ సమస్యకు పరిష్కారమనుకుని రోశయ్యను పెట్టారు. రోశయ్య సమస్యను సరిదిద్దుకునేందుకు కిరణ్ ను మార్చారు. ఇప్పుడు కిరణ్ సమస్య అయి కూర్చున్నాడు..
**నేను చెప్పిందే కరెక్టయింది.. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు జారి పోయారు, దిగజారిపోయారు. ముఖ్యమంత్రివాదాన్ని కూడ బలపరచలేదు. జావ కారిపోయారు. సొమ్ము మీదనే దృష్టి..
"విభజన అనివార్యమైతే హెచ్.ఎం.డి.ఎ. ప్రాంతాన్ని డిల్లీతరహా కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలి, సీమాంధ్రకోసం ఏటా 40 వేల కోట్ల వంతున 20 యేళ్ళు ఆర్ధికసాయమ చెయ్యాలి, భద్రాచలమ, అస్వారావుపెట.. తిరిగి సీమాంధ్రలో చేరచాలి, సీమాంధ్ర 13 జిల్లాల్లోనూ అభివృద్ధి విస్తరింపజెయ్యాలి,బిల్లు అసెంబ్లీకి పంపినప్పుడు తగిన సమయం ఇవ్వాలి...." డిల్లీలో నిన్న వారి మాటలు ఇవీ! మరి ఈ నాయకులు ఏపి ఏర్పడినప్పటినుంచి 13 జిల్లాలను ఎందుకు అనాధలుగా మిగిల్చారట?
కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీ విలీనం(నిమజ్జనం) చేసినప్పుడు మెగా అనుకున్న చిరు చెప్పింది గుర్తుందా?
"కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు నాపై నమ్మకముంది. నావల్ల పార్టీ ప్రయోజనం పొందుతుంది".. నిజమే కదా ప్రజలు ఏమైనా పార్టీకి లాభం చేస్తున్నారు.

18-11-2013

**ప్రపంచ తెలుగు ప్రజలారా ఏకమవుదాం, తెలుగు ప్రజలంతా ఒకటే, సమైక్యాంధ్రకోసం ప్రాణాలిస్తాం, విభజన ఆపే వరకు పోరాటం, పార్టీ కంటే ప్రజలే ముఖ్యం, విభజన అనివార్యమైతే సమన్యాయం సాధిస్తాం, విభజన తప్పేట్లు లేదు సీమాంధ్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాం, మరో పార్టీ పెడతాం, హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం, కనీసం పదేళ్ళూ ఉమ్మడి రాజాధానిగా ఉంచాలి, రెవెన్యూలో సింహ భాగం ఇవ్వాల్సిందే, యూనియన్ టెరిటరీ కోసం పోరాటం. కొత్త రాజధానికి, భారీగా నిధులివ్వండి, భద్రాచలం ఆంధ్రులది, కనీసం దాన్నయినా మాకు దక్కేట్లు చెయ్యాలి. మేము రాజీనామాలు చేస్తే విభజన ఆగుతుందా? మేము ఇంత ఎదగడానికి పార్టీ ఆశీస్సులే కారణం, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకే కట్టుబడి ఉంటాం.మరో ఆలోచన లేదు........
ఇదంతా వింటుంటే.. చదూతుంటే ఏమి అనిపిస్తుంది?
నాకైతే ఈ భర్తృహరి సుభాషితం గుర్తుకొస్తుంది....
@ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంబోధి బయోధినుండిపవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వెవేక భ్రష్ట సంపాతముల్.....

15-11-13

**ఒకవైపు తెలంగాణ, మరొకవైపు సమైక్యాంధ్ర.. ఈ గొడవ తప్ప.. ఇప్పుడు మరో విషయమే లేదు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు ఒక్క సాహితీ విశాఖే పట్టంకట్టినట్లుంది.. ఎఫ్‌బీ మొత్తంలో అక్షర రాగాలాపన అక్కడనుంచే వినిపిస్తున్నది..

**ఇప్పుడు దేశ జనభా 130 కోట్లుటండీ.. కాంగ్రెస్ పార్టీకి కూడా 130 సంవత్సరాలు సమీపిస్తున్నాయ్.. దరిద్రాలు శతకం ..  కరక్టే కదా!!

*ఇదేకదా(అ)రాచకీయం.. "టి" లో ఉండాలని 72 గంటలు బందట! "సీ" లో కలపాలకి వాళ్లేమిచేస్తారో? తెలుగు నేలపై కాలు పెట్టినందుకు పాపం దేవుడుగా కూడా రాముడికి కష్టాలే.. (భద్రాచలాన్ని తెలంగాణా నుంచి విడతీసి సీమాంధ్రలో విలీనం చేస్తారా లేక తెలంగాణాలోనే వుంచుతారా అనేదానికంటే ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే - కలసి వుందామని వాదించే సమైక్యవాదులు 'విడతీయాలని' అంటున్నారు. విడిపోవాలని వాదించే విభజనవాదులు, కలిపే వుంచాలని అంటున్నారు--.భండారు గారి పోస్టింగ్ )

14-11-13
**మొయిలీగారు డిల్లీలో ఆటో ఎక్కారట. నెహ్రూ దిగొచ్చినంత సంతోషంగా పత్రికలు ప్రముఖంగా ఫోటోలు వేశాయి.
మొయిలీకి నా చాలెంజ్: దమ్ముమంటే హైదరాబాద్ వచ్చి మీటరు రేటుకు ఆటో ఎక్కు... నీ చిన్నప్పటినుంచి ఇలాంటి జిమ్మిక్కులెన్నో చూసింది ఈ దేశం.
.. వాజ్‌పేయీ పార్లమెంటుకు ఎడ్ల బండిలో వచ్చారు. నీకు తెలీదేమో!
..ఎన్టీ రామారావనే ముఖ్యమంత్రి అబిడ్స్ లోని తన ఇంటినుంచి సెక్రెటరియట్ కు ఆటోలో వచ్చాడు ఒకసారి.

Tuesday 12 November 2013

                                  "క్షత్రియప్రభ" నవంబరు 2013, సంచికలో 

                       స్వామి వివేకానందపై రాసిన ప్రత్యేక వ్యాసం..

          "మనుషుల్లో మహా పురుషుడు" 


                                                 




"క్షత్రియప్రభ" నవంబరు 2013, సంచికలో
 భగవాన్ సత్యసాయి 88 వర్ధంతి పురస్కరించుకుని రాసిన వ్యాసం.. 
 *నడిచిన దేవుడు*  


Saturday 9 November 2013

నవరస భరితం..నవంబరు నవనవోన్మేషం.. 
బయటి గోడు పాటు జర్నలిస్టుల గూడు కూడా... 

9-11-13
**12 గంటల వ్యవధిలో జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (హైదరాబాద్) ఎన్నికలు
-------------------------------------------------------------------------------------------
కూడు కోసం రోజూ పాట్లు పడుతున్నాం.. ఇది జీవితకాలం జరిపే ఒంటరి పోరు... గూడుకోసం మన గోడును ఎవరూ పట్టించుకోరు. మనకోసం మనమే నడుము బిగించాలి. ఇది కలసికట్టుగా చేయవలసిన కార్యక్రమం.. ఏమి జరుగుతున్నదీ.. ఎలా జరుగుతున్నదీ స్ఫటికసదృశంగా చూపే ప్రాతినిధ్యం అవసరం. ప్రతి జర్నలిస్టు రక్తం ధారపోసి గడించి కూడబెట్టిన రెండులక్షల రూపాయల నగదుకు రక్షణ కావాలి. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (హైదరాబాద్)కి కేవలం 12 గంటల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు విలువను గురించి మనం నిత్యం ప్రజలకు బోధలు చేస్తాం. మరి మన ఓటు మనం వేస్తేనే కదా.. మనం ప్రశ్నించగలిగేది.
ఆరేళ్ళలో ఇది మొదటి సారి అందివస్తున్న అవకాసం. స్థలాలు నెరవేరని కలలుగా మిగలకూడదు.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎన్నుకోవాలి. ఎవరి ఆలోచన వారిది అది ముఖ్యం.. ఈ నిర్ణయంపై మన భవిష్యత్తు ఆధార పడిఉంటుంది..అయిదుగురు డైరెక్టర్ల ఎన్నిక కోసం 14 మంది బరిలో ఉన్నారు. అందరూ మన పాత్రికేయులే, మిత్రులే..
అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా!!!!

**Started with clouds, drizzling, rain, low pressure, depression, downpour, cyclone, thunders, hailstorm, floods, gales, 12th number signal..Spl Task Force on its toes...[starts crossing shore by 9 am tomorrow and over by 4 pm..] It is all the weather report of Jawaharilal Nehru Journalists Mac Housing Society (Hyd) Directors elections.

**నవ్వే వాళ్ళను నవ్వనీ.. ఏడ్చే వాళ్ళను ఏడవనీ.. నవ్వే వాళ్ళ అదృష్టమేమని ఏడ్చేవాళ్ళను ఏడవనీ!!  ఈ ఆ పాత మధురం ఎంత తియ్యన.. ఇది అన్నికాలాలకు వర్తిస్తుంది కదూ..

8-11-2013
**విలక్షణ హాస్య నటుడు 'అదో తుత్తి" ఎ వి సుబ్రహ్మణ్యం నాకు 1985 నుంచి పాత్రికయ మిత్రుదు..రచయిత. నేను గుంటూరు "ఉదయం" ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎవిఎస్ తెనాలి ఉదయం రిపోర్టర్ గా చేరాడు. సంవత్సరంలో బాగా దగ్గరయ్యాడు. ఆ తరువాత నేను ఆంధ్రజ్యోతి లొ చేరి హైదరబాద్ వచ్చినప్పుడు అతను కూడా అంధ్రజ్యోతి తెనాలి రిపోర్టర్ గా చేరాడు. కళాకారుడు.. హస్య ప్రియుడు.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆఫీసుకు వచ్చి గంటల తరబడి హాయిగా అందరినీ నవ్వించేవాడు. తరువాత సినిమాల్లో చేరి నిలదొక్కుకున్నాడు. రామినేని ఫౌండషన్ తరఫున వార్షిక అవార్డులను ఎవిఎస్ ప్రకటించేవాడు.. హైదరాబాద్ లో రెండు పర్యాయాలు ఇంటికి కూడా వచ్చాడు. ఒక మంచి హాస్యప్రియ మిత్రుణ్ణి కోల్పొవడం బాధాకరం.. RIP

**నమ్మరాదు నమ్మరాదు .. అమ్ముడుబోయే మిడిమేలపు మీడియాను నమ్మరాదు.. నేను ఈ సంగతి ఎప్పటినుంచి చెబుతున్నానో మిత్రులు ఒక్కసారి భూతకాలంలోకి వెళ్ళండి. చిరంజీవి కాలు ఐరన్ లెగ్ అని ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమప్పుడే వ్యాఖ్య పెట్టాను. కాంగ్రెస్ కు అంత్యకాలమని చెప్పినట్లే జరిగింది. ఈయనమీద నమ్మకం పెట్టుకుని సోనియా తనను కాంగ్రెస్ లోకి అహ్వానించారని చెప్పుకున్నాడు చిరు. ఇప్పుడేమో చిర్రు బుర్రు.. ఉన్నదీ పోయింది ఉంచుకున్నదీ పోయిందనే సామెత కరెక్ట్. సామాజిక న్యాయం.. సామాజిక తెలంగాణా.. అంటే అర్ధం అయిందా ఎవరికైనా..ఇప్పుడు సామాజిక కాంగ్రెస్..కాంగ్రెస్ ప్రయాణం జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ....

7-11-13
**"జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌజింగ్ సొసైటీ"(హైదరాబాద్) ఎన్నికలు..
--------------------------------------------------------------------------------------------------
చూశారా మిత్రులారా! ఎన్నికల ప్రభావం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 1105 మంది జర్నలిస్టులు ఆరేళ్ళకిందట ఏర్పరచుకున్న "జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌజింగ్ సొసైటీ" కి మొదటి సారి డైరెక్టరల ఎన్నికలు జరుగుతున్నాయి.
అంటే ఆరేళ్ళుగా ఎన్నికలు లేకుండా నడిచిందన్నమాట. పంచాయితీలకు గాని, మునిసిపలిటీలకు గాని, కార్పొరేషన్లకు గాని ఎన్నికలు నిర్వహించడంలో ఆర్నెల్లు ఆలస్యమైతే ప్రపంచం కూలిపోతున్నదన్నట్లు పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసేవాళ్ళు, గంతల తరబడి విశ్లేషణలు చేసేవారు ఆరేళ్ళుగా ఎందుకు ఎన్నికలు జరుపుకోలేదని, కోట్ల రూపాయల నిధులున్న సొసైటీ ఎవరు నిర్వహిస్తున్నారని ఎవరు ప్రశ్నిస్తారు. ఎవరు అడుగుతారు.? ప్రభుత్వంలో పారదర్శకత గురించి నిలదీసే జర్నలిస్టులు ఎంత పారదర్శకత ప్రదర్శించారు.
సొసైటీలో ఎవరు దేనికి బాధ్యులో తెలీకుండా ఆరేళ్ళు నడిచిందంటే ప్రజలకు ఉపదేశాలు చేసే పాత్రికేయ మేధావులు ఎందుకు మౌనం వహించారు. అనేక సొసైటీల్లో అవకతవకలు జరిగాయని కోడైకూసే రాతగాళ్ళూ మినహాయింపుకాదని ఎన్నో విమర్శలు వచ్చాయి. అంతే ఎవో కుంభకోణాలు జరిగాయని మాత్రం కాదు. పారదర్శకత లేకుంటే అనర్థాలు ఏర్పడతాయని మాత్రమే చెబుతున్నాను.
జర్నలిస్టుల్లోనూ గ్రూపులున్నాయన్నది బహిరంగమే. అనేక కమిటీల్లో అనేక సంవత్సరాలుగా గుత్తాధిపత్యం సాగుతున్నదంటూ రచ్చకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ప్రభావాలాకు, ప్రలోభాలకూ గురికాకుండా పాత్రికయ వర్గానికి న్యాయం జరిగేలా చూసుకోవలసిన కర్తవ్యం అందరిదీ.. కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించుకోవలసిన నైతికత మన జర్నలిస్టులది..ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక కోసం 14 మందికి పైగా బరిలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ అనుబంధాలకు దూరంగా ఉండాలి. విజ్ఞతతో ప్రతినిధులను ఎన్నుకోవాలి. 1105 మంది భవిష్యత్తు జీవనం ఆధారపడిఉంది. అందరూ రెండు లక్షల రూపాయలు చెల్లించిన వాళ్ళే!! కొందరు అకస్మాత్తుగా తెరమీదకు వస్తున్నారు. కొందరు ప్రచ్ఛన్నంగా ఉంటున్నారు. వివేకంతో ఆలోచించాలి.
ఈనెల 10 వతేదీన హైదరాబాద్ (సోమాజిగూడ) ప్రెస్ క్లబ్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్. అందరూ హక్కు వినియోగించుకోవాలి. ఈ అభ్యర్ధన ఎవ్వరికీ వ్యతిరేకమూ కాదు.. అనుకూలమూ కాదు..
**ప్రచార పటోటోపాలు ఎక్కువతే బొమ్మ ఎప్పుడూ బోర్లా పడుతుంది.. ఇది చరిత్ర చెబుతున్న పాఠం..కలం కత్తి అనుకుని నమ్ముకుంతే అది కుత్తుకలు కోస్తుంది..ఎందుకంతే బొద్దుబారిన కత్తికి ఎందరో "సాన" పెడతారు. ఎవేరి ఉపయోగం కోసమ వారి తంటా!!
**విభజన విషయమై చర్చకు అయిదు పార్టీలనే పిలిచిందట కేంద్రం..మీడియాలో కొందరు తెగ బాధపడిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 100 మీడియా సంస్థలనూ అహ్వానించకపోవడం..అప్రజాస్వామికం కదూ.. నాయకులకు పాకేజీ సలహాలు ఇచ్చేవరికి తృణమో పణమో దక్కకపోవడం విచారమే!!

6-11-13
****ఒక్క విషయం కాదు.. అన్నీ అంతే! జనాలను బలవంతంగా నమ్మించడానికే కదా పొద్దున్నే టీవీల్లో రాజకీయ రామంధాళి..చర్చల చిచ్చు.. ప్రాణాలు పణంగా పెట్టడానికి వీక్షకులు ఎవరూ ఇష్టపడడంలేదు. "పొద్దున్నే ఆ పాడు టీవీ పెట్టి ప్రాణాలు తోడకండి.. పగలూ రాత్రుళ్ళూ అదే గోల చస్తున్నాం", అని ఈ మధ్య ఇళ్ళలో తిట్లు శాపనార్ధాలు..
**సమైక్యంకోసం చచ్చిపోతామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు పాకేజీల జాబితాను సిద్ధం చేశారట.. పాపం ఎంపీలు కూడా క్యూల్లో నిల్చున్నారు..
** రాష్ట్ర దేశ రాజకీయాలను, ప్రభుత్వాలను(ప్రజలను) శాసించే స్థాయికి ఒక గుమస్తా ఎదగడం ఎంత గుణాత్మకమైన మార్పు!!
**నిన్నొక మాట, నేడొక మాట, రేపొకమాట చెప్పే పార్టీ కాదు మాది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.-విభజన ఆగిపోవాలని కోరుకుంటున్నా: బొత్స. అవును పూటకోచోట - మనిషికొక మాట చెప్పే పార్టీ మీది.  సిడబ్ల్యుసి శిరోధార్యమైతే విభజన ఎలా అగిపోతుందో?
**తాడూ, బొంగరం లేని లక్ష్మిపార్వతికి కూడా రాష్ట్రపతిని కలుసుకునే అవకాశం లభించడం ఎంత గర్వకారణం.
**విశాలాంధ్ర మహా సభ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, పేటకో జేఎసి.. ఎన్ని స్వయం ఉపాధి మార్గాలు?
**ప్రధానిని కలిశాం, రాష్ట్రపతిని కలిశాం, సోనియాను కలిశాం, రాహుల్ ను కలిశాం, చిదంబరం ను కలిశాం, షిండేని కలిశాం.. రాష్ట్రంలో తాజా రాజకీయ, శాంతిభద్రతల గురించి వివరించాం. వారు శ్రద్ధగా, ఆసక్తిగా విన్నారు. తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రయత్నాలు ఇలాగే సాగుతాయి..--
వీరికి పనిలేకపోతే డిల్లీలో వారికీ పనిలేదా..తలుపులు బార్లా తెరుచుకుని ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నట్లున్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉందా??

5-11-13
**"కేంద్రంలో ఎవరూ కెవిపి గారి సమైక్యాంధ్ర గోడు వినడం లేదని" పాపం ఒకానొక సమైక్య సీనియర్ పాత్రికేయుడు ఇవ్వాళ మధ్యహ్నం ఎంతగానో బాధపడిపోయారో. ఈ కింది మాటలు ఆయనవే.---
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్రరావు కోరారు. ఆయన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం పురోగతి సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దశలో కెవిపి విన్నపాన్ని వినేవారు ఎవరుంటారు.--- (చూడండి రాజకీయనేతలు, పాత్రికేయుల అవినాభావ సంబంధం అలాంటిది..)
**సమైక్యమైనా. ప్రత్యేకమైనా బాదుడు సామాన్యులకే అని అర్ధమైందా! సమ్మెలు చేసిన ఆర్టీసి కుటుంబాలకి ఎటూ ఫ్రీ పాసులే. వాళ్ళకేమీ నష్టం ఉండదు. చేయించిన ప్రజా ప్రతినిధులది ఎప్పుడూ బైరాగి టిక్కెట్టే, అశొక్ జ్ఞానిది ఆకాశపయనమే.. ఎటూ చిక్కులు సామాన్యులకే. మళ్ళీ రాజకీయ పార్టీలు చార్జీల పెంపుదలపై ఆందోళనలు.. నడ్డి విరిగేది ఎవరికి?

4-11-13
**సమైక్యంకోసం ప్రాణాలిస్తాం, తెలంగాణ అంగీకరించబోమని ప్రతిజ్ఞలు చేసిన కర్నూలు, అనంతపురం ఉత్తరకుమారులు ఇప్పుడు తెలంగాణాలొ తమను "నిమజ్జనం" చేయాలని కాళ్ళా వేళ్ళా పడుతున్నారు..చీ! సిగ్గులేని రాజకీయం.
**సంతోషం ఏమిటంటే నాకు ముఖతః, ముఖపుస్తకంలోనూ మిత్రులు పరిమితం. మిత్రులందరూ ఆప్తులు, సహృదయులే..ఏఫ్‌బి లో మిత్రుల సంఖ్య నేడు ముచ్చటగా మూడార్లకు చేరింది.(666)

2-11-13
**గాంధీ భవన్ లు ఎప్పుడో బ్రాందీ భవన్లయ్యాయ్..మహాత్ములకు మగానుబావులకు తేడా ఉందండి..లక్షాధికారుల కొడుకులే కోటీశ్వరులు అవుతారు..మంత్రుల సంతానం ముఖ్యమంత్రులవుతారు, నిరక్షర కుక్షులు నిచ్చెనలెక్కుతారు..
**వంట గ్యాస్ ధర తగ్గింది:- వార్త
అంతా గ్యాస్. అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆమాత్రమయినా తగ్గక పొతే "బండ" పడుతుందన్న భయం.. తరువాత ఎలాగూ మంటే:- ఇది వాత

1-11-13
** సినిమా హీరోయిన్లందరూ తెలుగొచ్చిన వాళ్ళేనా? తెలుగు చానళ్ళలో పని చేసేవారందరికీ తెలుగు వచ్చా? రాజకీయాలకు భాష అనవసరం..భరోసా ఉంటే అదేచాలు..
-----------------------------------------------------------------------------------------------

Friday 1 November 2013

వారం తీరంలో రాజకీయ అల(జడు)లు..


1-11-13.
**రాష్ట్రంలో మూడేళ్ళుగా కనుమరుగైన "ఆత్మ" త్వరలో సాక్షాత్కారం చూస్తూ ఉండండి. విజ్ఞులు నా మాట గుర్తుంచుకోండి..త్వరగా, త్వర త్వరగా తెరమీదకు పాత్ర!!

31-10-13
**ఉద్యోగుల సమ్మె వలననే సమయానికి తుపాను చర్యలు, సహాయ కార్యక్రమాలు అందించలేకపోయామని ముఖ్యమంత్రి గారు బాధ పడ్డారు. అందుకేనేమో రైతులను, బాధితులను ఆదుకోని సహ్హయం అందిచని సమ్మె ఉద్యోగులకు ఉదారంగా రెండు నెలల జీతం అడ్వాన్స్ మంజూరు చేశారు సి ఎం గారు!!

**ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలిగిస్తుంది. ఒక అలోచన మరొక అలోచనను రేకెత్తిస్తుంది. ఒక హృదయం మరొక హృదయాన్ని ప్రేమిస్తుంది..

**మీడియా హడావిడి కూడా అంతేగా!! చచ్చిన వాళ్ళను కూడా వదలకుండా చెత్త కథనాలు..

31-1-0-13
**ఈ రిస్ట్ వాచ్ కి నేడు 30వ జన్మదినం.. 
------------------------------------
ఈ రిస్ట్ వాచ్ వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ఇది నా జీవితంతో పెనవేసుకు పోయింది. నా కాళ్ళు, చేతులు, గుండె, మెదదు మాదిరి శరీరంలో విడదీయలేని ఒక భాగమైపోయింది. నేడు 30 సంవత్సరంలోకి కాలు పెట్టింది. అంటే ముప్పయ్యో జన్మదిన వార్షికోత్సవం జరుపుకుంటున్నది. నా కూతురి కంటే వయసులో ఇది పెద్దది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇది పని చేస్తున్నది. నాకు ప్రియాతి ప్రియమైన హెచ్ఎంటి తయారి.
1963 నుంచి ఇప్పటివరకు నేను రెండు వాచ్‌లు సొంత సంపాదనతో కొనుక్కున్నాను . 1963 ఎస్సెస్సెల్సీ మార్కుల ప్రాతిపదికపై 1964లో (పియుసి) 150 రూపాయల స్కాలర్‌షిప్ లభించింది. ఆ మొత్తం నుంచి 110 రూపాయలు పెట్టి అప్పుడే కొత్తగ మార్కెట్ లో ప్రవేశించిన ట్రెస్సా చతురస్ర వాచ్, మిగిలిన 40 రూపాయలతో ఫ్లెక్స్ షూ తీసుకున్నాను.. అలా ఆ వాచ్ 1984 రెండు దశాబ్దాలపాటు వరకు భద్రంగా వాడుకున్నాను. 


1984 అక్టొబరు నెలలో నిజామాబాద్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల "ఉదయం రోవింగ్ కరెస్పాండెంట్" గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఒకరోజు ఆవాచ్ కిందపడి పాడైపోయింది. అక్టొబర్ 31 వతేదీ మధ్యాహ్నం గంజ్ మార్కెట్లోని హెచ్ ఎం టి వాచ్ షాపుకెళ్ళి, ఈ వాచ్ 190 రూపాయలకు కొనుగోలు చేస్తుండా ఒక్క ఉదుటున సంచలనం... ఉద్రిక్తత, పెద్దగా కేకలు, అరుపులు, గంబ్దరగోళం. దుకాణం షట్టర్లు హడావిడిగా దించేశారు.. అప్పుడు తెలిసింది ప్రధాని ఇందిరాగాంధి దారుణ హత్యకు గురయ్యారని. వెంటనే బయటకు పరిగెత్తా!! భయానక వాతావరణం. దుకాణ దారు నన్ను లోపలికి లాగాడు. "బయటకు వద్దు. రాళ్ళు విసురుతున్నారు" అంటూ.. గంట సేపు లోపలే కూర్చున్నా. అప్పుడు ఆకాశవాణి డిల్లీ కేంద్ర ఆ వార్తను ధృవీకరించింది. ఈ రోజుకే మరో ప్రాధాన్యత. భారత ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని, ఆంతరంగిక భద్రతా వ్యవాహారాల మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇదే రోజు. 

సోదరాగ్రజులు, భగవదనుగ్రహ, గురుదేవ కటాక్ష పాత్రులు, శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు ఈ ఏడాది ఆగస్టు నెలలో వారి ఇంటికి ఆహ్వానించి అమెరికానుంచి తాను ప్రేమతో నాకోసం తెచ్చిన రిస్ట్ వాచ్ ను గురూజి చిత్రపటాలను, గ్రంధాలను బహూకరించారు.. రెంటిలో ఏదీ వదులుకోలేను. అందుకే ఇఫ్ఫుడు ఈ రెండు వాచీలు రోజు విడిచి రోజు పెట్టుకుంటున్నాను. 65 సంవత్సరాల జీవన ప్రయాణంలో రెండు చేతి గడియారాలతో 20 సంవత్సరాల ప్రేమానుబంధం, 35 సంవత్సరాల గాఢానుబంధం.. ..

**ఒక ప్రళయమో, విపత్తో, ప్రమాదమో, బాధో, హ(అ)త్యాచారమో జరిగినప్పుడు వెంటనే కవితలు, పరామర్శలు, సంతాపాలు గుట్టల గుట్టలు. కొవ్వొత్తి ప్రదర్సనలు, సామూహిక ప్రార్ధనలు, బ్యానర్ల ఊరేగింపుల వరద..మంత్రులు, అధికారగణ బాధ్యతారహిత ప్రకటనలు, ప్రభుత్వ వైఫల్యంపై పంచాంగం, రాజకీయనాయకుల పరామర్శ పర్యటనలు, విమర్శల తుపాను, ఉద్వేగ ప్రసంగాలు, పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై పత్రికలు, చానళ్ళ మూకుమ్మడి దాడులు, ప్రశ్నాస్త్రాల సంధన, పైత్యప్రకోపాలతో ఊహాతీత కథనాలు.. ఇవన్నీ అమానుషం..లోపాలు ఎత్తి చూపడంలో ఉత్సాహం సాయం చేయడంలో కనబడదు. అదీ విచారకరం..

29-10-13
**పదవులాట తెలీకపోతే పడవ బోల్తా.. అనుభవమే పాఠం చెబుతుంది..ట్యూషన్ ఉండదు..
**అంతా టేకులు.. రీ టేకుల జీవితం కదా.. రాజకీయలో రీళ్ళుండవని, అన్నీ కన్నీళ్ళేనని..తెలీదులేమ్మా!
**అయిదేళ్ళ కాపురం అనివార్యం. అయితే పీఠమెక్కిన వాడికే విడాకుల(రాజీనామా) అవకాశం. ఎక్కించిన మనకునచ్చకున్నా "అత్యధికులను" భరించాల్సిందే.. మన తిరస్కారం వాళ్ళకు పురస్కారం..

28-10-13
**ఆ ముక్కాయల చూర్ణాన్ని రంగరించి ఎప్పుడూ ముక్కులో వేళ్లెట్టుకునే ఆయన కర్ణాల్లో పోశారుట. అంతే..నసాళానికంటింది.. నాలుగేళ్ళబట్టీ ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, (వి)భజనొచ్చినా, నోరెళ్ళబెట్టి "వస్తున్నా మీ కోసం" అంటూ -ఆత్మగౌరవ- ఘోషలతో భూప్రదక్షిణలు మొదలయ్యాయి. ఇక భూకంపాలే...

**(పాత్రికేయ)మైకంలో ఉన్నాను మన్నించండి.. ఈ మాటలు, చేతలు నావే కావూ(అక్కినేని పాట). నాక్కాస్త తిక్కెక్కువ.. దానికి లెక్కలేదు..

**No beating round the bush..all direct answers No.1) JP will not change politics, but he will change, 2) how do you expect a vision-less person will do justice at all? 3) Congress sees no betterment 4) BJP is the only alternative for the present, first let it come to power then we can talk of miracles..,5) yes, people are looking for two states.. I am always impartial.. that is cent percent true to my conscious..

**గొట్టాలు గుట్టలుగా తయారయ్యాయి.. కలాలను కులాలు కమ్మేసాయి.. చెడు-వినకు, చెడు-కనకు, చెడిపోకు.

26-10-13
**ఇవ్వాళ అత్తల దినమట..
నేను గనక ఒక ఈల గనక వేశానంటే....
కొందరు కోడళ్ళు ముళ్ళ మీద కుళ్ళుకుంటూ, మరి కొందరు.. ఎంత సంతోషమో!!
అత్తయూ ఒక ఇంటి కోడలే కాని.. ప్రతి కోడలు అత్త కావాలన్న రూలు లేదు..అదీ అసలు కిరికిరి.
**

25-10-13
**ప్రపంచ మేధావిగా, రాజనీతిజ్ఞునిగా పేరొందిన పివి ప్రధాని పదవి నుంచి వైదొలగిన తరువాత గాంధీ భవన్ కు పలు మార్లు వస్తే. ఒక్క నాయకుడు తోంగిచూడలేదు.. వెనుక ఉన్న గ్రంధాలయంలో కొద్దిసేపు కూర్చునేవారు. పత్రికా ప్రతినిధులూ ముఖం చాటేశారు... అందుకే ఆయన కార్యక్రమాలు రామానందతీర్థ కార్యాలయానికి పరిమితి చేసుకునే వారు. మనం కాదంటే ఆయనను రాంటెక్ ప్రజలు ఆదరించారు.
**కొన్నిచోట్ల మానవ సంబంధాలు మాయమవుతున్నా.. మెషిన్ సంబంధాలు కొన్ని నాగార్జున సిమెంట్ లా పటిష్టమవుతున్నమాట వాస్తవం..