Friday 20 September 2013

**వారాంతం వేడి వేడి పకోడీలు...



*ఏడాది నలిగిన తరువాత పెళ్ళి చూపులు. తరువాత ఏడాదికి నిశ్చయ తాంబూలం.. మరో ఏడాది గదిచిన పిమ్మట ముహూర్త సమాలోచన.. ఇంకో ఏడాదికి ముహూర్తం..రెండేళ్ళ తరువాత పెళ్ళి, ఆ తరువాత ఏడాదికి కాపురం. అయినా అప్పటికీ మూడు నిద్రల ముచ్చట తీరలేదు.
తాళి లేని, బాజాలు మోగని, పురోహితుడు రాని పెళ్ళి..ఇక ఆపెళ్ళిలో త్రిల్ ఏముంటుండి? అసలు పెళ్ళయినట్లా లేదా? జవాబులేని ప్రశ్న..
తెలంగాణా ప్రకటన అయినా, జర్నలిస్టుల అవార్డుల బహుకరణ అయినా అంతే.. ఎండమావులే!!!
*Supreme court issuing notices to Ministers, CBI naming ministers as accused, Additional DGP involved in forgery, arrest of a scribe for his alleged partnership in the crime, MPs, ministers lodged in prison, and few forced to resign on charges of corruption, CM dropping colleagues from cabinet, MPs, MLAs, MLCs and even members of the cabinet charging CM with gross failures in many fields, IAS bosses facing trials, CBI investigating into disproportionate assets of a DGP, and State turning to fireball for last 50 days..... What a great and record achievement ? AP stands in forefront.. hats off to leadership.

*వార్తలను వండి, వార్చి, వడ్డించేది మనమేగా..ఎవరి అజెండా వారిది. ఎవరి భజన వారిది. పిండికోద్ది రోట్టె.. ముట్టిన వాడికి ముట్టినంత మహదేవా!! ప్రధాని ఇంట్లో జరిగింది, సోనియా దొడ్లో జరిగింది, చంచల్‌గూడ జైల్లో జరిగింది, మోడీ ముంగిట్లో జరిగింది.. అంటూ రోజూ ఎన్నెన్ని కథలు, కథనాలు, కాకరకాయలు.... చూస్తున్నాం వింటున్నాం, చదూతున్నాం..

*మనకు తెలిసినదంతా చరిత్రకాబోదు. అదేమాదిరి తెలియనంత మాత్రాన చరిత్ర కాకుండాపోదు. మన చరిత్రను తెల్లవాడు ఎప్పుడో వక్రీకరించి తిరగా బోర్లా రాశాడు. నల్లవాడు సమర్ధించుకున్నాడు. రాజకీయమైనా అంతే. మనకు నచ్చిందే వేదం కాదు. వ్యతిరేకించినంతమాత్రాన సత్యం కాకుండాపోదు..

*మోడీతొ ఢీనా? మాడు పగులుతుంది.. మూడుసార్లు మీడియాకే సాధ్యం కాలే ఆ స్పీడు కు బ్రేకెయ్యడం..

*భజన చేసే విధము తెలియండీ. తులసి రెడ్డి మంచి భజన పరుడు. ముందు ఎన్టీఆర్ భజన, తరువాత బాబు భజన, అనంతరం వాజ్‌పేయీ భజన, నెక్స్ట్ వైఎస్సార్ కీర్తన, వెంటనే రోశయ్య స్తోత్రం. సీను మారింది కిరణ్ పూజ. 2004 నుంచి సోనియా స్తుతి.. ఇప్పుడు సమైక్యాంధ్ర.. రేపు జగన్‌ను దేవుడన్నా ఆశ్చర్యం లేదు..

*Opinions,policies and choices change from time to time basing on the needs, whether in politics, journalism or any other fields.

*చంద్రశేఖర్ అజాద్ తో నా స్నేహం, పరిచయం 1978 నుంచి విజయవాడ ఈనాడులో..చంద్రశేఖర్ ఆజాద్, తలశిల నళినీరంజన్ చీఫ్ సబ్ ఎడిటర్లు, అప్పుడు కె.ఎన్.వై. పతంజలి మొదట్లో సీనియర్ సబ్, తరువాత చీఫ్ సబ్‌గ పదోన్నతి పొందాడు. అజాద్ ది ముక్కు సూటి తనం. అయినా మనసు వెన్న, మంచి గంధం. హడావిడి, టెన్షన్ ఉండేవికావు.లౌక్యుడు కాదు. బోళా శంకరుడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించని వ్యక్తిత్వం. హైదరాబాద్ వచ్చిన తరువాత చానల్‌కు మారాడు. ప్రెస్‌క్లబ్ లొ చురుకు. ఆయనది కార్డ్స్ బ్యాచ్. ఎన్నికలప్పుడు ప్రతి సారీ ఒక ప్యానల్ తో పోటీ. గెలుపు ఓటముల ప్రసక్తి లేదు. మంచి వాక్ చాతుర్యం, నిజమైన జర్నలిస్టు.. కలం మిత్రునికి నివాళులు..నిజంగా చంద్రుడే..అందరూ చల్లగా ఉండాలని కోరుకునే వాడు. సహచరుడు పతంజలి అంటే ప్రాణం. నళిని నిలదీశేవాడు. గమ్మ్మత్తేమిటంటే.. ఆ ముగ్గురూ మన మధ్య లేరు. అందరూ ఊర్ధ్వలోకాల్లో ఏం రాస్తున్నారో, ఏం చేస్తున్నారో..

*అంతఃకరణంలో దాడులు చేయాలని ఎవరికి ఉండకపోయినా, కడుపుబ్బరం భరించలేని "నారదులే" ఉత్ప్రేరకాలు, ప్రోత్సాహకాలు.  అందుకే ఏడో తేదీ ఎన్‌జీఓల సభ నిస్సారంగా, నిస్తేజంగా ఉందని పాపం కలాలు, గళాలు తెగ బాధపడిపోయాయ్.

*శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే? తెలుసా!
ఎవరైనా చనిపోతే నిర్యాణం ప్రకటన వేస్తామంటూ ఫోన్లు చేసి వెంటపడే తెలుగు పత్రికల టాబ్లాయిడ్ రిపోర్టర్లు..

Saturday 7 September 2013

రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల చరిత్ర కొద్దిగా తెలుసుకుందాం..

---------------------------------------------------------------------------------------------------





గోవింద్ వల్లభ్ పంత్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఫజల్ అలీ అధ్యక్షతన హెచ్ఎన్ కుంజ్రూ, కె ఎం ఫణిక్కర్ సభ్యులుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 డిసెంబరు 22న అప్పటి ప్రథాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. గవర్నర్ల ప్రావిన్సులను, పూర్వపు పెద్ద రాజసంస్థానాల్లో రాజ్ ప్రముఖ్ వ్యవస్థను అంతమొందించే ఏకైక లక్ష్యం నాటి ఎస్సార్సి ఏర్పాటు.
1950లొ అమలులోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు మూడు విభాగాలుగా తయారయ్యాయి. "ఎ" విభాగంలో గవర్నర్ల ఏలుబడిలొ మద్రాసు, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండేవి. "బి" విభాగంలో రాజసంస్థానాలు/సంస్థాన కూటములు హైదరాబాద్, సౌరాష్ట్ర, మైసూర్,ట్రివాన్‌కూర్-కొచ్చిన్, మధ్య భారత్, వింధ్యప్రదేశ్, పాటియాలా-తూర్పు పంజాబ్ రాష్ట్రాల (రాజస్థాన్) సంఘాలు ఉండేవి. "సి" విభాగం కింద బ్రిటిష్ హై కమిషనర్ల ఏలుబడిలో డిల్లీ, కచ్, హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్, కూర్గ్, భోపాల్, మణిపూర్, అజ్మీర్-మేర్వార్, త్రిపుర ఉండేవి. వాటిలో ఏ విభాగంలోని రాష్ట్రాలకు సరిహద్దులు స్పష్టంగా లేవు. ఆ ప్రతిబంధకాలు తొలగించేందుకే ఎస్సార్సీ ఏర్పాటయింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటువలన పాలనా సౌలభ్యం కలుగుందని అప్పతి కేంద్ర ప్రభుత్వం భావించింది.

1955జూన్ లోగా నివేదిక అందించవలసిన ఫజల్ అలీ కమిషన్ మరో మూడునెలల సమయం అదనంగా తీసుకుంది. సెప్టెంబర్ 30 న కేంద్రానికి నివేదిక అందజేసింది. ఆ సిఫారసుల మేరకు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు తొలగిపోయాయి. సరిహద్దులను కమిషన్ నిర్ధారించింది. ఆ ప్రకారం 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బొంబాయి, జమ్ము-కాశ్మీర్, కేరల, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాలు రద్దయ్యాయి. అండమాన్-నికోబార్,లక్ష దీవులు, డిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పాండిచేరి, త్రిపుర, మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతాలయ్యాయి. 

నివేదికలోని 100- నుంచి 111 పజీలవరకు ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లపై కమిషన్ తన అభిప్రాయం పొందుపరచింది. హైదరాబాద్ సంస్థానాన్ని మూడు భాగాలుగా విడగొట్టి మరఠ్వాదానుబొంబాయిలో, కన్నడ ప్రాంతాలను మైసూరులో, బీదరును హైదరాబాద్ లో విలీనం చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని సూచించింది. " ఆంధ్ర హైదరాబాద్ ప్రజల మధ్య సజాతీయత లేదని అభిప్రాయపడింది. అయిదేళ్ళపాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పేర్కొంది. అయిదేళ్ళతరువాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా చెయ్యాలని చెప్పలేదు. కమిషన్ సిఫారసులన్నిటినీ ఆమోదించిన కేంద్రం హైదరాబద్ విషయంలో సూచనను తిరస్కరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకావాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నందువలన, తెలుగు మాట్లాడేవారిని రెండు రాష్ట్రాలుగా విభజించడం సరికాదన్న ఉద్దేశంతో తిరస్కరించింది. 

ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం గమనించాలి. స్వాత్నత్ర్యానికి 45 సంవత్సరాల పూర్వమే భాషా ప్రయుక్తరాష్ట్రాల అవసరాన్ని కాంగ్రెస్ తీర్మానించింది. బెంగాల్ విభజనకు 1905లో ఉద్యమించింది కూడా. బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్రాలను పక్కనపెట్టి, ప్రాంతాలు, భాషలకు అనుగుణంగా కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసుకుంది. 1928లో భాషా సంయుక్త రాష్ట్రాలకు అనుగుణంగా తీర్మానం అమోదించింది. దానికి నీహ్రూ నివేదికే ఆధారం. 1946-47లో తన ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్నే ముఖ్యంగా ప్రస్తావించింది. అయితే దేశవిభజన, మతకల్లోలాల అనుభవాల కారణంగా నెహ్రూ భాషా సంయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించారు. కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమ పరిణామాలతో నెహ్రూ మనసు మార్చుకున్నారు. 

స్వాతంత్ర్యానికి ముందునుంచే ప్రత్యే ఆంధ్ర రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉండేది. ఆ సమయంలోనే రాజగోపాలాచారి ప్రభుత్వం ఆంధ్ర జలాలను మదరాసుకు తరలించాలని చేసిన యోచన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్షకు ఉపక్రమించి నా నెహ్రూ పట్టించుకోలేదు. డిసెంబరు 16న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో హింస జ్వలించదంతో ఆయన దిగి వచ్చారు. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ పిమ్మత హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పాటు ఉద్యమం తారస్థాయికి చేరుకుంది.. తదనంతర పరిణామాల వలన ఆంధ్రప్రదెశ్ ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే..

Wednesday 4 September 2013


ఉపాధ్యాయ దినం - గురుశిష్య బంధం..
------------------------------------

మన పుణ్యభూమిలో గురువుకు అగ్ర తాంబూలం.
మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ..అని అన్నారు.


                                                                 

                                                            
                                                                     గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, 
                                                       గురుర్దేవో మహేశ్వర, 
                                                       గురుస్సాక్షాత్ పరబ్రహ్మ 
                                                       తస్మై శ్రీ గురవేనమః. 

గురువు, ఆచార్యుడు, ఉపాధ్య్తాయుడు.. వీరికి వాస్తవానికి చాలా వ్యత్యాసముంది. గురు పూర్ణిమ వేరు- ఉపాధ్యాయ దినం వేరు. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుని నుంచి ఆచార్యుని వరకు ఎదిగిన మహోన్నతుడు. అందుకే సెప్టెంబరు 5 వ తేదీని మనం ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటాం. గతంలో దానికి ఒక గొప్పతనం ఉండేది. కానీ...ఇప్పుడు దృశ్యం మారింది. తల్లకిందులయింది. 

ఒకానొకప్పుడు గురువు శిష్యులు ఒకరికోసం ఒకరు తపించేవారు. ఇది కలికాలం కదూ.... ఈ తరం గురువులు కూడ కలి బారిన పడ్డారు. కాసులు, కోరికలూ వదలటం లేదు. ఎంత దండుకుందామా అని మాత్రం చూస్తున్నారు. ఎంతిచ్చినా తీరటం లేదు. చేతి దురద.... ఎంతసేపూ తన స్వార్ధం చూడటమే కానీ ఇచ్చిన కాసుకి తగినంత విద్య చెప్పామా అన్న కనీస, ఆ చిన్న ఆలోచన, కూడా చేయటం లేదు. ఎంతసేపూ శిష్యులని హింసించడమే కాని మూడు వేళ్ళు తమను చూపుతున్నాయన్న కనీస యొచనకూదా లేకుండాపొయింది. గురువు తెలిసే చేస్తుంటే శిష్యులు నిస్సహాయంగా ఎవరిదారి వారు వెతుక్కుంటూ వెడుతున్నారు. తానుగా గురువు ఇది నువ్వు చెయ్యి, అని అంటారేమోనని నిజమైన శిష్యులు ఎదురుచూస్తున్నారు. కానీ ఎందుకు ఈ గురువులు అనటం లేదు? అనలేకపోతున్నారు?

గురువుని మించిన శిష్యులు అంటే పాత తరం గురువులు పొంగిపోయేవారు. ఈ తరంలో అటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు. ఎవరు ఎక్కువ సొమ్ము ముట్టజెబితే వారికే విద్యను విక్రయిస్తున్నారు. కాసు కున్న విలువ విద్యకి లేదు. సమాయానికంతకన్నా లేదు. పడిగాపులు గాచినా విద్య మాత్రం దక్కదు. చివరికి కాసులూ పోయి, సమయమూ వృధాఅయి, విద్యలేకుండా, సమాజంలో సంపాదించుకున్న ఆ కాస్త మర్యాదా పోయి, పరపతి పోయి, ఒట్టి చేతులతో, అవమాన భారం నెత్తినేసుకుని, చక్కాపోవటమే శిష్యులకు మిగులుతున్నది.

జ్ఞాన సంపద ఒకచోట, కాసుకోసం మరోచోట పనిచేసి అలిసి సొలసి పోవటం ఇప్పటి గురువు వ్యవహారం. రాజకీయ వాతావరణం మారక పోవటం నిప్పుకు గాలి తోడైనట్లయింది. అందుకే ఏ రంగంలోనూ విద్యార్హతలు, జ్ఞాన సంపద కలవాళ్ళూ కరువయ్యారు. అంతటా, కాసుల గలగలలు, రాజకీయత. లోపాయికారీ తనంతో విద్య సంపాదించిన శిష్యుల రెపరెపలు తప్ప, జ్ఞాన సముపార్జన కనుమరుగవుతున్నది.