Saturday 31 August 2013

ఇది రోజువారీ రాజకీయం.. 

వారంలో...  వార్తలు-విశేషాలపై వ్యాఖ్యలు.. 




30-8-13
*Having seen the painful postings of Bhandaru Srinivasa Rao and Jwala Narasimha Rao, I once again appeal/request to all my learned friends, particularly the veteran( not by age/seniority but by maturity ) journalists not to accept the invitations by Telugu electronic channels and participate in the debates/ political analysis /news scan programs. The most unscrupulous, immature, and zero knowledge fellows are running the programs. That is why I called the self declared analysts( who are being patronised by channels) "VAARAALABBAYILU". The learned friends may scribble their thoughts/opinions in the columns of Telugu/English newspapers, which last long. It will prove the mettle of the person too. In the name of debates the channels are promoting verbal duo freestyle wrestling.

28-8-13
*అధికార పక్షం, విపక్షం, ప్రత్యేక వాదులు, సమైక్య వాదులు, ఉద్యోగనేతలు, ఉద్యమకారులు, విశ్లేషకులు, పాత్రికేయులు, న్యాయవాదులు.. వెరసి మేధావులారా(సామాన్య ప్రజలు ఈ కోవలోకి రారు)..రాష్ట్ర విభజనపై ఒకసారి కేంద్రం కచ్చితమైన నిర్ణయం తీసుకున్న తరువాత, యు పి ఎ అధినేత్రి, ప్రధాని, గృహ మంత్రి అది వెనుకకు పోని నిర్ణయమని కుండబద్దలు కొట్టి చెప్పినా ఎందుకీ నాటకాలు, ఉద్యమాలు, ధర్నాలు, డిల్లీ ప్రయాణాలు, మంతనాలు, దీక్షలు? ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసగించి పబ్బం గడుపుకుంటారు? కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, ఎంపీలు, సమైక్య మంత్రులు,  ప్రజా ప్రతినిధులారా! ఇకనైనా రాష్ట్రాన్ని దగ్ధం చెయ్యకండి. ఇష్టం లేకుంటే పార్టీని, పదవులను వీడి, అన్ని ప్రభుత్వ సదుపాయాలు నిరాకరించి మీరూ జనంలో మమేకం కండి, లేకుంటే ఇళ్లలో కూర్చోండి. . మీరు చేస్తున్న ఆమరణ  దీక్షలు ప్రజల ప్రాణాలు తీస్తున్నయి. మీలో ఒక్కరూ మరణించలేదు.  నాయకులు దీక్షకు ఉపక్రమించడం జనం ఉద్రేక పడిపోవడం.. బతిమిలాడించుకునో, భంగపడో మీ దీక్షలు అటకెక్కించుకోవడం రివాజైంది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుల మౌనం ఎన్నాళ్ళు? వాళ్లకు లబ్దిచేకూరే వరకు ఇంతే. తరువాత తట్ట తగలేసి పోతారు.

27-8-13
*రాష్ట్ర వివాద రావణకాష్ఠం చల్లారకుండానే ఐ టివి తెలుగు న్యూస్ చానల్ కొత్తగా జిల్లాల చిచ్చుపెట్టింది. 1956 తరౌవాత రాష్త్రంలో 3 జిల్లాలు మాత్రమే ఏర్పడ్దాయట. ఒక ఎంపీ 13 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే కలెక్తరు 39 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ. నిప్పు రాజుకుని ఇక జిల్లాలకు అంటుకుంటుంది. అనతపురం జిల్లాకంటే 39 దేశాలు విస్తీర్ణంలో తక్కువట. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా వైశాల్యం 11 వేల చదరపు కిలోమీటర్లైతే కొన్ని జిల్లాల వైశాల్యం 39 వేల కిలోమీటర్లట.. రాష్ట్రంలో నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఎప్పటినుంచో ఉందని కథనం కూడా..ఇది ఇప్పుడవసరమా.. నియంత్రణలేదా? అందునా ఆన్యూస్ చానల్ స్వయానా ముఖ్యమంత్రిదని విస్తృత ప్రచారంలో ఉంది కూడా.. ఇక రేపటినుంచి కొత్త కోణంలో మహా విశ్లేషకులు విజృంభిస్తారు కామోల్సు.
*బహుశః మన రాష్ట్రంలోనే అనుకుంటా ఈ వైపరీత్యం, ఇంత అరాచకత్వం. . 28 రోజులుగా మహోధృతంగా ఉద్యమం నడుస్తుంటే చీమకుట్టినట్లుగా లేని రాష్ట్ర ప్రభుత్వం. అంతకు మించి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగాసమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగ నాయకులతో ఒక దేశ ప్రధాని భేటీ! గతంలో తెలంగాణ ఎన్‌జీఓలు, ఇప్పుడు సీమాంధ్ర ఎన్‌జీఓలు.. 25 రోజులుగా రవాణా సౌకర్యం లేకుండా ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తూ ప్రజలను యమయాతనలు పెడుతుంటే కొరడా ఝళిపించని ప్రభుత్వం. సమ్మె నెందుకు నిషేదించదు ప్రభుత్వం..సాక్షాత్తు సచివాలయంలో, ట్రాన్స్కొ, జెంకో , అరణ్య సదన్ కార్యాలయాల్లో వారం పైగా ఘర్షణ వాతావరణం. నెలరోజులుగా బళ్ళు మూత..విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకం.. పెదవి విప్పని ప్రభుత. రాజధానికూడా వేదెక్కుతున్నది, ఎప్పుడు అంటుకుంటుందో!! ఎక్కడ చూసినా లక్ష గళాచర్చనలు.. డెల్లీలో, హైదరాబాద్ లోనే ప్రభుత్వాల గొంతులు పెగలడం లేదు.. గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడింది..

26-8-13
*పదవుల కోసం కాదు ప్రజా సేవకే అంకితం..
ప్రాణాలు పోయినా లెక్కజేయం.. ప్రజా సంక్షేమమే పరమావధి..
సమైక్యం కోసం ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడం..
ఈ డైలాగులు విని పిచ్చిజనం రోడ్లెక్కుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల భార్యలు, మాజీలు, తాజాలు అందరూ దీక్షా దక్షులే.
ఐతే అందరి ఆమరణం మూడురోజుల ముచ్చటే.. కూర్చున్న గంటకే నీరసం, బిపి డౌన్, సుగర్ లెవెల్ హై, గిడ్డినెస్.. రెండ్రోజుల్లో ఎన్నెన్ని (గుప్త) రోగాలు బయటకోస్తాయో! డాక్టర్ల సలహాలు, కుటుంబ సభ్యుల సూచనలు, పార్టీ నేతలు.. కొన్ని సందర్భాల్లో మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర నాయకత్వం బతిమాలుళ్ళు...అప్పటికే చానళ్ళలో కావలసినంత పబ్లిసిటీ, మంచి మైలేజీ, పత్రికల్లో ఫొటొలు..కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్ళినందున, సానుకూలంగా పరిష్కరించేదుకు సుముఖత వ్యక్తం చేసి హామీ ఇచ్చినందున,విశ్వాసం వ్యక్తం చేస్తూ వెంటనే దీక్ష విరమణ.. ఉద్యమమా జోహార్.. చరిత్ర పునరావృతమవుతుంది.. అది ఒక్క సమైక్యానికే పరిమితం కాదు. ప్రత్యేకమైనా, ఇళ్ళయినా, నీళ్ళైనా, స్థలాలైనా, స్కాలర్‌షిప్ లైనా, కరెంటు-ఆర్టీసీ చార్జీలైనా, అఘాయిత్యాలైనా, అత్యాచారాలైనా... విత్తనాలు-ఎరువులైనా, ఎన్‌కౌంటర్లైనా, పెట్రోలు, దీజిలు, గాసు, చివరకు ఉల్లిపాయలైనా .... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం..ఓ పెద్ద కుతంత్రం.. దీక్షా కంకణం..
*ఉల్లి ఘాటు, జగన్ పోటు ప్రభుత్వానికి చేటు..

24-8-13
*ఎన్‌టి రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, విజయశాంతి, చిరంజీవి, తాజాగా జగన్మోహనరెడ్డికి బ్రహ్మరథం పట్టి, విశ్వాసం ప్రకటించి వారి పార్టీలకు, కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలకు చెక్క భజన చేసిన ప్రవాసాంధ్రులు నెల రోజులుగా నోరు విప్పడంలేదే? రాష్ట్రం తగలడుతుంటే, తెలుగు తల్లి భోరుమంటుంటే, డాలర్ల సంపాదనలో పడి కన్న నేలను మరచిపోయారా? 'తానా,ఆటా..' లు కనబడడం, వినబడడం లేదే! ఎందుకీ మౌనం? మనవారిదెంత భాషాభిమానం, రాష్ట్ర ప్రేమ, దేశ భక్తి.. ఎవరెటు, చెప్పండి.
*"శ్యామలా దండకం" ధ్యానిస్తే రాహు గ్రహ పీడన విముక్తికలుగుతుంది--- ఒక ఆధ్యాత్మిక ప్రగాఢ విశ్వాసం.
   మరి రాహుల్ గ్రహవిముక్తికి దండకంకం పఠించాలి? -- మరొక అవకాశవాద అనుమానం..
**ఇదివరలో (గుంటూరు జిల్లాలో) "అమృతరావ్"అని, ఒక ఆమరణ నిరాహారదీక్షల ఫేం, హక్కుదారు(పేటెంట్) ఉండేవాడు.. పాపం పాతిక సార్లు పైగా చేసి ఉంటాడు.. నలభై   ఏళ్ళనాటి మాట. ఇప్పటి నాయకులకే కాదు.. మీడియా కింగులకు కూడా తెలీదు. ఆ రికార్డు బద్దలు చేస్తారా ఎవరైనా? ఏమో!!
*అబద్ధమే ఉద్యమాలకు ఆక్సిజన్ ... మన తెలుగు(తెగులు) మీడియా మధ్య మధ్య లో ట్యూబ్ లాగేస్తుంటుంది..
*మీరెన్నయినా చెప్పండి, ఈ"హిరణ్య గర్భం" చీల్చేది ఎప్పుడూ ఆ పై(డిల్లీ) గాంధే(ధారే)యులే.
*బాబు "హస్త" రేఖలు డిల్లీలో గీస్తారు. ఇప్పుడేమో 'చెయ్యి' కాలిపోయింది. చక్రం ఆగిపోయింది..
* ఆంధ్రజ్యోతి ఆది నుంచి అందరి సేవలలోనే తరిస్తున్నది..ఇది నిజం..

23-8-13
*నట్టనడుమ నడి వీపున పుట్టిన రాచపుండు మిడిమేలపు, నడమంత్రపు మీడియా.. ఈ మీడియా గతంలో వాజ్‌పేయీని, పి వి ని కూడా ఏమిచేయలేక పోయింది. మోడీ విషయంలోనూ మీడియా అంతే..ఒకటి కాదు, రెండు కాదు, మూడు సార్లు చేతులు, కాళ్ళు ఎత్తి వెల్లకిలా పడ్దది. అలాగే చిరంజీవినీ గెలిపించలేకపోయింది.. జనం వచ్చినంత మాత్రాన ఓట్లురావని, మీడియా ఎత్తినంతమాత్రాన గెలవదని కూడా చరిత్ర చెబుతోంది. అచ్చు పత్రికలు, పిచ్చ బొమ్మల డబ్బాల్లో బిస్కత్తుల వెనుక తోకలు ఊగుతుంటాయి. బాకాలు ఊదినంతమాత్రాన ఏదీ ఆకాశం నుంచి ఊడిపడదు. కొత్తది అతుక్కోదు. కొన్ని పచ్చ మీడియాలైతే, మరికొన్ని అచ్చోసిన మీడియాలు. ఒకరింట్లో తిని వేరొకరింట్లో చెయ్యికడుక్కొవడానికి అలవాటు పడింది.. వృత్తి పోయి ఉద్యోగమై చివరికి ఊడిగమయింది. పాత్రికేయం బహుకృత వేషం. అందరూ శ్రీవైష్ణవులే.. బుట్ట మొత్తం మటుమాయం..ఏ మీడియా మడిబట్ట కట్టుకోలేదు..
*ఇటలీ అమ్మ ఆశలన్నీ అడియాసలేనన్న మాట.. అమూల్ బేబీకి పెళ్ళోక్కటే కాదనుకున్నారు.. ఇప్పుడు పదవి కూడా రాదని తేలిపోయింది..ఇక ఆమె పెట్టె బేడా సర్దుకోవచ్చు..కాంగ్రెస్‌కు అమృతభాండం లాంటి ఆంధ్రప్రదేశ్ చిలికి, ఒలికి పోయింది. అమ్మ నాయకత్వం మసకబారింది. పార్లమెంటులోనే కళ్ల ఎదుటే ఏమి ధిక్కారం .. ఎంత ధైర్యం..ఇప్పుడేమిటి చెప్మా??
*తెల్లదొరల తుపాకి గుళ్ళకు నేలకొరింగిన విప్లవజ్యోతి ఒక తెలుగు వాడు..అల్లూరి
అవే తుపాకి గుళ్ళకు గుండెలెదురొడ్డి బ్రిటిషు వారి గుండెలదరగొట్టిన మరో తెలుగు సింహం... టంగుటూరి..
బానిసల మాదిరి భజనలు చేయని ధీరోదాత్తులు వారు..
అదీ తెలుతేజమంటే.. పౌరుషమంటే..ఆత్మగౌరవమంటే..

Tuesday 27 August 2013


                      శ్రీకృష్ణాష్టమి నేడే.

 
కృష్ణం వందే జగద్గురుం.. 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || గీ.4-7 

ఓ అర్జునా ! ధర్మమునకు హానీ కలిగినపుడు, అధర్మము పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును అని, అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. . 

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్థనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ||

                                                     

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు . శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు కంసుని చెరసాలలో జన్మించాడు జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

ఈ భారతావనిలో శ్రీకృష్ణాష్టమి అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు శ్రీకృష్ణాష్టమి అవతరించిన "శ్రీకృష్ణావతార జన్మదినం" పవిత్రమైన పుణ్యదినంగా జరుపుకుంటాం. శ్రావణ మాసపు అష్టమినాడు జన్మించిన శ్రీకృష్ణుడు ఆబాలగోపాలానికి అత్యంత ఆరాధనీయుడు. భగవద్గీతతో మానవాళికి ధర్మాన్ని బోధించిన గీతాకారుడు హిందువులకు పరమపూజ్యనీయుడు. జగద్గురువు జన్మించిన కృష్ణాష్టమి దినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా అవలంభిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా దక్షిణ భారతదేశంలోని మహిళలు తమ గృహాలను అందంగా అలంకరిస్తారు. రకరకాల తీపి పదార్ధాలు నల్లనయ్యకు నైవేద్యంగా అందించేందుకు సిద్దమవుతాయి. బాలకృష్ణునికి అత్యంతప్రీతిపాత్రమైన వెన్నను ఆ గోపకిషోరునికి ఆరగింపచేసి, ఆ దేవదేవుని కరుణాకటాక్షవీక్షణాలు పొందేందుకు ప్రతి గృహం ఎదురుచూస్తుంటుంది.

ఇంటి వాకిలి నుంచి పూజామందిరం వరకు ముద్రితమై చిన్నారి పాదముద్రలు ఆ బాలగోపాలుని రారమ్మని ఆహ్వానం పలుకుతుంటాయి. పాదముద్రల కోసం నీరు, ధాన్యపు పిండి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. పసిపాపడి పాదాలకు అద్దిన పిండితో వేసిన పాదముద్రలను చూచిన కృష్ణభగవానుడు ఇంటిల్లిపాదిని చల్లగా కాపాడుతాడన్న భావన అందరికి ఆనందాన్ని చేకూరుస్తుంది. ముకుందుని భక్తులు పరమపవిత్రమైన భాగవతాన్ని పారాయణం చేయడంతోపాటుగా, సంగీత,నృత్య,గాన మరియు భజనలతో దేవకీనందుని రోజంతా స్మరించుకుంటారు. ఇక ఉత్తర భారతంలో శ్రీకృష్ణజన్మాష్టమి కోలాహలం మాటలకు అందనిది. బాలకృష్ణుని విగ్రహానికి అర్ధరాత్రి వేళ అభ్యంగస్నానం చేయించి ఊయలలో ఉంచుతారు. తమ పిల్లలకు పాలు, వెన్న పట్ల ఆసక్తిని పెంపొందించేందుకుగాను నవనీతచోరుని లీలలలో ఒకటైన వెన్నను దొంగలించే ఇతివృత్తాన్ని ఉట్టిని కొట్టే వేడుక రూపంలో వీధుల్లో ఆచరిస్తారు. పెరుగు, వెన్నలతో నిండిన మట్టికుండను ఆకాశంలో వేలాడదీసారా అన్న రీతిలో అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు.

కృష్ణ పరమాత్మ అంటే అపరితమైన ఆనందం. ఇంత అని కొలవడానికి అవకాశం లేనిది. దేన్నైతే పొందాక ఇక మరొకటి కావాలని అనిపించదో అదే అపరిమిత ఆనందం అంటే. శ్రీమద్భాగవతంలో "దేవకీ పూర్వ సంధ్యాయాం అవిర్భూతం మహాత్మనం" అని చెబుతారు. పరమాత్మ దేవకీదేవికి పుట్టాడు అని చెబుతారు. ఆయన అవతరించాడు అని చెప్పరు, అవతరించాడు అంటే ఆయన ఎక్కడి నుండో దిగి రావడం. నేను పుడతాను అని మాట ఇచ్చాడు దేవకీదేవికి. ఆయన తన మాటకే కాదు తన భక్తుల మాటని కూడా తప్పు కానివ్వడు. నృసింహ అవతారం వచ్చింది ప్రహ్లాదుని మాటని నిజం చేయడానికే కదా. అట్లా పుట్టాడు స్వామి. ఆయన పుట్టగానే ఎట్లా ఉన్నాడు అని సేవించిన వసుదేవుని మాట, ఆయన అవతారాన్ని వర్ణించిన వ్యాసుని మాట "తమద్భుతం బాలకం". 

ఇతను పరమాత్మే అని గుర్తించడానికి పుండరీకాక్షుడై, నాలుడు భుజములు కలిగి, శంఖచక్రగద ధారియై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలిగి, కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. అట్లాంటి స్వామిని వసుదేవుడు చూసాడు. కారాగారంలో అర్దరాత్రి దేవకీ వసుదేవులకు పుట్టాడు. కంసునికి తెలిస్తే ఏం చేస్తాడో అని దేవకీదేవి చేసిన ప్రార్థనకి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరం శ్రీకృష్ణ అవతారం. అనంత కోటి బ్రహ్మాండములని తన పొట్టలో దాచుకున్న స్వామిని మనం కట్టి వేయగలామా! కానీ ఆయన యశోదమ్మ ప్రేమకు కట్టించుకొని తన సౌశీల్యాన్ని చూపించాడు. అట్లాంటి స్వామిని మనం సేవించుకోగలిగే అవకాశం స్వామి మనకు ప్రసాదించడమే మన అదృష్టం.

Monday 26 August 2013

Treasure from Vaddadi vaaru..


With love and affection, Sri Vaddadi Sataynarayana Murty, an ardent devotee of GURUJI, a man with commitment and an elder brother after completing a four-month visit to USA, on 25th August 2013, hugged me and presented a treasure. 





It is GURU PRASADAM ( Sri Sri Sri V V Sreedharaacharya) for me. The TREASURE include 15 books on various subjects [published by Sri Jwala Central Trust(regd), Lakdikapool, Hyderabad.], Vibhuiti Prasadam, Gurudeva's photo frames, two pendants with GURUDEVA'S image and a Wrist Watch. 
Among the books, the Telugu version of SRIDHARAMRITAM, translated by Jagaddhatri and Ramateertha (Visakhapatnam) is a jewel. I am really lucky to have GURU PRASADAM. After 30 years, I got another watch, which I love very much. 
Murty ji, I owe to you very much and I find no wards to express.. My heart fills with joy. The joy is for keeping two personalities, an elder brother and MASTER together in one abode. 
GURUBHYONNAMAHA !!

Friday 23 August 2013

15-8-13 నుంచి 22-8-13  రాజకీయ టుమ్రీలు 

                         రాజకీయ నిఘంటువు  

                                          ప్రతిపదార్ధానికి కొత్తఅర్ధం(వ్యర్ధం)      

---------------------------------------
*డాలరు - ఎస్కలేటర్ : రూపాయి - జావ కారిపోయి.
*సచివాలయం సి బ్లాక్ - తెలంగాణ, సీమాంధ్ర కబడి గ్రౌండ్.
*ఉద్యమం - ఇం'ధనం'పై ఆధారపడిన ఇంజను.
*సెంటిమెంట్ - అదో విచిత్ర పదం.
*పదవులు తృణప్రాయం - గడ్డి చాలా ఖరీదైంది.
*ప్రాణాలైనా అర్పిస్తాం - ఇదో లేటెస్ట్ నినాదం.
*మన రాజధాని - ఎప్పటికైనా డిల్లీ బెటర్!
*ఏపి భవన్ - ఇండియా గేట్ సమీపంలో  తెలుగు(తెలివి)రాజకీయ విడిది.
*హాట్‌లైన్ - హస్తిన - భాగ్యనగర్ నాన్ స్టాప్ ఎయిర్ సర్వీస్.
*వారాలబ్బాయిలు - తెలుగు టీవీల్లో విశ్లేషకులు.
*వెంగళప్పలు - టీవీ వీక్షకులు, పత్రిక పాఠకులు.
*నడిరోడ్లు - వంటలకు గాడిపొయ్యిలు.
రాజకీయ టుమ్రీలు
*భారతదేశాన్ని చీల్చింది(ఇండియా-పాకిస్థాన్) మహత్మా గాంధి. పాకిస్థాన్‌ను చీల్చింది(బంగ్లాదేశ్) ఇందిరా గాంధి. ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది(తెలంగాన-సీమాంధ్ర)సోనియా గాంధి. పరజలందరినీ వారు కలసిమెలసి ఉండమంటారు. జై జై గాంధీలు.
*రాజకీయం-పాత్రికేయం రాష్ట్రాన్ని ప్రాంతాలుగా మనుషులను, మనసులను చీల్చాయి.    
*తెలంగాణ ఆత్మగౌరవం, సమైక్య ఆత్మ గౌరవం: ఇవి ఇరువురి అహంభావం.
*నేలను చీలుస్తారు, సంపదను పీలుస్తారు. జనాలను ముంచుతారు. వాళ్ళు మాత్రం పెళ్ళిళ్లలో కౌగలింతలు.
*ప్రజలు దిక్కులేని చావు చస్తుంటేపట్టదు గాని, పెళ్ళిళ్లకు  పట్టు వస్త్రాలతో హాజరవుతారు గవర్నర్లు.



నాకేమీ అర్ధం కాలేదు. మీకేమైనా అయిందా?

------------------------------------------------------
*ఈ వ్యవహారాలు, వ్యాఖ్యలు, విశేషాలన్నీ అన్ని ఉద్యమాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీలకు అన్ని వేళలా వర్తిస్తుంది.  పెద్దల పదవులు భద్రం. పిచ్చివాళ్ల బతుకులే చిద్రం..  ప్రజలార మేలుకోండి...
*ప్రజా ధిక్కారం, ప్రభుత్వ ధిక్కారం, న్యాయస్థాన ధిక్కారం, వెరసి రాజ్యాంగ ధిక్కారం. వారినే ముద్దుగా గవర్నమెంటు  ఉద్యోగులని పిలుచుకుంటాం. వీరికి జీతాలు- భత్యాలు కాకుండా.. అదనంగా శక్తి కొలది "గీతాలు" కూడా... రాజ"కీ" (యా)లన్నీ వారి చేతల్లోనే, చేతుల్లోనే. దేనికైనా సమ్మె చేయడం వారి జన్మ హక్కు. సామాన్యులకే లేదు ఏ దిక్కు.
*ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. దుకాణాలు లేవు, బళ్ళు లేవు, హోటళ్ళు లేవు, బస్సులు లేవు, లారీలు లేవు, ఆటొలూ లేవు.  ప్రయాణాలు లేవు, గుళ్ళు కూడా లేవు. ప్రజా జీవనం స్తంభించిది. మరి పేదింటి పొయ్యిలో పిల్లి రోజూ ఎలా లేస్తున్నది.
*యాత్రలకు, ప్రదర్శనలకు, శిబిరాలకు,  ఫ్లెక్సీలకు, బ్యానర్లకు, మైకులకు, లౌడ్‌స్పీకర్లకు, షామియానాలకు, వేదికలకు, జెండాలకు, టోపీలకు, కాగడాలకు, కొవ్వొత్తులకు, నడిరోడ్డుపై నవకాయ రుచులతో భారీ వంటకాలకు,  వాహనాలలో ఇంధనానికి ఇంత ధనం ఎలా వస్తున్నది? ఎవరిస్తున్నారు?
*ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయవలసిన ఉద్యోగ నాయకుల రాష్ట్ర పర్యటనలు, సభలు, సమావేశాలు ఏమిటి? ఎలా అంగీకరిస్తున్నాయి నిబంధనలు. రాజకీయ నాయకులతో మంతనాలేమిటి? డిల్లీ ప్రయాణాలేమిటి? రైలు, విమాన, వసతి ఖర్చులెలా గడచిపోతున్నాయి!
*సమ్మె వల్ల ప్రభుత్వ రాబడికి గండి, ఆర్టీసి కి నష్టాలు, సాక్షాత్తు పాలనాపీఠం సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వవ్యతిరేక నినాదాల హోరు, సమ్మె జోరు. మంత్రుల రాజీనామాకై ఉద్యోగుల డిమాండ్.. ఏమిటీ వింత!! మరి బార్లు-సినిమాహాళ్ళు మాత్రం ఒక్క రోజు మూతపడకుండా రెట్టింపు వ్యాపారం.. ఫుల్ ఆదాయం.
*మరో గమ్మత్తేమిటంటే.. గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళేనన్నట్లు, ప్రతి రోజూ రాష్ట్ర వ్య్యాప్తంగా చచ్చే చావులన్నీ(శవాలన్నీ) "ఉద్యమం" ఖాతాలోకి పోతున్నాయి. అందరూ రాష్ట్రం కోసం చస్తున్నారట!
*అంకింత భావంతో ఉద్యమిస్తున్న(?) కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,ఎమ్మ్నెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, చొటమోట ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది ఎవ్వరికీ కనీసం అనారోగ్యం కూడా కలగడం లేదు. చావుకు కూడా వారంటే చచ్చే భయం..నాయకుల గుండెల బండరాళ్ళు, చలించవు. అమాయకుల ప్రాణాలే బలి.

*సమైక్య ఉద్యమంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమ్మె. అంటే ఉద్యోగులు పనులు చేయడం లేదు. మరి అలాంటప్పుడు శ్రీకాకుళం, నెల్లూరు పట్టణాల్లో 50 వేల రూపాయలు చొప్పున లంచం తీసుకుంటూ ఇద్దరు ఉన్నతోద్యోగులు ఏసిబి వలలో చిక్కారు. ఇదెలా స్సాధ్యం. అంటే విధులకు హాజరు కాకుండా లంచాలేమిటి? ఆ సొమ్ము ఫైనాన్స్ కోసం కాదు కదా?

*కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం..  తెలంగాణ  ఇస్తే అక్కడ ఖతం. ఇవ్వకుంటే ఇక్కడ ఖతం..ఉప ఎన్నికల్లో రెండూ రుచి చూసిందిగా ఆ మహా నాయకి. మొత్తానికి కాంగ్రెస్ మటాష్!

*పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట. అలా ఉంది. సమైక్యవాద ఉద్యమం ఉధృతమైందని చెప్పేందుకు "వేర్పాటు వద్దంటూ చిత్తూరు రోడ్లపై మహిళలు వర్షంలో తడుస్తూ కూడా శ్రావణమాసం వరలక్ష్మి పూజలు" అంటూ పత్రికల్లో వార్తలు. రాజకీయాలకు ముడివేసి పత్రికలు దేవుణ్ణి రోడ్డెక్కించాయి.

*సమైక్య ఉద్యమంలో భాగంగా అనెక పట్టణాల్లో నడిరోడ్లపై వంటలు-వడ్డింపులు. యాచకునికి చెయ్యి విదలచని వారు, పిల్లికి బిచ్చం వేయని వారూ గంగాళాలు, డేగిసాలతో వేలమందికి అన్న సంతర్పణ. ఎంత ప్రేమ సమైక్య రాష్ట్రమంటే! ఎవరు బాబూ అంత మహాదాతలు.

*12వ తేదీనుంచి సర్వజన సమ్మె లో భాగంగా 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు బంద్. రవాణాలేక ప్రజల ఇక్కట్లు. ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్లకు వంద రూపాయలు చొప్పున రోడ్లన్నీ రాసిచ్చేసింది దోచుకోమని. నాయకుల ప్రయాణాలకుమాత్రం ఎక్కడా అవరోధాలు లేవు. ప్రభుత్వ ప్రతిపాదిత బంద్ కాబట్టే ప్రైవేట్ ఆపరేటర్లకు పండగే పండగ. ఆపరటర్లందరూ రాజకీయ నాయకులే. పార్టీలకు అతీతంగా దోచుకోవడంలో  సమైక్యం.

*బస్సులు బంద్, స్కూళ్ళు బంద్, కాలేజీలు క్లొజ్. యూనివర్సిటీలు మూత, పరీక్షలు వాయిదా, కౌన్సిలింగుకు మంగళం, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, బ్యాంకులు బంద్, ఏటిఎం లు ఖాళీ. ప్రభుత్వాస్పత్రులు ఖాళీ. ఆస్పత్రులు కానీ బార్లు, వైన్ షాపులు మాత్రం ఫుల్ జోష్. రష్షే రష్. చిన్నహోటళ్ళు నడవవు, స్టార్ హోటళ్ళకు మంచి బిజినెస్, కార్పొరేట్ కాలేజీలు నాగా లేకుండా వారంలో ఏడురోజులూ నడుస్తాయి.

*నాయకులు, పత్రికాధిపతులు, సినిమా ఘనుల ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఘనాతి ఘనం. వేలమంది హాజరు. అక్కద మాత్రం ప్రత్యేక-వేర్పాటు వాదం వినబడదు. అందరూ భుజాలపై చేతులు వేసుకుని ఖుషీ. మధ్య, పేద తరగతి ప్రజల ఇళ్లలో పెళ్ళిళ్లకు అనీ అవరోధాలే.  ప్రజలు మాతమ్మే చీలి శత్రువులవుతారు. మీడియా పెద్దోళ్ళింట పెళ్ళిళ్ళను  ప్రపంచ అవసరాలుగా గుర్తించి లైవ్ ప్రసారాలు. ప్రతిఫలం బాగా ముడుతుందిగా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పోలీసు ఉన్నతాధిపతులు క్యూలు కడతారు.. అక్కడ పోలీసులతో పకడ్బందీ కాపలా.

*1972-73 జై ఆంధ్ర ఉద్యమమప్పుడు తెలుగు చిత్ర సీమ ప్రముఖులు(నటులు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు), మద్రాసులో నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఇప్పుడు..అంతా ఆర్ధిక రాజకీయమండి.

*During my four-day visit to Visaakha and two-day visit to Guntur, I too observed that electronic media was magnifying the incidents. Their reports were mere exaggeration. Life in Visakha and Guntur were normal except buses and schools. Movement is not media managed, but media is being managed.

*ప్రపంచం లో ఎవరు ఎక్కడికి వెళ్ళినా బతకడానికే... కూలి పని కోసం గల్ఫ్ కు వెళ్ళినా .. itఉద్యోగిగా అమెరికా వెళ్ళినా ఆ ప్రయాణం అంతా బతుకు తెరువు వేటనే .. ఆఫ్రికా నుంచి ఒబామా కుటుంబం అమెరికా వెళ్ళినా , ఉత్తరాంధ్ర నుంచి అప్పడు శ్రీలంక వెళ్ళినా బతుకు తెరువు కోసమే ... అదేమ చిత్రమో ఒక్క హైదరాబాద్ కు మాత్రం అభివృద్ధి చేసేందుకు వస్తారు ( కొందరు )ప్రపంచం లో ఏ నగరం చేసుకొని ఇలాంటి అదృష్టం హైదరాబాద్ నగరం చేసుకుంది . (పాత్రికేయుడు బుద్ధా మురళి వ్యాఖ్య)కు
- (నా ప్రతి వ్యాఖ్య ) ఈ సమాజాన్ని తెలుగు పత్రికలు, చానళ్ళు, సంపాదకులు, పాత్రికేయులు ఉద్ధరించినట్లే.. హైదరాబాద్‌ను అందరూ కలసి అభివృద్ధి చేసారు..

*ఉమ్మడి రాష్ట్ర నూతన రాజధానిని డిల్లీకి తరలించడం వల్ల ఉభయ రాష్ట్రాల ప్రజలకు లభించే మరొక అదనపు బోనస్ ఏమిటంటే.. హైదరాబాద్, తిరుపతి, విశాఖనుంచి డిల్లీ వెళ్ళే విమాన ప్రయాణికులకు రాజకీయనాయకుల తొడతొక్కిడి ఉండదు.  ఈక్యూల్లో కూడా రద్దీ అపారంగా తగ్గుతుంది.

*ఖజానాకు ప్రజాప్రతినిధుల ప్రయాణ భత్యాల ఖర్చు తగ్గుతుంది. శాసనసభ, శాశనమండలి, సచివాలయం, ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల నివాస గృహాలను అద్దెలకిచ్చి ఆదాయం పెంచుకోవచ్చు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్, ఇందిరాపార్కు  సందర్శకులకు పోలీసు  నిషేదపుటుత్తర్వులనుంచి, అసెంబ్లీ భవనానికి, ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు పహరా, ఇనుప కంచెల నుండి విముక్తి కూడా!!        
 
*తెలుగు పత్రికలు, చానళ్ళ ప్రధాన కార్యాలయాలు, "సంపాద"కులు, విశ్లేషకులు కూడా డిల్లీకి మారవచ్చు (నాయకులకు  అందుబాటులో ఉండాలికదా!!). అప్పుడు వారి స్థాయి, స్థోమతలు డిల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయికి పెరుగుతుంది. ఓబి వ్యాన్‌లు, కాన్వాయ్‌ల రణగొణ ధ్వనులు లేకుండా, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా..రోడ్లు విశాలంగా ఉంటాయి.  
 
*కానీ రాజ్‌భవన్, డిజిపి కార్యాలయాలను ఇక్కడే  ఉంచుకుందాం. ఎందుకంటే పాపం వారికి ఎప్పుడూ ప్రజలతో  సంబంధాలుండవుగా!! అప్పుడప్పుడూ వారి కుటుంబాల షాపింగ్ హడావిడులతొ సందడిగా ఉంటుంది నగరం.
----------
*ఒక గొప్ప నగ్న సత్యం ఏమిటంటే, "నో వర్క్-నో పే" నిబంధన మొట్టమొదట వర్తింపజేయవలసింది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు. వారికి విధులంటూ లేకపోయినా నిధులు మాత్రం పుష్కలం. అసెంబ్లీకి వెళ్ళరు, కార్యాలయాల్లో ఉండరు, ప్రజలు వారి చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు మాత్రం పదవుల చుట్టూ ప్రదక్షిణలు.

*నేనెప్పుడో చెప్పాను తెలంగాణ, సీమాంధ్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రాలకు ఉమ్మడి శాశ్వత రాజధానిగా హస్తినను నిర్ణయిస్తే మంచిది. దేశరాజధాని మరో రెండు రాష్ట్రాలకు రాజధాని కావడం ఎంత విశేషం. ప్రపంచంలో ఇదొక రికార్డు. కొత్త కార్యాలయాలు, భవనాల నిర్మాణం అవసరం ఉండదు. కేంద్ర సచివాలయం నుంచే పాలన నిక్షేపంగా సాగించవచ్చు.

* ప్యాకేజీలు, పర్సెంటేజీలు ఎలాగు ఉంటాయి. హస్త సాముద్రికురాలు జనపథంలో ఉంటున్నందున, అమ్మ కనుసన్నలలో మెలగుతూ పార్లమెంటు లేనప్పుడు అందరూ కలసి అసెంబ్లీ సమావేశాలు అక్కడే నిర్వహించుకోవచ్చు. అధినేతనే అసలు మనకు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. ముఠాలు వర్గాలు ఉండవు.

*మరో వెసులుబాటుకూడా ఉంది. పార్టీ పరంగా ఏఐసిసి అధినేత్రి స్వయంగా రెండురాష్టాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షురాలిగా ఉండడం ఎంత అదృష్టం. ఇక ఏ చికాకులు ఉండవు. రాష్ట్రానికి రాజకీయ కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు.

*రాహుల్ పట్టాభిషేకానికి కాలం కూడా కలిసొస్తుంది. దేశానికే కాదు, రాష్ట్రానికి కూడా నెహ్రూ కుటుంబ వారసత్వపు నాయకత్వం. సి.ఎం నుంచి అక్కడే పి.ఎం కు ప్రమోషన్!! ఇది మీడియా మేథావులందరూ కూడా ఆలోచించవలసిన ముఖ్యాంశం.

*కొన్నాళ్ళు భగత్ సింగ్, వీరసావర్కర్, ఇంకొన్నాళ్ళు అల్లూరి సీతారామరాజు, మరికొన్నాళ్ళు వివేకానంద...
అలాగే ఇప్పటి పాపులర్ ఫిగర్.. పొట్టి శ్రీరాములు..,

*దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారు. 1953 నవంబరు 1 ముందు- ఆతరువాత. 1956 నవంబరు1 ముందు-ఆతరువాత, అంటే విశాలాంధ్ర ఏర్పాటు, ఆంధ్రప్రదెష్ అవతరణ-అ సంఘటనల్లో కూదా లబ్దిపొందింది వ్యాపార రాజకీయ నాయకులే.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు,
ఆంధ్ర రాష్ట్రావతరణ అనంతరం గుత్తాధిపతులు, ప్రత్యేకాంధ్ర ఉద్యమ సృష్టికర్తలు ఒకరే. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగ, పాలనా పరంగా,(అధికార)పదవులపరంగా, ఎప్పుడు లబ్దిపొందినా ఈ రాష్ట్రంలో బాగుపడ్డది రెందు సామాజిక వర్గాలే. స్వతంత్రం వచ్చిననాటి నుంచి 1983 లొ తెలెఉగుదేశం ఆవిర్భావమ వరకు రాష్ట్రాన్ని ఒక చెతుల్లో బంధించగా, ఆ తరువాత 2004 వరకు మరో సామాజిక వర్గం పెత్తనం సాగించింది. వర్గ పోరులో మిగిలిన వర్గాలను తమ ఆర్ధిక బలంతో కీలుబొమ్మలు చేశాయి. తెలంగాణ ఉద్యమమైనా, ప్రత్యేకాంధ్ర పోరాటమైనా మళ్ళీ 2000 సంవత్సరం నుండి తెరపైకి వచ్చిన తెలంగాణ వాదమైనా సామాజిక పోరులో భాగమే కాని సార్వజనీనం కాదు. పెత్తనం చెలాయించడం ఇంకానా ఇక పై చెల్లదన్న వాదనతో కొత్త రాజకీయ శక్తుల పునరేకీకరణ సామాజివవర్గ రూపం దాల్చింది. వ్యక్తుల పదవులేకాని సమాజ శ్రేయస్సు కాదన్నది ప్రజలకు తెలిసిన వాస్తవం. నెల్లూరు చిత్తూరు జిల్లాలు మద్రాసుతొ 55 సంవస్తరాలుగా ఇప్పటికీ వ్యాపార బంధాలు కొనసాగిస్తుండగా అనంతపూర్, కదపజిల్లాల వర్గాలు కర్ణాటకతో ముడివేసుకు పోయారు. కర్నూలు మాత్రం హైదరాబాద్ కు చేరువై మమేకమైంది. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల రెండు సామాజిక వర్గాలైతే 50 యేళ్ళకు పైగా తెలణ్గాణలో తిష్ఠ వేసుకుని ఆధిపత్యం చేస్తున్నారు. ఈ బానిస బతుకు మాకొద్దని తెలంగాణ జనం అడగడాన్ని వక్రీకరిస్తున్నాయ్ రెండు సామాజిక వర్గాలు. వ్యక్తుల ప్రాబల్యమే కాని ప్రజల బాగోగులనేవి కంచుకాగాడా పెట్టినా కనిపించని విషయాలయ్యాయి.

*రాష్ట్ర విభజన ప్రతిపాదనను విరమించుకోకపోతే సమైక్యాంధ్ర కాంగ్రెస్ పేరుతో సీమాంధ్రలో కొత్త పార్టీ రావొచ్చని రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు చెప్పారు.[---]
--బహుశః అది వైఎస్సార్ సి పి కి అనునబంధమవుతుండేమో..వైఎస్సార్ అభిమానులందరూ ఏదో ఒక మిషతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో రౌతు అంటే వేరే చెప్పాలా..., ఆయన గురువు ఉండవల్లి అడుగుజాడే ఆయనది.. వారి వెనుక అదృశ్య శక్తులు సర్వులకు విదితులే..

*కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పుకునే నాయకుడి పార్టీ పేరులో కాంగ్రెస్ ఎందుకో ?(---)
--అది కాం"గ్రీసు".. ఆ జిడ్డు అంత త్వరగా వదలదు

*జర్నలిస్టు యూనియన్‌లో సైద్ధాంతికంగా చీలికలు ఎప్పుడో వచ్చాయి. తాజాగా ప్రాంతీయంగా, వ్యక్తులుగా జర్నలిస్టులు చీలిపోయారు. చీలికలు పేలికలు రాజకీయలకే పరిమితం కాదు.. ప్రాథమికంగా మనుషులకు, మనసుల్లో తేడాలు..
*అప్పుడు చీలికను రాద్ధాంతిక మనడానికి నాకు అభ్యంతరం లేదు పతకమూరు గారు! అన్నిటికి అర్ధం, పరమార్ధం ఆర్థికమే!!

*రాజకీయ నాయకులు అరమరికలు లేకుండా చర్చించుకుని భూములు, గనులు, పదవులు, కాంట్రాక్టులు, సంపదను పంచుకుంటారు. ప్రజలు ఆవేశపరులై అందోళనలు చేసి పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు, కష్టాలు, పన్నుల భారం  పెంచుకుంటారు. ఈ యజ్ఞానికి ప్రసార మాధ్యమాలు అగ్గి రాజేసి  ఆజ్యంపోసి  హవిస్సు(వాటా) అందుకుంటాయి. 
                             నారాయణసూక్తం

సామాన్యంగా నారాయణ సూక్తాన్ని పురుష సూక్తంతో కలిపి పారాయణ చేస్తారు. ఈ సూక్తం ధ్యాన పద్ధతిని వివరిస్తుంది. ధ్యానానికి ముందుగా ఈ సూక్తం పారాయణ చేసి భావాన్ని చింతన చేస్తుండడం ప్రగాడ ధ్యానానికి దోహదం చేస్తుంది.
---------------------------------------------------------------------------------------------
ఓం సహ నావవతు! సహ నౌ భునక్తు! సహ వీర్యం కరవావహై! తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై!!
ఓం శాంతిః శాంతిః శాంతిః!!



శ్లో(1): ఓం!! సహస్ర శీర్‌షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం!
          విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్!!
తా: వేయితలలు గలవాడు, ప్రకాశిస్తున్నవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు, యావత్‌ప్రపంచానికి మనగళకరుడు, నాశం లేనివాడు, అత్యున్నత స్థితి అయినవాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను.
శ్లో(2):విశ్వతఃపరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్
       విశ్వమేవేదం పురుష స్తదిశ్వ ముపజీవిత!!
తా:ఈ విశ్వం కనా ఉన్నతుడు, నిత్యుడు, ఈ విశ్వమై ఉంతున్నవాడు, భక్తులకష్టాలను బాపువాడు అయిన నారాయణుని ధ్యానిస్తాను.
శ్లో(3): పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శివమచ్యుతమ్!
       నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్!!
తా: విశ్వానికి నాఠుడూ,జీవులకు ఈశ్వరుడూ,శాశ్వతుడూ, మంగళరూపుడూ, వినాశం లేనివాడూ, విశిష్టqంగాతెలుసుకోవలసినవాడూ, సమస్తానికీ ఆత్మయై ఉన్నవాడూ, శరణుపొందదగిన ఉత్కృష్టుడూ అయిన నారాయణుని ధ్యానిస్తాను.
శ్లో(4):నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః|
     నారాయణం ప్రంబ్రహ్మ తత్వం నారాయణః పరః|
     నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః||
తా:నారాయణుడే పరం జ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్వం, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే, నారాయణుడే ఉత్కృష్టమైన ధ్యానం.
శ్లో(5):యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా|
        అంతర్బహిశ్చ  తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః||
తా: ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా వాటన్నిటా లోపలా వెలుపలా పరివ్యాపించి నారాయణుడే నెలకొనిఉంటున్నాడు.
శ్లో(6): అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంతం విశ్వశంభు|
         వమ్ పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్||
తా: అనంతుడూ, అవినాశుడూ, సర్వజ్ఞుడూ, సంసార సాగర అంతాన ఉండేవాడూ, యావత్ప్రపంచానికి మంగళకరుడూ, అయిన నారాయణుని అధోముఖమైన తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను.
శ్లో(7):అధో నిష్ట్వా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి|
       జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్||
తా: కంఠం వద్ద కిందగా, నాభికి ఉపరితలంగా జానెడు పైన ఉన్నది భౌతిక హృదయం. రెండవది దానికి మధ్యలో ఉన్నది ఆధ్యాత్మిక హృదయం. ఇక మూడవది దీపశిఖల వరుసతో ఆవ్ర్తమై ఉంది.ఈ హృదయం దేదీప్యమానమైంది.
శ్లో(8): సంతతగ్ంశిలాభిస్తు లంబత్యాకోససన్నిభమ్|
         తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్||
తా:తామరమొగ్గవంటి హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశం ఉన్నది. అంతా దానిలో నెలకొని ఉంది.
శ్లో(9):తస్య మధ్యే మహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః|
        సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహారమజరః కవిః||
తా: సర్వత్రా ప్రకాసిస్తూ, అన్ని దిశల వ్యాపిస్తున్న మహోన్నతమైన అగ్ని ఆ ఆకాశానికి నడుమ ఉంది. ప్రాణం అయిన ఆ అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, అహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనదిగాను,  పాతపడనిదిగాను, అన్నింటినీ చూసేదిగాను ఉన్నది.
శ్లో(10):తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సంతత!
         సంతాపయతి స్వం దేహ మాపాద తలమస్తకః|
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః||
తా:ఆ ప్రానం యొక్క కిరణాలు అడ్డదిడ్డంగా, ఊర్ధ్వంగా, అధోముఖంగా ప్రసరిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. పాదం నుండి తన శరీరాన్ని,వెచ్చ్గా ఉండేట్లు చేస్తుంది. దీని మధ్య అణుప్రమాణమైన అగ్నిజ్వాలఊర్ధ్వముఖంగా అమరి ఉంది.
శ్లో(11):నీలతోయదమధ్యస్ఠా ద్విద్యుల్లేఖేవ భాస్వరా!
        నీవారశూకవత్తన్వీ పీతాభస్వత్యణూపమా||
తా: కారుమేఘం మధ్యనుంచి వెలుగును విరజిమ్మే మెరుపు తీగల, వరిమొలకలా సన్నమైనదిగా, బంగారు ఛాయగా, అణువులా సూక్ష్మమైనదిగా ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది.
శ్లో(12): తస్యాః శిఖాయా  మధ్యే పరమాత్మా వ్యవస్థితి|
           స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్!!
తా: ఆగ్నిశికహ మధ్యన పరమాత్మ సుప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ,  ఆయ్నే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు, ఆయన అవినాశి, స్వప్రకాశమానుడు, ఆయ్నకంటే అధికుడు ఎవరూ లేనివాడు.  
శ్లో(13): ఋతగ్ం సత్యం, పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్|
          ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః||
తా: కానవచ్చే వస్తు జాతాన్ని అందంగాను, దృశ్యానికి ఆధారంగాను ఉన్న భగవంతుని, ప్రతి శరీరం అంతటా నిండివున్నవాణ్ణి, నల్లని మేని విష్ణువు, తెల్లని మేని శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుని, త్రినేత్రుని సమస్తాన్ని తనస్వరూపం పరిగ్రహించిన వాణ్ణి పదే పదే నమస్కరిస్తాను.

(ఈ విధంగా మనలను అంతర్ముఖం చేసి భగవంతుని సన్నిధానానికి చేరుస్తుంది ఈ నారాయణసూక్తం. ఆ పైన అవిచ్ఛిన్న ప్రేమతో  ఆయన సాన్నిధ్యంలో గడపడమే నిజమైన ధ్యానం. నారాయణ సూకం అనంతరం విష్ణుగాయత్రి ని పారాయణం చయడం పరిపాటి)
----------
శ్లో: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి|
    తన్నో విష్ణుః ప్రచోదయాత్||
తా: నారాయణుని తెలుసుకుందా, అందుకోసం ఆ వాసుదేవుని ధ్యానిద్దాం. ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నంలో ప్రేరేపించు గాక.  

Thursday 22 August 2013


ఆంధ్రకేసరి జయంతి 

------------------------
                   మనకున్న తెగువ గల తెలుగు వీరులు....

                      ఇద్దరే ఇద్దరు..వారు.. ఇద్దరూ ఇద్దరే.. 




విప్లవజ్యోతి అల్లూరి..
ఆంధ్రకేసరి టంగుటూరి..

--------------------------




*"గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం" _అయ్యదేవర కాళేశ్వరరావు


*"ప్రమాదములున్నచోటే ప్రకాశంగారుంటారు" _భోగరాజు పట్టాభి సీతారామయ్య


నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు,
మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి పేరు పొందినవాడు.
1904 లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మధ్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు.
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో విడుదలయిన స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కు కూడా సంపాదకత్వం వహించేవాడు.
1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా, జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.
ప్రకాశం శాసనసభ్యునిగా కూడా రాజీనామా చేసి మద్రాసులో స్వయంగా ముందుండి ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు.
1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూల అభ్యర్ధి అయిన రాజాజీ... ప్రకాశం ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు.
పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం రాజీనామా చేయడంతో ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.
అందుకే..ప్రకాశం పంతులు ధీరోదాత్తుడు,
కానీ ఇప్పుడెవ్వరికీ అంతటి మహనీయుని స్మరించుకునే సమయమూ లేదు, అవసరంలేదు..

Wednesday 21 August 2013

              విష్ణుసహస్రనామం నాలుగో(చివరి)భాగం: 

                                                         [సంపూర్ణం]





శ్లో)81:తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః|
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః||
తా:సమస్త తేజములను ధరించినవాడు,ఆదిత్యరూపమున వర్షించ్వాడు, ఆయుధధారులలో ఉత్తముడై దుష్టుల నణచ్వాడు, శ్రీకృష్ణుడు ఆయనయే! భక్తులొసగు పూజాద్రవ్యములను గ్రహించి వారి కోర్కెలను మన్నించువాడు, చతుర్వేద స్వరూపుడై మంత్రములను తన అధీనములో ఉంచుకున్నవాడు  ఆయనయే.
శ్లో)82:చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః|
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్||
తా:ఆ మహా పురుషుడు నాలుగు బాహువులు కలిగి నాలుగు రూపములుగా, నాలుగు వ్యూహములుగా, నాలుగు భాగములుగా ప్రవర్తిల్లువాడు, ఒక్కొక్క పాదముతో ఒక్కొక్క లోకమును కొలిచినవాడు. ఆయన నాలుగు వేదములను క్షుణ్ణముగ నెరిగిఉండి, నాలుగు ఆశ్రమములుగా దారి చూపుచూ, నాలుగు పురుషార్ధములను ఉద్భవింపజేసినవాడు.
శ్లో)83:సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా||
తా:ఆయన కాల్చక్ర స్వరూపుడగుటవలన వెనుకకు మరలని స్వభావము గలవాడు, అతిక్రమించుటకు వీలుగాని వాడ్ద్. అజేయుడై దురాత్ములను సంహరించువాడు, దుర్లభుడు, చేరుటకు సాధ్యము కాని వాడు,మనసున నిలుపుటకు అసాధ్యుడు  ఆయనయె.
శ్లో)84:శుభాంగో లోకసారంగః స్తతన్తు స్తన్తువర్ధనః|
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః||
తా:శోభనమగు రూపముతో నొప్పుచూ, జనులలో భక్తిని గ్రోలువాడు, భక్తులతొ చక్కని బంధము గలవాడు, మాయచే సంసార బంధములను పెంచువాడు ఆయన. దేవేంద్రుని రూపమున హవిస్సుల నారగించువాడు, దశావతారములనెత్తి మహాకర్మల నాచరించినవాడు, ఇక సాధింపవలసిన కార్యములు లేనివాడు, ఆగమములను సృష్టించినవాడు ఆయనయే.
శ్లో)85:ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః|
అర్కో వాజసనః శృంగీ జయన్తః సర్వవిజ్జయీ||
తా:సర్వ జీవులను ఉద్భవింప జేసి, ఆహారమునిచ్చి పోషించువాడు, తేజోస్వరూపుదై నిత్యమూ విజయము పొందువాడు, మత్స్యావతారమున శృంగము గలవాడు ఆ మహాపురుషుడు. రత్నమువలె శోభించు నాభితో, కృపారసము వెదజల్లు  కన్నులతో, దయాగుణముతో, విశ్వమును అతిశయింపజేయు సౌందర్యముతో అలరారువాడు ఆయనయే

శ్లో)86:సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః|
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః||
తా: సు"వర్న"మైన ఓంకారస్వరూపుడు, నిశ్చలుడు, వాగీశ్వరులైన బ్రహ్మాది దేవతలకు ఈశ్వరుడు, పంచభూతములను ధరించిన మహాస్వరూపుడు, మానస సరోవరరూపమున నుండువాడు ఆయన. అగాధమైన మాయగలవాడు, జ్ఞాన తపస్సులనెడి తరగని నిధులు గలవాడు ఆయనే.
శ్లో)87:కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనో నిలః|
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః||
తా:హిరాణ్యక్షుని వధించి భూమికి ఆనందమును గలుగజేసినవాడు, పరశురామావతారమున భూమిని దానమిచ్చినవాడు, మేఘరూపుడై వర్షించి మేలుచేయువాడు ఆ మహానుభావుడు. సర్వజ్ఞుడు, సర్వ ప్రదేశములు చూద గలిగినవాడు, వాయుస్వరూపుడు, అమృతమయమైన శరీరము గలిగి ఆనందామృతమును గ్రోలువాడు ఆయనయే.
శ్లో)88:సులభ స్సువ్రత స్సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః|
న్యగ్రోధోదుంబరో శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః||
తా:భక్తజన సులభుడై, భక్తుల కోరికలను సిద్ధింపజేయువాడు, ధర్మ రక్షణయను మంచి వ్రతము గలిగి అధర్మపరులగు అసురులను, శత్రువులను, తపింపజేసి జయించువాడు ఆయన. అట్లే కృష్ణావతారమున  దుష్టుదగు చాణూరుని సమ్హరించిన వాడు, మర్రిచెట్టు వలే తన మాయను విస్తరింపజేసినవాడు, ఉదుంబర వృక్ష స్వరూపుడు, అశ్వత్థ నారాయణుడు ఆయనయే.  
శ్లో)89:సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహనః|
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః||
తా:అనంత కిరణములతో ప్రకాశించుచు,  సప్త యను అశ్వము వాహనముగా గల సూర్య స్వరూపుడు, అగ్నిస్వరూపుడై అగ్నివలె పాపమంటనివాడు ఆయన. దుష్టులకు భయము గొల్పుచు, సజ్జనులభయమును పోగొట్టువాడు, పాపరహితుడు, ఊహకందని స్వభావము స్వరూపము గలవాదు ఆయనయే.
శ్లో)90:అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||
తా:అణువు వలె సూక్ష్మస్వరూపుడు, ప్రళయకాలమున సర్వమును కృశింపజేసి సూక్ష్మస్థితికి తెచ్చువాడు, అట్లే విశ్వమునాక్రమించిన విరాట్ పురుషుడు ఆయనయే. తానుతప్ప ఇతరులు భరింపరాని వాడైనందున తననుతానే భరించువాడు, అర్వగుణ స్వరూపుడైనను నిర్గుణుడు, సర్వోత్తముడు, మహాజ్ఞాన స్వరూపుడై  తేజోమయమైన ముఖము గలవాడు, సర్వ వంశములకు మూలపురుషుదై, వంశములను వర్ధిల్ల జేయువాడు  ఆ పరంధాముడే..

శ్లో)91:భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వకామదః|
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః||
తా: ఆదిసేషుని రూపమున భూభారమును వహించ్చు, సర్వజీవులను కాలక్రమేణ క్షీణింపజేసి, నసింపజేయువాడు,వాయురూపమున జీవులలో ప్రాణసక్తిని ప్రవహింపజేయువాడు ఆయన. విశ్వవృక్షమునకు వేదములనెడి చక్కని ఆకులు సృష్టించి, వేద శాస్త్రములచే, ఋషులచే చెప్పబడినవాడు ఆయనయే. యోగీశ్వరుడై యోగముచే త్ర్లియబడుచు సర్వకర్మలకు ఫలముల నిచ్చువాడు, భక్తులకు విశ్రాంతి, అజ్ఞానులకు దుఃఖము కలిగించువాడు ఆయనయే.
శ్లో)92:ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో  దమయితా దమః|
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః||
తా:ఆ మహాపురుషుడు ధనుర్ధారి,ధనుర్వేద్స్వరూపుడు,దండించువాడు, దందనీతి తానైనవాడు. ఆయన పరాజయము, మృత్యువు లేనివాడు.
సర్వకర్మలయందు గొప్ప ప్రజ్ఞాశాలియై సర్వ జగత్తుకు నియమములను విధించిన వాడు, నియంతవలె సర్వమును పరిధులు దాటనీయనివాడు ఆయనయే.
శ్లో)93:సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మపరాయణః|
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః||
తా: ఆయ్న మహా బలవంతుడు, సత్వగుణప్రధానుడు, సత్యధర్మములు తానై పురుషార్ధ సాధకులచే కోరబడువాడు.పూజార్హుడు,జనులు ప్రియమైనవి అర్పించుటకు యోగ్యతగలవాడు ఆయన. భక్తులకు ప్రియమును చేయువాడు, తనపై ప్రేమను వర్ధిల్ల జేయువాడునూ ఆయనయే.
శ్లో)94:విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః|
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః||
తా:సూర్యుని రూపమున ఆకాశమున సంచరించువాడు, సూర్యుదే నేత్రముగాగలిగి సర్వలోకములను వీక్షించువాడు, సర్వవిభుడై, జ్యోతిస్వరూపుడై, సద్భావ శీలుడై, వివిధ రూపములలో దర్శన మిచ్చువాడు ఆయన. ప్రాణికోతిని ఉద్భవింపజేయువాడు, యజ్ఞమునందు హవిస్సులను  స్వీకరించి సంపదలిచ్చువాడు ఆ పరమాత్ముదే.
శ్లో)95:అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః|
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః||
తా:అనంతుడు, యజ్ఞములందు ఆహుతులను భుజించువాడు, పాలకునిగా విశ్వమును రక్షించువాడు ఆ పరమాత్మ. ఆయన నిరాధారుడయ్యూ సర్వలోకములను ధరించుచు, అనెకపర్యాయములు ధర్మ రక్షణార్ధమై జన్మించినవాడు, హిరణ్యగర్భుని రూపమున సర్వులకు అగ్రజుడు. అద్భుతమైన గుణైశ్వర్య ప్రకృతిగలవాడు, విచార రహితుడు, భక్తులపట్ల క్షమాగుణము ప్రదర్శించువాదు ఆయనయే.

శ్లో)96:సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః|
స్వస్తిద స్స్యస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః||
తా:సనాతనుడు, బ్రహ్మకన్న ప్రాచీనుడు, కపిలమహర్షి స్వరూపుడు, సూర్య రూపమున నీటిని గ్రహించి, వర్షించువాడు, పృఅళయకాలమున సర్వమును తన యందు లయమొనర్చుకొనువాడు ఆయన. భక్తులకు శుభమును చేకూర్చు మంగళస్వరూపుడు, పరమానంద స్వరూపుడు ఆ పరంధాముడే.
శ్లో)97:అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః|
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః||
తా:రౌద్రమునకు అతీతుడు, సాంఖ్యయోగాత్మకమగు కుందలములు, మనస్తత్వాత్మకమగు చక్రము ధరించిన వాడు ఆయన. గొప్ప విక్రమము, వర్ణనాతీతమగు ప్రవృత్తిగలిగి ఉల్లంఘించుటకు వీలుగాని శాసనములు చేసినవాడు, ఓంకార శబ్దముతో కూడి యుండినవాడు, చంద్రునివలే చల్లని వాడు, విశ్రాంతినిచ్చువాదు ఆ పరమాత్ముడే.
శ్లో)98:అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః|
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః||
తా: సర్వావయవ సౌందర్య వంతుడై, సర్వసమర్ధుడై, క్రూరత్వము లేక గొప్ప క్షమాగునము కలిగినవాడు ఆ పరమాత్మ. విద్వద్వరేణ్యుడు, నామస్మరణ శ్రవనమాత్రముననే శుభముల నొసగు వాడు, భక్తుల భయమును పోగొట్టి సత్ఫలములు ప్రసాదించువాడు ఆయనే.
శ్లో)99:ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్యప్న నాశనః|
వీరహా రక్షణ స్సన్తో జీవనం పర్యవస్ధితః||
తా: సంసారమనెడి ఆపదనుండి భక్తులనుద్ధరించువాడు, స్మరణమాత్రము చేతనే పుణ్యమునిచ్చువాడు, పాపములను దుఃస్వప్న ఫలితములను నశింపజేయువాడు, శిష్టజన రక్షకుడు, సజ్జన స్వరూపుడు ఆయన. ప్రపంచమంతయు పరివేష్ఠించి యుండి ప్రాణులకు జీవనాధారమై, భక్తుల దుర్గతులను జ్ఞాన ప్రదానముచే పోగొట్టువాడు ఆయనయే.  
శ్లో)100:అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః||
తా: అనంత రూపములు, అనంత సంపద, నిఘూడమైన స్వభావము గలిగి అన్ని దిక్కులలో సంచరించుచు, దిక్పాలకులను అజ్ఞానువర్తులుగ చేయువాడు ఆయన. క్రోధమును జయించి, జనులకు కర్మానుసారముగ, ఫలముల నిచ్చుచు, భక్తుల సంసార భయమును పోగొట్టువాడు ఆయన.

శ్లో)101:అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః||
తా:తనకు ఆదిలేకున్నను సర్వజీవుల జన్మలకు మూల కారణమైన జీవులను ఉద్భవింపజేసినవాడు, భూమిని భరించుచు జగత్తునకు శోభనిచ్చువాడు,ఆయన.శోభాయమానమైన భుజకీర్తులు గలిగి గొప్పవీరుడై భయంకరమగు పరాక్రమముతో నొప్పుచూ దుష్టులకు భయమును కలిగించువాడు ఆయనయే.
శ్లో)102:ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః||
బ్ర్హ్మాది దేవతలకు ఆధారస్థానమై, తాను మాత్రము ఏ ఆధారము లేక యుండినవాడు,జీవులకు ప్రాణమిచ్చి కర్మలయందు ప్రేరేపించువాడు,ఓంకార స్వరూపుడు ఆ పరమాత్మ. తానే విశ్వమనెడి పుష్పముగా వికసించి, సదా జాగరూకతతో మెలగుచూ,సత్కర్మల నాచరించుచు,భక్తులకు ముక్తిమార్గము చూపువాడు ఆయన.
శ్లో)103:ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః|
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||
తా: తనకు తానే ప్రమాణమైన జ్ఞాన, సత్య స్వరూపుడై, జనన మరణములకతీతమైన ఆత్మ స్వరూపుడై, బ్రహ్మవిదుడై,"తత్" సబ్దముచే తెలియబడుమహాపురుషుడాయన. సర్వజీవులలో ఒకే ఆత్మగా వెలుగొందుచూ, జీవులకు ప్రాణమిచ్చి, ఆహారముద్వారా ప్రాణశక్తినిచ్చి పోషించువాడు ఆయనే.
శ్లో)104:భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః||
తా:భూ,భువర్, సువర్లోకములలో ఒకే మహావృక్షమువలె వ్యాపించి యున్నవాడు, లోకముల నుద్భవింప జేసినవాడు,పితామహుడైన బ్రహ్మకు తండ్రియైనవాడు,సంసార సాగరమును తరించుటకు సహాయము చేయువాడు ఆయనయే. యజ్ఞములకు పతియై,యజ్ఞ కర్మలను ప్రేరేపించుచు, యజమానిగ యజ్ఞములు చేయించుచు, యజ్ఞాంగములుగల యజ్ఞపురుషుడై, యజ్ఞ ఫలములనిచ్చువాడు ఆ పరంధాముడే.
శ్లో)105:యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|
యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ||
తా:యజ్ఞరక్షణ చేయువాడు, యజ్ఞములు చేయించువాడు,యజ్ఞమేతానై, యజ్ఞముద్వారా పొందబడుచు, యజ్ఞ హవిస్సులనారగించుచు, యజ్ఞాంతమున యజ్ఞఫలముల నిచ్చువాడు, జ్ఞ్నన యజ్ఞ స్వరూపుడు ఆపరమాత్మ. అన్నస్వరూపుడు,జీవునిరూపమున అన్నమును భుజించువాడు ఆయనయే.
శ్లో)106:ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః||
తా:సర్వ జగత్తును తానే జనింపజేయుచు, ధర్మసంస్థాపనకై తానే అవతరించుచు, శ్రీరాముని రూపమున భూమిని ప్పాలైంచినవాడు, వరాహరూపమున భూమిని త్రవ్వి హిరాణ్యాక్షుని వధించినవాదు ఆ మహనీయుడే. సామవేదమును బోధించిన వాడు, సృష్టికర్త, దేవకీసుతుడగు శ్రీకృష్ణుని రూపమున అవతరించినవాడు, స్మరణమాత్రముననే  పాపములను నశింపజేయువాడు ఆ పరమాత్మయే.
శ్లో)107:శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
తా:"పాంచజన్యమను శంఖమును, నందకమను ఖడ్గమును, సుదర్శన చక్రమును, శారంగ్‌మను ధనస్సును, కౌమోదకి యను గదను, సర్వవిధములగు ఆయుధములను ధరించినవాడు, రథ చక్రమ్నుకూద ఆయుధముగ చేతబట్టినవాడు, ఎట్టి పరిస్థితులలోను చలింపని స్వభావము గలవాడు అయిన శ్రీమన్నారాయణునికి ప్రణామము చేయుచున్నానను" అని  భీష్ముడు  పలికెను.

ఓం తత్సత్||

[భగవదనుగ్రహము, గురు కృప, పెద్దల ఆశీస్సులు, సోదరీ సోదరుల ప్రొత్సాహంతో తాత్పర్య సహితంగా విష్ణుసహస్రనామ యజ్ఞం నిరాటంకంగా నేటితో ముగిసింది. ఇంతకు ముందే విష్ణుసహస్రనామం పంచుకునే మహద్భాగ్యం కలిగినప్పటికి, భక్తులకు, మిత్రులకు, హితైషులకు మరొక పర్యాయం విష్ణుసహస్రనామం పరిచయం చేయవలసిందిగా అమెరికా సందర్శనలోఉన్న సర్వజ్ఞులు, పెద్దలు, సోదరులు శ్రీ వడ్డాది సత్యనారాయణమూర్తి గారి కోరిక మేరకు పునఃపఠనం చేయగలిగాను. శ్రావణమాసం  ముందు మొదలైన ఆ క్రతువు ముగిసింది. నాకు మరో పర్యాయం శ్రీమన్నారాయణుని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు శ్రీ వడ్డాది వారికి నమస్సుమాంజలులు.]

Tuesday 20 August 2013



రక్షాబంధన్ , జంధ్యాల పౌర్ణమి 

దైవిక శక్తులతో కూడిన తిథి శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధనాన్ని, జంధ్యాల పౌర్ణమి ఆచరించడం భారతీయ సాంప్రదాయం, హైందవ ఆచారం.

స్ర్తిలకు రక్షణగా పురుషులు ఉండాలనే పరమార్థం రాఖీ కట్టడంలో రాఖీపూర్ణిమ ప్రసిద్ధి ఇమిడి ఉంది. సోదర ప్రేమకు చిహ్నంగా రక్షాబంధనం ప్రాచుర్యం పొందింది. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లో మధురమైన గుర్తు. వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఇది సృష్టిస్తుంది. దీనికి సంబంధించి మన పురాణాల్లో ప్రస్తావన ఉంది.

యేన బద్దో బలి రాజా దానవేంద్రో మహాబలః
తేనాత్వ మభి బద్నామి రక్షేమా చల మాచల

మహాబలవంతుడు, రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా? నీవు స్థిరత్వంలో ఉండగలవు-అని దీని అర్థం. తన సోదరుని క్షేమం కాంక్షించే ప్రతి సోదరి పవిత్ర రక్షను అతని మణికట్టుకు ముడి వేస్తుంది. ఈ రక్ష ఏ ఆపద సమయంలోనైనా తన సోదరుడిని రక్షించాలని ఆమె ఆకాంక్ష. సోదరి ప్రేమకు సంకేతంగా ఉండే ఈ సూత్రం సోదరుడికి తన అక్కా లేదా చెల్లెలి విషయంలో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సోదరి సుఖసౌభాగ్యాల కోసం అతను ఎలాంటి త్యాగాలు చేయటానికి అవసరమైన ప్రోత్సాహం కల్గిస్తుంది.





                  

ఓ పళ్లెంలో రాఖీలు, కుంకుమ, అక్షతలు, కర్పూరం, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలను ఉంచుతారు. శ్రావణ పౌర్ణమి నాడు స్ర్తిలు ముందుగా కులదైవాన్ని ప్రార్థించి, ప్రసాదాన్ని నివేదిస్తారు. అనంతరం ఈ ప్రసాదాన్ని రాఖీలను ఉంచిన పళ్లెంలో ఉంచుతారు. అన్నదమ్ములకు తిలకం దిద్ది, పన్నీరు జల్లి, గంధం పూసి, వారు సురక్షితంగా ఉండాలని హారతి ఇచ్చి తూర్పు ముఖంగా కూర్చోబెడతారు. సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీని కడతారు. రాఖీ కట్టాక సోదరులు అక్షింతలు వేసి చెల్లెలైతే దీవిస్తారు. అక్కలైతే నమస్కరిస్తారు. అక్కా చెలెళ్ళు అడిగిన బహుమతిని సోదరులు అందించి ఆనందాన్ని పొందుతారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన శాంతి నికేతన్‌లో రాఖీ మహోత్సవాలు నిర్వహించి ప్రపంచ శాంతిని నెలకొల్పాడు.       .                                                                      
పూర్ణిమ రోజున కట్టిన రక్షా సూత్రం సమస్త రోగాలను, అశుభాలను నశింపజేస్తుంది. ఏడాదిలో ఒకసారి దీనిని ధరిస్తే సంవత్సరమంతా రక్షణ లభిస్తుంది. జన్మతః సోదరులు కాని వారందరినీ ఏకత్రాటిపైకి తెచ్చే సౌభ్రాతృత్వం ‘రక్షాబంధన్’లో ఇమిడి ఉంది. శ్రావణ మాస పౌర్ణమి రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి దైవపూజ కావించుకుని సోదరుల నుదుట తిలకం దిద్ది, మంగళహారతిచ్ఛి  నోరు తీపి చేసి సప్తవర్ణాలను తలపించే రంగురంగుల దారాలతో రాఖీ కట్టి  వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అదే తమ్ముడైతే అక్క ఆశీర్వదిస్తుంది. ఈ రోజు బ్రాహ్మణులు పాత యజ్ఞోపవీతాలను విసర్జించి నూతన యజ్ఞోపవీతాలు ధరించి, వేదపఠనం చేస్తారు. అందువల్ల "జంధ్యాల పౌర్ణమీ" అని కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది.                                    

 రక్షాబంధన్ వల్ల సోదరులకు అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగుతాయి. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సిరిసంపదలు రెట్టింపవుతాయి. శ్రావణ పౌర్ణమిరోజున కట్టే రక్షాబంధన సూత్రం వ్యక్తికి జీవితంలో విజయ సాఫల్యం కలిగిస్తుంది. దీనికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవదానవులకు పుష్కర కాలం పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయాడు. దీనినే ‘దేవాసుర సంగ్రామం’ అంటారు. ధర్మనాశనం జరిగింది. దేవగురువైన బృహస్పతి దగ్గరకు ఇంద్రుడు వెళ్లి సలహా అడిగాడు. శ్రావణపూర్ణిమ నాడు ‘రక్షాసూత్రం’ కట్టించుకోవాలని బృహస్పతి ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆ విధంగానే ఇంద్రుడు పూర్ణిమ నాడు తన భార్య శచీదేవి చేత రక్షాసూత్రం కట్టించుకుని మరోసారి దానవులపై యుద్ధం చేసి విజయం సాధించాడు. ఈ యుద్ధంలో భూలోకంలోని రాజులు దేవతల పక్షాన పాల్గొన్నారు. రక్షా మంత్రం, రక్షాబంధనం మహిమ వారికి తెలియగానే ఆ అనుష్ఠానాన్ని భూమి మీదకు తెచ్చారు. ఆ విధంగా భూలోకంలో ప్రచారం వచ్చింది. ముఖ్యమైన మార్పు ఏమంటే- దేవలోకంలో శచీదేవి భర్తకు రక్షాబంధనం కట్టింది కానీ భూలోకంలో అక్కా చెలెళ్లు తమ సోదరులకు రక్షాబంధనాన్ని కట్టే ఆచారంగా పరిణమించింది.

మరో కథ:

మహాభారతంలో ఓ సందర్భంగా చేతికి గాయమైన కృష్ణుడికి రక్తం కారకుండా తన చీర చెంగు నుంచి ఒక ముక్కను తెంపి ద్రౌపది కడుతుంది. ఆ రుణం తీర్చుకోవడానికా అన్నట్లు కృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది మాన సంరక్షణ చేయడమే కాకుండా, ఎన్నో సందర్భాల్లో అన్నగా ఆమెకు మానసిక ధైర్యమిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పటినుంచే రక్షాబంధనం మొదలైందని పెద్దలు చెబుతారు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు పాండవులకు విజయం చేకూరాలని కోరుకుంటూ రక్షా కంకణాన్ని కట్టమని కుంతీదేవికి, ద్రౌపదికి సూచించాడు. ఆ సూచనల మేరకు కుంతీదేవి, ద్రౌపది పాండవులకు విజయం చేకూరాలని కోరుతూ శ్రీకృష్ణుడిని ప్రార్థించి రక్షా కంకణాలను పాండవులకు కట్టారు. ఆ రక్షా కంకణమే రక్షాబంధనంగా మారింది. అయితే, కాలప్రవాహంలో అక్కచెల్లెళ్లు సోదరులకు కంకణం కట్టటమే ఆనవాయితీగా మారింది.

యముడి సోదరియైన యమున అతడికి రాఖీ కడుతూ చిరంజీవిగా ఉండాలని అభిలషించేదట. సోదరి ప్రేమకు విచలితుడైన యముడు భూమండలంలో రక్షాబంధన్ పాటించేవారిని ముఖ్యంగా సోదరి చేత రాఖీ కట్టించుకున్న వారందరికీ సకల శుభాలు కలుగుతాయని ప్రకటించాడట. కృతయుగంలో వామనుడిగా వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి తొక్కగా, అతని మనవి మేరకు రాజ్యానికి రక్షగా అక్కడే ఉన్నాడట. లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని బ్రహ్మణ స్ర్తి రూపంలో పాతాళానికి వెళ్లి శ్రావణ పౌర్ణమి రోజునే బలికి రక్ష కట్టి, కానుకగా తన భర్తను తిరిగి అప్పగించమని కోరిందట. అందుకు సంతసించిన బలి విష్ణువును లక్ష్మీదేవికి ఇచ్చివేసిన రోజు పూర్ణిమ రోజేనట. ఆనాటి నుంచి స్ర్తిలు ఎవరికైతే రక్షాబంధనం కడతారో వారు పదికాలాలపాటు చల్లగా వర్థిల్లుతారని, రక్షాబంధనం చేసిన స్ర్తిలకు కోరుకున్న బహుమతులు ఇచ్చే ఆచారం వెలుగు చూసిందట.

ఇక మన చరిత్ర ప్రస్తావించుకుంటే, ఉదయ్‌పూర్ రాణి కర్ణావతి భర్త రాణా మరణించగా గుజరాత్ పాలకుడు బహదుర్ షాతో ఉపద్రవం ఏర్పడింది. హుమాయున్ చక్రవర్తికి ఆమె రాఖీ పంపి రక్షణ కోరగా అతడు బహదుర్‌షాను తరిమివేసినట్టు కథనం. హిందూ ధర్మ స్వరాజ్య ప్రతిష్టాత్మకుడైన ఛత్రపతి శివాజీ భవానీదేవి కృపాలబ్దియైన ఖడ్గాన్ని, రక్షాకంకణాన్ని ధరించాడు. గ్రీకువీరుడు అలెగ్జాండర్ భారత్‌పై దండెత్తినపుడు, పురుషోత్తముడు అనే రాజు చేతిలో తన భర్త ఓడిపోతాడని తెలుసుకున్న అలెగ్జాండరు భార్య రుక్సానా బేగం పురుషోత్తమునికి రాఖీ కట్టింది. ఆమెను తన సోదరిగా భావించి, ఆ భావనను యుద్ధరంగంలో జ్ఞప్తికి ఉంచుకుని అలెగ్జాండరును పురుషోత్తముడు విడిచి పెట్టాడని ప్రతీక.

Monday 19 August 2013

      ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు ఒక చారిత్రాత్మక తప్పిదం: 
                             ప్రొ||ఎన్ జి రంగా

                                తెలుగు చలనచిత్ర రంగం జైఆంధ్ర కు మద్దతు 


1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు ఒక చారిత్రాత్మక తప్పిదమని ఉత్తమోత్తమ పార్లమెంటేరియన్  ఆచార్య ఎన్ జి రంగా ఆనాడే చెప్పారు. ఇప్పుడు సీమాంధ్ర మొత్తం సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారనడం ఓ ట్రాష్. ఆంధ్ర రాష్త్ర సాధనకోసం ఉద్యమించే వారూ ఉన్నారు. రుజువు కావాలా!

సరే ఈనెల 24 వతేదీశనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాసం జిల్లా పర్చూరు రోటరీ కల్యాన మంటపానికి వెళ్ళండి. ప్రొఫెసర్ రంగా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్ర సాధన" సభ జరుగుతున్నది. అందులో శ్రీయుతులు వసంత నాగేశ్వరరావు,  పిళ్ళా వేంకటేశ్వరరావు, సుంకర కృష్ణమూర్తి, పెళ్లకూరు సురేంద్రరెడ్డి, దేవిరెడ్ది రవీంద్రరెడ్డి, కర్నాటి రామమోహనఋఆవు, చిగులూరి కృష్ణారావు, యల్లాప్రగడ సుబ్బారావు,  పిసి మూర్తి, ఆవుల వీరశేఖరయాదవ్, సయ్యద్ అహ్మద్ పాషా, ఊటుకూరి సతీష్‌కుమార్,  వంకినేని అన్జేఎకుమార్ తదితరులు ప్రసంగిస్తారు.
 
1972 లో సర్దార్ గౌతు లచ్చన్న, బి వి సుబ్బారెడ్డి, కాకాని వెంకట రత్నం, వెంకయ్య నాయుడు వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని నడిపి తెలంగాణాతో కలసి ఉండలేమని కరాఖండిగా చెప్పి తెగతెంపులు చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పటి మాదిరి నాటి ఉద్యమం "వ్యూహ రచన" కాదు. ఉద్యమ అణచివేత చర్యలో భాగంగా జరిపిన పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోగా, ఆ సమాచారం తెలుసుకున్న కాకాని వెంకటరత్నం గుండె ఆగి మరణించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా వందలమంది ప్రాణాలు పణంగా పెట్టారు.

ఆది నుంచి మద్రాసులో పుట్టి పెరిగిన తెలుగు చలనచిత్ర రంగం కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలైరావడానికి ఇష్తపడలేదు. తెలనంఘాణ పొడ గిట్టని తెలుగు సినిమారంగం  జై ఆంధ్ర ఉద్యమాన్ని ముక్త కంఠంతో బలపరచింది. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం "జై ఆంధ్ర " అని నినదించారు.

ఎన్‌టిరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌విరంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చలం, వాణిశ్రీ, అంజలి, జమున, శారద, చాయాదేవి ఇత్యాది అగ్రశ్రేని కళాకారులు జైఆంధ్ర కు మద్దతు పలికారు. జైఆంధ్రకు మద్దతుగా మద్రాసు నగరంలో 1973 ఫిబ్రవరి 18 న నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించారు. రాష్ట్రపతి వివి గిరి సైతం రాష్ట్రంలో ఆనాడు అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు.      

వర్తమానంలో మాదిరి ఆత్మహత్యలకు పాల్పడలేదు. స్పాన్సర్డ్ ఉద్యమాలు చూస్తున్న వారు, చేస్తున్న చాలా మంది అప్పటికి  పుట్టలేదు. రాజకీయ ప్రవేశపు అర్హతకూడా సంపాదించలేదు. ఇంతమంది "ఆత్మహత్యలు"  చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఒక్క వయోధిక సీనియర్ నాయకునికి ఎందుకు హృదయం ద్రవించలేదో, ఆగలేదో అర్ధం కాని విషయం. ఆనాడు పివి నరసింహారావు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బివి సుబ్బారెడ్డి పదవికి రాజీనామ చేసి మరీ ఉద్యమంలో  పాల్గొన్నారు.  ఇప్పటిమాదిరి తెరచాటు రాజకీయం నడపలేదు. ఉద్యమధాటికి పివి రాజీనామ చేయ వలసి వచ్చింది. రాష్ట్రపతి పాలన వచ్చింది. జై ఆంధ్ర, అంతకు ముందు విశాఖ ఉక్కు ఉద్యమాలు రాష్ట్రానికి నైతిక, సైద్ధాంతిక విలువలతో కూడిన యువనాయకత్వాన్ని ప్రసాదించాయి. వసూల్ రాజాలను కాదు.  

Saturday 17 August 2013

                                                    

                                                    విష్ణుసహస్రనామం:
                                                      (తృతీయ భాగం)




శ్లో)56:అజో మహర్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః
తా: పుట్టుకలేనివాడు,అసుర సంహారి, త్రిలోక విజేత, పూజార్హుడు ఆయన. సత్యస్వరూపుదై, సమృద్ధుడై, ఆనంద స్వరూపుడై, భక్తులకు పరమానందము నిచ్చువాడు ఆయనే.
శ్లో)57:మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః|
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగకృతాన్తకృత్||
తా: వామనస్వరూపుడు, మస్త్యావతారమున గొప్ప శృంగముగలవాడు, వరాహవతారమున భూమికి పతి, జాగృత్, స్వప్న, సుషుప్తులను అవస్థలకు అధిపతి అయినవాడు, కపిలమహాముని స్వరూపుడై సాంఖ్య యోదము బోధించినవాడు ఆ పరమాత్ముడే. ఆత్మజ్ఞాని, దుష్కర్మలను నాశనముచేయువాడు,కృతజ్ఞుడై  భక్తులకు ఫలమునిచ్చువాడు ఆయనయే.
శ్లో)58:మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|
గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః||
తా: ఆది వరాహ స్వరూపుడు, స్వర్న భుజకీర్తులు, సుదర్శన చక్రము, కౌమోదకియను గదను ధరించినవాడు, గొప్ప సేనలు గలవాడు ఆయన. ఊహకందని లోతైన జ్ఞాన సక్తి సంపదలు గలిగి సులభముగ తెలియరాని తత్వముగలవాడు, ప్రార్ధనల ద్వారా మాత్రమే చేరగలిగిన వాడు ఆయన.  
శ్లో)59:వేదాస్వ్యాంగో జితఃకృష్ణోదృఢస్సంకర్షణోచ్యుతః|
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహమనాః||
తా:సృష్టికరత, ప్రళయకాలమున తనలో సర్వమును లయమొనర్చుకొనువాడు, అజేయుడు, అచంచలుడు, మహావృక్షము వలె స్థిరుడై,తన కర్మలకు తానే సాధనముగ ఉండువాడు ఆయన. మనస్సంకల్ప సిద్ధిగలవాడు, కమలాక్షుడు, కృష్ణుడు, సూర్య స్వరూపుడు, వరుణుని పుత్రులైన వశిష్ఠ, అగస్త్యుల స్వరూపుడు ఆయనయే.
శ్లో)60:భగవాన్ భగహానన్దీ వనమాలీ హలాయుధః|
ఆదిత్యో జ్యోరిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః||
తా: షడ్విధ  ఐశ్వర్య సంపన్నుడై, సంహారకాలమున ఈ ఐశ్వర్యములను తిరిగి తనలో కలుపుకొనువాడు,భాస్కరుడు, తేజోమూర్తి ఆయన. ఆనందస్వరూపుడై, ఓర్పుగలవాడై, బలరాముని రూపమున నాగలిని, కృష్ణుని రూపమున వనమాలను ధరించి భక్తులకు పరమ గమ్యమై భాసిల్లువాడు ఆయనయే..
శ్లో)61:సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|
దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||
తా: రామావతారమున ధనస్సును, పరశురామావతారమున పరశువును ధరించి దుష్టులను చీల్చినవాడు,వామనావతారమున స్వర్గలోము నంటినవాడు, వ్యాసుని రూపమున జ్ఞానమును, వేదసారమును అందించినవాడు, సమస్త విద్యలకు అధిపతియై భక్తులకు జన్మరాహిత్యవిద్యను, సర్వ సంపదలను అనుగ్రహించువాడు ఆ పరమాత్మయే.
శ్లో)62:త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్|
సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణమ్||
తా: సామవేదస్వరూపుడై, మూడు సామవేద మంత్రములచే కీర్తింపబడెడివాఉ, సామవేదగానము చేయువాడు, సర్వ దుఃఖములకు సంసారమనెడి రోగమునకు వైద్యుడు, మందుతానై సమస్త జీవులకు శాంతిని ప్రసాదించువాడు, ఆయన. శాంత స్వరూపుడై, ఇంద్రియాతీతుడై, ంజోక్షసాధనకు సన్యాసాశ్రమమును నిర్దేశించినవాడు, మోక్షగాములకు పరమ గమ్యమైనవాడు ఆ పరంధాముడే.  
శ్లో63:)శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||
తా: ఆ మహానుభావుడు సృష్టికర్త, శుభలక్షణ సమన్వితుడు, ఆదిసేషునిపై శయనించి ఉన్నవాడు, భూమిని భరించుచు,భూమినుండి ఆనందమును పొందువాడు, గోవులను జగత్తును రక్షించువాడు. శాంతిని ప్రసాదించువాడు, ధర్మదృష్టికలిగి ధర్మమును ప్రేమించువాడు ఆయనయే.    
శ్లో)64:అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||
తా: ఆయన కాలచక్ర స్వరూపుదై వెనుకకు మరలని వాడు,బ్రహ్మకన్న ఉత్తముడు, సంసార బంధములు లేకుండ ప్రళయకాలమున సర్వమును సంక్షేపించి హరించువాడు. క్షేమమును, శుభమును కలుగజేయువాడు, శ్రీవత్సమను చ్హ్నము వక్షస్థలమున గలిగి, లక్ష్మీపతియై, లక్ష్మికి నివాస స్థానమై శొభిల్లువాడు ఆ పరమాత్ముడే.
శ్లో)65:శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః|
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||
తా: ఆ మహాపురుషుడు లక్ష్మీదేవికి పతి, లక్ష్మిని ధరించినవాడు, లక్ష్మికి నివాసస్థానమై ఉండి లక్ష్మికి మాన్యుడైనవాడు. భక్తులకు సంపదలిచ్చువాడు. జనుల కర్మానుసారముగ సంపదను విభజించువాడు, ముల్లోకములకు ఆశ్రయమై ఉన్నవాడు.
శ్లో)66:స్వక్ష స్స్వంగ శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః|
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః||
తా:శుభప్రదమైన అంగములు, శుభదృష్టి గలిగి, పరమానందస్వరూపుదై, శతవిధములుగ జీవులకు ఆనందము నిచ్చువాడు ఆయన. పరిపూర్ణజ్ఞానియై, సత్కీర్తి గలిగి, విజితాత్ముదై, సమస్త జీవాత్మలను విధేయులుగ ఉంచుకొన్నవాడు, సూర్యాది సమస్త జ్యోతిర్వర్గములకు అధిపతియు ఆయనయే.
శ్లో)67:ఉదీర్ణస్సరతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్ధిరః|
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః||
తా:సర్వబంధములకు, కర్మలకు అతీతుడై, సర్వసాక్షియై, సమస్త విభూతులు గలిగి స్థిరుడై, తనపై మరెవ్వరూ అధిపతిలేకుండ తానే సర్వాధిపతియై నిలిచిన వాడు ఆయన. సమస్త ప్రపంచమునకు భూషణమై, శోకరహితుడై, భక్తుల దుఃఖమును పోగొట్టువాడు, సేతునిర్మాణమునకు పూర్వము  శ్రీరామునిరూపమున భూమిపై శయనించినవాడు ఆయనే.
శ్లో)68:అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధో ప్రతిరధః ప్రద్యుమ్నోమితవిక్రమః||
తా: సమస్త బ్రహ్మాండమును కుంభమువలె తనలో ఇముడ్చుకున్న వాడు, సూర్యాది జ్యోతిర్వర్గములకు కాంతి నొసగువాడు, పరిశుద్ధాత్ముడైన వాడు, పూజనీయుడు, భక్తులపాపములను నిర్మూలించువాడు ఆయన. తేజోరూపుడు, శతృవులు నిరోధించలేనివాడు, అమిత పరాక్రమవంతుడు, సంగ్రామమున ఎదురులేనివాడు ఆయనయే.
శ్లో)69:కాలనేమినిహా శౌరిః శూర శ్శూరజనేశ్వరః|
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః||
తా:కాలనేమి, కేశియను రాక్షసులను సంహరించినవాడు, గొప్ప విక్రమము గలవాడు, శూరజనులందరికీ ప్రభువు, శూరసేన వంశమున పుట్టిన శ్రీకృష్ణుడు ఆయన. త్రిలోకములకు ప్రభువై, అంతర్యామియై, ప్రళయకాలమున సర్వమూ హరించువాడు, తన కాంతికిరణములచే సర్వమును తేజోవంతమొనర్చువాడు ఆ పరమాత్ముడే.
శ్లో)70: కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః||
తా: మన్మధ స్వరూపుడై సృష్టిచేయువాడు, అన్ని కోరికలు సిద్ధించినవాడు, భక్తులకోర్కెలు తీర్చువాడు, సుందరరూపుడు ఆ పరమాత్మ. నిర్దేశించుటకు వీలుగాని తత్వము గలవాడై, సర్వవ్యాపియై, గొప్ప వేగము, అనంత జ్ఞానములతో శోభిల్లువాడు, ఆగమములను సృష్టించినవాడు అగ్నిదేవుని స్వరూపుడు ఆయన.
శ్లో)71:బహ్మణ్యోబ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ వివర్థనః
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః||
తా:బ్రహ్మను, సర్వ జగత్తును సృష్టించినవాడు, బ్రహ్మ విదుడు, సత్య, జ్ఞాన స్వరూపుడు, వేదములను బోధించువాడు, బ్రహ్మకు మాన్యుడై బ్రహ్మజ్ఞులచే కోరబడువాడు ఆయనయే.
శ్లో)72:మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః||
తా: మూడడుగులతో విశ్వమంతయు ఆక్రమించినవాడు, సృష్టి, స్థితి, లయములను మహాకర్మలు చేయువాడు, మహా తేజోస్వరూపుడు, క్షీరసాగర మథనమప్పుడు  వాసుకి యను మహా సర్పరూపమున ఉన్నవాడు ఆ మహాపురుషుడే. మహా క్రతువైన అశ్వమేధము, మహా యజ్ఞమైన జపయజ్ఞము తానై ఉండి, గొప్ప యజ్ఞములు నిర్వర్తించుచు, హవిస్సులలో గొప్ప భాగమును స్వీకరించువాడు ఆయనయే.  
శ్లో)73:స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః||
తా: స్తోత్రము తానై, స్తోత్రమును ప్రేరేపించుచు, స్తోత్రములవలన ప్రసన్నమగువాడు, ఋషులచే, వేదములచే స్తుతింపబడువాడు ఆయనయే. రణప్రియుడు, కర్మబంధములనెడి ఋగ్మతలు లేనివాడు, పరిపూర్ణస్వరూపుడు, పుణ్యాత్ముడై, పుణ్యమునిచ్చువాడు, భక్తుల కోరికలు పూరించువాడు ఆయనయే.
శ్లో)74:మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః||
తా: మనోవేగము గలవాడు, పుణ్యతీర్ఠములను, బ్రహ్మాండమును సృష్టించినవాడు, సంపదలను, మోక్షము నిచ్చువాడు, వాసుదేవుడైన శ్రీకృష్ణుడు ఆయన. సర్వ ప్రాణులకు నివాస స్థానమై ఉండి, బంగారు వంటి చక్కని మనస్తత్వము గలిగినవాడు, బ్రహ్మమే హవిస్సుగా స్వీకరించువాడు ఆ పరంధాముడు.
శ్లో)75:సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః|
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః||
తా:ఏకైక సత్యమై ఉండి, సత్య సంపదలైన తపోజ్ఞానాదులు తానై, సద్బుద్ధిగలిగి, సత్పురుషులలో నివసించుచు, వారికి మోక్షస్థానమై ఉన్నవాడు ఆయన. గొప్ప శూరులతో గూడిన సైన్యము గలిగినవాడు, యాదవకుల తిలకుడై, యమునా తీరమున  విహరించిన శ్రీకృష్ణపరమాత్మ ఆయనే.
శ్లో)76:భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః|
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః||
తా: సర్వ భూతములకు, సర్వ ప్రాణుల అసువులకు నివాస స్థానమై ఉండి,ప్రపంచమును తన మాయతో కప్పినవాడు, అగ్నిస్వరూపుడు, పరాజయమునొందనివాడై దురాత్ముల దర్పము నణచువాడు, ఆ పరమాత్ముడు. నిరంతరము తృప్తుడై, సజ్జనులకు విశ్వాసము నిచ్చువాడు, ఆయనపై చిత్తము నిలుపుట అసాధ్యమైనవాడు.
శ్లో)77:విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః||
తా:విశ్వమే తనరూపముగ గలిగిన విరాట్ స్వరూపుడు, తేజో మూర్తి, విశ్వరూపమున అనేక ముఖములు గలవాడు, దుష్టశిక్షణ కొరకై దశావతారముల నెత్తినవాడు ఆయనయే. బహురూపి యైనను ఇంద్రియములకు గోచరము కానివాడు, నిరాకారుడు ఆయన.
శ్లో)78:ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః||
తా:ఏకైక సత్యస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సోమయజ్ఞ స్వరూపుడు, భక్తులకు వారు కోరిన రూపములలో దర్శనమిచ్చువాడు, మోక్షపదమై ఉన్నవాడు ఆ పరమాత్మ. సమస్తలోకములకు ప్రభువు, హితుడు, మాధవుడు, భక్తవత్సలుడు ఆయనయే.
శ్లో)79:సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః||
తా:బంగారము వంటి శరీరము, తేజస్సు కలిగి,శుభలక్షణ సమన్వితుడై, చందనచర్చితమైన శరీరముతో శోభిల్లువాడు, తనతో సమానమైనవడు లేనివాడు ఆయన. ఆశలేనివాడు, నిర్గుణుడు, స్తిరత్వము గలవాడు, ప్రపంచమును నడుపువాడు, వీరులైన శత్రువులను వధించువాడునూ ఆయనయే.
శ్లో)80:అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||
తా: లోకమాన్యుడు, త్రిలోకములను ధరించి, పాలించువాడు, అనాత్మ వస్తువులందు ఆసక్తిలేనివాడు, భక్తులకు గౌరవమిచ్చువాడు ఆయన. గొప్ప మేథాశక్తి, అమోఘమైన ప్రజ్ఞ గలిగి భక్తుల మేధస్సులో నుత్పన్నమగువాడు, ధన్యుడు, ఆదిశేషస్వరూపుడు ఆ పరంధాముడు.


Thursday 15 August 2013

"క్షత్రియప్రభ" ఆగస్ట్ సంచికలో నా వ్యాసం. 

             స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి...





చివరి బ్రిటీష్ గవర్నర్ జనరలైన విస్కౌట్ లుయీస్ మౌంట్బాటెన్ 1947 జూన్ 3 న బ్రిటీష్ ఇండియాని లౌకిక భారత దేశంగాను మరియు ఇస్లామిక్ పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగష్టు 14న పాకిస్తాన్, 1947 ఆగష్ట్ 15 న భారత దేశం స్వతంత్ర్య దేశాలుగా అవతరించాయి. స్వాతంత్ర్యానంతరం హిందూ ముస్లిం ల మధ్య తీవ్ర మతఘర్షణలు తలెత్తాయి. అప్పటి భారత ప్రధాని నెహ్రూ మరియు ఉపప్రధాని వల్లభాయ్ పటేల మౌంట్బాటెన్ ని గవర్నర్ జనరల్ గా కొనసాగవలసిందిగా కోరారు. 1948 లో అయన స్థానంలో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ గా నియమితులైనారు. 565 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసే భాధ్యతను పటేల్ స్వీకరించారు. ఆయన తన ఉక్కు సంకల్పం నిజాయితీలతో కూడిన విధానాలతో ఏకీకరణ సాధించారు. బలప్రయోగంతో జూనాఘడ్, జమ్మూ-కాశ్మీర్ మరియు హైదరాబాద్ ఆపరేషన్ పోలో సంస్థానాల విలీనాలు ఆయన ఉక్కు సంకల్పానికి మచ్చుతునకలు. 1949 నవంబర్ 26 లో రజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1950 జనవరి 26 వ భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది.రాజ్యాంగ పరిషత్ డా| రాజేధ్ర ప్రసాద్ ని ప్రథమ రాష్ట్రపతికా ఎన్నుకోవటంతో ఆయన రాజగోపాలా చారినుండి బధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర్య సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చేరి 1953-54 మరియు సిక్కింలు 1975 లో విలీనమయ్యాయి. 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 62 శాతం పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మనం స్వాతంత్ర్యం సాధించి ఇప్పటికి 65 ఏళ్లు పూర్తయ్యాయి.  "దెబ్బతీయడం గొప్ప కాదు, దెబ్బను సహించడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన మహాత్మా గాంధి అడుగుజాడలు ప్రతి భారతీయునికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన అడుగు వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీ లేక అస్తవ్యస్తంగా చిత్తమొచ్చినట్లు నడిచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా, నిర్దేశాలయ్యాయి. అవే ఆదర్శనీయాలయ్యాయి. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆక్రోశం, ఆవేశాల స్థానంలో అహింసను ఆయుధాలుగా ఆయన మలచిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అప్పటివరకు తాము ఆడిందే ఆటగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆట కట్టించినట్లయ్యింది. అది వ్యక్తి సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు ... ఆయన చేపట్టిన ఏ ఉద్యమానికైనా ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. వందే మాతరం అంటూ ముక్తకంఠంతో సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. ఆ విశ్వాసానికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రతిఫలం లభించింది. అంత చీకటిలోనూ కోట్లాది భారతీయుల కళ్ళలో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవయ్యేళ్ళు.అరవయ్యేళ్ళ స్వాతంత్ర ప్రస్థానంలో ప్రతి ఏడాదినీ పుట్టినరోజులా జరుపుకున్నాం. ఇలా 65 ఆగస్టు 15లు చేశాం. ఈ ఏడాది ఈ నెలలో 66వ పర్వదినం జరుపుకోబోతున్నాం. కానీ మన దేశంలో మనం మౌలిక విషయాలకు సైద్ధాంతిక ప్రాముఖ్యతను నేటికీ ఇవ్వలేకపోయాం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రెండు తరాలు గతించాయి. కానీ ఆహారం, పోషణ, ఆరోగ్యం మరియు విద్య వంటి ప్రాధమిక అవసరాలు ఇప్పటికీ జనాభాకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.  స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏదో స్వీట్లు పంచుకుని కేకలు వేసుకుంటూ ఏవో నీతులు చెప్పి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కాదు. ఇది ఎంతమాత్రం సరికాదు. స్వాతంత్ర్య పోరాటంలో నాటి మహనీయులు చూపిన కృషి, అంకితభావం, వారి త్యాగం, జీవితాలను పణంగా పెట్టి సాధించిన అపురూపమైన ప్రేమైక బహుమానం స్వాతంత్రం అని తెలుసుకుని స్మరించుకోవాలి. స్వాంతంత్రం ఎందుకూ అంటే, మన జీవితాన్ని మనమే స్వేచ్ఛగా మలచుకుని ఓ మంచి మార్గంలో పెట్టుకుని పరిపూర్ణమైన మానవునిగా ఉండేందుకు. అంతేతప్ప ఎవరో మన జీవితాలను మలచడం కోసం కాదు. 

స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన దేశం గణనీయమైన ప్రగతిని సాధించింది, కానీ మౌలిక వసతుల మాటేమిటి... అందుకే ఇప్పటితరం చేయాల్సింది ఏంటంటే, మనం ఎలా ఉండాలన్నది మనకు మనమే నిర్దేశించుకోవడం, అలాగే దేశం ఎలా ఉండాలో.. అలా తీర్చిదిద్దుకోవడం, అదేవిధంగా భావితరాలకు కావల్సిన బంగారు బాటను వేయడం. అందుకోసం ప్రాథమిక అవసరాలైన పోషణ, ఆరోగ్యం, విద్య, మరియు జీవావరణ వ్యవస్థలను పటిష్టపరచుకోవడం. ఇవి అవశ్యం.  దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్న మనం దేశానికి అవసరమైన గొప్పగొప్ప నాయకులను మాత్రం తయారు చేసుకోలేకపోయాం. రాజకీయవేత్తలను, నిర్వాహకులను తయారుచేసుకోగలిగాము కానీ దేశానికి కావలసిన గొప్ప నాయకులను మాత్రం సాధించుకోలేకపోయాము. సమగ్రత, మేధస్సు దేశానికి అవసరం. వీటిని ఆయుధాలుగా చేసుకుని నేటి యువత దేశాన్ని నడపాలి. మనం కొన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని చూపిస్తున్నప్పటికీ, జనాభాలో ఇప్పటికీ 50 శాతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దేశ జనభా శక్తియుక్తుల్ని ఉపయోగించుకోకుండా ఏ దేశమూ ప్రగతిపథంలో పయనించజాలదు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోనూజాలదు. అందుకే ఈ స్వాతంత్ర్యదినం నాడు, ప్రతి భారతీయుడు ప్రతినబూనాలి. మనకు మన దేశం ఎలా ఉండాలో అలా సృష్టించుకునేందకు పాటుపడాలని నిశ్చయించుకోవాలి. మనం మన దేశంకోసం పడిన శ్రమ భావితరాలకు బంగారుబాటలు వేయాలి. వాటిని ఆస్వాదించే భావితరం మనల్ని తలచుకుని గర్వపడాలి. ఈ స్వాతంత్ర్యదినోత్సవంనాడు ఈ లక్ష్యసాధనకు నడుం బిగించుదాం. 
   
 ప్రముఖ సాహితీ వేత్త ఆరుద్ర అన్నట్లు 'మన స్వతంత్రం మేడి పండు-మన దరిద్రం రాచపుండు'' లా దాపురించింది ప్రస్తుత దేశ పరిస్ధితి. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్వైర విహారం చేస్తున్నది. భారత రాజ్యాంగం సృష్టించిన ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందించాలని సంకల్పిం చింది. ఈ మేరకు పంచవర్ష ప్రణాళికల రూపంలో కొంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి సాధించింది. కాని సాధించాల్సింది ఎంతో ఉంది. స్వతంత్రం సిద్ధించే నాటికి దేశాభివృద్ధికి నిర్ణయించిన కర్తవ్యాలు ఇంకా నెరవేరలేదు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇప్పటికే గుర్తింపు పొందిన భారత దేశంలో అలజడి, అల్లకల్లోలం, అవ్యవస్థ నెలకొని ఉన్నాయి. దేశ మంతటా అవినీతి ఆవరించి ఉంది. అన్యాయం మితి మీరింది. దరిద్రం తాండవిస్తున్నది. దేశమంతటా జాతి బేధాలు, మత బేధాలు, ఆర్ధిక బేధాలు పడగలెత్తి బుసలు కొడు తున్నాయి. ద్రవ్యోల్బణం, అధిక జనాభా, దారిద్య్రం వంటి ఎన్నో సమ స్యలు దేశాన్ని పట్టి పీడిస్తు న్నాయి. అవినీతి కుంభ కోణాలు విశృంఖలంగా వెలుగు చూస్తున్నాయి. బస్టాండులు, పార్కులు, వ్యాపార కూడళ్ళ నుంచి పార్లమెంట్‌ భవనం వరకూ అన్నీ ఉగ్రవాద దాడులకు గురి అవు తున్నాయి. ప్రస్తుతం అస్సాంలో సాగుతున్న మారణ హోమం జాతి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశ రాజకీయ సార్వభౌమత్వాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపు ఆజ్ఞల లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక విధానాల్లో చోటుచేసుకున్న అవకతవకలు మనల్ని ఇతర దేశాల ముందు తలదించుకునేలా చేసే పరిస్థితి నెల కొన్నది. బలహీన, అల్ప సంఖ్యాక వర్గాలకు సామాజిక న్యాయం ఎండమావిగా మారింది.

"క్షత్రియప్రభ" ఆగస్ట్ సంచికలో నా వ్యాసం.
---------------------------------------- 


               సమస్త శుభకరం-శ్రావణ మాసం



శ్రావణ మాసం అని ఎందుకు పేరు ? అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు. మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య క్రమం తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 'శ్రావయతి శ్రుణోతి ఇతి శ్రీ' మన మొరలను వింటుంది, ఆపై భగవంతుడిని వినేట్టు చేస్తుంది కనుక ఆమె పేరు శ్రీ. మనం ఆశ్రయించాలని అనుకుంటే ఆశ్రయించేట్టు చేసేది కనుక ఆమె శ్రీ. మనల్ని కాపాడాలని స్వామిని ఆశ్రయించేది కనుక ఆమె శ్రీ. 'శ్రీ' తో కూడుకున్నాడు కనుక ఆయన తప్పనిసరి రక్షణ చేసి తీరుతాడు కనుక ఆయన పేరు శ్రీపతి లేక శ్రీమన్నారాయణ. శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూ ఉత్సాహముగా , సంబరముగా పండుగలు , పూజలు , పేరంటాలు జరుపుకునే మాసము . శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి. 

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. 
ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో -- శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు . మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు -- ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే . నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే ... పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. వరాలిచ్చే తల్లి ... వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు. 

లక్ష్మీ సర్వ సంపదలకీ అధిష్ఠాతృ దేవత. ఇంద్రియ నిగ్రహం, శాంతం, సుశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది. లోభం, మోహం, రోషం, మదం, అహంకారం వంటి గుణాలేమి లేని చల్లని చల్లని తల్లి ఆమె. సర్వ సస్యాలు ఆమె రూపాలే. వైకుంఠంలో మహాలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, రాజ్యంలో రాజ్యలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి అంటూ సర్వ ప్రాణులలో, ద్రవ్యాలలో మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే. లక్ష్మీదేవి అన్నిచోట్ల ఉండే దయారూపిణి. అలాంటి లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రద మాసమైన శ్రావణమాసం వచ్చేస్తోంది. జ్యోతిష్య శాస్త్రరీత్యా శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. 
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. మహిళలకు అత్యంత ముఖ్యమైన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. వీలుకాని వారు, శ్రావణ మాసంలోని ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు.
అనురాగ బంధాల ప్రతీక... రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల అనురాగ బంధాల ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది. పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి అని అంటారు. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు.
NANDIRAJU RADHAKRISHNA
POLITICAL COMMENTARIES
(JULY 25-AUGUST 14, 2013)



తెగిన తెలంగాణ..
విభజన పోరులు-భజనపరులు

రాజకీయ మాయాజాలం, ప్రెస్‌క్లబ్, సొంత స్టేటస్ పై రాసుకున్న వ్యాఖ్యలన్నింటినీ ప్రతి 15 రోజులకొక మారు అన్నింటినీ గుదిగుచ్చి ఒక సమాహారంగా నా బ్లాగులో పదిలపరచుకునే కార్యక్రమం ప్రారంభించా. అందులో మొదటి అధ్యాయమే తెలంగాణ అంశంపై 2013 జులై 25 నుంచి ఆగస్టు 15 వరకు సాగిన వ్యాఖ్యాలోచనల క్రమం.



_____________________________________________
14-8-13
*మనదేశాన్ని ఏ పార్టీ పరిపాలిస్తున్నదో తెలుసా?
ఆ! ఐ ఎన్ సి.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఏడవచ్చుగా...
అక్కడే పప్పులో కాలేశావ్. మనకు స్వతంత్రం తెచ్చింది ఇండియన నేషనల్ కాంగ్రెస్. అదిప్పుడు లేదు. ఇప్పుడున్నది ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్, అదీ ఐ.ఎన్.సి. అంటే!! మన జనపథ్ భజన బృందం గురించి ఇదంతా ముందుగా ఊహించే కామోల్సు,. తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. అది తెలుసుకో ముందు..
________________________________________________________
13-8-13


*ఇందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాచేస్తే ప్రభుత్వం లేనట్లేగా! ప్రభుత్వ రహిత రాజ్యంలో మనం చస్తూ బతుకుతున్నాం.. ధైర్యం చేసి ఒక్క ముఖ్య మంత్రి రాజీనామా చస్తే అసలు ఏ గోదవ ఉబ్డదుగా. మంత్రులూ మీ రాజీనామాలను గవర్నరుకు పంపండి. విధులకు హాజరు కాకండి. రాజీనామాచేసిన మీ సంతకాలకు చిల్లి గవ్వ విలువ ఉండదు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడే స్వయంగా రాజ్యాంగ, భగవత్ ధిక్కారణకు పూనుకున్నారు. ఇది ఆత్మద్రోహం, ప్రజాద్రోహమే కాదు, భగవద్రోహం కూడా. భక్తులను మోసగించకండి, తిరుమల ఆలయా ప్రాంగణంలో కాలు పెట్టకండి.

*రాగ ద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తామని, క్రమశిక్షణ పాటిస్తామని, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తామని రాజ్యాంగం, భగవంతుని పై ప్రమాణం చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కాంగ్రెస్ అధిష్టానం, తమ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రౌడీల్లా డిల్లీ వీధుల్లో ఆ నినాదాలేమిటి? వయసు మీరిన వారు కూడా ఆ గెంతులేమిటి? కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తక్షణం పదవులకు పార్టీకి రాజీనామా చేసి, ప్రభుత్వ నివాసాలు ఖాళీ చేసి, జీత భత్యాలు తిరస్కరించి కేంద్రాన్ని పడకొట్టండి. ఈ దౌర్భాగ్య నాటకాలొద్దు. అంతా ప్రచార యావమాత్రమే!! అంతా 'జన్‌పథ్' అమ్మ భజన బృందం.. పార్టీలకు అతీతంగా ఇటువంటి నాటకాల రాయుళ్లను ప్రజలు తరిమికొట్టాలి.
_______________________________________________________
*ఏమిటీ గందరగోళం..పరిష్కారమెప్పుడు?

అసెంబ్లీ సజావుగా జరిగి నాలుగేళ్ళయింది. మంత్రివర్గ సమావేశాలు షెద్యూల్ ప్రకారం జరిగి మూడేళ్ళవుతున్నది. మంట్రులకు ముఖ్యమంత్రిపట్ల గౌరవం, లేదు. మంత్రులంతే ముఖ్యమంత్రికి విశ్వాసమే లేదు. ఎమ్మెల్యేలకు మంత్రులకు శతృత్వం. ముఖ్యమంత్రికి ఎంపీలకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటుండి. ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు జైలుకెళ్ళిన ఘనత గల ప్రభుత్వమిది. సీమాంధ్ర మంత్రులు, తెలంగాణాను పట్టించుకోరు. తెలంగాణ మంత్రులు సీమాంధ్రను చీమను చూసినట్లు చులకన భావం.
శాసన సభ్యులు అసెంబ్లీకి రారు. బీఎసి ప్రకారం సభ నడవదు. శాసన మండలి సభ్యులకు పనేమీ ఉండదు వారెప్పుడూ ఆరో వేలే! సీమ ఎంపీలు తెలంగాణ ఎంప్పెలపై కస్సుబుస్సు. తెలంగాణ ఎంపీలకు సీమాంధ్ర ఎంపీలంటె ద్వేషం. పిసిసిని మంత్రివర్గం పట్టించుకోదు. మంత్రివర్గాన్ని పిసిసి లెక్క చేయదు. ప్రజా సమస్యలపైనే కాదు కనీసం వార్షిక బడ్జెట్ అన్నా పూర్తి నిర్లక్ష్యం. ఏడాదిలో 50 రోజుల సభా సమావేశాలు జరగడం నాలుగేళ్ళలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వానికి అసలు ఉనికే లేదు. ప్రతిపక్షానికి పూర్తిగా పక్షవాతమే. సర్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, ఉన్నతాధికారులు.. చంచలగూడ జైల్‌ల్లో తిష్ఠ వేసుక్కూచున్నారు. ముఖ్య మంత్రి, ఉపముఖ్య మంత్రి,పిసిసి అధ్యక్షుడు పరస్పరం విద్వేషపూరితంగా వ్యవహరిస్తుంటారు. అధిష్టానం వద్ద పితురీలు, ప్రభుత్వంపై అధికార పక్షం దుమ్మెతిపోస్తుంది.
ఏఐసిసి కి రాష్ట్ర కాంగ్రెస్ పై పట్టు లేదు. పిసిసికి అధిష్ఠానమంటే ప్రాంతాల వారీగా చీలి క్రమశిక్షణ ఉల్లంఘించి రోడ్డెక్కి తిట్ల పురాణం. వర్కింగ్ కమిటీ, ఏ ఐ సి సి ల్లో వాగ్వివాదాలు. ఎవ్వరిపై ఎవరూ చర్య తీసుకోరు. ఒక ఎమ్మెల్యే పిసిస్ అధ్యక్షుని తిట్టినా, ముఖ్యమంత్రిని తూర్పారబట్టినా ఏ చర్యలుండవు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పైకూడా మౌనమే. ఎమ్మెల్యేలు. ఎంపీలు పార్టీ ఫిరాయిస్తున్నా దిక్కులు చూడడం మినహా చలనమే లేదు. పాలన గాడితప్పింది. తన జి ఓలను తానే అమలుచేయలేని దుస్థితి. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు పనిచేయరు. ఆర్టీసీ బస్సులు నడవవు.. నిత్యావసర వస్తువులకు కరవు. ఆకాశంలో ధరలు. ప్రభుత్వోద్యోగులు ప్రాంతాల వారీగా సమ్మెలు. స్కూళ్ళు కాలేజీలు, దుకాణాలు.. బంద్‌లు.
అయినా సరే కేంద్రం కన్నెత్తి చూడదు. పన్నెత్తి మాటాడదు. పత్రికలన్నీ విషపుత్రికలు, ప్రసారమాధ్యమాలు మద్య ప్రవాహాలు. అయినా సరే. తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనళ్ల్లో అందరూ ఒకే బాట. అందరూ అసెంబ్లీకి వెళ్ళకున్నా కలసికట్టుగా డిల్లీ వెళ్ళీ అక్కడ చీలిపోయి కేంద్రం పై, పార్టీ అధిష్ఠానంపై నిరసనలు. ప్రదర్శనలు. డిల్లీలో కళ్ళు, చెవులు, నోరు స్థంభించిన నిర్జీవ యంత్రాంగం. పన్నుల మోత, పోలీసుల చలాన్ల వాతకు అదుపులేదు. ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.
______________________________________________________

*మనుషులు చీలిపోయారు, మనసులు విడిపోయాయి, పత్రికలు, చానళ్ళు, జర్నలిస్టులు, పార్టీలు అన్నీ కకావికలమయ్యాయి. తెగిపోయాయి, మంత్రివర్గం ముక్కలైంది, అసెంబ్లీ చెక్కలైంది, రాష్త్ర ప్రభుత్వం మాయమైంది, విద్యాసంవత్సరం హతమైంది.ఆర్టీసి సమ్మె చేస్తోంది.
.. ఇంకెక్కడి సమైక్యం. కానీ..అవినీతిపరులు సమైక్యం, ఫిరాయింపుదార్లు సమైక్యం, కులం సమైక్యం, వర్గం సమైక్యం, స్వార్ధపరులు సమైక్యం, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సమైక్యంగా బస్సులు నడుపుకుంటున్నారు. టెవీ చర్చల్లో విశ్లేషకులు కూడా సమైక్యం..కాంట్రాక్టర్లు ఘంటాపధంగా సమైక్యం.
ఇదంతా సమైక్య భజన... ప్రజలు బాధలు పడుతున్నారు. రాజకీయ వ్యాపారులు లాభపడుతున్నారు. ఎందుకీ నాటకాలు?

*పార్టీలతో సంబంధం లేదు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, లోక్‌సభ సభ్యులు, అజాగళ స్థానాల్లాంటి ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు.. తెలంగాణ కోసం కాని, సీమాంధ్ర కోసం కాని చేసింది ఏమిటీ. పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. అమాయకులు బలవుతుంటే వాళ్ళు పదవులకోసం పాకులాట. కాంట్రాక్ట్‌లు, మంత్రి పదవులు, సొమ్ములు వాళ్ళకు సమ్మె సమ్మెట దెబ్బలు సామాన్యులకు.. నాయకులను కాలరుచ్చుకుని నడిరోడ్డుపై నిలదీయాలి.

*ఈ దేశానికి మరో అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, వీరసావర్కర్, ఒక వివేకానందుడు... అవసరమైన తరుణంలో భారత మాతకు మగధీరులైన ఇద్దరు కుమారులు ఆవర్భవించారు. దేశభక్తి, అబివృద్ధి, జాతీయత, సంస్కృతి, సాంప్రదాయం, హైందవం, అవినీతిపై అవిశ్రాంత పోరాటం తదితర అంశాల పునాదుల పునర్నిర్మాణానికి ఒక నరేంద్ర మోదీ, ఒక సుబ్రహ్మణ్యస్వామి లభించారు. నాలుగువందల ఏళ్ళ పరాయి పాలన స్వాతంత్ర్యానంతరం 66 సంవత్సరాల తరువాత కూడా అనువంశిక పాలన, కుటుంబ బానిసత్వాల కింద నలగవలసిందేనా? నూరేళ్ళు నిండిన ఒక కాలంతీరిన రాజకీయ వృద్ధ అలోచనా విధానం నుంచి విముక్తి పొందదానికి ఇది ఒక అరుదైన అపూర్వ అవకాశం. శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ, పండిట్ మౌళి చంద్రశర్మ, ప్రేమ్ నాథ్ డోగ్రా, ఆచార్య డి పి ఘోష్, పీతాంబరదాస్, ఎ రామారావు, బలరాజ్ మథోక్, అటల్‌బిహారి వాజ్‌పేయీ, ఎల్‌కె అద్వాని వంటి ఉద్దండుల నీడన ఎదిగినా దేశభక్తుల అడుగు జాడల్లో రూపురేఖలు దిద్దుకున్న బిజెపి మనకు ఆశాజ్యోతి. దేశం ఒక దశాబ్దం పాటు మోదీ నేతృత్వంలో సాగితే యువతదే ఉజ్వల భవిత.
___________________________________________________________

 7-8-13


*చతుర్ముఖ పారాయణం కోసం జన్‌పథ్10 ఒక కమిటీ వేసింది. ఇద్దరు నార్త్(అహ్మద్, దిగ్గీ), ఇద్దరు సౌత్(ఆంటోని, మొయిలీ). మొయిలీ కొక్కడికే కాస్త తెలుగు అర్ధమవుతుందనుకుంటా!! ఇది ప్రభుత్వ కమీటీ' కాదు, కంటితుడుపుకోసం కాంగ్రెస్ కమిటీ..మరో శ్రీకృష్ణ కమిటీ మాదిరి, ప్రణబ్ కమిటీ మాదిరి, రోశయ్య కమిటీ లాంటిది.. దీనికి నిర్ణీత కాలమంటూ లేదు... ఇది అనంతం నాయనా...దీనికే మనవాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. ...

*తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేది.. ఇవ్వకుంటే చచ్చేదీ కాంగ్రెస్సే అని గతంలో టి కాంగ్రెస్ పెద్దలు చెపారు. గమ్మత్తేమిటంటే ఇచ్చిన తరువాత కూడ చస్తున్నది అదే..

*సమైక్య భారతంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అంతా మనదైనప్పుడు తెలంగాణపై అభ్యంతరాలెందుకు, అనుమానాలెందుకు? చదువులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, కాంట్రాక్టులకు మనవాళ్లమందరూ పోటీపడి వ్యాపిస్తున్నప్పుడు ఇంకా ఈ సమైక్యమేమిటి? అంతా రాజకీయ ధనాఢ్యుల డ్రామా!! ఈ సమైక్యవాదులకు ఎన్ని రాష్ట్రాల్లో ఆస్తులున్నాయో, వ్యాపారాలు, పరిశ్రమలు, కాంట్రాక్ట్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత తెలుగు వారు తమిళనాడులో, కర్ణాటకలో ఎందరు స్థిరపడలేదు? వారు తెలుగువారు కాదా? డిల్లీ, మహరాష్ట్రలో మనవాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు? మనం పొరుగువాళ్ళనుంచి నేర్చుకోవలసింది రాష్త్ర అభివృద్ధి. దానికి పోటీ పడాలి, అనువంశిక పాలనకు వొంగి వొంగి దణ్ణాలు పెట్టడం, అమ్మ బొమ్మ చూస్తే వణకిపోవడం ఇకనైనా మానుకుంటే లక్షణంగా బాగుపడతాం.
___________________________________________________________

6-8-13

*తెలంగాణ సెగ ఏర్పడ్డప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఅరెస్ నేతలు నాటి ముఖ్యమంత్రి పెద్దాయన, రోశయ్యను నోటికొచ్చినట్లు దూషించారు. అభిమానం, చీము, నెత్తురు ఉన్న వ్యక్తి గనుక ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసి ఏడాదిపాటు సాధారణ శాసనమండలి సభ్యుడుగా కొనసాగి దర్జాగా నలుగురిలొ, ప్రజల్లో తలెత్తుకు తిరిగారు. అనేక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏనాడూ సచివాలయానికి రాకుండా ముఖం చాటెయ్యలేదు. రాష్ట్రంలో, డిల్లీలో అవమానాలు భరిస్తూ చేతులు నలుపుకుంటూ కూర్చోలేదు. ఆయన రాజకీయ అనుభవం, భాషా పటిమ, పాలనానుభవం వన్నె తెచ్చాయి. నెహ్రూ నుంచి సోనియా వరకు అందరి వద్ద ఒక మేధావి గానే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా ఒక రాజనీతిజ్ఞునిగా గుర్తింపునిచ్చి 78 సంవత్సరాల వయసులో ఆయనను నిలువెత్తు మనిషిగా నిలబెట్టి గవర్నరును చేశాయి. ఆ లక్షణాలు అందరిలో ఆశించడం మన తెలివితక్కువ తనం. ఆయన తెలివిలేని, తెలుగు రాని ముఖ్యమంత్రి కాదు.

*తెలంగాణ ఏర్పడితే .. ఇక్కడి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి... ఇలాంటి పేర్లున్న పత్రికలు పేర్లు ఎలా మార్చుకుంటాయో! .

*అసలు చిక్కల్లా రాజకీయ నిరుద్యోగులతోనే కదా వచ్చింది.. రాష్ట్రాలతోపాటు ఇక అన్నీ డబల్ థమాకా!! గవర్నర్లు, సిఎం లు, మంత్రివర్గాలు, సిఎస్ లు, డిజిపిలు, స్పీకర్లు, కార్పొరేషన్ చైర్మన్లు....ఏమి మన భాగ్యమూ!!

*జాతీయస్థాయిలో టిడిపి బిజెపిని దూరం చేసుకుని, కళ్ళు పొడుచుకున్నా. ఇవ్వాళ పార్లమెంటులో సమైక్యాంధ్రకు అనుకూలంగా టిడిపి ఎంపి ఆందోళనను వెనుకేసుకొచ్చింది ఆ బిజేపి నే...బాబు గారు కనీసం ఒక కన్నైనా తెరిస్తే బాగుంటుంది. శివప్రసాద్ సపెన్షన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది.

*రాజకీయాలకు ఫేస్‌బుక్‌కు ఒక సారూప్యం ఉంది. ఎదుటివారి ముఖం చూడకూడదనుకుంటే ఎఫ్‌బి లో వాళ్ళని బ్లాక్ చేయచ్చు. మనముఖం చూపకూడదనుకుంటే..రాజకీయాల్లో మనం బ్లాక్ అయిపోతాం..మరి చూడండి సి ఎం గారు వారంగా కనబడడంలేదట..మొన్న పేపర్లో కూడా వేశారు. నిజమేనా!!

*ఏడాదిగా రాష్త్రంలో ఊరూ వాడా బద్దలయ్యేట్లు ఇద్దరు ఆడ్సవాళ్ళు (విజయమ్మ, షర్మిల) కాంగ్రెస్ ను చెరిగేస్తుంటే, కడిగేస్తుంటే డిల్లీలో అందరు ఆడాళ్ళు, మగాళ్ళు ఉన్నా పెదవి విప్పలేక పోతున్నారు. ఇక్కడ మాత్రం కొన్ని ఉడతలు తోకలు ఊపుతున్నాయి.
_____________________________________________________________

5-8-13

*నాకు మన దిగ్గీరాజా స్టైల్ లో ఒక బ్రహ్మాండమైన అలోచన వచ్చింది.
ప్రపంచంలో ఇప్పటివరకు అనేక దినోత్సవాలు (దినం అంటే కొందరికి అరికాలు మంట నెత్తికెకుతుంది..తలలో ఉండవలసిన సరుకు అరికాలులో ఉన్నందువల్ల..) తల్లుల దినం, తండ్రుల దినం, ప్రేమికుల దినం, మిత్రుల దినం, స్వాతంత్ర్య దినం, రిపబ్లిక్ దినం, రాష్ట్రావరణ దినం, కుమార్తెల.. కుమారుల.. తాతల.. డాక్టర్ల.. పర్యావరణ... పాత్రికేయుల, ఫొటొగ్రాఫర్ల, కార్మికుల.. పిల్లల (చిల్డ్రన్) ఇంకా ఎన్నో.....వరుస తప్పకుండా జరుపుకుంటున్నప్పుడు.. అన్ని రంగాలలో తరతమ బేధాలు లేకుందా అందరికీ ద్రోహం చేస్తున్న వారందరినీ గౌరవించి, పూజించేందుకు ఒకే రోజు ఎందుకు నిర్ధారించకూడదు? పితృ, మాతృ, భాతృ, మిత్ర, దేశ, జాతి, ప్రాంతీయ, భాషా, రాజకీయ, ప్రజా, ఆత్మ, నమ్మక, యాజమాన్య, కార్మిక, కుటుంబ...(ఈ జాబితా చాంతాడులా పొడుగ్గా ఉంటుంది లేండి) ద్రోహులను ఒకేరోజున స్మరించుకుని, తర్పణం విడవడానికి అందరికీ అమోద యోగ్యమైన ఒక "దినం" ఎందుకు కేటాయించ కూడదు? జాతీయ స్థాయిలో వారికి ఒక స్మారక స్థూపం నిర్మించవచ్చు.ఒక కమిటీ వేయచ్చు. అప్పుడు రాష్ట్ర శాఖలూ ఏర్పడతాయి.

*రాజీనామా చేసిన అందరు ప్రజాప్రతినిధులు ప్రజలు ఒత్తిడి చేయకముందే హైదరాబాద్, డిల్లీలలో తమ ప్రభుత్వ గృహాలు ఖాళీ చేసి, కార్లు స్వాధీనం చేసి, కార్యాలయాలకు వెళ్ళకుండా. పార్లమెంటు, అసెంబ్లీలకు గైర్హాజరు కావాలి, తమ నియోజకవర్గాలకు వెళ్ళాలి. వచ్చే ఎన్నికల వరకు పార్తీ కార్యాలయాల ముఖాలు చూడకూదదు. అందుకు ఎవరైనా సిధ్ధమేనా అని ఉద్యమ కారులు నిలదీయాలి.

*రాజీనామా చేసిన అందరు ప్రజాప్రతినిధులు ప్రజలు ఒత్తిడి చేయకముందే హైదరాబాద్, డిల్లీలలో తమ ప్రభుత్వ గృహాలు ఖాళీ చేసి, కార్లు స్వాధీనం చేసి, కార్యాలయాలకు వెళ్ళకుండా. పార్లమెంటు, అసెంబ్లీలకు గైర్హాజరు కావాలి, తమ నియోజకవర్గాలకు వెళ్ళాలి. వచ్చే ఎన్నికల వరకు పార్తీ కార్యాలయాల ముఖాలు చూడకూదదు. అందుకు ఎవరైనా సిధ్ధమేనా అని ఉద్యమ కారులు నిలదీయాలి.

*ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిందెవరో తెలుసా!! సిడబ్ల్యుసి మహానేతలు సోనియా, రాహుల్, మన్మోహన్, అహ్మద్ పటేల్, గులాం అజాద్, జనర్ధన్ ద్వివేది, చిదంబరం... తదితరులు. వీళ్ళందరూ యుపి, ఎంపి, పంజాబ్,జెకె,గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల మహానాయకులు. వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏళ్ళకిందట తుడిచిపెట్టుకుపోయింది. కలికం వేసి చూసినా ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. ఇన్ని రాష్ట్రాల్లో లేని కాంగ్రెస్ ఎ పి లో మాత్రం ఎందుకుండాలని వాళ్ళ పట్టుదల లా ఉంది.

*నాకొకటే అర్ధం కావడం లేదు. మనం అమితంగా ప్రేమించే, ఆరాధించే, అన్నింటికీ ఆదర్శంగా భావించే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాల కలయిక. మరి మనకు అన్ని రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి. 50 రాష్ట్రాలుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అదే విధంగా 15 రాష్ట్రాలున్న సోవియెట్ రష్యా, ప్రపంచం లో మరో కమ్య్యూనిస్టు దేశం చైనా 23 రాష్ట్రాలు, 5 స్వయంప్రతిపత్తి ప్రాంతాలు, 4 ప్రత్యేక మునిసిపాలిటీలు, మరో రెండు ప్రత్యేక పాలనా ప్రాంతాలతో అభివృద్ధి చెందినప్పుడు మరో పదో, పదిహేనో కొత్త రాష్ట్రాలు ఏవ్ర్పడితే భారత్ ఎందుకు అభివృధ్ధి చెందదు, ఏ విధంగా బలహీన పడుతుందో ?  మరి తెలుగు వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విధానం లో అనుసరించిన తీరుపై అభిప్రాయభేదాలు, వాదోపవాదాల జోలికి వెళ్ళడం లేదు. ఎవరి మనోభావాలు వారికుండడంలో తప్పులేదు.. అంశం రాజకీయ స్వార్ధం కానంత వరకు. అమెరికా, రష్యా, చైనా, జర్మని, జపాన్, ఆస్త్రేలియాల్లో ఉద్యోగాల్లు చేస్తూ, ఆస్తులు సంపాదించుకుని, పౌరసత్వాలు పొంది స్థిరపడి అక్కద రాజకీయ పదవులు అనుభవిస్తున్న "ఘనమైఅన ప్రవాస భారతీయ మేధావులు, దేశభక్తులు" రాష్ట్రం దగ్ధమవుతుంటే పన్నెత్తి ఎందుకు మాట్లాడరు? సర్వం (అ)రాజకీయం...

_____________________________________________________________

3-8-13

*అవునూ.. నాకొక అనుమానం. నిన్నటివరకు కాంగ్రెస్ లో నేను కోస్తా, నిన్ను కోస్తా అంటూ గంగ వెర్రులెత్తిన మహిళా నేత ఇప్పుడు మటుమాయమైందేమిటబ్బా..వైఎస్సార్ మరణించినప్పుడు గుండెలు బాదుకుంటూ పొర్లి దొర్లి రోదించిన మనిషేమయిందబ్బా? రోశయ్య సిఎం కాగానే రంగం మార్చి ఆయన్ను ఆకాశానికెట్టి, తరువాత కిరణ్ చుట్టూ ప్రదిక్షణలు చేసిన భక్తి గీతాలు పాదిన మహిళా శిరోమణి ఎక్కడుందబ్బా! నాలుగేళ్ళపాటు మందలిలో సోనియా భజనకు అంకితమైన నూకాలమ్మ అడ్రసు ఎవరికైనా తెలుసా? మాట్లాడితే కోస్తా అంటుంది. ఇప్పుడు ఏ సొరకాయలు కోస్తున్నదో! ఊరకే అనలేదు గోదావరి ఈతకు తోకలు పట్టుకోకూడదని.

*పొద్దుటినుంచి జీ టీవీ భద్రాచలం ఎవరిది అంటూ నిప్పు పెట్టింది. అయోధ్యతో పోలిక తెచ్చింది. అగ్గికి ముందే ఆజ్యం సిద్ధం.. పక్కనే విసనకర్ర కూడా గాలికోసం..

*రాష్ట్ర విభజనే కాదు, ఇక పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, భార్యా భర్తలు సంసారం చేయలన్నా, పిల్లలను కనాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా మొత్తం సోనియా నాయకత్వంలో, దిగ్గీ మార్గదర్శకత్వంలో ఏర్పడే కమిటీ నిర్ణయిస్తుంది. {ఇద్దరూ ఇద్దరే ! "నీకు నీ వారు లేరు.. నాకు నా వారు లేరు" - 23 సంవత్సరాలుగా యు పిలో, పదేళ్ళుగా ఎం పి లో కాంగ్రెస్ కు దిక్కూ దివాణం లేదు. ఆ రాష్ట్ర నేతలు మనలను పీడిస్తున్న పీతలు}
________________________________________________________


2-8-13

*అయిపోయింది. సర్వం పూర్తయిన తరువాత ప్రజా సెంటిమెంట్ మంటల్లో "కాలిన తెలుగు చేతులకు" ఇటలీ కంపెనీ తయారు చేసిన దిగ్విజయ్ బ్రాండ్ "విభజన" ఆయింట్మెంట్ మన ఎంపీలకు ఇచ్చారు. రాజీనామా దూకుడుతో దూసుకెళ్ళిన కేంద్ర మంత్రులకు చట్టసభలో "విభజనపై" ప్రజా గళం వినిపించుకునే గొప్ప, అరుదైన అవకాశం ఇచ్చేసరికి సాగిలపడి "మా వాక్‌శూరత్వం వినండి సభలో" అంటూ జబ్బలు చరుచుకుంటూ బయటపడ్డారు. పదిమంది ఎంపీలు రాజీనామా చేశారట(అవి ఎటూ ఆమోదం పొందవు. కేంద్రమంత్రుల రూటు వేరు. ఎంపీల రూటు సపరేటు. అక్కడ ఇక్కడ అంతా 'రాజీ' నాటకం. ఎంపీల బృందాన్ని గమనించండి. ఎక్కువమంది వై.ఎస్. అభిమానులు. (ఆత్మరక్షణ )రక్త సంబంధం కాదనలేక రేపు ఒక్క ఉదుటున ఏ గోడైనా దూక వచ్చు. వీరిని నమ్ముకుంటే ప్రజలు నట్టేట మునగరా?
కేంద్ర మంత్రిపదవుల్లో ఉన్నవారు "సోనియా వీణా తంత్రులు మీటుకుంటూ" అన్ని పార్టీలు విభజనకు అంగీకరించాయి ఇప్పుడేమీ చెయ్యలేము, అని నోరెళ్ళబెట్టి పదవులు కాపాడుకున్నారు. కావూరి, పనబాక, కిశోర్‌చంద్రదేవ్ వేరయ్యారు. కిల్లి, శీలం, పల్లం, పురంధేశ్వరి ఒకటయ్యారు.
బొత్స ఆంధ్ర సి ఎం దక్కించుకునే దింపుడు కళ్ళెం ప్రయత్నం. ఆయన ఇవ్వాళ గాంధిభవన్లో విలేఖరులతో మాట్లాడుతూ, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపొటే రేపు బిజెపి ఇస్తుంది, దానికి ఎందుకా అవకాశం ఇవ్వాలి అని కాంగ్రెస్ ఇప్పుడే ఇచ్చేసింది" అన్నారు. . అమంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి కేంద్రంలో ప్రభుత్వం ఖాయమని అంగీకరించినట్టే కదా? సి ఎం కిరణ్ మూడురోజులుగా ముఖ దర్సనమే లేదు, నాలుగు గోడల మధ్య సమీక్షల్లో సతమతం.. ఎవరు తేలుతారో ఎవరు మునుగుతారో?

*హైదరాబాద్ లో బి బ్యాంక్ పెట్టి, తిరుపతిలో పార్టీ పెట్టి, పాలకొల్లులో పల్టీకొట్టి, మూసీలో మునిగి, యమునలో నిమజ్జనమై, పార్లమెంటులో కాలెట్టి, డిల్లీలో కాపురమెట్టి, రాష్ట్రాన్ని తగలెట్టి, కాంగ్రెస్ కు నిప్పెట్టి.. హ-- హ-- ఎలాయినా "అన్న"ది అయిరన్ లెగ్..

*ప్రజాప్రతినిధుల ఈ రాజీనామాలను స్పీకర్ ఎలాగూ ఆమోదించడు. ఉద్వేగం ఉద్రిక్తల మధ్య రాజీనామాలు చెల్లవంటాడు. డిసెంబరు 9 తరువాత రాజీనామాలేమయ్యాయి. వివిధ కారణాల చేత ఎమ్మెల్యేలు రాజీనామాచేస్తే వాటిని నాణ్చి నాణ్చి కాలహరణం చేసి నీరు గార్చిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులారా! రాజీనాటకాలొద్దు. మాట తప్పకండి, మడమ తిప్పకండి. చరిత్రహీనులుగా మిగలకండి. రాజకీయ వ్యాపారాలు, వ్యాపార రాజకీయాలు ఒకే ఒరలో ఇమడని కత్తులు. అవి చివరకు మీ కుత్తుకలపై పడతాయి. కేంద్రంలో రాజకీయ కుట్రలు నడిపిస్తున్న కాంగ్రెస్ సంగతి తెలియని అమాయకులెవరూ లేరు. మంత్రులు రాజీనామాలు గవర్నర్‌కుఇవ్వండి. ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్‌కు ఇవ్వండి. ఎమ్మెల్సీలు చైర్‌మన్ కు ఇవ్వండి. మళ్ళీ ఆ ప్రాంగణాల్లో కాలు పెట్టకండి. నిజాయితీ నిరూపించుకోండి. ఎలాగూ అసెంబ్లీని సుషుప్తావస్థలో పెట్టి గవర్నర్‌కు పాలనా బాధ్యతలు అప్పగిస్తారు. అప్పుడు మీ చేతుల్లో ఏమీ ఉండదు. క్వార్టర్లు, కార్లు స్వాధీనం చెయ్యండి.

____________________________________________________________

1-8-13

*నాలుగేళ్ల పాటు 10 జిల్లాల తెలంగాణాను తగలబెట్టి చోద్యం చూసిన 128 సంవత్సరాల అఖిలభారత కాంగ్రెస్ ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు దిగ్గీ రాజా చేత దివిజయంగా అగ్గి పెట్టించి వినోదం చూస్తున్నది. తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సేటూ రాకుండా కాంగ్రెస్ నెత్తిన చెంగేసుకున్నది. ఆంధ్ర ప్రాంతంలో ఏడాదికిందత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సిపి ప్రభంజనానికి దిమ్మతిరిగి కాంగ్రెస్‌కు కళ్ళు బైర్లు కమ్మాయి. అయినా ఇంకా బుద్ధిరాలేదు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న అత్యాశతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా విధివిధానాల రూపకల్పన లేకుండా తెలంగాణ ప్రకటించి రెండోచోట కూడ చేతులు కాల్చుకుంది.  నాలుగేళ్ళపాటు తెలంగాణ ఉద్యమంలోఅసువులు బాసింది, ఇప్పుడు సీమాంధ్ర ఆందోళనలోనూ సమిధలవుతున్నది అమాయక, బడుగు బలహీన వర్గాల ప్రజలే, అందులోనూ యువతే! రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు నాటకాలు ఆడుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి సంతానం, బంధుగణం భద్రతల మధ్య నగరాల్లో క్షేమంగా ఉన్నారు. పల్లె పల్లెలో ఉద్రిక్తతపెరిగి ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలారా ...

*"నమస్తే తెలంగాణ" ఒక నిర్దిష్ట అభిప్రాయం చెబుతున్నది. అదేమాదిరి "ద హాన్స్ ఇండియా" ఆంగ్ల దినపత్రిక తెలంగాణను సమర్ధించింది. ఆ రెందు పత్రికల చానళ్ళు తేలంగాన మద్దతుదారులే! మిగిలిన పత్రికలు, చానళ్ళు ఎందుకు తమ అభిప్రాయం చెప్పలేకపోతున్నాయి? ముందు నుంచి నా ప్రశ్న అదే. ప్రసార మాధ్యమానికి పక్షపాతం ఉండవచ్చా/ఉండకూడదా? సామాజిక బాధ్యత లేదా? కేవలం వ్యాపారమేనా? ఎడిటర్లూ ఏసి గదుల మేధావి ఆలోచనలు కట్టిపెట్టి మనుషుల్లో మెసగండి."సంపాద"క లక్షణాలు విడనాడండి.
____________________________________________________________

31-7-13

*ప్రజలను ఇబ్బంది పెట్టే బందులొద్దు. అక్కడకూడా ఆత్మహత్యలను ప్రేరేపించకండి నాయకులూ! సీమాంధ్రలోని ప్రజా ప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)అందరూ తెలంగాణను అడ్డుకోవాలంటే ఒకే ఒక మార్గం. పార్లమెంటులో బిల్లును, అసెంబ్లీలో తీర్మానాన్ని నిరోధించాలంటే ఏకతాటిపై నిలిచి అసలు అందుకు ఆస్కారం లేకుండా మూకుమ్మడి రాజీనామాలు చెయ్యండి. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు లేకుండా పార్లమెంటులో బిల్లెలా పాస్ అవుతుంది? అదే మాదిరి తీర్మానం పని లేకుండా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వచ్చి సభే రద్దవుతుంది. ముందుగా సీమాంధ్ర కేంద్రమంత్రులు రేపటి మంత్రివర్గ సమావేశానికి గైరహాజరవ్వాలి కాకుంటే డిసెంట్ నోట్ రాయాలి. ముందు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యాలి. ఇంతటి శక్తి, సీమాంధ్ర భవిష్యత్ పై ఆసక్తి, అసలా ధైర్యం ఉందా?

*తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కేంద్రం(కోర్ కమిటీ, సి డబ్ల్యూసి, యుపిఎ మిత్రపక్షాలు) ప్రకటించి 24 గంటలైంది. అప్పటినుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి, బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్తిబాబు అనబడే సమైక్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాని కనబడడం లేదు, వినబడడం లేదు. ఎవరికైనా అచూకి తెలిసిందా.. ఇప్పటివరకు సత్తిబాబుకు కోటరీగ పనిచేసిన నలుగురు వీర విలేఖరులు కూడ మాయమయ్యారు. రూట్ మర్చుకునే రోడ్ మ్యాప్ తయారీలో వారు నిమగ్నులయ్యారట.. వివరాలు తెలిస్తే కాస్త చెప్పండి.

*రాష్ట్రం తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా భాష తెలుగే.. ఆంధ్ర భాష, తెలంగాణ భాష అనరు. లిపి ఒకటే.మనుషుమందరిలో రక్తం ఎరుపే! రెండుచోట్ల తెలుగు పత్రికలే.. తెలుగు చానళ్ళే.. మనం తెలుగు వారమే.. ఇప్పటికైనా తెరపై విశ్లేషకుల ముఖాలు మార్చండి..కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలకు చోటివ్వండి.

*FOR THIS STATE OF AFFAIRS, SELF INTERESTED POLITICIANS HAVE TO BE BLAMED. THEY HAVE BEEN FULLY ENGAGED IN MINTING MONEY AND TOTALLY NEGLECTED THE STATE DEVELOPMENT. POLITICIANS ENTERED REAL ESTATE, EDUCATION, MEDICAL, MEDIA,CONTRACTS .. BUSINESS AND STARTED EARNING CRORES..ALL THE C Ms EXCEPT YSR CONCENTRATED ON DEVELOPMENT IN AND AROUND HYDERABAD ONLY. WHY THEY HAD NOT APPLIED THEIR MIND ON OTHER AREAS. YSR WAS THE ONLY ONE WHO STARTED PROMOTING IRRIGATION PROJECTS, IITs, UNIVERSITIES, PORTS, INDUSTRIES ETC.. IN ALL DISTRICTS GIVING EQUAL IMPORTANCE. EVEN HIGH COMMAND BOWED BEFORE HIM. WHAT HAD HAPPENED FOR THE LAST 4 YRS..THE STATE HAS GONE TO DOGS.. ANDHRA/SEEMA POLITICIANS CRAWLED BEFORE SONIA FOR THE REASONS BEST KNOWN TO EVERY ONE. PEOPLE OF THE AREAS CONCERNED SHOULD CATCH HOLD THE COLLARS OF THOSE WHO STOOD BY INTEGRATED STATE AND TALKED ALL COCK AND BULL STORIES.. WHY THE 175 MLAs AND 25 MPs HAVE KEPT QUIET WITH OUT QUITTING. THE PROBLEM IS ALWAYS WITH THE LEADERS AND PEOPLE REMAIN SUFFERERS..

*
_______________________________________________________________

30-7-13

*ఇక్కడ మరొక్క విషయం. కె సి ఆర్ పార్లమెంటుకు వెళ్లడని, మత్తులో ఫారం హౌజ్‌లో పడుకుంటాడని, తెరాస కుటుంబ పార్టీ అని, ఛాతీ మీద చెంచాడు మాంసం, శరీరంలో వంద గ్రాముల కండ లేదని అటు కాంగ్రెస్, టిడిపి నేతలు ఏవేవో అన్నారు. కాలు కదపకుండా డిల్లీని దాసోహమనిపించిన ఘనుడని ఇప్పటికైనా ఒప్పుకుని నోళ్ళు కట్టేసుకుంటారా? తెరాస కాంగ్రెస్‌లో విలీనం అయిన తరువాతకూడా అయనే హవా నడిపించుకుంటాడు. కాంగ్రెస్సోళ్లందరూ సీట్లకోసం ఆయన దగ్గర క్యూలు కడతారు.. మొత్తానికి కె కే, కడియం వంటి గాలిపటాలు అదృష్టవంతులు.

*అభివృద్ధి తెలంగాణ కావాలి, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం లేదని చెప్పిన నగర మంత్రులు ముఖేశ్, నాగేందర్.. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తారా? మంత్రిపదవులకు రాజీనామా చేస్తారా?

*మూడేళ్ళుగా అసెంబ్లీ చుట్టూ ఉన్న ఇనుప కంచెను ఇప్పటికైనా తొలగించి, ప్రజాస్వామ్యానికి, గాంధి మహాత్మునికి చెర నుంచి విముక్తి కలిగిస్తారా? పాలకులారా?

*తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తామన్న 15 మంది మంత్రులు, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి, కాంగ్రెస్‌నే వీడిపోతానన్న రాయపాటి, తెలంగాణా సామాజిక న్యాయమంటూ గాండ్రించిన చిరంజీవి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, తెరవెనుక నుండి బహుకృత వేషాలు వేస్తున్న సమైక్యవాది రాజ్యసభ సభ్యుడు రాజకీయ తెరంగేట్రం నుండి తప్పుకునేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు నిర్ణయించుకున్నారు. సమైక్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇకనైనా సిఎల్పీ, గాంధిభవన్ చాయల్లో కనబడకుంటా తప్పుకుంటారా? బుల్లి తెరలముందు ముఖాలకు ముసుగేసుకుంటారా? అక్రమ ఆర్జననతో సొల్లు కార్చుకున్న తెలుగు టివి చానళ్ళు, విశ్లేషకులు, అగౌరవ ఎడిటర్లు ఇప్పుడేమి చేస్తారు?

*ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని తగలబెట్టేందుకు ఎవరో ఎక్కడినుంచో రారు. బిస్కట్ల కోసం నాలుకలు జాపుకుని, తోకలు ఊపుకునే జాగిలాలు, కల(లా)ల మేధావులు, గొట్టాల బేహారులు ఎప్పుడూ సిధ్ధమే..

*మధ్యాహ్నం డిల్లీ నుంచి ఒకాయన ఒక ఆంధ్రప్రాంత రాష్ట్ర మంత్రికి ఫోన్ చేసి.. మీకు, మీ మీడీయాకు పనేమీలేదా? గత రెండు ఎన్నికల ప్రణాళికల్లో, అంతకుముందు సిడబ్ల్యుసి తీర్మానంలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందా? ఎందుకు ప్రజలను రెచ్చగొడతారు? అన్నారు. 1999 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ప్రస్తావానే లేదు. తెరాస ఆవిర్భావానికి ముంది టిడిపీని, ఎన్‌డియేను ఇరకాటంలో పెట్టేందుకు సిడబ్ల్యుసిలో రెండో ఎస్సార్సిపై తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. 2004 ప్రణాళికలో రెండో ఎస్సార్సీ అని పేర్కొన్నది. ఆ తరువాత యుపీఎ ఉమ్మడి కార్యక్రమంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణను ప్రస్తావించి తెప్ప తగలేసింది. ఇక 2009 ప్రణాళికల్లో ప్రణబ్ కమిటీకి చెల్లు చీటీ చెప్పి రోశయ్య కమిటీని తెరపైకి తెచ్చింది. వైఎస్సార్ మరణంతో రోశయ్య ముఖ్యమంత్రి కాగానే ఆ కమిటీకి మంగళం పాడి, డిసెంబరు 9న గందరగోళం సృష్టించే ఒక ప్రకటన చేసి, పది రోజుల్లో ఉపసమ్హరించుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది ఈ కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించాడు. 2010 ఫిబ్రవరి 3 న శ్రీకృష్ణకమిటీకి ప్రాణం పోసింది. ఆ కమిటీ డిసెంబరు 30 నాటికి నివేదిక సమర్పించినా కేంద్రంలో పట్టించుకున్న నాధుడే లేడు. కాంగ్రెస్ నాయకులను తక్కువగా అంచనా వేయకండి అంటూ... చూస్తుండండి ఏమి జరుగుతుందో అన్నాడు. నిజమే ఏమిజరుగనుందో?? (1999, 2004, 2009 రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికల్లో తెలంగాణ ప్రస్తావనలు ఇవిగో అని చూపాడు).

*పొద్దుటినుంచి తెలుగుచానళ్లలో ఒకటే కక్కులు ఎత్తిపోస్తునారు. మరో వైపు(కుక్కల)కాట్లటలు. సీమాంధ్ర వైపు కన్నేశాయి తోకూపుకుంటూ. అక్కడ ఏదో జరగరానిది జరుగుతున్నట్లు. సెమాంధ్రలో కేంద్ర బలగాలు మోహరించారని ఒకటే కూతలు. రాష్ట్రం విడిపోయినా, పోకున్నా అది వేరే విషయం..విలేఖరుల విహారాలు విమానాల్లో..కొందరివి స్పాన్సర్డ్ ప్రయాణాలు, ఎంత అదృష్టం. నాలుగు రోజులపాటు ప్రత్యేక ఆఫర్లట..  మూడేళ్ళుగా ప్రజల గోడు పట్టించుకోకుండా సంపాదనలో మునిగిన మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు(అజాగళస్థనాలు)కూడా కట్టకట్టుకుని పిలవని పేరంటానికి డిల్లీలో వాలిపోయారు, ఈ రాష్ట్రాన్ని అనాధను చేసి. వీరికి మనం ఓటేయ్యాలా? సోనియాకు సాష్టాంగపడతారా? రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా? రాజీనామాలు చేస్తారా? పార్టీతో తెగతెంపులు చేసుకుంటారా?
____________________________________________________

29-7-13

*మనకున్న (పీ)నేతలు విభజన పరులు కారు. పూర్తిగా జనపథ భజనపరులు. తలవొంచమంటే సాష్ఠాంగ దండ ప్రమాణాలు చేసే అతి విశ్వాస పరులు. "అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట.." . రాయలేలిన సీమ రతనాల సీమ అదే "రాయలసీమ." ఆ కవితా, కదన కుతూహలాలను నేడు రాయల సీమ నేతలు సోనియా పాదాక్రాంతం చేయడం సిగ్గుమాలిన తనం. కర్నాటకంలో విలీనమైన తెలుగు ప్రాంతాలు పోను ఇప్పటికి మిగిలిన నాలుగు జిల్లాలను కూడా నిలబెట్టుకోలేని నాయకులు దొరికారు. స్వార్ధ పరత్వంతో నలుగురూ ఇద్దరుగా విడిపోవాలని కోరుకోవడం సిగ్గుమాలిన తనం. రాష్ట్రం మూడు భాగాలైనా, నాలుగు భాగాలైనా.. ఫరవాలేదు. సీమ ఔన్నత్యం నాలుగు పాదాల మీద అలా తలెత్తుకుని నిలబడేట్లు చూడండి. రాయల తెలంగాణ అని కొందరు, ఆంధ్రలో ఐక్యమవ్వాలన్న అలోచన మరి కొందరు. సీమలో నాయకులు చలిచీమలు గా మిగలడం ప్రజల దౌర్భాగ్యం. సంస్కృతి, సంప్రదాయం, భాష ను యాసను కనీసం మిగిల్చండి. మీరు తాకట్టు పెట్టుకోండి కానీ సీమను చీల్చకండి.

*ప్రాంతీయ బేధాల్లేకుండా ప్రతిచోటా ప్రజలు కాలరు పట్టుకుని ఈ నేతలను నిలదీయాలి. సమైక్యాన్ని కొన్నాళ్ళు భుజాలు మార్చుకుంటూ ప్రజలను ఏమార్చి పబ్బం గడుపుకుంటున్నారు. ఉద్యమం, త్యాగాలు సంభంధం లేకుండా ప్రచారానికి ఏర్పాటైన పరాన్నభుక్కు బ్యానర్లు, లెటర్ హెడ్ సంస్థలు. ప్రజలతో సంబంధాలు, సిద్ధాంతాలు, పట్టుమని పదిమంది లేని డబ్బు సంపాదన మేధావి వర్గం ఇది. సంచలనాలతో ఉనికి కోసం తాపత్రయం..రాజకీయ రంగులు మార్చే వ్యక్తులు ఇక్కడ పెద్ద నాయకులు. ఉత్సవ 'విగ్రహ' ఆరాధకులు. వీరిపట్ల తస్మాత జాగ్రత్త!!
__________________________________________________

25-7-13

*తెలంగాణ అంతా ఖాయమైనప్పుడు, ఖరారైనప్పుడు, అధిష్టానం ఔనన్నప్పుడు ఇంక బెంగేముంది. కాంగ్రెస్‌లో కొట్లాటలెందుకు? ఉభయ ప్రాంతాలవారిని కట్టడి చెయ్యచ్చుగా!! ఉత్సవ విగ్రహాల హడావిడి మినహా మూల విరాట్టులు కదలడం లేదు, మెదలడం లేదు! ఎందుకో, ఏమిటో!! మధ్యలో మీడియా గంగ వెర్రులేమిటో?